సంగారెడ్డి జిల్లాలో వింత.. బ్రహ్మంగారి భవిష్యవాణి నిజమవుతోందా?
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన చోటు చేసుకుంటుంది. ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి గ్రామ శివారులో ఉన్న ఒక రావి చెట్టు నడిమధ్య నుండి ఒక ఈత చెట్టు మొలకెత్తి పెద్దగా పెరిగింది. ఒక చెట్టు మొదలు నుండి వేరొక చెట్టు పెరగడం చాలా అరుదు. కానీ ఇక్కడ రెండు రకాల చెట్లు ఒకే చోట పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అద్భుతం చూసిన స్థానికులు, బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు నిజమవుతున్నాయని అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ చెట్లు ఇక్కడ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందని గ్రామ ప్రజలు అంటున్నారు
కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి..
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా క్యాతనపల్లి మునిసిపాలిటీకి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ లు కరీంనగర్ జిల్లా పరిశీలకులుగా తనను నియమించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామం, మండలం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే తీరును పరిశీలించేందుకు పరిశీలించేందుకు జిల్లా పరిశీలకునిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.
ఈనెల 25న జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సును జయప్రదం చేయండి – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు
కరీంనగర్, నేటిధాత్రి:
నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈనెల 25వ తేదీన బద్దం ఎల్లారెడ్డి భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సన్నాహక సదస్సు జరుగుతుందని కావున జిల్లాలోని కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడులో గల సిమెంట్ గోదాం హమాలీ కార్మికుల సమావేశం జంగం తిరుపతి అధ్యక్షతన గోదాం వద్ద జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె చేయాలని అందుకోసమే సదస్సు నిర్వహించడo జరుగుతుందని దీనిలో కార్మికలోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈసమావేశంలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు ననవేని కొమరయ్య ననవేని శ్రీనివాస్, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి ):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్.బి. గితె ఐపీఎస్ ప్రారంభించారు.అనంతరం డాడీస్ రోడ్ ఆప్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాపెల్లి రాజలింగం వాహనాలు నడిపే వారికి డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ఎలా ఉపయోగపడుతుందో వివరణ ఇచ్చారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.వాహనాలకు “డాడీస్ రోడ్ ఆప్” క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక, లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
SP launches
అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడటమే “డాడీస్ రోడ్ యాప్” ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అనంతరం సూపరింటెండెంట్ పోలీస్ మహేష్ బి గితె ఐ.పీ.ఎస్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు.ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసిన అలర్ట్ మెసేజ్ వస్తుందన్నారు.ఇటువంటి యాప్ తయారు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.జిల్లా ప్రజలు అనుకోని ప్రమాదాల భారీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ ఆప్ క్యూఆర్ స్టిక్కర్ ను వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గం డిస్ట్రిబ్యూటర్ ముప్పిడి గంగారెడ్డి డాడీస్ రోడ్ సభ్యులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల కార్యవర్గం ఎన్నిక.
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు) ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) రాజన్న సిరిసిల్ల శాఖ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడిగా డా. నల్ల మధు మరియు జనరల్ సెక్రటరీగా డా. తడుకా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రానున్న సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్యులు డా. కె ప్రసాద్ రావు, డా. మురళీధర్ రావు, డా. శ్రీనివాస్, డా. సురేంద్రబాబు గారులతో పాటు, ఇతర పీడియాట్రిషియన్లు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా( IAP) రాజన్న సిరిసిల్ల శాఖ సామూహిక కార్యకలాపాల శక్తివంతమైన ఆరంభాన్ని సూచిస్తూ, భవిష్యత్తులో పిల్లల ఆరోగ్య అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించనుంది అని వైద్యులు తెలిపారు.
వనపర్తి జిల్లాలో శుభాకార్యాలలో ఊరేగింపుల్లో,డీజే నిషేధం ఎస్పీ వనపర్తి నేటిదాత్రి ;
ప్రజలు డిజె సౌండ్ సిస్టమ్ సాంప్రదాయానికి స్వస్తి పలకాలని చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా,.శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ శబ్దాలతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నామని ఎస్పీ అన్నారు వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల డీజే యజమానులు, నిర్వాహకులకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వాహకులకు అవగాహన కల్పించారు అధిక శబ్ద తీవ్రత గల డిజె సౌండ్ సిస్టమ్ ను పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ర్యాలీలో ఉపయోగించడం వల్ల అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అందరికీ తెలుసనీ ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు ఈ డీజే సంపదాయానికి అలవాటు పడి తప్పతాగి విచ్చలవిడిగా చిందులు వేయడం ఒక ఫ్యాషన్ గా మారిందని ఆయన వివరించారు. సాంప్రదాయ బద్దంగా జరగాల్సిన పెళ్ళిళ్ళు శుభకార్యాలలో కూడా డీజే సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారిందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
wanaparthi
అంతే కాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై వనపర్తి జిల్లా పరిధిలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్ మరియు బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను పరిరక్షణ చట్టం సెక్షన్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు ఈ నిషేదిత ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష జరిమానా ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పీ,వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ, కృష్ణ, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు .
బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు యువత విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలాలి బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.
గంగాధర నేటిధాత్రి :
బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజితోత్సవ సభకు చొప్పదండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి లోకం తరలివెళ్లాలని బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ వై నియోజకవర్గ ఇన్చార్జ్ బంధారపు అజయ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం గంగాధరలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, త్వరలో నియోజకవర్గ స్థాయి యువత, విద్యార్థి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ 25 సంవత్సరాల పాటు ప్రజల మద్దతుతో ముందుకు సాగుతూ, దేశ చరిత్రలో విశేషమైన స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు. “ఒక్కడితో ప్రారంభమైన బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అనేకమంది నాయకులను, కార్యకర్తలను తయారు చేసింది. వందలాది ఎమ్మెల్యేలు, వేలాది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలను అందించిన పార్టీ బిఆర్ఎస్. విద్యార్థులు, యువతకు అవకాశాలు కల్పించిన పార్టీ ఇదే,” అని వారు అన్నారు. సమావేశంలో గంగాధర యువత అధ్యక్షులు సుంకె అనిల్, రామడుగు అధ్యక్షులు ఆరెపల్లి ప్రశాంత్, కొడిమ్యాల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ చొప్పదండి పట్టణ అధ్యక్షులు నరేష్ రావణ్, సముద్రాల ఓంకార్, గంగాధర సంపత్, జక్కుల వెంకటేష్, దుబ్బాసి రఘు, యువత, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ సంయుక్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ భాగమైన బాబు జగ్జీవన్ రాం వ్యవసాయ కళాశాల సిరిసిల్ల జాతీయ సేవ పథక విభాగం మరియు సిరిసిల్ల జిల్లా సంక్షేమ సంయుక్తంగా ఏడవ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బాలింతలు గర్భిణీ స్త్రీలు మరియు గృహనులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజ్యం మాట్లాడుతూసమతుల్య ఆహారం పిల్లలకు మరియు స్త్రీలకు చాలా అవసరమని పాలు మరియు గ్రుడ్డు సముతుల్య ఆహారంలో భాగమని వివరిస్తూ మన దేశంలో 34 శాతం పిల్లలు పోషక లోపంతో బాధపడుతున్నారని తెలియజేశారు కళాశాల ఎన్ఎస్ఎస్ నిర్వాహకులు సహాయ ఆచార్యులు డాక్టర్ మాధవి మాట్లాడుతూ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలు మొదటి 1000 రోజులు అనగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలకు రెండు సంవత్సరాలు నిండే వరకు పోషకాహాలతో నిండిన ఆహారం ముఖ్యమని వివరించారు డాక్టర్ సంపత్ కుమార్ సహాయ ఆచార్యులు మరియు కళాశాల దత్త గ్రామం నిర్వాహకులు మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ఆహారంతో పాటు మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమని కరోనా తర్వాత మన ఆహారం అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు నేటి పిల్లల రేపటి దేశ పౌరులని వివరిస్తూ వారు ఆరోగ్యం దేశ భవిష్యత్తు నిర్వహిస్తుందని అంతేకాకుండా స్త్రీలు ముఖ్యంగా బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలని వివరించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి అంగన్వాడి అధికారులు పాఠశాల విద్యార్థులు గృహనులు బాలింతలు గర్భిణీ స్త్రీలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు
సీనియర్ సిటిజన్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారిగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ, మహేష్.బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ చట్టం ప్రకారం సామాన్యులకు కూడా చట్టంలోని అంశములు తెలిసి ఫిర్యాదు చేయుటకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు. మరియు ఎస్పీ అనుమతితో ఆఫీసు ముందర పోస్టర్ను అతికించడం జరిగినది. అత్యధికంగా ప్రజలు తిరిగే ఆర్డిఓ. కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది. సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి అనుమతితో అక్కడ కూడా వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు, దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు , అంకారపు జ్ఞానోబా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు.
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో డాక్టర్,భీమ్ రామ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు. అనంతరం గ్రంథాలయ విద్యార్థినీ,విద్యార్థులను పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జిల్లా గ్రంథాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి. మహనీయుడైన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు . ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు కమటం మల్లయ్య, గ్రంథాలయ సిబ్బంది, సాయి, మహేష్ మరియు, విద్యార్థులు,పాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.
ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలన,కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్, అంగన్వాడి సెంటర్ తనిఖీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని పెద్ద ఎత్తున లేబర్ ను మొబలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన అడవిలోకి వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న ట్రాం చ్ పనులను పరిశీలించారు.
Collector
అలాగే కూలీల సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల కుటుంబ వివరాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు,పని వేళలు,తదితరాల విషయాలను అడుగుతూ, వారితో హాయిగా ముచ్చటిస్తూ, స్ఫూర్తిని కలిగించారు.ఈ సందర్భంగా ఎంత మంది ఇక్కడ ఈ కూలీ పనులు చేస్తున్నారు? వారి పని వేళలు ఎప్పటివరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారు? వంటి వివరాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు లేబర్ ను మొబలైజ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.ఈ మూడు నెలలు అత్యంత కీలకమని చెప్పారు.ఈ మేరకు అధికారులు స్పందిస్తూ పర్వతాపూర్ గ్రామంలో 160 మంది ఈ కూలీ పనులు చేస్తున్నారన్నారు.ఎండాకాలం దృష్ట్యా వారి పని వేళలు ఉదయం 7 నుంచి 11 వరకు అని అన్నారు. 5 మీటర్స్ పొడవు 1 మీటర్ వెడల్పు , 0.5 మీటర్ లోతు పనులు చేస్తున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.అలాగే ఉపాధి హామీ పనులకు సంబంధించిన కొలతల పుస్తకాన్ని, జాబ్ కార్డులను, మాస్టర్ రోల్ ను అన్ని రిజిస్టర్ లను స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు.కొలతల్లో వ్యత్యాసం రావొద్దని, సామాజిక తనిఖీల్లో ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు.స్వయంగ అక్కడ తీసిన ట్రెంచ్ ల కొలతలు టేప్ తో కొలచి సంతృప్తి వ్యక్తం చేశారు.వేజ్ పెరిగితే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని అన్నారు.
Collector
వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని అదే విధంగా తాగునీరు,నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ప్రభావం ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.శరీరం నిర్జలీకరణ డీ హైడ్రేషన్ కు గురికాకుండా సరిపడా స్వచ్ఛమైన తాగునీరు, ఉత్తేజితులయ్యేందుకు గాను ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూలీలకు సూచించారు.కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు, అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు, అంగన్వాడి సెంటర్లో చిన్నారుల మేధస్సును పాటలు పద్యల రూపంలో పరీక్షించి అంగన్వాడీ పనితీరు పట్ల ఆదర్శంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ వరలక్ష్మి, ఏపీవో శంకరయ్య, టెక్ని టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత. వనపర్తి నేటిదాత్రి :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాసవి వనిత క్లబ్ వనపర్తి గోల్డ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశము నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా జెడ్జి శ్రీమతి ఎమ్.ఆర్ సునీత లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి రజిని డిహెచ్ఎంఓ శ్రీనివాసులు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల న్యాయ వాది ఉత్తరయ్య పాల్గొన్నారు ఈసందర్భంగా జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం ఉదయం నడక తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యం గా ఉంటారని అన్నారు పిల్లలను మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి శ్రీనివాసులు సెక్రెటరీ కే బుచ్చయ్య కోశాధికారి ఏ మధుసూదన్ ఆర్యవైశ్య సంగం కన్వీనర్ పూరి బాలరాజు పట్టణ బీజేపీ మాజి అధ్యక్షులు బచ్చు రాము వనితా క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి సువర్ణ సెక్రెటరీ కొంపల్లి రజిత భార్గవి ఆర్యవైశ్య సంగం పట్టణ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి సంధ్య మాధవి రాజశేఖర్ నరసింహస్వామి నవీన్ వనపర్తి ఆర్యవైశ్య లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలులకు ఆర్డర్ కాపీలు అందజేసిన సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్.
* సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట బోయినిపల్లె తంగళ్ళపల్లి, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలకి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీత రావు, ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేసినవారికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది ఇల్లంతకుంట మండల అధ్యక్షురాలుగా జ్యోతి గారిని, బోయిన్ పల్లి మండల అధ్యక్షురాలుగా రాజలక్ష్మి గారిని, తంగళ్ళపల్లి మండల అధ్యక్షురాలుగా హారిక రెడ్డిని, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలుగా వనిత బ్లాక్ కాంగ్రెస్ మహిళ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా సామల రోజా, జిల్లా సెక్రెటరిగా సరితరెడ్డి,
Congress President.
జిల్లాకాంగ్రెస్ కార్యలయంలోఈరోజు ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం సభ్యత్వ నమోదులో లక్షకు పైచిలుకు సభ్యత్వాలు చేసి ముందంజలో ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు మహిళలందరూ కూడా ముందుండి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహిళ సాధికారత కోసం కృషి మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే క్రమంలో మహిళలకు అందరికీ సమైక్య సంఘాల నుండి బస్సులు కొనుగోలు చేసి మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి 200 యూనిట్ల కరెంటు ఉచితం ఆరోగ్యశ్రీ , నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమంలోamc చైర్మన్ వెలుముల స్వరూప జిల్లా మహిళ కాంగ్రెస్ సినియర్ నాయకరాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, సుధా, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి తంగళ్ళపల్లె మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్( టోని) మరియు సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
Celebrations.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే చిత్రపటానికి పూలమాలలు వేసి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ మనోహర్ రావు, ఆయా శాఖల అధికారులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల విధులతో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమైక్య భవనానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ సమీపంలో అధునాతన పద్ధతుల్లో నూతనంగా భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని వివరించారు. మహిళాసంఘాలకుచేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళలు ఆర్థికంగా ఎదిగిన అప్పుడే ఆ కుటుంబం ఉన్నత శిఖరాలకుచేరుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ని కలిసిన పెబ్బేరు నూతన ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
గురువారం నూతన పెబ్బేరు ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డివనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లాఎస్పీ రావుల గిరిధర్నుమర్యాదపూర్వకంగాకలిస పుష్పగుచ్చం అందజేశారురు ఈ సందర్భంగ ఎస్పీ మాట్లాడుతూవిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు జి,యుగంధర్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ పెబ్బేరుకు బదిలీపై వచ్చారు.పెబ్బేరు ఎస్సైగా పనిచేసిన హరిప్రసాద్ రెడ్డి వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీపై వెళ్ళారు. శాంతిభద్రతల పరిరక్షణకు పెబ్బేరు ప్రజలు సహకరించాలని నూతన ఎస్సై యుగందర్ రెడ్డి ప్రజలను కోరారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే ఐపిఎస్
సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పోలీస్ అధికారులతో నేడు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని ,పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ ఉన్న కేసులలో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి నింధితులను అరెస్టు చేసి త్వరగా చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పగడ్భందీగా వ్యవహరించాలని,నేరాల చెదనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ త్వరగతిన సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, సదన్ కుమార్, మధుకర్, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.
అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.
అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.
BJP
మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.
అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా
సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )
బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది. ₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000 అందించాలని, పంటల బీమా యోజన అమలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బిజెపి జిల్లా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.