అక్రమ ఇసుక డంపులు విక్రయాలు.

అక్రమ ఇసుక డంపులు విక్రయాలు

పగలు రాత్రి జోరుగా నడుస్తున్న ఇసుక దందాలు

అధికారుల పట్టింపు లేకనే జోరందుకున్న జీరో ఇసుక దందాలు

గోదావరి ఇసుక చాటున ఏటి ఇసుక దందాలు

కేసముద్రం నేటి ధాత్రి:

 

రోజురోజుకు పెరిగిపోతున్న ఇస్కాసురుల ఆగడాలు అంతా కాదు ప్రతిరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏటి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కేసముద్రం మండల పరిసర ప్రాంతాలలో ఉన్న వాగుల లో లభ్యమయ్యే ఇసుకను రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలించడమే కాకుండా చుట్టుపక్కల మండలాలలోని ఏటి ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇసుక ట్రాక్టర్ 5000 వేలు మరియు ప్రభుత్వ చాలా నుకు డబ్బులు కడితేనే ఇసుక ఇంటి ముందరికి వస్తుంది మరి ఇసుకసురులు ఏ ప్రభుత్వ కార్యాలయానికి పన్ను చెల్లించకుండా ఇంత భారీగా అక్రమం ఇసుక రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇసుక లభ్యం అయ్యే ఏరు కానీ వాగు కానీ ప్రాంతాలలో సంబంధిత కార్యాలయ సిబ్బందికి ముడుపులు చెల్లిస్తూ అక్రమ ఇసుక రావణా చేస్తున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ఇసుక దందాల కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు పాటించకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు తుంగలో తొక్కుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను నియమిస్తూ దందాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఇసుక దందాలు మూడు పూలు ఆరు కాయలు కన్నా ఎక్కువ లాభసాటిగా ఉండడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా పట్ట పగలు కూడా రవాణా చేస్తున్నారంటే వీరికి ఎవరి అండదండలు లేనిదే చేయరు అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నందున ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి ఇసుక సురుల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇసుక డంపుల ఇసుక కుప్పల సీజ్.

ఇసుక డంపుల ఇసుక కుప్పల సీజ్,,,,,,

ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు సీజ్ చేశామన్న మైనింగ్ అధికారులు,,,,,

అక్రమ ఇసుక డంపు చేస్తే కఠిన చర్యలు తప్పవు మైనింగ్ అధికారి మధు కుమార్,,,,,

ఇసుక కుప్పలను పంచనామ చేసిన మండల ఆర్ ఐ గౌస్ మొయినుద్దీన్,,,,,

రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణ పరిధిలో ఇసుకను డంపు చేసి అమ్ముతున్న ఇసుక డంప్యాడ్లపై మంగళవారం మెదక్ జిల్లా మైనింగ్ అధికారులు దాడి చేసి అక్రమ ఇసుక కుప్పలను సీజ్ చేసినట్లు జిల్లా మైనింగ్ అధికారి ఏదీ అసిస్టెంట్ మైనింగ్ అధికారి జువాలజిస్ట్.మధు కుమార్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేటలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజావాణిలో తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇసుక డంపులపై దాడి చేయగా నాలుగు డప్పుల్లో మూడు డప్పుల వద్ద అక్రమ ఇసుక లభించింది అన్నారు నాలుగో డబ్బు వద్ద ఎలాంటి ఇసుక గొప్పలు లేవని ఆయన తెలిపారు ఈ ఇసుక డంపులను రామాయంపేట మండల ఆర్ ఐ గౌస్ మైనది పంచనామ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version