ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు.

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ సమావేశం మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ కార్యక్రమం కన్వినర్ బనగాని రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ
ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించుటకు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దీని ద్వారా ఓకే సారి ఎన్నికలు జరిగితే ఆదేశం ఆర్థికంగా అభివృద్ధి పరంగా ప్రజాధనం వృధా జరగదని పరిపాలన సైతం వేగంగా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు సైతం ఇలాంటి డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారని దీనివల్ల సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారని మనమందరం ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాగతించి జిల్లా మండల స్థాయిలో బూతు స్థాయిలో విస్తృత ప్రచారం చేసి పార్టీలకు అతీతంగా యువకులను మేధావులను బాగాసామ్యం చేసుకొని వారి సహకారంతో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు ఇది ఒక మంచి కార్యక్రమం అని ప్రజలందరికీ వివరించాలని చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాన్నె మొగిలి దుప్పటి భద్రయ్య బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిప్ నాయకులుసోమా దామోదర్, మంద మహేష్ పున్నం చందర్, మిట్ట కుమార్,రాజశేఖర్, నరేందర్, సాయి పటేల్, ప్రవీణ్,హరిలాల్, రాజన్న, మల్లన్న, సంపత్, రామదాసు, రాకేష్ రెడ్డి,నరేష్, సమ్మయ్య,సంతోష్, తదితరులు పాల్గొన్నా
రు అనంతరం వివిధ గ్రామాల నుండి యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది వీరిని జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిదర్ రెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జాయిన్ అయినా వారు రజనీకాంత్ నవీన్ వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నారు

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్
హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు సమయం వృధా అవుతుందని అన్నారు వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉండడంతో ఆయా రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది గతంలో జమిలి ఎన్నికలు అనేవి 1952 నుంచే ఎన్నికలు జరిగినవి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను మార్చి రాష్ట్రపతి పాలన పెట్టడం తద్వారా దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,బిజెపి నాయకులు మార్త రాజభద్రయ్య,చందుపట్ల రాజేందర్ రెడ్డి,బెజ్జంకి పూర్ణ చారి,కుక్కల విజయకుమార్, మార్త బిక్షపతి,సంగా పురుషోత్తం,దంచనాల సత్యనారాయణ,మారేడుగొండ భాస్కరాచారి,ఆకుల రాంబాబు,బూత్ అధ్యక్షులు మరాఠి నరసింగరావు,ముత్యాల దేవేందర్,సంఘ నరేష్, ఉడుత చిరంజీవి,బీరం రాజిరెడ్డి,గాజుల రంజిత్ బిజెపి కార్యకర్తలు  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version