ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట నేటిదాత్రి :
ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ లో నుండి తీరుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఇప్పటికి ఓటమి నీ అంగీకరించలేకపోతున్నారని మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విఫలమయ్యారని అందుకే ఉపాధ్యాయులు మేధావులు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 2025 బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ టాక్స్ నుండి మధ్యతరగతి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపశమనం కలిగించారని దానిని ఉపాధ్యాయ మేధావులు పట్టబద్రులు అంగీకరించి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికారని అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ కోసం మరియు ఉత్తర తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పసుపు బోర్డు మరియు మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని మహేందర్ రెడ్డి పత్రికా మిత్రుల సమావేశంలో అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మహేందర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది తప్ప అటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవసరం ఉండదని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారని తమ పార్టీ లో పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకులు మాత్రమే ఉంటారని అమ్ముడు పోయే నాయకులు కార్యకర్తలు ఉండరని పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసే కార్యకర్తలు మాత్రమే ఉంటారని మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి గట్టిగా తమ సత్తా ఏంటో నిరూపించి చూపిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు