సూక్ష్మ నీటి సేద్యంతో తక్కువ నీటికి ఎక్కువ దిగుబడులు

సూక్ష్మ నీటి సేద్యం ద్వారా తక్కువ నీటి తో ఎక్కువ దిగుబడులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో సూక్ష్మ నీటి సేద్యం ద్వారా ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల ను జిల్లా ఉద్యాన. అధికారి పి. సోమేశ్వర రావు సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సూక్ష్మ నీటి సేద్యం ద్వారా తక్కువ నీటి తో ఎక్కువ దిగుబడులు రైతులు సాధిస్తున్నారని తెలిపారు. ఈ సూక్ష్మ నీటి సేద్యం ద్వారా దీర్ఘ కాలిక పంటలు సాగు చేసుకోవచ్చని .

మరియు కలుపు నివారణ కు కూడా ఈ సూక్ష్మ సేద్యం దోహద పడుతుందని తెలిపారు. సూక్ష్మ సేద్యం ద్వారా సాగు చేస్తున్న పంటలను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ క్షేత్ర స్థాయి ప్రోగ్రామ్ ఉద్యాన అధికారి మౌనిక రెడ్డి, జైన కంపెనీ ప్రతి నిధులు విజయ్, స్వామి,గొల్ల రాజా రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్ ఫామ్ పై మొగ్గు చూపాలిసోమలింగా రెడ్డీ.

ఆయిల్ ఫామ్ పై మొగ్గు చూపాలిసోమలింగా రెడ్డీ.

నిజాంపేట: నేటి ధాత్రి

 

రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై మోగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఎనుమల రాజబాబు 3 సంవత్సరాల వయస్సు గల ఆయిల్ ఫామ్ తోటను సందర్శించి.. రైతుకు పలు సూచనలు చేసి మాట్లాడారు.. మండల వ్యాప్తంగా ప్రజలు ఆయిల్ ఫామ్ తోటపై మోగ్గుచూపులున్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన వనరులు ఉన్నాయన్నారు. మొక్క నాటిన 4 సంవత్సరాల తర్వాత స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. సబ్సిడీ రూపంలో డ్రిప్ సౌకర్యంతో పాటు మొక్కలను అంతర్ పంట సాగు కొరకు డబ్బును పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీలత, మౌనిక తదితరులు ఉన్నారు.

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో ఆయన వ్యవసాయ భూములను సందర్శించి సూక్ష్మ సేద్య పరికరాలతో సాగులో ఉన్న పంట పొలాలను అమర్చిన పరికరాలను పరిశీలించి నారు. బిందు సేద్యాన్ని అమలు చేస్తున్న రైతులను ఉద్దేశించి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం ద్వారా నీటినిపొదుపు చేసుకోవడం తో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు.క్షేత్ర పర్యటన లో జైన్ డ్రిప్ డి సి ఓ విజయకుమార్, నేటఫీమ్ డిసిఓ పాండు,గొల్ల రాజరమేష్, స్వామి రైతులు అంజన్న,శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version