మళ్లీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే…

మళ్లీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే…

ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. అలానే వ్యూయర్ షిప్ కూడా విపరీతంగా ఉంటుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్, పాక్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ క్రమంలో మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగితే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మరోసారి భారత్, పాక్ తలపడనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్..

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్

టీ20 ప్రపంచకప్‌ 2026 వివాదం నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌ మహమ్మద్‌ సలావుద్దీన్‌.. ఆదేశ మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌పై నిప్పులు చెరిగాడు. అతడు అబద్ధాలకోరు అంటూ విమర్శించాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026) నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్.. మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అతడు పచ్చి అబద్ధాల కోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌లో పర్యటించక పోవడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని తొలుత చెప్పిన నజ్రుల్..తర్వాత మాట మార్చాడు. ఇది ఆటగాళ్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నాడు. ఇక నజ్రుల్ యూ టర్న్ పై బంగ్లా అసిస్టెంట్ కోచ్ సలావుద్దీన్ ఫైర్ అయ్యారు.

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్…

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

 

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. భాతర బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌ బాట పట్టారు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో 114 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.
‘భారత్‌తో కీలకమైన మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. ఆ సమయంలో పాక్ డ్రెస్సింగ్ రూం నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. ఈ మ్యాచ్ ఎంత కీలకమో.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కున్న ప్రాధాన్యం ఏంటో మాకు తెలుసు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మేం ఇతర జట్లతో ఐదు మ్యాచ్‌లు గెలిచాం. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. కానీ భారత్‌తో మ్యాచ్‌లో ఓడిపోయాం. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. బంతి అనూహ్యంగా తిరిగింది. మేం సరిగానే ప్రారంభించాం. కానీ ఇషాన్ కిషన్ మా నుంచి మ్యాచ్‌ను దూరంగా తీసుకెళ్లిపోయాడు. మేం తిరిగి పుంజుకుంటాం. మేం ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మంచి క్రికెట్ ఆడాం. ఈ టోర్నమెంట్‌లో రాణిస్తామనే ఆత్మవిశ్వాసం మాకుంది’ అని పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్…

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

 

పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి పాక్ బౌలర్లను వణికించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్‌కు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత వికెట్ ‌కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి పాక్‌ను పూర్తిగా కట్టడి చేశారు. ఈ విజయంతో భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

నమ్మకం ఉంది..

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ కిషన్ మాట్లాడాడు. ‘వికెట్ అంత సులభంగా లేదు. కానీ నా బలాల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆఫ్‌సైడ్ ఆటపై ఎక్కువగా శ్రమించాను. పెద్ద గ్రౌండ్ కావడంతో గ్యాప్‌లను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాను. 160-170 స్కోరు సరిపోతుందని ముందే అనుకున్నాను’ అని తెలిపాడు.

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

 

 

పొట్టి ప్రపంచ కప్2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో వర్షం పడే అవకాశం ఉండటంతో.. వాన పడకూదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వాన పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(World Cup 2026)లో ఇప్పటికే అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఐర్లాండ్, అమెరికా, స్కాట్లాండ్, జింబాబ్వే వంటి పలు జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అంతేకాక ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించినంత పని చేశాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి టాప్ జట్టును ఓడించి.. ఈ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఇలా సాగుతున్న పొట్టి ప్రపంచ కప్2026లో క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడు అభిమానులను భయపెడుతున్నాడు.

కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ..

కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై ప్రధానంగా చర్చ..

 

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో (Union Minister CR Patil) సీఎం సమావేశమయ్యారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని సీఎం వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు ముఖ్యమంత్రి.

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

#మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల..

#భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు..

#మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఏర్పాట్ల క్షేత్రస్థాయి పరిశీలన – రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..

హన్మకొండ, నేటిధాత్రి:

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం నాడు జిల్లా జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్, పోలీస్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి, భక్తులకు అందించే సౌకర్యాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూ లైన్ల ఏర్పాటు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకల మార్గాలు వంటి విషయాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేదమంత్రాల సాక్షిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.
తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించామని, రవాణా మరియు పోలీస్ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో భక్తులందరూ అధికారులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, సతీష్, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ఆలయ ఈఓ అనిల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి వైదొలగి చాలా పెద్ద తప్పు చేశామనే భావనలో బంగ్లాదేశ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ రిలీఫ్ లభించింది.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌(Worl Cup-2026) నుంచి తప్పుకుని చాలా పెద్ద తప్పు చేశామనే భావనలో బంగ్లాదేశ్ ఉన్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇదే సమయంలో ఐసీసీ కూడా వారిపై చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీబీకి భారీ ఊరట లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడమని పాకిస్థాన్(Pakistan) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశం జరగ్గా.. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది. ఇదే మీటింగ్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు పాల్గొనకపోవడంపై ఐసీసీ(ICC) నిరాశ వ్యక్తం చేసింది. ఇదే సమయంలో బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడా పరమైన, పరిపాలనా జరిమానా విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని తెలిపింది. దీని వల్ల వారి హక్కులకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని ఐసీసీ వెల్లడించింది.

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు…

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు

డీఆర్‌డీఏ సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంస

డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఈ-సైకిళ్ల పంపిణీలో ప్రతిభ కనబరిచిన డీఆర్‌డీఏ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రశంసించారు. శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో పీడీ శ్రీదేవితో కలిసి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశాశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుప్పం పట్టణం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి నమోదయ్యేలా 24 గంటల వ్యవధిలో  ఈ-సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవిషయంలో సంతోషం వ్యక్తం చేశారన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాలు, మహిళా సంఘాలను బలోపేతం లాంటి కార్యక్రమాల అమలుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ డీపీఎంలు, ఏపీఎంలు, ఏపీఎంసీసీ, సభ్యులు పాల్గొన్నారు.

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్…

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్

 

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. అమెరికా బౌలర్ల ధాటికి పేకమేడల్లా కుప్పకూలింది. ఒకానొక సందర్భంలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నాక్ ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో ఏకంగా 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య ఒంటరి పోరాటం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 161 పరుగుల చేసింది. 162 పరుగులతో ఛేదనకు దిగిన అమెరికా.. 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు విజయం లాంఛనమైంది.

విధ్వంసకర బ్యాటింగ్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం సూర్య జట్టు గెలుపుపై మాట్లాడాడు. ‘నేనెంత ఒత్తిడి అనుభవించానో.. నేను మాత్రమే చెప్పగలను. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతానని నాకు తెలుసు. నేను చివరి వరకు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా మారుతుందని నా మీద నాకు నమ్మకముంది. పిచ్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. కానీ ఎప్పుడు పరుగులు వేగంగా రాబట్టాలో మాకు తెలుసు.క్యురేటర్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. పిచ్‌ను రూల్, వాటరింగ్ చేయడానికి సరైన సన్‌లైట్ కూడా లేదు. ఈ పిచ్ మీద 180, 190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14 ఓవర్ల తర్వాత వచ్చిన బ్రేక్‌లో గౌతీ భాయ్ నాకు అదే విషయం చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు.. నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అన్నాడు. ఆ బ్రేక్ మాకు కలిసొచ్చింది. ముఖ్యంగా నేను ముంబైలో చాలా క్రికెట్ ఆడాను. ఇక్కడి పిచ్‌ల గురించి నాకు ఓ అవగాహన ఉంది’ అని సూర్య చెప్పుకొచ్చాడు.

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్…

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

 

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్‌గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. దాదాపు ఏడాది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్సీ విషయంలో అజేయంగా నిలుస్తున్నప్పటికీ.. సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఫామ్ అందుకుని అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముందు స్కై ఫామ్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయమే. ఈ నేపథ్యంలో సూర్య కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫార్ పఠాన్(Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)కు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డ్ ఉంది. టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా అతడికి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ మనం సూర్యకుమార్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అలాగే సూర్య బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.

డబ్ల్యూసీ 2026 వేళ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..

డబ్ల్యూసీ 2026 వేళ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..

 

దేశాలతో ఆల్‌ఫార్మాట్ సిరీస్‌లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్‌కు ఘోర అవమానం జరిగింది..

స్పోర్ట్స్ డెస్క్: మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు సన్నాహక మ్యాచులతో బిజీగా ఉన్నాయి. అలానే గత కొంతకాలంగా మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా వివిధ దేశాలతో ఆల్‌ఫార్మాట్ సిరీస్‌లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్‌కు ఘోర అవమానం జరిగింది. మరి.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం…

ఇదే సమయంలో పాక్‌తో తొలి టీ20 సందర్భంగా ఆస్ట్రేలియా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్‌మాన్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తొలిసారి క్యాపులు అందించింది. అలానే మ్యాట్‌ రెన్షాకు తొలి టీ20 అవకాశం ఇచ్చింది. అయితే, అంతకుముందు మిగిలిన SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల జట్లు కూడా తమ కీలక ఆటగాళ్లను కాకుండా.. మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి జట్లతోనే పాక్‌లో పర్యటించాయి.

ఘోర అవమానం ఏంటంటే..

ఇలా టాప్ దేశాలు తమ ద్వితీయ శ్రేణి జట్టును బరిలో దింపడంతో పాకిస్థాన్ క్రికెట్‌ స్థాయి దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. పాక్‌ను తేలికగా తీసుకుంటున్నందునే ఈ మేటి జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాక్‌ క్రికెట్‌ విశ్లేషకుడైన ఒమైర్‌ అలవి ఇవే మాటలు అన్నాడు. ఆస్ట్రేలియా కొంతమంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే పాకిస్థాన్ వచ్చిందని, అదే విధంగా.. తొలి టీ20లో వారి అత్యుత్తమ ప్లేయర్లను ఆడించనేలేదని అన్నాడు. ఇది పాకిస్థాన్ క్రికెట్‌ అభిమానులకు ఘోర అవమానమని ఒమైర్‌ విచారం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు తమ వీకెండ్‌ జట్లతో పాకిస్థాన్‌కు వచ్చాయని, ఏదో సిరీస్‌ ఆడాలి కాబట్టి మొక్కుబడిగా ఈ పని చేస్తున్నాయని అనిపిస్తోందని పాక్‌ మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ అన్నాడు.

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా…

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

 

టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్.. భారత్‌కు రాబోమని, మ్యాచుల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీ(ICC)పై ఒత్తిడి తెచ్చింది. అయితే బంగ్లా చెప్పినట్లు భారత్‌లో ఎలాంటి భద్రతా సమస్యలు లేకపోవడంతో ఐసీసీ దీనిని తిరస్కరించింది. బీసీబీ(BCB) మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి తప్పించి.. ర్యాంకుల ఆధారంగా దాని స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది.
బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ కూడా ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తుందనే వార్తలు వచ్చాయి. తమ ప్రభుత్వ నిర్ణయం బట్టే తదుపరి ప్రణాళికలు ఉంటాయని పీసీబీ ఛైర్మన్ నఖ్వి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ హెచ్చరించడంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గి తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup) కోసం ఆ జట్టు శ్రీలంకకు వెళ్లబోతోంది. ఈ మేరకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) షెడ్యూల్‌ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 2న పాక్‌ కొలంబోకు చేరనున్నట్లు తెలిసింది. ఈ మేరకు పీసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) స్పందించాడు. ‘ప్రస్తుతం ఏదైతే జరిగిందో అదంతా బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధం. భారత్‌లో భద్రత పరమైన సమస్యలు లేవు. నా ఉద్దేశంలో ఇదంతా బంగ్లాదేశ్ తప్పు. ఆ దేశ క్రికెట్ జట్టు భారత్‌కు రాకపోవడం వల్ల చాలా కోల్పోనుంది. నిజానికి ఆ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. బంగ్లా స్పిన్నర్లకు భారత్ పిచ్‌ల గురించి బాగా తెలుసు. అయితే టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు ఎవరైతే భారత్‌కు రారో.. వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. అలాగే ఆ దేశ క్రికెట్ బోర్డులు కూడా భారీగా నష్టపోయే అవకాశమూ ఉంది’ అని సురేశ్ రైనా వెల్లడించాడు.

 జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. ముస్తాఫిజుర్‌కు చోటు…

 జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. ముస్తాఫిజుర్‌కు చోటు

 

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 2026(IPL)లో చోటు కోల్పోయిన ముస్తాఫిజుర్ రెహమాన్‌(Mustafizur Rahman )కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్ పేస్ విభాగం బాధ్యతలు మోయనున్నారు. మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్‌ను ప్రధాన స్పిన్నర్లుగా తీసుకున్నారు. బ్యాటింగ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్‌పై బంగ్లా ఎక్కువగా ఆధారపడనుంది.
గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచులను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్(ఫిబ్రవరి 7), ఇటలీ(ఫిబ్రవరి 9), ఇంగ్లండ్(ఫిబ్రవరి 14), నేపాల్(ఫిబ్రవరి 17) మ్యాచులు ఆడాల్సి ఉంది.బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, నేపాల్‌, ఇటలీ జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు మొత్తం 40 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. సూపర్ 8 దశ అనంతరం టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ కోల్‌కతా, కొలంబో, ముంబైలో జరగనుండగా, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్‌ లేదా కొలంబోలో నిర్వహించనున్నారు.

అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం….

అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?

 

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్‌ ముస్తాఫిజూర్‌ రెహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ(BCCI) సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.అయితే ఇదే అంశం భారత్‌-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌ 2026కి సంబంధించి భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించేలా ప్రణాళికలు చేయాలని ఐసీసీకి లేఖ రాయమని ఆయన బీసీబీ(BCB)కి సూచించారు. పాకిస్తాన్ తరహాలోనే ఈ నిర్ణయం ఉండాలని అభిప్రాయపడ్డారు.

 ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది..

 ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. సౌతాఫ్రికా హెడ్ కోచ్

 

ధర్మశాల వేదికగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టీ20 ఆడనుంది. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. గంభీర్ నిర్ణయాల వల్లే టీమిండియా ఓటమి పాలవుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా నేడు టీమిండియా-సౌతాఫ్రికా(Ind Vs SA) మధ్య మూడో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. పేలవ ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లో ఓడింది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తుది జట్టుతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడని విమర్శలు వస్తూనే ఉన్నాయి. రెండో టీ20లో వన్‌డౌన్‌లో అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కి పంపించి.. ఎనిమిదో స్థానంలో దూబెను ఆడించడం వల్లే ఓటమి ఎదురైందని అభిమానులు, క్రికెట్ మాజీలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కన్రాడ్(Shukri Conrad) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.‘టీ20 ప్రపంచ కప్ 2026 ప్రణాళికలకు అనుగుణంగానే మేము ముందుకు సాగుతున్నాం. ప్రతి మ్యాచులోనూ మేం బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలనుకోవట్లేదు. తప్పకుండా తుది జట్టులో మార్పులు చేయాలన్న నియమం కూడా ఏమీ లేదు. ప్రపంచ కప్ తుది జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్ట్ సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారు బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శన చూసి అర్హత ఉన్నవారికి అవకాశం ఇస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి అవగాహనతోనే ఉన్నాం’ అని సఫారీల హెడ్ కోచ్ అన్నాడు.

 సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..

 సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

 

టీ20 ప్రపంచ కప్ 2026 దగ్గర పడుతున్న సమయంలో టీమిండియా సన్నాహక పోరు ప్రారంభించింది. తుది జట్టులో వికెట్ కీపింగ్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ పోటీ పడుతున్నారు. సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలిచిన తర్వాత సంజూపై జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇప్పటికే సన్నాహక మ్యాచులు ప్రారంభమయ్యాయి. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఈ క్రమంలో తొలి టీ20లో సెలక్టర్లు జితేశ్ వైపే మొగ్గు చూపడంతో.. సంజూ తుది జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఈ మ్యాచులో జితేశ్ శర్మ(Jitesh Sharma) అద్భుతమైన కీపింగ్ చేశాడు. ఏకంగా నాలుగు క్యాచులు అందుకుని జట్టులో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్‌తోనూ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ అనంతరం జితేశ్ శర్మ.. తనకు, సంజూ శాంసన్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడాడు. ‘అతడు జట్టులో ఉన్నందుకు ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే సంజూ నాకు పెద్దన్న లాంటోడు. మా మధ్య పోటీ ఉన్న మాట వాస్తవం.. కానీ అప్పుడే మనలో దాగున్న ప్రతిభ బయటకు వస్తుంది. ఇది జట్టుకు కూడా ఎంతో మంచిది. సంజూ అద్భుతమైన ఆటగాడు. మేమిద్దరం టీమిండియా తరఫున ఆడుతున్నాం. మేం సోదరుల్లాంటివారం. అతడు నాకు చాలా సాయం చేశాడు’ అని జితేశ్ శర్మ అన్నాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version