కరకగూడెంలో ఘనంగా మహాత్మా గాంధీ 78వ వర్ధంతి

ఘనంగా మహాత్మా గాంధీ గ 78వ వర్ధంతి.

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామంలో జాతి పిత మహాత్మా గాంధీ గారీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీ స్మారక కరకగూడెం మేనేజర్ నాగ బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేనమరియు సర్పంచ్ పోలేబోయిన సుజాత.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
అహింసా అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాత జాతిపిత మహాత్మా గాంధీ , ఆయన చూపిన శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అని కొనియాడారు.
భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీని విడదీసి చూడలేం, అలాంటి మహాత్ముడి జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో
గ్రామ పెద్దలు కొంపెల్లి రామలింగం గారు, చిట్టి ప్రసాద్ , గొగ్గలి రవి , షేక్ రఫీ , తిప్పని శ్రీను , ప్రజా ప్రతినిదులు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు…

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

 

దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండో‌గా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

ఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ స్వాత్(Special Weapons and Tactics Teams)లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27), తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కలిచివేసే వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ హత్యకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు అంకుర్ చౌదరి తన భార్యను చంపుతున్న సమయంలో ఆమె(కాజల్) సోదరుడు నిఖిల్ (ఈయన కూడా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్) కు ఫోన్ చేశాడు. ‘ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది.. నేను నీ చెల్లిని చంపేస్తున్నా’ అని చెప్పి, ఆమెపై దాడికి దిగాడు.

ఫోన్ లైన్‌లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు విన్న నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘తను చనిపోయింది, వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పడం గమనార్హం.

ఘటన నేపథ్యం..

జనవరి 22న ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్-అంకుర్ నివాసంలో ఈ ఘటన జరిగింది. భర్త.. నిందితుడైన అంకుర్ తన భార్య కాజల్ తలని తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టి, ఆపై బరువైన డంబెల్ (Dumbbell)తో ఆమె తలపై దాడి చేశాడు.

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి…

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

 

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.

అమరావతి, జనవరి 30: ఈ రోజు జనవరి 30 భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. బాపు దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

‘జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దాం’ అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా సందేశంలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version