పేదలకు సన్నబియ్యం పంపిణి.

ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణి

ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ. నిరుపేదలకు చెందాల్సిన రేషన్ షాపులోని దొడ్డు బియ్యం అక్రమార్కులు రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకున్నారని పేదల నోటికి చెందాల్సిన అన్నం దొంగల పాలవుతుందని భావించి. ఎలాగైనా నిరుపేదలకు న్యాయం చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రితో పాటు పౌర సరఫరాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సన్న బియ్యం పంపిణి చేస్తేనే బియ్యం దొంగలకు అడ్డుకట్ట వేయచ్చని చర్చించి సన్న బియ్యం. ప్రజలకు పంపిణి చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు నిరుపేదల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ప్రజా ప్రభుత్వం సన్నా హాలు చేస్తోందని. ఇందులో భాగంగా పౌర సరఫరాల శా ఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,సొంత నియోజకవర్గ మైన హుజూర్ నగర్‌లో ఈ పథకాన్ని ఉగాది పండుగ పర్వదిననా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పౌర సమాచార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని
సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం మా నిరుపేదలకు ఆనందంగా ఉన్నదనీ సన్న బియ్యం పంపిణి చేసి నిజమైన పెదలపార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించిందని రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదిలో. రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం. ప్రభుత్వ కృషికి నిదర్శనమని. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు, నియోజకవర్గ ఎమ్మెల్యే కు ఓనపాకాల ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version