MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP..

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP కథలాపూర్ మండల శాఖ….

నేటి ధాత్రి కథలాపూర్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కథలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు MP నిధులను కేటాయించడంతో BJP మండల శాఖ,బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ,తండ్రీయాల, కథలాపూర్ గ్రామాలకు బోర్ మోటార్,దులూర్ రజక సంఘ భవనానికి 9 లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్,వేములవాడ నియోజకవర్గ నాయకులు చెన్నమనేని వికాస్ రావు లకు బీజేపీ మండల శాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావ్,బద్రి సత్యం,కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్,నరెడ్ల రవి,గడ్డం జీవన్ రెడ్డి, తెడ్డు మహేష్ పాల్గొన్నారు.

బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న.!

సిరిసిల్ల జిల్లాలోని బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణంలో ని మున్నూరు కాపు భవన్ లో
భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో

Bandi Sanjay

సిరిసిల్ల జిల్లా బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అనంతరం నూతనంగా సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడిగ నియమింపబడ్డ రెడ్డబోయిన గోపికి సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతూ… రాబోయేవి ఎన్నికలే,స్థానిక ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మనదని,బీజేపీ స్ట్రాటజీ ఎట్లుంటదో మీకు తెలుసునని, సెస్, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఫైట్ చేసినమో మీకు తెలుసు,సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే,భయపెట్టి బెదిరించి బీఆర్ఎస్ గెలిచినట్లు అరాచకాలు చేసిన దుర్మార్గమైన చరిత్ర బీఆర్ఎస్ దే అని,ఎవరెన్ని చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని,ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీజేపీదే అని బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బిజెపి ప్రధాన అధ్యక్షులు బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు యువకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

అబద్దాలకు హద్దు లేదు?..మాటలకు పొంతన లేదు!?

`అసలు జనసేన ఎందుకు పుట్టింది?

`ఎవరి కోసం పుట్టింది!

`ఎలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటోంది!

`అసలు సిద్దాంతం ఏమిటి?

`చేయాల్సిన రాద్దాంతం ఏమిటి?

`ఆవిర్భావ సభ ఎవరికి భరోసా కల్పించింది?

`కొత్త తరం నాయకత్వానికి ఏమి హామీ ఇచ్చింది?

`గంటకు పైగా సాగిన ఉపన్యాసంలో చెప్పిందేమిటి?

`గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన వుందా?

`కనీసం అప్పటి మాటలకు, ఇప్పటి మాటలు కొంచైనా సింక్‌ అవుతున్నాయా?

`దేవుని హారతితో తన తండ్రి సిగరెట్‌ వెలిగించుకునే వారు అని చెప్పిందే పవన్‌!

`మా ఇంట్లో ఎప్పుడూ రామ నామ జపం వినిపిస్తూనే వుండేది అంటున్నది పవనే!

`తొలిప్రేమ సినిమా తర్వాత కంప్యూటర్‌ కోర్స్‌ చెన్నై లో నేర్చుకున్నాన్నది పవనే!

`పరీక్ష రాసి రావడం వల్ల లేటైతే ఇంట్లో కంగారు పడ్డారని చెప్పింది ఆయనే.

`పదకొండేళ్ల ప్రస్థానం గురించి పక్కన పెట్టి తన బాల్య స్మృతులు చెప్పడమేమిటి?

`అసలు జన సేన లక్ష్యాలేమిటి?

`జనసేన అధికారంలోకి ఎప్పుడు వస్తుంది?

`జనసేన వల్ల ఏపికి ఏం లాభం చేకూరింది?

`పార్టీ కోసం కష్టపడుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?

`అవన్నీ వదిలేసి చెప్పిన మాటలేమిటి?

`జనసేన సభలో పవన్‌ చెప్పాల్సిన మాటలేనా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నోరు తెరిస్తే అబద్దమే..మాట మాట్లాడితే అబద్దమే..చెప్పిందంతా అబద్దమే..చెబుతున్నదంతా అబద్దమే..చెప్పేదేమున్నా అదీ అబద్దమే…ఈ మాటలు ఎవరి గురించో అనుకుంటున్నారా? జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ గురించి ఏపిలోని వివిధ రాజకీయా పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ఆది నుంచి ఆయన చెబుతున్న గతం తాలూకు మాటలకు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనలేదంటున్నారు. పైగా నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించిన ఘనత జనసేనదే అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ వార్షికోత్సవ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు కొంత పొగరాజేశారు. పిఠాపురంలో పవన్‌ గెలుపుకు తామే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు తోడు పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వాతావణంలో వేడిని పెంచాయి. తెలుగుదేశం శ్రేణుల నుంచి జనసేన మీద తీవ్ర నిరసనలు వెలువడ్డాయి. ఇదిలా వుంటే ప్రతి సారి పవన్‌ తన వ్యక్తిగత జీవితంలోని అంశాలు ఉటంకించడం పరిపాటిగా మారింది. అయితే ఒకటే విషయాన్ని పదే పదే చెబితే బాగుండదనుకుంటారో..లేక గతంలో చెప్పిన అంశాన్ని మర్చిపోతుంటారో గాని ఎప్పుడూ ఏదో ఒక కొత్త లెక్క చెబుతుంటారు. కాని గతంలోనే చెప్పిన విషయాన్నే మరోలా చెబుతుంటారు. ఇక్కడే అందరూ పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా తాను చెన్నైలో వివక్షను ఎదుర్కొన్నానంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం నెలకొన్నది. చిరంజీవి సినీ స్టార్‌గా ఎదిగింది చెన్నైలోనే. ఆయన తన జీవితంలో ఎక్కువ సినీ కాలం గడిపింది చెన్నైలోనే..అన్నతోనే వుంటూ పవన్‌ కూడా చెన్నైలోనే వున్నారు. కాని ఇప్పుడు చెన్నైలో తాను వివక్షను ఎదుర్కొన్నారని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీ వార్షికోత్సవ సభలో సుమారు 90 నిమిషాల పాటు ప్రసంగించిన పవన్‌ కళ్యాణ్‌ తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. గతంలో ఆయన నెల్లూరుతోపాటు, అనేక పట్టణాల్లో తన చదవు సాగిందంటూ చెప్పేవారు. చెన్నైలోనూ చదువుకున్నాననేవారు. ఏది నమ్మాలో ఇప్పటికీ ఎవరికీ అర్దం కాకుండాపోయింది. పైగా ఓసారి తెలుగు అంటారు. మరో సారి ఇంగ్లీష్‌ అంటారు. బోటనీ అంటారు..ఇలా ఆయనకు అప్పటికప్పుడు ఏది గుర్తుకు వస్తే అదే చదివినట్లు లెక్క అన్న ధోరణిలో చెబుతుంటారు. పదే పదే ఇలాంటి అంశాలలో చెప్పిన ప్రతీసారి కొత్తదనం కోసం కథలు చెప్పినట్లు తన బాల్యం గురించి చెబుతారు. ఇక తాను చెన్నైలో కంప్యూటర్‌ కోర్సు చదవిన సమయంలో అంటూ పిఠాపురంలో కొత్త కథ చెప్పారు. అప్పటికే తాను నాలుగు సినిమాలు చేసిన హీరోనైనా సరే తాను బైటకు వెళ్తే ఇంటికి వచ్చేవరకు భయపడేవారంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు చెన్నైలో వుండగా జరిగిందని ఒక సంఘటన చెప్పిన మరుక్షణమే సికింద్రాబాద్‌లోని సంగీత్‌ ధియేటర్‌ సంగతి చెప్పారు. జనం ఏది నమ్మాలో..ఏది నమ్మకూడదో కూడా అర్దం కాకుండా రాసుకొచ్చుకొని మరీ చెబుతుంటారు. పవన్‌ కల్యాన్‌ తన తండ్రి గురించి గతంలో చెబుతూ ఆయన కమ్యూనిస్టు వాది ఆయన నాస్తికుడు అని చెప్పారు. వాళ్ల నానమ్మ దేవుడికి హారతి ఇస్తే దానితో సిగరెట్‌ వెలిగించుకునేవారు అంటూ స్వయంగా పవన్‌ కళ్యాణే చెప్పారు. ఇప్పుడు మళ్లీ మా కుటుంబంలో నా చిన్న నాటినుంచి ఇంట్లో రామనామం వినిపిస్తూనేవుండేదంటారు. తన తండ్రి రామభక్తుడని పిఠాపురం సాక్షిగా చెప్పుకొచ్చారు. తాను నాస్తికవాదినంటూ పవన్‌ కూడా గతంలో అనేక సార్లు చెప్పారు. పైగా తాను బాప్టిజం తీసుకున్నానని కూడా ఆయనే చెప్పారు. తన పిల్లలకు కూడా బాప్టిజం తీసుకున్నానని గతంలో చెప్పారు. పిఠాపురం సాక్షిగా తాను 14వ ఏటనే పూజలు చేసేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి తాను కృషిని మాత్రమే నమ్ముతానని ఏ దేవుడిని నమ్మనంటూ వ్యాఖ్యానించారు. మరో సోదరుడు నాగబాబు తాను ఏ దేవుడిని నమ్మనంటూ కూడా ఆయన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లుచెప్పారు. మరి పవన్‌ మాత్రం మా ఇంట్లో సనాతనధర్మానికి ఎంతో విలువిస్తామంటూ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మమే లేకుంటే మన వ్యవస్ధ చిన్నాభిన్నమయ్యేదంటూ కొత్త కొత్త భాష్యాలు చెప్పారు. ఇవన్నీ విన్న జనసైనికులకు కూడా అసలు సభ ముఖ్య ఉద్దేశ్యమేమిటి? పవన్‌ కళ్యాన్‌ మాట్లాడుతున్నదేమిటని ముక్కున వేలేసుకున్నారు. ఇలా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కూడా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన ఎందుకు ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశ్యమేమిటి? దాని విధానాలేమిటి? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఇప్పటి వరకు సాధించిందేమిటి? ఇంకా సాధించాల్సిందేమిటి? జనసేన ఎలా ముందుకు సాగాలి? ఎప్పుడు అధికారంలోకి రావాలి? పార్టీ నిర్మాణం ఎలా సాగాలి? ఎంత మంది సభ్యులున్న పార్టీగా చరిత్ర సృష్టించాలి. ప్రాంతీయ పార్టీగా వుండాలా? జాతీయ పార్టీగా ఎదగాలా? అందుకు నాయకులు ఏంచేయాలి? కార్యకర్తలు ఏం చేయాలి? పార్టీ నిర్మాణంలో ఎవరెవరు? ఎలాంటి పాత్ర పోషించాలి. కార్యకర్తలు పూర్తి సమయం పార్టీకోసం కేటాయిస్తే వారి భవిష్యతేమిటి? రాజకీయంగా వారికి ఎలాంటి పదవులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? కూటమిలో చేరి ప్రజలకు ఇచ్చిన హమీల సంగతి ఏమిటి? వాటి అమలు తీరేమిటి? ఆరు గ్యారెంటీల ప్రస్తావనేది? వాటి అమలులో అవరోదాలు ఎందుకు ఎదురౌతున్నాయి? ఎప్పటి వరకు వాటిని పూర్తి చేసే అవకాశం వుంది? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకు జనసేను సంబంధం వుందా? లేదా? ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వంలో వుండి ప్రశ్నిస్తారా? లేక అమలు కాకుండా ఎదిరిస్తారా? వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా? లేదా మరో 15 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు అని చెప్పిన మాటలకు కట్టుబడి వుంటారా? 2014 ఎన్నికల ముందు కలిసి సాగిన కూటమిలో లుకలుకలు వచ్చినట్లు వస్తాయా? రాకుండా చూసుకుంటానని హమీ ఇస్తారా? ఇలాంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాని నలభై ఏళ్లు తెలుగుదేశం పార్టీని గెలిపించామని చెప్పి తన వల్లే కూటమి విజయం సాధించిందని పరోక్షంగా ప్రకటించారు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూటమి మధ్యలో చిచ్చు రాజేసేందుకు కారణమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. అయినా 2019 ఎన్నికల్లో 175 సీట్లకు జన సేనపోటీ చేస్తే గెలిచింది ఒక్కటి. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత జనసేనలో లేడు. పవన్‌ కళ్యాన్‌ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎవరు గెలవాలో..ఏ పార్టీని ఓడిరచాలో నిర్ణయం చేసేది ప్రజలు. కాని నాయకులు కలలు కంటుంటారు. ఎల్లకాలం మేమే వుంటామన్న భ్రమల్లో బతుకుతుంటారు. కాని ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాక్టికల్‌గా వుంటారు. గెలుపోటములు దైవాదీనాలంటూ చెబుతారు. కాని పవన్‌ కల్యాన్‌ అందుకు భిన్నంగా చెబుతుండడంతో జనం నవ్వుకుంటున్నారు. అసలు జనసేన పోటీ చేసిందే 21. కాకపోతే మొత్తం సీట్లు గెలిచారు. 150 సీట్లలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ విజయం సామాన్యమైంది కాదు. 135 సీట్లు గెల్చుకున్నది. ఆ గెలుపు కింద జనసేన గెలుపు అన్నది చాలా చిన్న విషయం. ఇకపోతే పిఠాపురంలో తన గెలుపుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మతోపాటు ఆయన కుమారుడు వర్మ పాత్ర వుందని కొనియాడారు. వర్మ చేత ఆశీస్సులు తీసుకున్నారు. కాని ఇప్పుడు పరోక్షంగా వర్మ లాంటి వాళ్లు అలా అనుకుంటే తమ ఖర్మ అన్నట్లు నాగబాబు అన్నారు. ఇదిలా వుంటే జాతీయ మీడియా పవన్‌ పై రాసిన ఆర్టికల్స్‌పై వివరణ ఇచ్చుకునే క్రమంలో తాను ఏం చెబుతున్నాడో తనకే అర్ధం కాకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైట్‌ నుంచి లెఫ్ట్‌కు, లెఫ్ట్‌ నుంచి సెంటర్‌కు అంటూ ఓ దినపత్రికలోవచ్చిన కధనంపై రకరకాల బాష్యాలు చెప్పారు. అలా మారాల్సిన పరిస్దితులు వచ్చాయని చెప్పుకున్నారు. చెగువేరా ఒక డాక్టర్‌గా మాత్రమే తెలుసని, ఆయన చేసిన సేవలు మాత్రమే తనకు తెలుసంటూ కొత్త లెక్కలు చెప్పడంతో అందరూ నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది జనసేన అనే వ్యాఖ్యలతో టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయితీ ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

బిజెపి నాయకులు వికాస్ రావు కి ఆహ్వానం.!

మల్యాల గ్రామంలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు బిజెపి నాయకులు వికాస్ రావు కి ఆహ్వానం.

చందుర్తి, నేటిధాత్రి:

మన మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే ప్ర ప్రధమ బ్రహ్మోత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి రావాలని బిజెపి నాయకులు చెన్నమనేని వికాస్ ని ఆలయ కమిటీ కలిసి ఆహ్వానం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతోపాటు అల్లాడి రమేశ్, మార్త సత్తయ్య, మొకిలే విజయేందర్, సిరికొండ శ్రీనివాస్, లోకోజి సతీష్, పాటి సుధాకర్, దురిశెట్టి రాజు, మూడపెళ్లి ముఖేష్ మరియు ఇతర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న.!

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సిరిసిల్లబిజెపి బిజెపి కార్యకర్తల్లో జోష్

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ * తేదీ:16-03-2025 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా * విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నేడు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట నేటిదాత్రి : 

ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ లో నుండి తీరుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఇప్పటికి ఓటమి నీ అంగీకరించలేకపోతున్నారని మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విఫలమయ్యారని అందుకే ఉపాధ్యాయులు మేధావులు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 2025 బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ టాక్స్ నుండి మధ్యతరగతి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపశమనం కలిగించారని దానిని ఉపాధ్యాయ మేధావులు పట్టబద్రులు అంగీకరించి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికారని అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ కోసం మరియు ఉత్తర తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పసుపు బోర్డు మరియు మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని మహేందర్ రెడ్డి పత్రికా మిత్రుల సమావేశంలో అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మహేందర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది తప్ప అటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవసరం ఉండదని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారని తమ పార్టీ లో పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకులు మాత్రమే ఉంటారని అమ్ముడు పోయే నాయకులు కార్యకర్తలు ఉండరని పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసే కార్యకర్తలు మాత్రమే ఉంటారని మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి గట్టిగా తమ సత్తా ఏంటో నిరూపించి చూపిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు

ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు

-సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు

 

-మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు

-క్షమించి మమ్మల్ని రమ్మంటారా?

-వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా!

-రమ్మంటే పరుగెత్తుకొస్తాం

-మేమక్కడ నెగలలేకపోతున్నాం…

-కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం

-ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు

-ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు

-మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు

-ప్రజల ముందు చులకనయ్యాం

-ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం

-కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు

-ముందు నుయ్యి, వెనుక గొయ్యి తొవ్వుకున్నారు

-ఎమ్మెల్యేలను ఆదరించకపోవడంలో కాంగ్రెస్‌ నాయకుల తప్పేం లేదు

-పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వేధించింది వీళ్లే

-పదేళ్లు పడరాని పాట్లు పడి కాంగ్రెస్‌ కోసం పనిచేశారు

-అనేక కేసులు ఎదుర్కొన్నారు

-నిర్భంధాలు చూశారు…పోలీసు దెబ్బలు తిన్నారు

-పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం లేక కాంగ్రెస్‌ నాయకులు సలసల కాగుతున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యే లకు సలాం కొట్టలేకపోతున్నారు

-కాంగ్రెస్‌ నాయకులు పాత బకాయిలు తీర్చుకునే సమయంలో వచ్చి చేయందుకున్నారు

-ఇది కాంగ్రెస్‌ నేతలకు సుతారం ఇష్టం లేదు

-అప్పుడు అదే ఎమ్మెల్యే పెత్తనం.. ఇప్పుడు అదే ఆధిపత్యం

-కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు

-ఎమ్మెల్యేలైనా సరే లెక్క చేయడం లేదు

-ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుల వెంటనే కార్యకర్తలుంటున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు

-కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు

-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్‌లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్‌ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్‌ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్‌ఎస్‌ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్‌లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్‌ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్‌ దక్కకపోవచ్చు. కాంగ్రెస్‌లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్‌పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌నుంచి బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్‌ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్‌ఎస్‌కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్‌ఎస్‌ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్‌పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్‌లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్‌లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్‌ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్‌ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్‌ఎస్‌ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్‌ఎస్‌ను అణచివేయొచ్చు. బిఆర్‌ఎస్‌ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్‌ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్‌ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్‌ఎస్‌ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్‌ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్‌ఎస్‌ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్‌ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్‌ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్‌లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్‌ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్‌ఎస్‌ ఛీప్‌తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్‌, హరీష్‌రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్‌ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ టికెట్‌ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్‌లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్‌ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్‌ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్‌ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్‌ఎస్‌ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు
చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి ముల్క కొమురయ్య భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతా తెలియజేస్తూ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు, ఈ సంబరాల కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముల్క కొమురయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ పొంచేట్టి రాకేష్,మండల ప్రధాన కార్యదర్శి గంగరాజు, పత్తిపాక శ్రీనివాస్, కొక్కుల నరేష్, తోట శంకర్,అయోధ్య పర్శరాములు, మట్కామ్ మల్లేశం,లింగాల రాజయ్య, సిరికొండ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు
– దీక్ష సమయంలో బిజెపి మద్దతు
– బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
సిరిసిల్ల, (నేటి ధాత్రి):

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో గురించి దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసిన తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్క కొమురయ్యకు ఓటు వేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రభాకర్,ఆడెపు రవీందర్,పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్,మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు,నరేష్, మోర రవి, విష్ణు, రాంప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు పండుగ మాధవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల బిజెపి అధ్యక్షులు వేన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పే ల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు పోకల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సిలివేరి ప్రశాంత్ గోనపల్లి శ్రీనివాస్ ఇటుకల మహేందర్ కిషన్ మోర్చా మండల అధ్యక్షులు ఆసాని ప్రభాకర్ రెడ్డి ఓబిసి మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్.బక్క శెట్టి రాజశేఖర్ గౌడ్ కటకం మధుసూదన్ మేకల సురేష్ గోగు పరిచయ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రామకృష్ణాపూర్ లో బిజెపి శ్రేణుల సంబరాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ భారీ ఘనవిజయం సాధించడం పట్ల రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో పట్టణ బిజెపి పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి, టపాసులు పేల్చే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల్ల పోషం, పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ లు మాట్లాడుతూ…. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్ ,వైద్య శ్రీనివాస్, వేముల అశోక్, సంతోష్ రామ్ నాయక్, శ్రీనివాస్, ఓరుగంటి సాయి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా బిజెపి అధ్యక్షులు నారాయణను సన్మానం చేసిన బిజెపి నేతలు

వనపర్తి నేటిధాత్రి;
వనపర్తి జిల్లా రెండవసారి నూతనంగా నియామకం అయిన జిల్లా బిజెపి అధ్యక్షుడు నారాయణ ను వనపర్తి జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి నేతలు శాలువతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు బచ్చురాం బిజెపి నేతలు బండారు కుమారస్వామి పెద్దిరాజు వసంత్ రెడ్డి తిరుమలేష్ మాజీ సర్పంచ్ దేవేందర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా బసరా వచ్చు రామ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేసిన అభివృద్ధి పనులను జిల్లా ప్రజలకు వివరిస్తమని అన్నారు

నూతనంగా ఎన్నుకోబడిన బిజేపి మండల కార్యవర్గానికి సన్మానం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల కార్యవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య పాల్గొని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు,కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానం చేశారు. అనంతరం చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ని పటిష్ట పరచాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజేపి పార్టి బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోనె విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యక్షులుగా. 1 లోకోజీ సతీష్ ( మల్యాల ) 2ఎల్లలా తిరుపతి రెడ్డి రామారావుపల్లి) 3 మట్కo మల్లేశం చందుర్తి ప్రధాన కార్యదర్శులుగా 1 మర్రి మల్లేశం చందుర్తి కార్యదర్శులుగా 1.అయోధ్య పర్షరాములు. జోగాపూర్ 2.కొక్కుల నరేష్ .లింగoపేట 3.నాయుని బాపు రెడ్డి. మరిగడ్డ 4.పత్తిపాక శ్రీనివాస్. మల్యాల కార్యవర్గం సభ్యులు గా 1.గంగిపెల్లి మల్లేశం సనుగుల 2.ఉగిలే శ్రీనివాస్ కిష్టంపేట మరియు కార్యకర్తలు సీనియర్ నాయకులు చిలుముల హనుమయ్య చారి, బద్దం తిరుమల్ రెడ్డి,చిర్ల మహేష్, అజమెరా రవి నాయక్, నరగుల సాగర్, గడ్డం రగు, జలగం శ్రీనివాస్ రావు, సునికి రాజు, ఈగ శ్రీధర్, చక్యాల లక్ష్మి నారాయణ నాయకులు పాల్గొన్నారు.

‘‘తొందరపడకు సుందరవదన’’!

`అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది.

`ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుంది.

`నాగబాబుకు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ!

`లోకేష్‌ సీఎం అంటే ఎందుకు ఉలికిపడుతున్నావు?

`మీడియా పై నాగబాబు జులుం సాగదు.

`నాగబాబుకు నచ్చినట్లు ఏ మీడియా వార్తలు రాయదు.

`కూటమిలో జనసేన ఒక నూలు పోగు మాత్రమే.

`తెలుగు దేశంతో ఉంటేనే జనసేనకు బలం.

`తెగదెంపులు చేసుకుంటే తెగిన గాలిపటం.

`ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమని మర్చిపోవద్దు.

`తెలుగు దేశం వల్లనే జనసేనకు సీట్లొచ్చాయన్నది అసలే మరువొద్దు.

`వాపు ఎప్పుడూ బలపు కాదు

`నిజం మీద రాజకీయం చేయకపోతే మనుగడ ఉండదు.

`నాగబాబు తొందరపడి నోరు జారకు?

`నోటిని అదుపులో పెట్టుకో!

`మాటల పొదుపు నేర్చుకో!

`అన్ని వేళల్లో ఆవేశం పనికి రాదు.

`పవన్‌ కళ్యాణ్‌ ఎంతో కష్టపడి జనసేన నిర్మించుకున్నాడు.

`తేనె సీసాలో నీటి చుక్కలు వేయకు.

`పవన్‌ కళ్యాణ్‌ కు రాజకీయ పరిమితులు తెలుసు

`పాలనలో ఎలా ఒదిగిపోవాలో తెలుసు

`ఎప్పటికైనా కూటమిలో లోకేషే సీఎం అని పవన్‌కు తెలుసు

`తెలుగు దేశం పార్టీ ఆలోచనలు పవన్‌కు తెలుసు

`కూటమికి ఎవరూ బీటలు పెట్టడం లేదు

`పవన్‌ ఎక్కడికెళ్లినా అభిమానులు సీఎం అంటారు

`ఏనాడు తెలుగు దేశం పార్టీ నొచ్చుకోలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

`లోకేష్‌ సీఎం అనగానే నాగబాబు స్పందించాల్సిన అవసరం లేదు

`కూటమిలో ఎవరో కుంపటి పెడుతున్నారని భ్రమ పడాల్సిన పని లేదు

`ఒకప్పుడు అభిమానులు పవర్‌ స్టార్‌ అని అరుస్తుంటేనే నాగబాబు జీర్ణించుకోలేదు

`అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేశావు

`జనసేన బలపడడంలో నాగబాబు పాత్ర నయాపైస కూడా లేదు

`పార్టీ నడపలేని సమయంలో దిల్‌ రాజు సినిమాతో పార్టీ బతికింది

`స్వయంగా ఈ మాట పవనే చెప్పింది

`గతంలో బాలకృష్ణ అంటే ఎవరో తెలియదన్నావు

`చరిత్ర ఎవరినీ మర్చిపోదు

`వడ్డీ తో సహా అన్నీ కాలమే చెల్లిస్తుంది

`అన్న చూసి ఓపిక నేర్చుకోలేదు,తమ్ముణ్ణి చూసి కష్టం నేర్చుకోలేదు

`మధ్యలో దూరి చిలువలు పలువలు చేయకు

`ఉన్న కాస్త పరువు తీసుకోకు..

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు వుండరు. ఇది రాజకీయాలకు వున్న మొదటి సిద్దాంతం. మూల సిద్దాంతం. రాజకీయ రాజ్యాంగంలో ఇది రాసి పెట్టకపోయినా, అనుసరిస్తున్న ఏకైక విదానం. సిద్దాంతం. సహజంగా మనం ప్రయాణం చేసే సమయంలో ఎంతో మంది కలుస్తుంటారు. ఇది కూడా అంతే. రాజకీయ పార్టీలకు, నాయకులకు ఎప్పుడు ఎవరు స్నేహితులౌతారో..ఎవరు ఎప్పుడు రాజకీయంగా శత్రువులౌతారో చెప్పడం కష్టం. రాజకీయాల్లో ఎలాంటి పరిస్ధితినైనా సరే ఒకే రకంగా తీసుకోవాలి. కాని జనసేన నాయకుడు నాగబాబు కొంత విరుద్దం. విచిత్రం. ఆయన మాటలు, తీరు, వ్యవహార శైలి కొంత వివాదాస్పదం. కారణం ఆయన ఆలోచనలు లేని, ఆవేశం మూలంగా చాల వరకు ఇరుకున పడుతుంటాడు. ముందూ వెనుక ఆలోచించడన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. ఈ మధ్య ఆయన పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎం. అయిన తర్వాత చాల కాలం తర్వాత నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. అయితే కేవలం కారులో కూర్చొని ఓ వీడియా విడుదల చేశారు. కూటమి ఒక బలమైన, దృఢమైన బంధమన్నారు. మంచి మాట. కాని ఎవరో కూటమి మధ్యలో చిచ్చు పెడుతున్నారని, ఆ బంధాన్ని ఎవరో బలహీన పర్చాలని చూస్తున్నారని, అలాంటి వార్తలు కొన్ని మీడియా సంస్ధలు సృష్టిస్తున్నాయని మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ మాట్లాడినట్లే ఇప్పుడూ చెల్లుతుందని అనుకున్నట్లున్నారు. అందుకే కొంచెం ఆవేశం ఎక్కువ కదా? అందుకే లోకేష్‌ సిఎం అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకోవడం ఆయనకు నచ్చడం లేదు. దాంతో కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియా పనిగట్టుకొని రాతలు రాస్తుందని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అసలు దేనికి చర్యలు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? అన్న ఆలోచన కూడా చేయకుండా తన నోటి దూలను మరోసారి నాగబాబు చూపించుకున్నారు. ఇక్కడ నాగబాబు ఒక మాట మర్చిపోతున్నారు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? ఎప్పటికైనా పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతోనే రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల్లో వుంటున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రాభివృద్దిని కాంక్షిస్తున్నారు. అలాంటప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలన్న కోరిక పవన్‌ కళ్యాణ్‌కు వుంటుంది. ఆయనను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని అభిమానులకు వుంటుంది. జనసేన ఏర్పాటు చేసిన నాటి నుంచి, నేటి వరకు పవన్‌ ఎక్కడికెళ్లినా సిఎం. సిఎం. అంటూ నినాదాలు చేయడం పరిపాటి. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. సాక్ష్యాత్తు పవన్‌ కళ్యాన్‌ కూడా గెలవలేదు. రెండు చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడికెళ్లినా జనం సిఎం. సిఎం అంటూ గోల చేశారు. ఆ సమయంలో ఓట్లు వేయలేదు..కాని సిఎం. సిఎం. అని అరిస్తే అవుతానా? ఓట్లేస్తే అవుతానని పవన్‌ అన్న మాటలు నాగబాబుకు గుర్తులేనట్లున్నాయి. సిఎం. సిఎం అనడం కాదు ఓట్లేసి చూపించండి సూచిస్తూనే ఒక దశలో ఓట్లేయండి అని వేడుకున్న సందర్భం కూడా వుంది. అలాంటప్పుడు 2009 నుంచి క్రియాశీల రాజకీయాల్లో వున్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ ముఖ్యమంత్రి కావాలనుకోవడం అభిమానుల తప్పా? పవన్‌ కళ్యాణ్‌ జనసేన అధ్యక్షుడు. లోకేష్‌ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి. అంటే రాజకీయంగా పార్టీ పరంగా పవన్‌ కల్యాన్‌కన్నా పవర్‌ పుల్‌ నాయకుడు లోకేష్‌. ఆంధ్రప్రదేశలో కూటమి వున్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించినంత కాలం ఆ పార్టీయే అధికారంలోవుంటుంది. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు, కొంత కాలం తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యేది లోకేష్‌ మాత్రమే. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్‌ మాత్రమే. ఏపిలో కూటమి ప్రభుత్వం ఎన్ని సార్లు అధికారంలోకి వచ్చినా పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా పోటీ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత మెజార్టీ సాదించలేదు. అధికారానికి అవసరమైన మెజార్టీ సీట్లులేవు. సరిగ్గా గత ఎన్నికల మందు జనసేకు కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. కాని బిజేపి రాయబారంతో పవన్‌ కళ్యాణ్‌కు 21 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు వరకు తెలుగుదేశంపార్టీ ఏ కూటమిలో కూడా లేదు. కేవలం పవన్‌ తన రాజకీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి నిచ్చెనగా తెలుగుదేశం పార్టీ సహకారంకోసం పాకులాడాడు. డిల్లీ వెళ్లి బిజేపిని కూటమి కోసం ఒప్పించారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బిజేపి నాయకుల కోసం ఎదురుచూడలేదు. డిల్లీ పెద్దలు రమ్మంటేనేవెళ్లారు. జాతీయ స్ధాయిలో బిజేపి బలహీనపడుతుందన్న సంగతి గ్రహించిన తర్వాతే చంద్రబాబు కోసం ఆ పార్టీ పెద్దలు ఆహ్వానం పలికారు. 2014 ఎన్డీయేలో వున్న చంద్రబాబును పక్కన పెట్టిందే బిజేపి పార్టీ. ఆ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఊహించని మెజార్టీతో కేంద్రంలో గెలిచిన తర్వాత బిజేపి తన రాజకీయం చూపించింది. దాంతో చంద్రబాబు కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా బిజేపితో కటీఫ్‌ చేసుకున్నారు. తర్వాత మళ్లీ బిజేపి పంచన చేరారు. కారణం రాజకీయ అవకాశ వాదం. ఇంతకు మించే ఏముంది? జనసేన పార్టీకి ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌కు వున్న అభిమానులు తప్ప, ఇప్పటికీ పార్టీ యంత్రాంగంపూర్తిగా లేదు. గ్రామ గ్రామాణ పార్టీ శ్రేణి నిర్మాణం జరగలేదు. కాని తెలుగుదేశం పార్టీ పరిస్దితి అది కాదు. నలభై సంవత్సరాలుగా పార్టీ పటిష్టమైన పునాదులతో వుంది. గ్రామ గ్రామాణ పార్టీ యంత్రాంగం బలంగా వుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి లోకేష్‌ సుధీర్ఘమైన పాదయాత్ర చేశారు. పార్టీని మరింత పటిష్టం చేశారు. లోకేష్‌ గట్టి ప్రయత్నం మూలంగా తెలుగుదేశం పార్టీకి సుమారు కోటి మంది సభ్యులున్నారు. జనసేనకు ఎంత మంది కార్యకర్తలున్నారో ఎవరైనా చెప్పలగరా? గత ఎన్నికల్లో పరస్పరసహాకారం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చేది. కాని జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎలా వుంటుందో ఓసారి ఊహించుకుంటే అర్దమౌతుంది. ఇక్కడ అటు జనసే, ఇటు తెలుగుదేశం పరస్పర అవగాహనతో ఎన్నికల్లో వెళ్లారు. ఒకరి ఓటు బ్యాంకు మరొకరికి ఉపయోగపడిరది. దాంతోనే అంత పెద్ద మెజార్టీ స్దానాలు కూటమి కైవసం చేసుకున్నది. అంతే కాని కూటమికి అన్ని సీట్లు రావడానికి తామే కారణమని పవన్‌ కళ్యాన్‌ కూడా అనుకోవడం లేదు. ఈ విషయాన్ని నాగబాబు గ్రహించాలి. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. పైగా తెలుగుదేశం పార్టీ మరో వంద సంవత్సరాలు నిలవాలన్నా, అధికారంలో వుండాలన్నా లోకేష్‌ నాయకత్వం ఎంతో అవసరం. లోకేష్‌ ముఖ్యమంత్రి కావడం ఆ పార్టీ శ్రేణులకు ఎంతో ముఖ్యం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకుడు వున్నప్పటికీ పార్టీ యంత్రాంగాన్నంతా కోఆర్డినేట్‌ చేస్తున్నది మొత్తం లోకేష్‌ మాత్రమే. ఆయన ఎంతో కష్టపడి సుధీర్ఘమైన పాదయాత్ర చేసి, కూటమి అదికారంలోకి రావడంలో పవన్‌ పాత్ర ఎంత వుందో చంద్రబాబు పాత్ర ఎంత వుందో, అంతకు మించి లోకేష్‌ పాత్ర వుందని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల నాగబాబు ఇప్పుడు తమ్ముడి మీద ఎంతో ప్రేమ ఒలకబోస్తే అభిమానులు కూడా నమ్మరు. గతంలో ఓసారి చిరంజీవి సినిమా ఫంక్షన్‌లో అభిమానులంతా పవర్‌ స్టార్‌, పవర్‌ స్టార్‌ అంటూ గోల చేస్తునప్పుడు వారిపై కోపం ప్రదర్శించింది నాగబాబు కాదా? సర్ధిచెప్పాల్సిన సమయంలో సహనం కోల్పోయి మాట్లాడిరది నాగబాబు కాదా? జనసేన పార్టీలో నయాపైన నాగబాబు కష్టం వుందా? జనసేన పార్టీని ఎలా నడపాలో అర్ధం కాని సమయంలో, ఆర్ధిక ఇబ్బందులతో పవన్‌ కొట్టుమిట్డాడుతున్న తరుణంలో వకీల్‌ సాబ్‌ సినిమా తీసి, తనను ఆర్ధికంగా ఆదుకున్నది దిల్‌ రాజు అని అశేష జనవాహిని ముందు సాక్ష్యాత్తు పవన్‌ కళ్యాన్‌ చెప్పారు. అంతే కాని జనసేన కోసం తన సోదరులు ఆర్ధిక సాయం చేశారని చెప్పలేదు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారని చెప్పినసందర్భం ఎప్పుడూ లేదు. సాఫీగా సాగుతున్న రాజకీయాలలో నాగబాబు వేలు పెట్టడం అవసరమా? మీడియా మీద అక్కసు వెల్లగక్కడం అవసరమా? కాలం రాజకీయాలను ఎటు వైపు తిప్పుతుందో ఎవరూ చెప్పలేరు. అయినా కూటమి మూలంగా ఎప్పటికైనా లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారన్న సంగతి తెలియకుండానే పవన్‌ కళ్యాన్‌ పొత్తుకు అంగీకరించి వుంటారా? అందుకే నాగబాబుకాస్త నోరు అదుపులో పెట్టుకో అని జనసైనికులే అంటున్నారు. ఇల్లు అలకగాన పండుగ కాదు. కూటమి పేరుతో ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి కాగానే రాజకీయం ఏలినట్టు కాదు. జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నప్పుడు లెక్క. అప్పడు నాగబాబు ఏది మాట్లాడినా దానికి ఓ విలువ వుంటుంది. ఇప్పుడు ఏది మాట్లాడినా తట్టుకోలేక మాట్లాడినట్లౌవుతుంది.

5, 8 మస్ట్​గా పాస్​ కావాల్సిందే!

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్​ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్​లో పాస్​ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. ‘గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల్లో విద్యార్థులు పెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటించిన రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలోనూ ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే ఎలిమెంటరీ విద్యా పూర్తయ్యే వరకు ఏ విద్యార్థని బహిష్కరించకూడదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ ముగ్గురిని సిఎంలను చేయగలరా!

https://epaper.netidhatri.com/view/387/netidhathri-e-paper-25th-september-2024%09

`కాంగ్రెస్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌.

`బిఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

`బిజేపి కేంద్ర మంత్రి బండి సంజయ్‌.

`ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!!

`పార్టీలు నిర్ణయం ప్రకటిస్తారా!

`బిసి వాదం అనగానే సరిపోదు!

`నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు.

`మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి!

`ప్రజల్లో వెనకబడిపోతున్నామని బిసిలను ముందుపెట్టకండి.

`తర్వాత కూరలో కరివేపాకులు చేయకండి!

`అండగా నిలబడిన బిసి నేతలను వెనక్కి తోయకండి!

`ఓసిల రాజకీయ అవసరాల కోసం బిసిలను ముందు పెట్టకండి.

`ఓట్ల కోసం బిసి రాజకీయాలు ఓసిలకు అలవాటే!

ఈసారి అలాంటి చిర్లర రాజకీయాలకు చెల్లు చీటే!

`బిసి ముఖ్యమంత్రి మా విధానం అని ప్రకటించండి.

`పార్టీ వేధికగా తీర్మానం చేయండి.

`మాట తప్పమని తేల్చి చెప్పండి.

`అప్పుడే బిసి నేతలను సమాజంలోకి పంపండి.

`బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలుసు.

`బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలకు అలుసు.

`బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు!

`పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు?

`తెలంగాణలో బిసిల అభ్యున్నతి అంటే బిస్కట్లు వేయడమా?

`అధికారంలో వున్నప్పుడు దామాషా లేదు.

`ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు.

`మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి.

`లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి.

`యాచించడం కాదు, శాసించడం కావాలి.

`బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మారుమ్రోగించండి.

`ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయండి.

`అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయండి.

`బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోండి.

`బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో చూడండి!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ రాజకీయాలలో బిసి మబ్బులు కమ్ముకున్నాయి. బిసిల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా బిసి నినాదం ఊపందుకున్నది. అన్ని పార్టీలు ఇప్పుడు బిసి జపం చేయని తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిజానికి జాతీయ స్థాయిలో బిసి గణన అనేది రాజకీయ అంశంగా మారి చాలా కాలమైంది. పార్లమెంటు ఎన్నికలలో బిజేపికి అదే ఆశనిపాతమైంది. అయినా ఆ వేడి తెలంగాణ దాక అప్పటి వరకు రాలేదు. దేశ వ్యాప్తంగా కుల గణన డిమాండ్‌ ఈపందుకున్న నేపథ్యంలో తెలంగాణలో బిసిల ఐక్యతా రాగం జోరందుకున్నది. అటు కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిసి లెక్కలు తేలాల్సిందే అంటూ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న గళం విప్పారు. ఇది ఆయన స్వయంగా ఎంచుకున్న అంశమా? లేక పార్టీ వెనకుండి నడిపిస్తున్న విషయమా! అన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. ఏది ఏమైనా అన్ని పార్టీలు తీన్మార్‌ మల్లన్న ఉచ్చులో పడిపోయాయన్నది వాస్తవం. ఇప్పుడు ముందుకు తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేకుండా చేయడంలో మల్లన్న మొదటి విజయం అందుకున్నారు. అదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల కదిలేలా చేశారు. బిసిల అంశంలో అన్ని పార్టీల బిసి నేతలను ఒకే వేధిక మీదకు తెస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు జేఏసి గూటికి చేరాయి. కాలం గడుస్తున్న కొద్దీ జారిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురౌతుందా! లేక బిసిల దామాషా ప్రకారం అందాల్సిన సీట్లు అన్ని పార్టీలు ప్రకటించే దాక పోరు జరుగుతుందా! వేచి చూడాలి. అయితే అన్ని పార్టీలు బిసి నినాదం ఎజెండాగా వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగాలని ప్రయత్నం చేస్తాయా? లేదా అన్నది కూడా తేలిపోతుంది. బిజేపి గత ఎన్నికల ముందే బిసి. ముఖ్యమంత్రి స్లోగన్‌ వాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు పూర్తిగా విశ్వసించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటిస్తే బిజేపి సీట్ల గెలుపు మరో రకంగా వుండేది. జాతీయ పార్టీలు ముందుగా సిఎం. అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదని తప్పించుకున్నారు. గెలవాల్సిన చోట ఓటమి మూటగట్టుకున్నారు. చే జేతులా ఎన్నికల ముందు చేతులు ఎత్తేసి చెయ్యి పార్టీకి మార్గం సుగమం చేశారు. తర్వాత తప్పు చేశామని అన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ లు బిసిల అంశాన్ని ముట్టుకోలేదు. అసలు బిసిలకు రావాల్సిన సీట్లు కూడా కేటాయించ లేదు. ఇప్పుడు తెలంగాణలో బిసి విదానం అమలు చేసే పార్టీకే నూకలుంటాయని బిసిలు బలంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం వుంది. తాజాగా బిఆర్‌ఎస్‌ బిసి అంశం ఎక్కడ కాంగ్రెస్‌, బిజేపిలు ఎత్తుకొని మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో ఏకాకిని చేస్తాయో అని ఉలిక్కిపడిరది. బిసి నేతలంతా కలిసి రాజకీయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆ పార్టీ నాయకులు సమావేశమై ఎజెండా రూపకల్పన చేశారు. కానీ వాళ్ల ఎజెండా ఎన్నికల నాటికి కేసిఆర్‌ అమలు చేస్తాడా? అన్నది మాత్రం అనుమానమే. అధికారంలో వున్న పదేళ్ళలో బిఆర్‌ఎస్‌ బిసిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమి లేదు. మంత్రి వర్గంలో తగిన స్థానం కల్పించింది లేదు. సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కేసిఆర్‌ పట్టించుకున్నది లేదు. పదేళ్ల కాలంలో ఎంతో మంది ఓసి నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా స్పందించలేదు. కానీ బిసి అయిన ఈటెల రాజేందర్‌ ను పార్టీ నుంచి తరిమేశాడు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి దించేశాడు. బిసి.బిడ్డ కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వలేదు. ఇలా బిసిలకు అనేక రకాలుగా కేసిఆర్‌ అన్యాయం చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి వేధిక మీద దళితుడే ముఖ్యమంత్రి అని వందల సార్లు చెప్పాడు. అధికారంలోకి రాగానే మాట మార్చాడు. మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కూడా కల్పించలేదు. అలాంటి కేసిఆర్‌ ఇప్పుడు బిసి నినాదం ఎత్తుకుంటే ప్రజలు నమ్మకపోవచ్చు. స్వయంగా కేసిఆరే బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు. ఒకవేళ ప్రకటించినా ప్రజలు నమ్ముతారనే నమ్మకం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఎలాగైనా అధికారంలో వస్తామనే కలలు కేసిఆర్‌ కంటున్నారు. అందుకే తెలంగాణ ఏం జరుగుతున్నా ఆయన నోరు మెదపడం లేదు. కేసిఆర్‌ ను ఓడిరచి తప్పు చేశామన్న భావనలో ప్రజలు పశ్చాత్తపపడాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ కేసిఆరే రావాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాడు. కాకపోతే ప్రజల్లో నాయకులు వుండాలన్న ఆలోచనతో బిసి నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కొన్ని గేమ్‌ మొదలుపెట్టారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా తానే ముఖ్యమంత్రిగా వుండాలనుకుంటారు. ప్రాంతీయ పార్టీలలో ఇతరులను ముఖ్యమంత్రులను చేయడం జరగదు. బిఆర్‌ఎస్‌ లో అది ఎప్పటికీ సాధ్యం కాదు. అయినా బిసి విధానం ప్రకటించాలనుకుంటే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలి. బిసిల వాదం వినిపించాలనుకున్నప్పుడు కచ్చితంగా వచ్చే ఎన్నికలకు ముందే బిసి ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాలి. కాంగ్రెస్‌ పార్టీలో ఉద్యమకారుడైన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ను మించిన బిసి నాయకుడు లేడు. కాంగ్రెస్‌ కు చిత్త శుద్ధి వుంటే మంత్రి పేరు ప్రకటించాలి. అలాగే బిజేపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తే చాలు. ఎందుకంటే తెలంగాణలో బిజేపి బలపడడానికి ప్రధాన కారణం ఎవరు? అని ఏ ఒక్కరినీ ప్రశ్నించినా బండి సంజయ్‌ అని టక్కున సమాధానం చెబుతారు. ఇలా ముగ్గురు నాయకులు మూడు పార్టీలలో వున్నారు. ఈ ముగ్గురిని సిఎం అభ్యర్థులుగా ఆయా పార్టీలు చేయగలవా? ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!! అందుకు అవసరమైన విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పగలరా? నిక్కచ్చిగా ఇదే మా నిర్ణయం అని పార్టీలు ప్రకటిస్తాయా! రాజకీయ అవసరాల కోసం బిసి నాయకులను ముందు పెట్టి బిసి వాదం అనగానే సరిపోదు! మన పార్టీ ఎక్కడ వెనుకబడి పోతుందో అన్న ఆందోళనతో నాయకులను ముందుకు తోయొద్దు. ఒకవేళ పార్టీల ఆదేశాలు లేకుండా రాజకీయ పార్టీలలో వుంటే బిసి నాయకులు తమ విధానం ఇదీ అని ప్రకటించగలరా? ఒక అడుగు ముందుకేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇస్తామని ఇప్పుడు మాట్లాడే బిసి నేతలకు ఎన్నికల నాడు ఆ పార్టీలు టిక్కెట్లు ఇస్తాయా? తెలంగాణలో బిసి విధానంతో పార్టీలు నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు. మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి! రాజకీయంగా ప్రజల్లో వెనకబడిపోతున్నామని గ్రహించి బిసిలను ముందుపెట్టకండి. ఈ విషయాన్ని ఆ పార్టీలలో వున్న నాయకులు బాగా ఆలోచించి ముందుకు రావాలి. తర్వాత బిసిలను కూరలో కరివేపాకులు చేయాలనే అన్ని పార్టీలు చూస్తాయి. దేశంలో మూడు సార్లు, నాలుగు సార్లు, వరుసగా ముఖ్యమంత్రులు అయిన వాళ్లు ఎంతో మంది నాయకులున్నారు. కానీ కేసిఆర్‌ ను రెండో సారికే ఎందుకు దించేశారో ఇప్పటికీ మధనం జరుపుకోవడం లేదు. ప్రజలేం అమాయకులు కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల కోసం అర్రులు చాచలేదు. కేసిఆర్‌ ను దించేయాలనుకున్నారు. ఆ స్పష్టత కనిపిస్తున్నా కేసిఆర్‌ అతి విశ్వాసానికి పోయారు. దెబ్బ తిన్నారు. పార్లమెంటు ఎన్నికలలో అందుకే మరింత ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ప్రజల్లో లేని నాయకుడు ఎప్పుడూ ప్రజా సేవకు పనికి రాడు. సరిగ్గా ఏపిలో కూడా అదే తీర్పు ఇచ్చారు. అయినా కేసిఆర్‌ ప్రజల కోసం బైటకు రాలేదు. ఒకవేళ ప్రజలు మళ్ళీ అధికారం ఇచ్చినా ఆయన జనం ముఖం చూడరు. పైగా అన్ని వర్గాలకు మేలు చేశానన్న భ్రమలో వున్నాడు. ఇతర వర్గాలను రాజకీయంగా ఎదగకుండా చేశాడు. వాళ్లు ముందుకొస్తే తన సీటుకు ఎసరొస్తుందనుకున్నాడు. అందుకే ప్రజలు కేసిఆర్‌ ను పక్కన పెట్టారు. ఇంకా ప్రజలు కేసిఆర్‌ ను నమ్ముతారనుకోవడం వృధా ప్రయాస. తనకు ఉద్యమ సమయంలో ఎంతో అండగా వున్న ఎంతో మంది బిసి నేతలను తర్వాత వారి ఉనికి ప్రశ్నార్థకం చేశాడు. ఓట్ల కోసం బిసి రాజకీయాలు ఓసిలకు అలవాటుగా మారింది. ఈసారి ఈసారి అలాంటి చిర్లర రాజకీయాలకు చెల్లు చీటే! పాడాల్సిన సమయం వచ్చింది. ఏ పార్టీ అయితే బిసి ముఖ్యమంత్రిని ప్రకటిస్తుందో ఆ పార్టీకే మనుగడ కనిపిస్తోంది. అందుకే బిసి ముఖ్యమంత్రి మా విధానం అని ప్రకటించండి. పార్టీల వేధికగా అన్ని పార్టీల అధినేతలు తీర్మానం చేయండి. మాట తప్పమని తేల్చి చెప్పండి. అప్పుడే బిసి నేతలను సమాజంలోకి పంపండి. బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలు వంచించడం చూడంది కాదు. బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు! ఆ దిశగా అడుగులు వేయరెందుకు? పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు? ఈ మాట చెప్పడానికి కనీసం ఇంగితం వుండాలి. బిసిల జనాభాను బట్టి సీట్లు కేటాయిస్తామని చెప్పడానికి అధ్యయనాలు అవసరమా? కాలయాపన, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరేమీ జరగదు. బిసిలు అంత అమాకులు కాదు. ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి. లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి. పార్టీలకు హెచ్చరికలు జారీ చేయాలి. యాచించడం కాదు, శాసించడం బిసిలు అలవర్చుకోవాలి. బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మోత మోగించాలి. బిసి సభలు, సదస్సులు, అడుగడుగునా నిరంతరం ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో బిసి ఉద్యమాలు రావాలి. ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయాలి. అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయాలి. బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోవాలి. బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో తేల్చుకోవాలి. సై అంటే సై అంటే తప్ప బిసిలు అధికారంలోకి రారు. బిసిలకు రాజ్యాధికారం దక్కదు.

బిజేపికి కేజ్రీ ఝలక్!

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024

బిజేపి బ్లైండ్ ప్లాన్…కేజ్రి మైండ్ గేమ్.

అడుగడుగునా ఊహించని దెబ్బ కొడుతున్న కేజ్రివాల్.

డిల్లీని సొంతం చేసుకోలేక బిజేపి అవస్థలు.

ఆమ్ ఆద్మీని ఊడ్చేయాలకుంటున్న బిజేపి కలలు కళ్లలు.

కేజ్రివాల్ ను అరెస్టు చేయగలిగారు.

సిఎం. కుర్చీను దించలేకపోయారు.

కేజ్రి రాజీనామాకు నిరంతరం డిమాండ్ చేశారు.

కేజ్రి రాజీనామా చేస్తాననగానే సంబరపడ్డారు.

కేజ్రి తన సతీమణిని సిఎం చేస్తారని ఆశపడ్డారు.

అతిశీని సిఎం చేస్తామని కేజ్రి ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యూహాలు అర్థం కాక బిజేపి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. బిజేపి జాతీయ నాయకులు ఒకటి తలిస్తే అరవింద్ కేజ్రివాల్ మరొకటి చేస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ ను జైలుకైతే పంపగలిగారు గాని, ఆయనను ముప్పు తిప్పలు పెట్టలేకపోతున్నారు. ఆయన మీద రాజకీయ ఆధిపత్యం కొనసాగించలేకపోతున్నారు. ఎలాగైనా ఆమ్ ఆద్మీని ఊదేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా అరవింద్ రాజకీయ వ్యూహాలు చిక్కడం లేదు. దొరకడం లేదు. బిజేపి పెద్దలకు అందడం లేదు. అరవింద్ కేజ్రివాల్ ను జైలు పాలు చేసి మానసిక స్థైర్యం దెబ్బ తీయాలని చూశారు. కానీ ఆయన మరింత బలడుతున్నారు. ఒకప్పుడు డిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ విస్తరణకు తెలియకుండానే బిజేపి వాళ్లే మార్గం చూపిస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ జైలులో వున్నంత కాలం ఆయనకు పదవి పిచ్చి తప్ప ప్రజలకు సేవ చేయాలని లేదని బిజేపి విమర్శిస్తూవచ్చింది. ఎలాగైనా కేజ్రివాల్ తో రాజీనామా చేయించి రాజకీయంగా పతనం వైపు నెట్టాలని చూసింది. కానీ అక్కడ కూడా బిజేపి ఎత్తుగడ పారలేదు. కేజ్రివాల్ ఒక వేళ రాజీనామా చేసినా తన సతీమణిని సిఎం. చేస్తారని భావించింది. జైలు నుంచి విడుదలైన కేజ్రివాల్ రెండు రోజులకు తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాంతో బిజేపి తన ఆరోపణలకు పదునుపెట్టింది. మరో లాలూ, రబ్రీ అంటూ విమర్శలు గుప్పించించింది. డిల్లీలో బిహార్ తరహా లాలు రాజకీయాలంటూ ఎత్తిపోడుపులు మొదలుపెట్టింది. పనిలో పనిగా బిజేపి డిల్లీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసింది. బిజేపి రాష్ట్రపతి ముర్ముకు వినతిపత్రం కూడా అందజేసింది. కానీ అనూహ్యంగా కేజ్రివాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ప్రకటించారు. బిజేపి కేంద్ర నాయకత్వం బిత్తరపోయేలా చేశారు. బిజేపికి పాలుపోని‌ సంకట స్థితిలోకి కేజ్రివాల్ నెట్టేశాడు. ఒక రకంగా బిజేపికి దారులన్నీ మూసేశాడు. అసలు దారి దొరక్కుండా చేశారు. ఇప్పటికే కేజ్రివాల్ మూలంగా బిజేపికి రాజకీయంగా కోలుకోలేని దెబ్బలు పడుతూనే వున్నాయి. ఇప్పుడు బిజేపి ఊహకందని దెబ్బ కొట్టాడు. బిజేపికి ముందు నుయ్యి..వెనక గొయ్యి తెచ్చిపెట్టాడు. డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సందర్భంలోనే కేజ్రివాల్ తనను బిజేపి అరెస్టు చేయిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నిజం చేసి బిజేపి ఇరుకున పడింది. అది కేజ్రివాల్ జైలుకు వెళ్లిన తర్వాత బిజేపికి అర్థమైంది. అయినా బిజేపి ఏదో ఒక ఆశతో కేజ్రివాల్‌పై పైచేయి సాధిస్తామన్న నమ్మకంతో అడుగులు వేస్తూనే వుంది. కేజ్రివాల్ వాటిని బిజేపి తప్పటగులుగా తెల్చేస్తూనే వున్నారు. బిజేపి పరువు గంగలో కలిపేస్తూనే వున్నారు. ఇప్పుడు కేజ్రివాల్ ఇలాంటి దెబ్బ కొడతారని బిజేపి అధినాయకత్వం కలలో కూడా ఊహించలేదు. బిజేపి ఇంతగా చతికిలపడే పరిస్థితి వస్తుందని ఊహించలేదు.‌ అనవసరంగా కేజ్రివాల్ ను కెలికి తప్పు చేశామా? అన్న భావన కొందరు బిజేపి పెద్దలు వెలుబుచ్చుతూనే వున్నారు. ఇదే అదునుగా బిజేపిని కేజ్రివాల్ దెబ్బ మీద కొడుతూనే వున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజేపికి గడ్డుకాలం తెచ్చేందుకు కేజ్రివాల్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. నిజానికి డిల్లీలో రాష్ట్రపతి పాలన తేవాలని బిజేపి కేంద్ర నాయకత్వం తహతహలాడుతోంది. కేజ్రివాల్ సరికొత్త ఎత్తుగడతో బిజేపి చతికిలపడిపోయింది. అంతే కాకుండా ఆమ్ ఆద్మీ నాయకురాలు అతీశీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిజేపి ఆగమాగమౌతోంది. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక కొత్త ఎత్తులు ఎలా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా డిల్లీని సొంతం చేసుకోవాలని పదేళ్ల నుంచి ఆరాటపడుతోంది.‌ ఇప్పటికైనా ఆ అవకాశం దక్కుతుందనుకున్న ఆశలు ఆవిరి కావడంతో దిక్కులు చూస్తోంది.

నాడు ఉద్యమ ద్రోహాలు..నేడు ఈటెలపై మాటలు.

https://epaper.netidhatri.com/

తెలంగాణను కదిలించింది ఈటెల!

విద్యార్థులకు అండగా నిలిచింది ఈటెల.

ఉద్యమం కోసం ఆస్థులు కోల్పోయింది ఈటెల.

ఉద్యమ కారులను కడుపులో పెట్టుకున్నది ఈటెల.

ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను కాపాడిరది ఈటెల.

బడుగుల నేత ఈటెల.

భవిష్యత్తు తెలంగాణకు సాక్ష్యాలు.

తెలంగాణ అంటేనే ఈటెల గుండెకాయ.

ఉద్యమ వాసన లేని వాళ్లు ఈటెలను ప్రశ్నించడమా!

ఈటెలవి త్యాగాల పునాదులు. రేవంత్‌ వి రాజకీయ భవంతులు.

బిజేపిని ప్రశ్నించలేక, ఈటెలను టార్గెట్‌ చేస్తున్నారు.

దమ్ముంటే బిజేపిని తూర్పారపట్టండి!

ధైర్యం వుంటే బిజేపి ప్రశ్నించండి.

వేలెత్తి చూపడానికి బడుగులే దొరికారా!

బడుగుల రాజకీయాలను చిదిమేయాలనుకుంటున్నారా!

అధికారంలో వున్నవారికి ఓపిక ఎంతో అవసరం. మాట పొదుపు ఎంతో మేలు. అందుకే మనం ఏం మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎంత మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడుతున్నాం? సందర్భమేమిటి? అవతలి వ్యక్తికి వున్న పేరేమిటి? అన్నది బాగా గుర్తెరిగి మాట్లాడాలి. అందులోనూ ముఖ్యమంత్రి పదవిలో వున్నవారు ఎంత పొదుపైన, ఇంపైన మాటలు మాట్లాడితే ప్రజలు అంత స్వాగతిస్తారు. కోపం వుంది కదా? అని రాజకీయ ప్రత్యర్థులపై మాటల దాడిలో బూతులు మంచివి కాదు. వారిని ఎదుర్కొవడంలో అడ్డదిడ్డమైన మాటలు అసలే మంచివి కాదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత ప్రస్టేషన్లో మాట్లాడుతున్నట్లున్నారు. ఆయన మాటలు కాంగ్రెస్‌ నేతలకు కూడా నచ్చడం లేదంటున్నారు. అటు కేసిఆర్‌ను, ఇటు కేటిఆర్‌ను, హరీష్‌రావును, చివరకు మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నిజంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఏదైనా వుంటే సైద్దాంతికంగా మాట్లాడితే బాగుంటుంది. మైకు పట్టుకుంటే రేవంత్‌రెడ్డి ఏం మాట్లాతున్నాడో అర్ధం కాకుండా పోతోందని అంటున్నారు. మొన్నామధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా సంప్రదాయాలను పాటించారు. అభివృద్ధి పనులకు హజరయ్యారు. ఇంత వరకు బాగానే వుంది.
దేశంలో వున్న జాతీయ పార్టీలు రెండే. ఒకటి బిజేపి. రెండు కాంగ్రెస్‌. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ వుంది. దేశమంతా భారత్‌ జోడో యాత్ర పేరుతో రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిన పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఉత్తరాధిన సాగుతోంది. ఇలాంటి సమయంలో సందుదొరికితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజేపిని చెడుగుడు ఆడుకోవాలి. కాని భవిష్యత్తులో మాకు సహకారం కావాలి. తెలంగాణ మీద కరుణ వుండాలని సరిగ్గా ఎన్నికల ముందు కేంద్రం ముందు మోకరిల్లడం అంటే అంతర్ధామేమిటి? బాగా ఆలోచిస్తే కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాదన్న సంకేతాలు పరోక్షంగా పంపినట్లు కాదా? ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు తీరని నష్టం కాదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు మాట్లాడితే ఆయాచితంగా మాట్లాడారని అనుకుంటారా? ఎందుకంటే ఏ నాయకుడైనా సభకు వెళ్లే ముందు ఏం మాట్లాడాలన్నదానిపై ముందే ఒక ఆలోచనతో స్పష్టతతోనే వెళ్తారు. అవే మాట్లాడతారు. ఇక్కడ కూడా రేవంత్‌ అలా మాట్లాడినట్లే అన్న చర్చ అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు ఇతర రాజకీయ పార్టీలలోనూ సాగింది.
ఈ విషయం కాంగ్రెస్‌పార్టీ జాతీయ నాయకత్వం దాకా వెళ్లిందంటున్నారు. దాంతో బిజేపిని విమర్శించి కవర్‌ చేసుకోవాలన్న ఆలోచనతో ఈటెల రాజేందర్‌ను టార్గెట్‌ చేసినట్లున్నారన్న చర్చకు దారి తీసింది. రాజేందర్‌పై రేవంత్‌రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు పంచు డైలాగ్‌లకు చప్పట్లు కొడుతున్నారు కదా? అని ఏది పడితే అది మాట్లాడితే ఓట్లేసేది ప్రజలు. అందువల్ల . ప్రజల ఆలోచన విదానానికి అనుగుణంగా మాత్రమే నాయకులు మాట్లాడాలి. ఈ మధ్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మరికొన్ని మాటలు కూడా అనేక వివాదాలకు దారి తీశాయి. జేబుల్లో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతున్నామని సిఎం. రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకు కౌంటర్‌గా జేబుల్లో కత్తెర్లు ఎవరు పెట్టుకొని తిరుగారతంటూ ఎదురు ప్రశ్న వేసి హేళన చేశారు. పేగులు మెడలేసుకొని తిరుగుతాం? అనడం వంటివి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తగదు. కార్యకర్తలు మానవబాంబులౌతారు? అనడం దేనికి సంకేతం. శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు పంపడం దేనికి సంకేతమో? చెప్పాలని బిఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. అదే సామాన్య ప్రజలో, ప్రతిపక్ష నేతలో మాట్లాడితే ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే రేవంత్‌రెడ్డి లాంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం వుంటుంది. తాజాగా యాదగిరి గుట్టకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రుల బృందం పర్యటన కూడా వివాదాస్పమౌతోంది. ప్రతి చోట వివాదాలు మూటగట్టుకుంటూ వెళ్లడం కూడా మంచిది కాదు. ఇక ఈటెల రాజేందర్‌ లాంటి నాయకుడిపై మాట్లాడేముందు రాజకీయాలు మాట్లాడితే బాగుంటుంది. ఈటెలను ఉద్దేశించి పార్టీపరమైన అంశాలు ప్రస్తావిస్తే ఎంతో హుందాగా వుంటుంది. అంతే కాని పక్కనే పది, పదిహేనేళ్లుగా ఇక్కడే వుంటున్నా, ఏనాడైనా ఈటెల రాజేందర్‌ వచ్చాడా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాడని అనడంలో ఔచిత్యమేమీ లేదు. గతంలో ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పగ తీర్చుకున్నట్లుగా తప్ప, రాజకీయం ఏమీ కనిపించడం లేదు. మంత్రి మల్లారెడ్డి పై కూడా ఇలాంటిదే సాగుతోందన్నది వినిపిస్తున్న మాట. కాని ఈటెల రాజేందర్‌ విషయంలో కూడా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కాదు.

ఎందకంటే ఈటెల రాజేందర్‌ తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదు. అందుకే మనం ఎవరిని తిడుతున్నామన్నది గుర్తెరిగి మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమ పర్యంతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గడిపిన నాయకుడు. అక్కడే చదువుకున్న విద్యార్ధి. సమాజాన్ని అక్కడే చదువుకున్నాడు. సమాజ చైతన్యం కోసం అక్కడి నుంచే ఉద్యమ ప్రస్ధానం మొదలుపెట్టాడు. తెలంగాణ ఉద్యమంలో తన పోరాట పటిమ ఎంతదో చూపించాడు. తెలంగాణ అంతా ఏకం చేయడంలో ఈటెల రాజేందర్‌ పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. ఎందుకంటే ఈటెల రాజేందర్‌ది త్యాగాల చరిత్ర. ఆ మాట ఇప్పటి తరానికి అర్దం కాకపోవచ్చు..తెలంగాణ ఉద్యమంలో లేని వారికి తెలియకపోవచ్చు. ఆయనంటే నచ్చని వారికి గిట్టకపోవచ్చు. కాని ఎన్ని తరాలైనా తెలంగాణ సమాజం ఈటెలను గుర్తుంచుకుంటుంది. గుండెల్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా, తెలంగాణ ఉద్యమాకారులకే చరత్రలో చోటు దక్కింది. ఆ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలి. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అదృష్టం రేవంత్‌రెడ్డిని వరించింది. రాదనుకున్న తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో రెండో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయ్యారు. తెలంగాణ ఉద్యమమే లేకపోతే, ఈటెల రాజేందర్‌ లాంటి వాళ్లే ఉద్యమం చేయకపోతే, తెలంగాణ వచ్చేదా? ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంలో వుంటే రేవంత్‌రెడ్డి ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యేవారా?
తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధి లోకానికి అండగా నిలిచింది ఈటెల రాజేందర్‌. తెగించి కొట్లాడిన ఎంతో మంది విద్యార్ధులను కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు ఈటెల రాజేందర్‌. వాళ్ల జీవితాలను కాపాడిరది రాజేందర్‌. ఈటెల రాజేందర్‌ లాంటి వారు కాపాడకపోతే ఎంతో మంది ఉద్యమకారులు ఆనాడు పోలీసుల చేతుల్లో నరకం అనుభవించేవారు. ఎక్కడ ఉద్యమ కారులను పోలీసులు పట్టుకెళ్లినా, ఉద్యమ కారులకు ఏ నష్టం జరక్కుండా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా, అవసరమైతే ఆదిలాబాద్‌ ప్రాంతానికైన వెళ్లి వారిని రక్షించుకున్న చరిత్ర ఈటెలది. అలాంటి ఈటెల రాజేందర్‌ మేడ్చల్‌ ప్రజలను ఓట్లు అడడగం తప్పని అనడం నైతికం కాదు. ఈటెల రాజేందర్‌ బిజేపిలో వున్నంత మాత్రాన ఆయన చీదరించుకోవాల్సిన వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని అలా కించపర్చకూడదు. రాజకీయంగా విమర్శలు చేయండి. ఈటెల రాజేందర్‌ నాయకుడుగా వున్న పార్టీపై విమర్శలు చేయండి. తెలంగాణ సమాజం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పదు. ఉద్యమ కాలంలో ఎలాగైతే త్యాగాలు చేశారో..ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్‌ ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు. అలాంటి నాయకుడిని ఎవరు తప్పు పట్టినా, ఆయనను చిన్నగా చేసి మాట్లాడినంత మాత్రాన అవతలి వారి గౌరవం పెరగదు. ఇది ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం.

కమలంలో ఈటెల కల్లోలం!

https://epaper.netidhatri.com/

తెలంగాణ ‘‘బీజేపీ’’ ప్రక్షాళన జరగాలి `ఎపీసోడ్‌ `3

`అందరి ఆరోపణలకు ఊతం.

`బిజేపికి ఈటెలతోనే జరిగిన నష్టం?

`బండి దిగడానికి కారణం?

`నేతలంతా తలో దారి చూసుకోవడానికి పరోక్షం!

`ఈటెల అహం బ్రహ్మాస్మీ అనే రకం?

`అందుకే ఆటలో అరటిపండుగా మిగులుతున్న వైనం.

`నేటిధాత్రి ఏనాడో చెప్పిన నిజం.

`అయినా మారని ఈటెల గుణం.

`ఇప్పుడు చౌరస్తాలో ఈటెల రాజకీయం.

`పెద్దరికం కాళ్ల దన్నుకున్నాడు.

`ఆదుకున్న పార్టీని ఆగం చేశాడు.

`తనకు మాలిన ధర్మంలో తనను తానే ముంచుకున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు ఈటెల రాజేందర్‌ వ్యవహారం బిజేపికి తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పెంచి పోషించిన పార్టీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం ఈటలకు అలవాటే అంటున్నారు. తనను తాను అతిగా ఊహించుకొని బిజేపిలో చేరి చక్రం తిప్పుదామనుకున్నాడు. కాని కుదరలేదు. అసలు ఆయన రాజకీయమే కలిసి రాలేదు. ఆదుకున్న పార్టీకి ఈటెల చేసిన మేలు లేదు. నమ్మి ఆయన వెంట వచ్చిన వారి కోసం నిలబడ్డది లేదు. ఇచ్చిన పదవులతో సంతృప్తి చెందలేదు. బిజేపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావాలని కలలుగన్నాడు. కలలు కల్లలయ్యేసరికి పార్టీని నిండా ముంచేశాడు. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు బిజేపి కోసం అహర్నిషలు పాటు పడే నాయకులు అంటున్న మాట. ఈటెల వచ్చిన తర్వాత పార్టీకి గ్రహణం పట్టిందని నేతలంటున్న మాట. గతంలోనే నేటి ధాత్రి ఈటెల రాజకీయ భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చెప్పేసింది. ఇప్పుడు అదే నిజమైంది. ఆనాడే ఈటెల రాజేందర్‌ అంటే ఏమిటో? ఆయన వ్యవహారం ఎలా వుంటుందో అన్నది పూస గుచ్చినట్లు నేటిధాత్రి చెప్పింది. ఎందుకంటే ఆయన రాజకీయం ప్రస్ధానం విద్యార్ధి దశలో ఎర్ర జెండాతో మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ జెండాను పట్టుకోవడం జరిగింది . ఆ పార్టీలో ఎనలేని గౌరవం దక్కింది. కేసిఆర్‌ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఒక దశలో కేసిఆర్‌ తర్వాత ఈటెల రాజేందరే అన్నంతగా గుర్తింపునిచ్చారు. కాని నిలుపుకోలేదు. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీలోనైనా ఆ పార్టీ అధినేత, ఆ కుటంబాన్ని కాదని ముందుకు దూసుకెళ్లడం అన్నది ఎవరికీ, ఏనాటికి కుదరదు. ప్రాంతీయ పార్టీలలో కుంపట్లు రేగితే తప్ప, మరొకరు నాయకుడు కాలేదు. అయితే కేసిఆర్‌ నాయకత్వంలో నడుస్తున్న బిఆర్‌ఎస్‌లో కలలుగనం ఈటెల చేసిన మొదటి తప్పు. గులాబీ జెండాను తాను కూడా ఓనర్‌నే అనుకోవడంతోనే ఈటెల పతనం మొదలైంది. నిజానికి పార్టీలో వుంటూ, ఏం రాజకీయం చేసినా సాగుతుంది. కాని పార్టీనే కబలిద్దామనుకున్నప్పుడే అసలు రంగు బైట పడుతుంది. రాజకీయం జీవితం సమాధి అవుతుంది. అలాంటి వారు చరిత్రలో చాలా మంది వున్నారు. ఈటెల రాజేందర్‌ కూడా ఆ హిస్టరీలో చేరనున్నారు. చెప్పేవారికి లేకపోయినా వినే వారికి వుండొద్దా? అన్న సామెత ఈటెలకు ఏనాడు గుర్తుకు రానన్నట్లుంది. అందుకే ఈటెల రాజకీయం అతలాకుతలమైంది. ఆఖరుకు బిజేపిలో కూడా తన ప్రాభవం సాగుతుందనుకున్నాడు కాని, తన ప్రాపకమే మిగులుతుందని ఊహించుకోలేకపోయాడు. తన వెంట వచ్చిన వారికి అండగా నిలడలేదు. ఇంత కాలం ఈటెలను నమ్మిన వాళ్లు కూడా నమ్మకుండా చేసుకున్నాడు. బిజేపిలో కూడా నమ్మకం కోల్పోయాడు. ఎటూ వెళ్లలేక, వెళ్లేందుకు దారి లేక, వెళ్లినా ఎవరూ దగ్గర తీసే అవకాశం లేక, విధిలేక బిజేపిలో సాగుతున్నాడే గాని, అవకాశం వస్తే జంప్‌ అయ్యేందుకు సిద్దంగానే వున్నాడు.
కమలంలో ఈటెల అల్లకల్లోలం రేపాడన్నది ఆ పార్టీలో అందరూ అంటున్న మాటే.

ఈ విషయాన్ని ఏ ఒక్కరూ మనసులో దాచుకోలేదు. విజయశాంతి లాంటి వాళ్లు మాత్రం బహిరంగంగానే విమర్శలు చేశారు. తాము పార్టీ వీడడానికి కారణం ఈటెల లాంటి వారే అంటూ స్పష్టంగా చెప్పేశారు. నిజానికి బిజేపిని ఒక ఊపులోకి తీసుకొచ్చింది బండి సంజయ్‌. ఆయన ఎంపి అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడుగా వచ్చిన అవకాశంతో పార్టీకి బలమైన పునాదులే వేశాడని చెప్పాలి. అప్పటి వరకు బిజేపి అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడేవారే జెండా మోస్తారు అన్న అభిప్రాయం వుండేది. కాని ఇప్పుడు దేశంకోసం, ధర్మంకోసం నిలబడే పార్టీ అని అందరూ గుర్తిస్తున్నారు. బిజేపికి జై కొడుతున్నారు. ముఖ్యంగా పెద్దఎత్తున యువత బిజేపిని ఆదరిస్తున్నారు. బిజేపి సిద్దాంతాల వైపు ఆకర్షితులౌతున్నారు. ఆ పార్టీ జెండాను మోస్తున్నారు. గుండెల నిండా బిజేపిని నింపుకుంటున్నారు. తెలంగాణలో బిజేపి మరింత బపడేందుకు బండి సంజయ్‌ లాంటి నాయకులు చేసిన ప్రచారం కూడా ఎంతో ఉపకరించింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్‌ అధికారికంగా బిజేపి అభ్యర్ధిగా పోటీ చేసినా, ఆ గెలుపు తన వ్యక్తిగత ఖాతాలోనే వేసుకున్నారు. ఆ ఎన్నికల సమయంలో బిజేపి నేతలతో కలిసి పెద్దగా ప్రచారం చేయలేదు. మొత్తంగా ఆ గెలుపుకు బిజేపికి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అదిష్టానం ముందు తాను బలమైన నేతగా గుర్తింపు పొందాలని తాపత్రయపడ్డాడు. అయితే తెలంగాణలో బిజేపి బలమైన పార్టీగా అవతరిస్తున్న సమయంలో వచ్చిన ఈటెల రాజేందర్‌ ఆ బలం తన వల్ల అన్నది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. తెలంగాణలో పార్టీ బలపడాలంటే బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వుంటే మరింత నష్టమే అన్నది పదే పదే అదిష్టానం చెవిలో ఊదుతూ వచ్చాడు? అన్నది అందరూ చెప్పుకుంటున్నదే. ఎప్పుడైతే బండిని పక్కన పెట్టారో అప్పటి నుంచి తెలంగాణలో బిజేపి గ్రాఫ్‌ పడిపోయింది. గత శాసన సభ ఎన్నికల్లో తనకంటేపార్టీలో బలమైన నేత లేడన్నట్లు తనను తాను అతిగా ఊహించుకున్న ఈటెల ఏకంగా కేసిఆర్‌ మీద పోటీ చేశాడు. హుజూరాబాద్‌లోనూ బరిలో నిలిచి రెంటికీ చెడ్డ రేవడి అయ్యాడు. ఈ విషయాన్ని కూడా నేటిధాత్రి రెండేళ్ల క్రితం చెప్పింది. ఈటెల రాజేందర్‌ భవిష్యత్తులో హుజూరాబాద్‌ను వదులుకునేందుకు కూడా వెనుకాడడన్న మాట నేటిద్రాత్రి చెప్పడం జరిగింది. అది కూడా అక్షరాల నిజమైంది. ఈటెలను నమ్మి కేసిఆర్‌ పదవులు ఇచ్చినంత కాలం ఈటెల పెరిగాడు. కాని ఈటెల తన వల్లే బిఆర్‌ఎస్‌ పెరిగిందన్న అపోహలో రాజకీయం చేశాడు. తనకొంప తానే ముంచుకున్నాడు. అయినా మార్పు రాలేదు.

పార్లమెంటు ఎన్నికలపై దృష్టిపెట్టిన ఈటెలరాజేందర్‌ కోరికలకు హద్దూ బద్దూ లేకుండపోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట్లో ఈటెల మెదక్‌ నుంచిపోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కాని అక్కడి నుంచి గతంలో ఓసారి పోటీ చేసి ఓడిపోయిన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ వున్నాడు. లోకసభ ఎన్నికల్లో అక్కడ రఘునందన్‌కు తలనొప్పిగా మారాడు. గత కొంత కాలంగా ఈటెల కరీంనగర్‌ నుంచి పోటీ చేయాలనకుంటున్నాడన్న వార్తలు వచ్చాయి. అక్కడ కొన్ని దశాబ్దాలుగా తన కోటను నిర్మించుకుంటూ వచ్చి, తెలంగాణలోనే బిజేపిని బలమైన పార్టీగా తయారు చేసిన బండి సంజయ్‌నే పక్కకు తప్పించే ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ రెండు చోట్ల సీటు దక్కకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత చెవెళ్ల మాజీ ఎంపి. కొండా విశ్వేశ్వరరెడ్డి సీటు కావలని కోరినట్లు సమాచారం . అక్కడ కూడా ఈటెలను రానిచ్చే పరిస్దితి లేదు. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని సుద్దులు చెప్పడం మొదలుపెట్టారు. పార్టీ మారాలనుకునే వారు తన మాతృ సంస్ధను వదిలి వెళ్లొద్దని ఇతరులకు గీతోపదేశం చేస్తున్నాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి అవేవో చేతలు అన్నట్లు. ఈటెల రాజేందర్‌ కూడా నీతి,నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడని గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా తనకు మల్కాజిగిరి సీటు కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు. మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. నిజానికి ఈటెల రాజేందర్‌ బిజేపి లోకి వెళ్లడానికి ముందే పార్టీ ఎంతో బలపడిరది. వివేక్‌ వెంటస్వామి లాంటి వారు తన మీడియా ద్వారా బిజేపికి ఎంతో కొంత మేలు చేశారు. ఈటెల రాజేందర్‌ ఉప ఎన్నికల సమయంలో కూడా ఆర్ధికంగా ఉపయోగపడ్డట్టు కూడా తెలిసిందే. అలాంటి నాయకుడు కూడా బిజేపిని వీడేందుకు కారణం ఈటెల రాజేందరే అన్న అభిప్రాయంచాలా మందిలో వుంది. ఇలా బిజేపిని వీడేవారిని ఎవరినీ ఆపలేదు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఆయన ఎవరినీ చేర్చుకున్నది లేదు. అధ్యక్షుడితో సఖ్యత కనబర్చింది లేదు. దాంతో అగ్రనాయకులంతా తలో దారిలాగా మారడానికి ఈటెల వ్యవహరమే కారణమనే ఆరోపణలు అనేకం వున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రేగిన వివాదంలో ఈటెల నుద్దేశించి కిషన్‌రెడ్డి వాడు వుంటే ఎంతపోతే ఎంత అన్న ఆలోచనకు వచ్చినప్పుడే ఈటెలను పక్కన పెడితే బాగుండేది. ఇప్పటికైనా మించి పోయింది లేదన్నది గుర్తిస్తే మేలు జరుగుతుంది.

బిజేపి అరువు…కాంగ్రెస్‌ కరువు!?

https://epaper.netidhatri.com/

`ఉన్న నేతలు ఊడుతున్న బిజేపి.

` సీనియర్లకు కూడా గెలుస్తామన్న నమ్మకం లేదా?

`కేంద్ర నాయకత్వం భరోసా అంతంత మాత్రమేనా?

` వస్తున్నారు…పోతున్నారు…కేంద్ర పెద్దలు.

`బండిని తొలగించడంతో వున్న వాళ్లు పోతున్నారు.

` కొత్త నేతలతో కాంగ్రెస్‌ లో పాత నేతలకు తలనొప్పులు.

` గెలుస్తామన్న విశ్వాసం సీనియర్లలోనే లేదు.

`ఖర్చు చేయడం అంటే వున్నది ఊడ్చేసుకోవడమే?

`పార్టీ గెలిచినా ప్రాధాన్యత వుంటుందన్న భరోసా లేదు.

`ముందట పడితే రేవంత్‌ కు మేలు చేసినట్లౌతుంది.

`రండి…రండి…అనకోవడమే.

`అభ్యర్థుల ప్రకటన చేస్తే ఓ తంట…చేయకుంటే మరో తంట.

`ముందడుగులు దేవుడెరుగు! అన్నీ వెనకడుగులే!!
హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయ పార్టీలకు ఉపు అంటే ఊరికే వచ్చేది కాదు. ప్రజా మద్దతు అంటే మాటలు కాదు. అధికారంలోకి రావడం అంటే ఆటలు కాదు. పాలించాలంటే పార్టీ ఒక్కటే కాదు, దాని పనితనం, దానిలో పనిమంతులు కూడా వుండాలి. తెలంగాణ విషయానికి వస్తే ప్రజలు అటు కాంగ్రెస్‌ను గాని, ఇటు బిజేపిని కాని ఎందుకు నమ్మాలే? అన్న ప్రశ్నకు సమాదానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే 2004 ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని, గెలిచి పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టించింది కాంగ్రెస్‌. 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ తీర్మాణం చేసిన బిజేపి 1999లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాజధాని నగరమే హైదరాబాద్‌లో వుంది. ఇక ప్రత్యేక రాష్ట్రమెందుకని మాట్లాడిరది బిజేపి. ఇలా రాజకీయ అవసరాల కోసం పిల్లిమొగ్గలేసి, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్న పార్టీలు ఈ రెండు. వాటిని నమ్మాలంటే ప్రజలు ఇప్పుడు సుముఖంగా లేదు. తెలంగాణ ఆంధ్రలో విలీనం చేసి, 1956లో పెనం మీద వున్న తెలంగాణను పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ప్రజలు అప్పటి నైజాం నవాబుకు వ్యతిరేకంగా రాజరికాన్ని దిక్కరించి సాయధ పోరాటం చేసి, తెలంగాణ దాస్య శృంఖలాలను తెంచుకొని స్వరాష్ట్రమై ఐదేళ్లు మూడేళ్లు స్వయం పాలన సాగింది. అలా మూడేళ్లు గడిచిందో లేదో బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రలో కలిపి, గంగలో ముంచినంత పని చేశారు. తెలంగాణకు మళ్లీ వాతలు పెట్టారు. ప్రజల గోస పుచ్చుకున్నారు. ఆనాడే ఆంధ్రతో కలవమంటూ తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకన్నా వినకుండా ఆంధ్రలో కలిపేశారు. పెత్తనం వారి చేతిలో పెట్టి, తెలంగాణ మోచేతికి బెల్లం అంటించి నాకించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ తప్పని పరిస్ధితుల్లో, అనివార్యమై తెలంగాణ 2014లో ఇచ్చిందే కాని, తెలంగాణ ప్రజలమీద గౌరవంతో ఇవ్వలేదు. రాజకీయంగా పార్టీ నామరూపాలు లేకుండాపోయే ప్రమాదముందని గ్రహించి ఇచ్చారు. అయితే అప్పటికే పుణ్య కాలం పూర్తయింది. ఇక కాంగ్రెస్‌ను మళ్లీ నమ్మితే నట్టెట ముంచుతుందన్న భయంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ అంటేనే ఆమడ దూరం తరిమేస్తున్నారు. అందులోనూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొందరు మాత్రమే జై తెలంగాణ అన్నారు. కాని అప్పటి కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాగైనా తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం, భరోసా కల్గిన తర్వాతనే తెలంగాణ కోసం ఆలోచించారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల దాకా ఆ ఊసే ఎత్తలేదు. పైగా కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా ఉద్యమాన్ని అడ్డుకున్నారే గాని, సహకరించలేదు. ఎంత సేపు వైఎస్‌ కళ్లలో పడాలని, ఆయన చేత పదువుల పొందాలన్న తపన తప్ప, తెలంగాణ కోసం పోరాడేందుకు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు ముందుకు రాలేదు. వైఎస్‌. మరణం తర్వాత గాని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు సోయి రాలేదు. వైఎస్‌ మత్తు తొలగలేదు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేసి, కేంద్రం యూటర్న్‌ తీసుకుంటే రాజీనామా చేయమంటే కూడా చేయలేదు. కొందరు చేసినా, మళ్లీ వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఇదీ కాంగ్రెస్‌ నాయకుల చరిత్ర. అయినా కనీసం ఆ నాయకుల పెత్తనం కూడా నేడు కాంగ్రెస్‌లో లేదు. తెలంగాణను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నడుస్తోంది. అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం అనేది కల. ఇక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచిందన్న ఊపు తప్ప, తెలంగాణ ప్రజల మన్ననలు చూరగొన్నది ఏనాడు లేదు. అసలు మొన్నటి దాక బిజేపి ఊపు చూపించింది. అప్పుడే నేటిధాత్రి కుండబద్దలు కొట్టిచెప్పింది. అది వాపు తప్ప బలం కాదని తేల్చి చెప్పింది. అదే బిజేపి విషయంలో నిజమైంది. ఉప ఎన్నికల పుణ్యమా? అని బిజేపిలో కదలిక వచ్చినట్లు కనిపించింది. కాని అదంతా డొల్ల అంటూ నేటిధాత్రి చెబుతూనే వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే అన్నంతగా బిజేపి ఊపు మీద వున్నట్లు కనిపించింది. కాని కర్నాటక ఎన్నికల ఫలితాలతో బిజేపి గాలిబుడగ పగిలిపోయింది. బండి సంజయ్‌ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో బిజేపిలో కొద్దో గొప్పో వున్న ఆ మాత్రం గాలి కూడా లేకుండాపోయింది. ఇప్పుడు పూర్తిగా చతికిలపడిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆది నుంచి బిజేపి తెలంగాణకు వ్యతిరేకంగానే వుంది. తెలంగాణ ఇస్తామని బిజేపి ఏనాడు చెప్పలేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిన తర్వాత చత్తీస్‌ఘడ్‌, రర్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ మూడురాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాని తెలంగాణ ఇవ్వలేదు. అందుకు అప్పటి ఎన్డీయేలో చంద్రబాబు బాగస్వామి కావడమే. కేవలం చంద్రబాబు కోసం తెలంగాణ ఇవ్వకుండా అన్యాయం చేసింది బిజేపి. ఆ తర్వాత కూడ తెలంగాణ బలమైన ఆకాంక్ష కళ్లముందు కనిపించిన తర్వాత సుష్మాస్వరాజ్‌ మాత్రమే పట్టుబట్టి తెలంగాణకు న్యాయం జరగాలని కోరింది. తెలంగాణ పక్షం నిలిచింది. కాని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఆది నుంచి తెలంగాణపై విషం చిమ్ముతూనే వున్నాడు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో తల్లిని చంపి బిడ్డను బ్రతికించారాన్నరు. అంటే ఆయనకు తెలంగాణ ఇవ్వడం సుతారం ఇష్టం లేదన్నది తేలిపోయింది. అంతే కాదు పార్లమెంటు తలుపు మూసి తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తు పార్లమెంటులో కూడా చెప్పి, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసు వుందో చెప్పకనే చెప్పారు. మరి అలాంటి బిజేపి పెద్దలు తెలంగాణకు న్యాయం చేస్తారని ప్రజలు భావించడంలేదు. అందుకే బిజేపిని అక్కున చేర్చుకోడం లేదు. ఆదరించేందుకు ఇష్టపడడం లేదు. ఒక దశలో బిజేపిలోకి కాంగ్రెస్‌నుంచి పెద్దఎత్తున వలసలు వెళ్లాయి. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న ఎంతో మంది కాంగ్రెస్‌నేతలు బిజేపిలో చేరిపోయారు. ఆఖరుకు ఇక కాంగ్రెస్‌లో వున్నా లాభం లేదనుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజేపిలోకి వెళ్లి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు. ఇక ఆ ఎన్నికలో గెలిచి, సార్వత్రిక ఎన్నికల్లో బిజేపి అదికారంలోకి వస్తే నేనే సిఎం అన్నంతగా ఆశల పల్లకిలో ఊరేగారు. ఏమైంది ఉన్న పదవి పోయింది. మాజీ అన్నది వచ్చి చేరింది. చివరకు పార్టీలో తనకు గుర్తింపు లేకుండా పోతోందని మధనపడుతున్నాడు. కాంగ్రెస్‌లో వున్నంత కాలం కాంగ్రెస్‌కు రోజులు లేవన్నాడు. ఇప్పుడు బిజేపికి కష్టకాలమే అంటున్నాడు. బండి సంజయ్‌ అధ్యక్షుడిగా వున్న సమయంలో ఇక బిఆర్‌ఎస్‌నుంచి అదిగో వచ్చె, ఇదిగో వచ్చే అంటూ లెక్కలేసి మరీ చెప్పారు. ఆ మాటలు నమ్మి కాంగ్రెస్‌ నేతలు పార్టీ వదిలి కొంత మంది బిజేపిలో చేరారు. ఇప్పుడు వాళ్లంతా కాంగ్రెస్‌ వైపు అడుగులేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ ఇప్పుడు నాయకుల కరువులో వుంది. బిజేపి అరువు నేతలు తిరిగి వలసలు వెళ్తుంటే కుమిలిపోతోంది…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version