సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడి జిల్లాలోని 12 మండలాలు గ్రామాలలో ప్రజాస్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తారీఖున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేష్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు తెలిపారు

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).

 

గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.

ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.

నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

తహసీల్దార్ సస్పెండ్

తహసీల్దార్ సస్పెండ్

“నేటిధాత్రి”, బీబీనగర్.

బీబీనగర్ తహశీల్దార్ ను సస్పెండ్ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

బీబీనగర్ మండలం పడమట సోమారం గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా పాసుబుక్స్ జనరేషన్ కు బాధ్యులయిన తహశీల్దార్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు

రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు.

మౌలిక వసతులు లేని పాఠశాలల పై వెంటనే చర్య తీసుకోవాలి

 

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ

 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సువర్ణ అనే అమ్మాయి పై కుక్క కాటుదాడి జరిగినందున

సిరిసిల్ల జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మరియు బిజెపి మహిళ కార్యకర్తలు మొన్నటి రోజున గురుకుల పాఠశాలను చెక్ చేయడానికి వెళ్లడం జరిగినది.

కానీ అక్కడ ఎలాంటి గురుకుల పాఠశాల పిల్లలకు సదుపాయాలు లేకుండా ఉన్నందున ప్రిన్సిపాల్ ని అడగడం జరిగినది.

ఆ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఉండడం ఇలాంటివి జిల్లాలో ఎన్ని ఉన్నాయో, అవన్నీ గురుకుల పాఠశాలలను గుర్తించి వెంటనే కలెక్టర్ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.

అంతేకాకుండా ఇలాంటి సిరిసిల్ల జిల్లాలో సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రెస్ మీట్ సందర్భంగా మహిళ బీజేపీ పక్షాన కోరడం జరిగినది.

అంతేకాకుండా హాస్టల్ లోనికి రాకుండా చాలా సేపు బయట వెయిట్ చేయించడం జరిగిందని అన్నారు.

హాస్టల్ యొక్క పరిస్థితులు బాగా లేవని ఎక్కడ బయట పడుతుందో అని మమ్మల్ని లోనికి రాకుండా చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు.

ఒక మహిళా విలేఖరిని కూడా లోనికి రానివ్వలేదని తెలిపారు.

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా కలెక్టర్ కి విన్నవిస్తున్నామని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి,జిల్లా కార్యదర్శి దుంపెన స్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్డి రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బిజెపి మహిళా నాయకురాలు కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య.!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కొందరు సమావేశానికి హనుమకొండకు వెళ్ళగా కలెక్టర్ ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు.

ఆమె మాటే – తుపాకి తుటా…..!

డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు

ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 3 వ వర్ధంతి సభ

భద్రాచలం ;నేటి ధాత్రి

ఆమె ఉపన్యాసాలతో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి దొరల గుండెల్లో తూటాలను పేల్చిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అన్నారు.
బుధవారం స్థానిక చంద్ర భవనంలో
ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదురాలు మల్లు స్వరాజ్యం గారి 3వ వర్ధంతి సభలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు నాదెళ్ల లీలావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్యం గారి చిత్రపటానికి నాదెళ్ల లిలావతి పూల మాలా వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీతా లక్ష్మి మాట్లాడుతు మల్లు స్వరాజ్యం సంపన్న కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే 13 ఏల కే తుపాకి పట్టి నిజం ప్రభుత్వం కి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య చైతన్యవంతులను చేశారని అన్నారు. తుపాకి పట్టి గెరిల్లా పోరాట నిర్మించిన మల్లు స్వరాజ్యం నీ నిజాం సైన్యాలు యెదుర్కోలేక ఇంటిని సైతం తగలబెట్టారని అన్నారు.ఆ నాడు ఆమె ను పట్టిస్తే 10 వేల రూపాయిలు ఇస్తాము అని ప్రభుత్వం ప్రచురించింది గుర్తు చేశారు.
స్వరాజ్యం రజాకర్ల పాలిట సింహా స్వప్నం అయ్యి నిలిచారని కొనియాడారు.ఆమె జానపద బాణీల్లో కవి కట్టి స్వయం గా ఆమె పాడి గ్రామంలోని ప్రజలను ఐక్యం చేసేదని తెలిపారు . ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పోటీచేసి 2 పర్యాయాలు సీపీఎం పార్టీ తరపున ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. మల్లు స్వరాజ్యం స్పూర్తి తో మహిళలందరూ ఐద్వా ఇచ్చే పిలుపులో, పోరాటలలో భాగస్వాములు అయినప్పుడే నిజమైన ఘన నివాలి అర్పించినట్టు అని సీత లక్ష్మి స్పష్టం చేశారు..ఈ కార్యక్రమం లో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు జీవన జ్యోతి , వై పూర్ణిమా దేవి, గౌతమి యే జే, ఆఫీస్ భేరర్స్ సక్కుభాయి, జీ నాగలక్ష్మి, ఎమ్ సుబ్బలక్ష్మి , పట్టణ కమిటీ సభ్యులు కే సుసిల , గణపతమ్మ,సి యెచ్ దనమ్మ,డి నాగలక్ష్మి ,సౌదామిని ,సౌభాగ్యం తడితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్.

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారుల చొరవ

25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మార్చి 31లోగా రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట మార్చి 18 నేటి ధాత్రి(మెదక్):

Collector

అనధికార లే అవుట్ ప్లాట్లు, అనధికార లే అవుట్ లను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31, 2025 లోగా క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ.. ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ * తెలిపారు.

ఈ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 22,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని, హౌస్ ఓనర్స్ కి మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతోందని వివరించారు.

ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

మిగిలిన దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువు లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలన్నారు.

ఎల్ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి ఏదేని సలహాలు కొరకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులందరికి ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకునేలా మునిసిపల్ సిబ్బంది ప్రోత్సహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఓలు ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తుదారులకు ఫోన్ కాల్ చేసి ఈ నెల 31లోపు.. 25 శాతం రాయితీని ఉపయోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ సేవలను పొందవచ్చునని, మార్చి 31 లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.

సందేహాల నివృత్తికి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయకేంద్రం నంబర్ 9154293341, .అలాగే రామాయంపేట పురపాలక సహాయ కేంద్రం నంబర్ 9963290800 లలో సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు.

ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పరామర్శించిన.!

ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పరామర్శించిన రమేష్ మేడి

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ లో ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఏఏఓ గత నెల బైక్ యాక్సిడెంట్లో గాయపడిన విషయాన్ని తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల అసోసియేషన్ సెక్రటరీ జనరల్ (ప్రధాన కార్యదర్శి) రమేష్ మేడి వచ్చి పరామర్శించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ నూతన కమిటీ కూడా పాల్గొనడం జరిగింది కమిటీని కార్యక్రమాలను అభినందించడం జరిగింది భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిర్వహించిన అందరూ చురుకుగా పాల్గొనాలని చెప్పారు
రాహుల్ (సబ్ ఇంజనీర్) డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ (సబ్ ఇంజనీర్) సెక్రటరీ మొగులప్ప ( ఆర్టిజన్ ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ (సబ్ ఇంజనీర్) అడిషనల్ సెక్రటరీ రాములు (జే ఏ ఓ) ట్రెజరర్ కిరణ్ ( ఏ ఎల్ ఎం )
ఉపాధ్యక్షులు ,సంగమేష్ (ఎల్ ఎం) మాజీ అధ్యక్షులు ,
ఏఎల్ఎంలు జేఎల్ఎంలు ఆర్టిజన్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించిన మేము సైతం అని ముందుకు రావడానికి జహీరాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగ అరుంధతి సంఘం నాయకులు వరాలు , స్వామి దాస్, జయరాజ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

తంగళ్ళపల్లి,నేటిధాత్రి:

మండలంలో ఆయా పార్టీల నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజలు అయోమయానికి గురైతున్నారు.తంగళ్ళపల్లి మండలంలో ఒక వైపు బిఆర్ఎస్ నాయకులు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లతో ప్రజలు అయోమయానికి లోనవుతూ మండలంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితిని నెలకొన్నది. నువ్వా నేనా అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు, అలాగే బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు మండలంలో నువ్వా నేనా అన్న చందంగా తయారైందని చర్చలు జరుగుతున్నాయి.అధికారంలో ఎవరున్నా మండలాన్ని అభివృద్ధి చేయాలే తప్పా వ్యక్తిగత దూషణలతో
మాట్లాడుకోవడం సరైంది కాదని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ఎకరిపై ఒకరు దుషించుకోకుండా సమన్వయంతో ఉంటూ మండల అభివృద్ధికి దోహద పడాలని పలువురు మండల మేధావులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు కోరుతున్నారు.

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ..

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుని నియామకం

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ చట్టబద్ధత కల్పించాలి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పందుల సారయ్య ను జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షులు పులిగిల్ల బాలయ్య ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ నత్తి కోర్నేల్ నియామకం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పందుల సారయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా ఆలు పెరగకుండా చేస్తున్నామని ఇట్టి ఉద్యమానికి ఎన్నో ఉడుదులుకులు జరిగిన ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు తీర్పుకు శిరసా వహిస్తూ అసెంబ్లీలో కమిటీని వేసి అదేవిధంగా షమీం అత్తరు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసి దానిపై సర్వే చేయించి వర్గీకరణ చేయించి మంత్రివర్గంతో ముసాయిదా తీర్మానం చేయించడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి మాదిగలు మాదిగ ఉపకులాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత కల్పించి అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని 19 96లో వర్గీకరణ చేస్తానని ప్రకటించిన బిజెపి నాలుగు పర్యాయాలు అధికారంలోకి వచ్చి వారు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని అన్నారు. ఇలాంటి బీజేపీని ప్రజలు పాతాళని తొక్కే రోజు దగ్గరలో ఉందని బిజెపి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య అన్నారు.
నా నియమానికి సహకరించినటువంటి దళితరత్నం దొబ్బటి రమేష్ టి పి సి సి కార్యదర్శి పాముల రమేష్, డాక్టర్ శరత్, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, దయాకర్, రావుల మురళి, మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఘనపురపు అంజయ్య, మిట్ట కడుపుల జలంధర్, బ్లాక్ కాంగ్రెస్ బైరు వెంకన్న, పలువురికి అభినందనలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ

* సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబాసాహెబ్ గితే(IPS), ఈరోజు సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు.

జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు.

ఎండ కాలంలో వడ దెబ్బె మందులు సిద్ధంగా ఉంచుకోవాలి

జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి జిల్లా జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను
నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులను ఆదేశించారు.క్షయ వ్యాధిమధుమేహం వేసవి కాలంలో వచ్చే వడదెబ్బలను అరికట్టేందుకు వైద్య శాఖ ద్వారా చేపడుతున్న చర్యల పై గురువారం కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు.మిషన్ మధుమేహ ద్వారా జిల్లాలోని 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మధుమేహం వ్యాధిని ముందుగానే గుర్తించి వ్యాధి నివారణకు అవగాహన మందులు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికీ నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పూర్తి అయ్యిందని మిగిలినవి మార్చి 25 లోపు పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు.
జిల్లాలోమధుమేహం బారిన పడకుండా ఉండటానికి, వచ్చినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లలో మార్పులు వ్యాయామం పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా గోడపత్రికలు చేయించి ప్రచారం చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని అనుమానిత లక్షణాలు ఉన్న క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఏ ఒక్క అనుమానితున్ని వదిలిపెట్టవద్దని కలెక్టర ఆదేశించారు .దాదాపు 99 శాతం ప్రక్రియ పూర్తి అయ్యిందని మిగిలిన ఒక్క శాతం సైతం త్వరలో పూర్తి చేస్తామని ప్రోగ్రాం ఆఫీసర్ డా సాయినాథ్ రెడ్డి తెలిపారు. క్షయవ్యాధి నిర్ధారణకు గల్లా పరీక్షతో పాటు ఎక్సరే తీసి క్షయవ్యాధి నిర్ధారణ పకడ్బందీగా చేయాలని సూచించార.వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహనతో పాటు అవసరమైన మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ముఖ్యంగా ఉపాధిహామీ లో పనిచేసే వారికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు ముందుగానే అందుబాటులోఉంచాలని సూచించారు ఎవరైనా వడదెబ్బకు గురి అయితే సెలైన్, అవసరమైన మందులు ఇచ్చి పూర్తిస్థాయి వైద్యం అందించే విధంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వడదెబ్బ బారిన పడకుండా తగిన సలహాలు సూచనలు ప్రచారం చేయాలని సూచించారు.జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచంద్ర రావు. డా. పరిమళ, బాసిత్ డి పి ఆర్ ఓ వైద్య అధికారులు పాల్గొన్నారు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు….

తంగళ్ళపల్లి:నేటి ధాత్రి

తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బంది సరైన టైంలో వస్తున్నారా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారనిఅధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టి సైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించి మండలంలో ఇంటి ఇతర పనులపై ఆరా తీశారు మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపిడిఓ లక్ష్మీనారాయణ ఆరా తీయగా . 2893. దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని
కలెక్టర్అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ ముందుగా ఓపి రిజిస్ట్రేషన్ పరిశీలించారు ఇతర రూములు తిరుగుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపై ఎటువంటి రకాల పరీక్షలు చేస్తూ వారికి మందులు ఇచ్చే గది ల్యాబ్ తనిఖీ చేసి మందులు వ్యాక్సిలపై ఆరా తీశారు ప్రభుత్వ వైద్య సేవ చేసుకునేలా ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ప్రభుత్వ దావఖానాలోనే ప్రసవం అయ్యేలా చూడాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కొరతలు ఉన్నాయని నేరెళ్ల వైద్యశాల అధికారి డాక్టర్ చంద్రిక రెడ్డిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత నేరెళ్ల టీజి ఆర్ ఎస్ గర్ల్స్ విద్యార్థి హాస్టల్లో సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం రాగిజావయిస్తుండగా పరిశీలించారు తర్వాత ఏ ఆహారాలు విద్యార్థులకు అందిస్తున్నారు అని అడగగా ప్రిన్సిపల్ సమాధానం చెబుతూ మెనూ ప్రకారం బగారా రైస్ ఆలుగడ్డ కూర టమాట ఉడికించిన గుడ్లు, సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేలా చర్యలు తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికల ప్రకారం విద్యార్థులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం.

జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం

నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా ,హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ ప్రింటింగ్ మరియు ప్యాకేజ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. భారత రాష్ట్రపతి మరియు హర్యానా గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు, ఈ సందర్భంగా గోషిక వెంకటేష్ మాట్లాడుతూ , హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని తన కృషికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సహంతో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను మొదట డిప్లొమా, జి జె యు నుండి బి. టెక్ , ఎం. టెక్ చేసాను. దీని తరువాత నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసాను మరియు కొన్ని సంవత్సరాల తరువాత – నాకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు నా డిగ్రీ మరియు పతకాన్ని స్వీకరించడానికి జి జె యు హిసార్ హర్యానాకు పిలువబడిందన్నారు. ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం.!

బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు.
. ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట నేటిదాత్రి : 

ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ లో నుండి తీరుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఇప్పటికి ఓటమి నీ అంగీకరించలేకపోతున్నారని మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విఫలమయ్యారని అందుకే ఉపాధ్యాయులు మేధావులు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 2025 బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ టాక్స్ నుండి మధ్యతరగతి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపశమనం కలిగించారని దానిని ఉపాధ్యాయ మేధావులు పట్టబద్రులు అంగీకరించి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికారని అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ కోసం మరియు ఉత్తర తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పసుపు బోర్డు మరియు మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని మహేందర్ రెడ్డి పత్రికా మిత్రుల సమావేశంలో అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మహేందర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది తప్ప అటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవసరం ఉండదని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారని తమ పార్టీ లో పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకులు మాత్రమే ఉంటారని అమ్ముడు పోయే నాయకులు కార్యకర్తలు ఉండరని పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసే కార్యకర్తలు మాత్రమే ఉంటారని మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి గట్టిగా తమ సత్తా ఏంటో నిరూపించి చూపిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తులు

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్
వనపర్తి నెటిదాత్రి;
వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వివిధ ప్రాంతాలను నుండి వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్వీకరించారు . ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా చట్టపరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ 
 ఆదేశించారు

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం

జహీరాబాద్. నేటి ధాత్రి:

MIM

వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో ఆయన వ్యవసాయ భూములను సందర్శించి సూక్ష్మ సేద్య పరికరాలతో సాగులో ఉన్న పంట పొలాలను అమర్చిన పరికరాలను పరిశీలించి నారు. బిందు సేద్యాన్ని అమలు చేస్తున్న రైతులను ఉద్దేశించి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం ద్వారా నీటినిపొదుపు చేసుకోవడం తో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు.క్షేత్ర పర్యటన లో జైన్ డ్రిప్ డి సి ఓ విజయకుమార్, నేటఫీమ్ డిసిఓ పాండు,గొల్ల రాజరమేష్, స్వామి రైతులు అంజన్న,శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు

మంచిర్యాల జిల్లాలో ప్రత్యక్షమైన అఘోరిమాత..

మంచిర్యాల జిల్లాలో ప్రత్యక్షమైన అఘోరిమాత

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ హైవే రోడ్డుపై కారులో దూసుకెళ్తున్న అఘోరీ మాత.శుక్రవారం ఉదయం11:45 నిమిషాల టైం లో కారులో వెళ్తున్న అఘోరిమాతను చూసిన ప్రజలు ఆపే ప్రయత్నం చేసిన అఘోరిమాత కారు ఆపకుండా వెళ్లిపోయారు.కాలేశ్వరం దేవాలయానికి అఘోరి మాత వెళ్తున్నారేమో అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version