సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం.

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం

సిరిసిల్ల టౌన్(నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిని గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ శాఖ నూతన బిజెపి కార్యవర్గం నియమించడం జరిగినది. ఇందులో భాగంగా ఉపాధ్యక్షులుగా మోర శ్రీహరి మరియు అంకారపు రాజు, కాంభోజ శ్రీధర్, పల్లికొండ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండ సురేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులుగా కోడంతవి సురం వినయ్ పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోశాధికారిగా ఇoజపురి మురళి బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖగా నియమితులయ్యారని జిల్లా బిజెపి అధ్యక్షుడు తెలిపారు.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడాతూ..
యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ 1975 లో అధికారం కొరకు, అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణిచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం, అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బిజెపి అగ్రనాయకులు అద్వానీ, వాజపేయి, మోడీ లు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

ఆమనగల్ నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె), బూత్ అధ్యక్షులు, కొప్పు నర్సింహ, M. శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు…ఈ సందర్భంగా కండె హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. గత 11 ఏళ్లలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకొచ్చాయి,అని వివరించారు.
స్వచ్ఛ భారత్, పీఎం కిసాన్, ఉజ్వలా యోజన, జనధన్ యోజన, ముద్రా లొన్లు, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల వల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. ఈ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గోరటి నర్సింహ, ఆమనగల్ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె) గార్లు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, వారి స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను సూటిగా వినిపించుకునే ప్రయత్నం చేశారు…

తాగునీరు, రోడ్లు, ఉపాధి అవకాశాలపై వచ్చిన అంశాలపై స్పందించి, వీటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే చర్యలు తీసుకుంటామని తెలిపారు…

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

అనంతరం అమ్మ పేరు మీద మొక్కలను నాటడం జరిగింది…

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, Bjym మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, బిసి మోర్చ కల్వకుర్తి ఇంచార్జ్ వరికుప్పల చంద్రమౌళి, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు శాంపూరి భగవాన్ రెడ్డి, బీసీ మోర్చ మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా నాయకులు కొప్పు పుల్లయ్య, మాజీ బూత్ అధ్యక్షుడు గండి కోట జంగయ్య, మాజీ వార్డు సభ్యులు ఆర్ ప్రభు లింగం, నల్ల కొమురయ్య, తిప్పిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మందా రాంరెడ్డి, వరికుప్పల రాఘవేందర్, మండల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎరగమౌని రాములు, సీనియర్ నాయకులు కొప్పు నర్సింహ అలియాస్ బొంబాయి, కార్ మెకానిక్ శేఖర్, వరికుప్పల శ్రీకాంత్, బండ్ల శివ, వరికుప్పల అశోక్ గార్లు గ్రామంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు… ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

నాగారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేటి ధాత్రి:

 

జూన్ 23 నుండి జూలై 6 వరకు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ నుండి జన్మదిన వరకు జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర మహిళా మోర్చా పిలుపుమేరకు మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ వేణుగోపాల్ ఆద్వర్యంలో నాగారం మున్సిపాలిటీ ఆర్ ఎల్ నగర్ శ్రీ స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అమ్మ పేరు మీద మొక్క నాటే కార్యక్రమం మరియు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రెటరీ మాధవి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనన్న, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ శ్యాంసుందర శర్మ, శ్రీనివాస్ గౌడ్
సీనియర్ బిజెపి నాయకులు రవీందర్ రెడ్డి, పోతంశెట్టి, సురేందర్ , శ్రీనివాస్,జ్యోతి పాండే శైలజ ,విజయలక్ష్మి ,శారద మరియు మండల మహిళలు, మహిళ మోర్చా నాయకురాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు

హాజరైన బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు హాజరయ్యారు.ఈసందర్బంగా మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక,మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం ‘యోగ’అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు శరీరం మరియు మనస్సు కలయికకు ప్రతీకగా చేరడం లేదా ఏకం చేయడం అని,నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతోంది మరియు జనాదరణ పొందుతూనే ఉందని,దాని సార్వత్రిక విజ్ఞప్తిని గుర్తించి,11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి 69/131 తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు.యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థాపించే ముసాయిదా తీర్మానాన్ని భారతదేశం ప్రతిపాదించింది మరియు రికార్డు స్థాయిలో 190 సభ్య దేశాలు ఆమోదించాయన్నారు.

జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ ప్రతిపాదనను మొదట ప్రవేశపెట్టారు.యోగా అనేది మనస్సు మరియు శరీరం,ఆలోచన మరియు చర్య యొక్క ఐక్యతను కలిగి ఉంటుందని మన ఆరోగ్యానికి మరియు మన శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం. యోగా అంటే వ్యాయామం మాత్రమే కాదు,మీతో, ప్రపంచంతో మరియు ప్రకృతితో ఏకత్వం యొక్క భావాన్ని కనుగొనడానికి ఇది ఒక మార్గం,యోగా అనేది శారీరక శ్రమ కంటే ఎక్కువ మరియు రోజువారి జీవితంలో సమతుల్య వైఖరిని కొనసాగిస్తుందని పనితీరులో నైపుణ్యాన్ని ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాచం గురుప్రసాద్,ఆర్పి జయంతి లాల్,కాసగాని రాజ్ కుమార్, ఎరుకలు దివాకర్,మార్తా రాజభద్రయ్య,ఎర్రం రామన్న, సంగా పురుషోత్తం,బాసాని సోమరాజు పటేల్,మార్త బిక్షపతి,సందీప్,కుమారస్వామి నరసయ్య,పావుశెట్టి సునీత,దంచనాదుల కిరణ్ కుమార్,కందుకూరి గిరి ప్రసాద్,కాలుగుల గోపీనాథ్, గోగుల రాజిరెడ్డి,రవీందర్ యాదవ్,నగేష్,బాలాజీ మురళి,ఆర్పీ సంగీత,చెట్ల రజినీకాంత్,సంగా ప్రభాకర్, బండి యాదగిరి,మధుసూదన్ రెడ్డి, రాంబాబు,ప్రజా ప్రతినిధులు,బిజెపి నాయకులు,పతాంజలి వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.

 

 

 

 

Whether you choose to walk or run, you are a child.
Whether you choose to walk or run, you are a child.

ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున
ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.

ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.

రైతుల పండుగ ఎరువక.

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

 

 

BJP Executive Committee

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది.

బాలానగర్ /నేటి ధాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుందని బాలానగర్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల ఆస్తులను కొల్లగొట్టి, ప్రశ్నించే బంజారా బిడ్డలను, బంజారా రైతులను, బంజారా ఉద్యోగులను జైల్లో పెడుతున్నారన్నారు. లంబాడ సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం లంబాడ సామాజిక వర్గంకు అవమానం చేసినట్టే అని అన్నారు. ఈ విషయంపై గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో గిరిజనులను తృతీయ శ్రేణి నాయకులుగా పరిగణిస్తున్నారని విమర్శించారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ lప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

BJP Durgam Ashok.

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… .

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో పెద్దమ్మ . పెద్ద రాజుల కళ్యాణ మహోత్సవమునకు ప్రత్యేకంగా హాజరైన జిల్లా బిజెపి అధ్యక్షుడు గోపి. జిల్లా బీజేవైఎం. జిల్లా అధ్యక్షులు రావుల రాజిరెడ్డి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గోపి రాజు రెడ్డి బిజెపి పార్టీ నాయకులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు బిజెపి పార్టీ నాయకులను. ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో. బిజెపి పార్టీ నాయకులు. సుధాకర్. రాజేందర్. నెల్లుట్ల రమేష్. కాజు గంటి రాజు. చిందం నరేష్. సందీప్ జిల్లెల్ల గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల మల్లేశం ముదిరాజ్ ఈసా నరసయ్య సంఘం నాయకుడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.

*వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది

బిజెపి మాజీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు జన్నేమొగిలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల నూతన కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజర య్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది భారతదేశం 2047 నాటికి ఒక పూర్తిగా వికసిత దేశంగామారా లన్న దృష్టితో ఏర్పడిన అభిప్రా యం భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికిదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన దేశంగా నిలిపే లక్ష్యంతో నరేంద్ర మోడీ పని చేస్తున్నారు

వికసిత్ భారత్ లక్ష్యం

 

 

Former BJP

 

 

ఆర్థిక అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడం,ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగావకాశాలను సృష్టించడం, ఐటీ, మానుఫా క్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధిసమాజ పరంగా సమగ్రత సామాజిక సమానత్వం, లింగ సమాన త్వం, విద్యావృద్ధిఆరోగ్య సదుపాయాల వృద్ధిపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం పరిశుభ్రమైన, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తుల ప్రోత్సాహంకాలుష్య నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణసాంకేతికత ఆధారిత అభివృద్ధిడిజిటల్ ఇండియా అభియాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజ భారత విలువలు మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధి సంస్కృతి,భాషలు, సంప్రదా యాలను గౌరవిస్తూ ఆధుని కతను అంగీకరించడం భారత యువతకు ఒక ప్రేరణాత్మక దిశను చూపుతుంది.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు,సంస్కరణలు ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతో అమలవుతాయి.ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ స్థానం మరింత శక్తివంతంగా మారుతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విజయ్, భూతం తిరుపతి, మండల కార్యదర్శులు మేకల సుమన్, వంగరి శివ శంకర్, కొంగరి భారతి, సీనియర్ నాయకులు మోత్కూరు సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, వంగల భాస్కర్ రెడ్డి, మును కుంట్ల చంద్రమౌళి,కన్నెబోయిన రమేష్, మూడేడ్ల పైడి, పరుష బోయిన శంకర్, బత్తుల రాజే ష్, కొంగర సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి, మూడేడ్ల రాంప్ర సాద్ తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాధ్యంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ఎల్లవేళల శ్రమిస్తూ నరేంద్ర మోడీ ని ఆయన తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధిక స్థానాల్లో గెలుపొందే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ రావుల రాకేష్ బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య మండల ఉపాధ్యక్షులు సుధా గాని శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ రెడ్డి చింతల రాజేందర్ మండల కార్యదర్శి చెన్నవేని సంపత్ బిజెపి సీనియర్ నాయకులు మాచర్ల రఘు, కంచ కుమారస్వామి బూత్ అధ్యక్షులు వల్లల ప్రవీణ్ తీగల వంశీ బుర్రితిరుపతి జైపాల్ చందు వివేక్ తోట్ల మహేష్ గొప్పగాని రాజు మాదారపు రాజు శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

చందుపట్ల కీర్తి రెడ్డి బిజెపి పార్టీ అధికార ప్రతినిధి

భూపాలపల్లి నేటిధాత్రి : 

 

బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన అధ్యక్షతన జిల్లా మండల స్థాయి పదాధికారులతో 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం జిల్లా కార్యశాల నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు
అనంతరం జిల్లా కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు.
11 ఏళ్ల మోదీ పాలనతో సాధించిన విజయాలు, ఘనతలపై ఈ నెల 4 నుంచి 25 వరకు చేపట్టబోయే కార్యక్రమాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి వికసిత భారత్ కన్వీనర్ కో కన్వీనర్లులు జన్నే మొగిలి దొంగల రాజేందర్ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కన్వీనర్ సుతాటి వేణు రావు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు వివిధ మండల అధ్యక్షులు శక్తి కేంద్ర ప్రభారీలు ప్రముఖు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

కొత్తగూడ నేటిధాత్రి:

కొత్తగూడ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్త గూడబిజెపి మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి మురళి మాట్లాడుతూ .
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఆరవది ఏండ్ల ఆరాటం ప్రజల అస్తిత్వపు ఆత్మ గౌరవ పోరాటం
నా తెలంగాణ అమరవీరుల పోరాట ఫలితంగా చిన్నమ్మ సుష్మ స్వరాజ్ గారి వంటి ఎందరో మహానీయులు యోగ దనంతో స్వరాష్ట్రమై పులకించిన పుడమి తల్లి నా తెలంగాణ మహానీయులు ఆశయాలతో ఆశయ సిద్ది కై అమరవీరుల ఆత్మ ఫలితంగా అవతరించిన నెల నా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు బోనాల ప్రవీణ్ కుమార్ చారి. వజ్జరవి . జిల్లా నాయకులు వాసంసారయ్య. మండల ఉపాధ్యక్షులు బూర్గసారంగపాణి. శ్రీనివాస్. రామయ్య పిన్నింటి రవీందర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు…

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి.

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి

వనపర్తిలో బిజెపి తిరంగా ర్యాలీ

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్

వనపర్తి నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం మారణకాండకు ప్రతీకారంగా భారత సైన్యం సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ మాట్లాడుతూ ఇస్లామిక్ టెర్రరిస్ట్ రాజ్యాలు కుట్రపూరితంగా పెహల్గాంలో 26 మందిని ఊచ కోత ఘటనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ టెర్రరిస్టులకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిని ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య ద్వారా మే 7 న కేవలం 22 నిమిషాల వ్యవధిలో పౌర సమాజానికి విఘాతం కలగకుండా 9 ఉగ్రస్తావరాలను పూర్తిగా నేలమట్టం చేసి వందలాదిమంది టెర్రరిస్టులను అంతమొందించి భారతదేశ రక్షణ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పారని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వారికి మద్దతుగా నిలుస్తున్న బంగ్లాదేశ్ టర్కీ సౌదీ అరేబియా దేశాల వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా రద్దుచేసి వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేలా చేశారని అన్నారు. వనపర్తి లో తిరంగా ర్యాలీలో పార్టీలకతీతంగా విద్యార్థి యువజన కుల ప్రజా సంఘాలు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పెద్ద ఎత్తున పాల్గొని దేశ భద్రత విషయంలో దేశ జవాన్లకు నేను సైతం మద్దతుగా రాజకీయ పార్టీల కు అతీతంగా తిరంగా ర్యాలీలో పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నారాయణ జిల్లా రామన్ గౌడు.పట్టణ ప్రధాన కార్యదర్శి నల్లబోతుల అరవింద్ కుమార్. రాష్ట్ర నాయకులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డి పురుషోత్తం రెడ్డి బిశ్రీశైలం చిత్తారి ప్రభాకర్, గౌని హేమారెడ్డి , రత్నాకర్ రెడ్డి కృష్ణారెడ్డి తపస్ ఉపాధ్యాయ సంఘం అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ చేయూత శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యనారాయణ, రామ్మూర్తి హిందూ రాష్ట్ర మహాసభ అధ్యక్షురాలు నారాయణ దాసు జ్యోతి రమణ వనపర్తి పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు బచ్చురాము, కృష్ణ గౌడ్ సామాజిక నాయకులు పోచా రవీందర్ రెడ్డి, బులియన్ మర్చంట్ బంగారు అనిల్ అయ్యప్ప ఆలయ కమిటీ ముత్తు కృష్ణ గురుస్వామి స్నేక్ సొసైటీ చీర్ల కృష్ణసాగర్ మెడికల్ అసోసియేషన్ వినోద్ రామన్ గౌడ్ కుమారస్వామి ఏర్పుల సుమిత్రమ్మ, తిరంగా ర్యాలీ కో కన్వీనర్ కదిరే మధు, ఆగపోగు కుమార్ఎండి ఖలీల్, అశ్విని రాద, వారణాసి కల్పన, మని వర్ధన్, సాగర్, బోయల రాము, రాజశేఖర్, ఎద్దుల రాజు, తదితరులు పాల్గొన్నారు

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం.

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం..

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బహిరంగ సభలో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్స్ సవరణ బిల్లు ఎక్కువ రోజులు నిలువదని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి మహమ్మద్ రహీం ఖాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ అన్నారు. వర్ఫ్ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు.వర్షంలోనే అతిధులు అదరకుండా బెదరకుండా సమావేశంలో మాట్లాడడం పట్ల ప్రజలు కుర్చీలను తమ నెత్తిపై పెట్టుకుని సభలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన అనంతరం కొన్ని వర్గాలపై రోజుకోరకమైన చట్టాలు నియమాలు నిబంధనలు తీసుకువచ్చి అణగదొక్కెందుకు కృషి చేస్తుందన్నారు. రబ్బర్ బాలు గోడకు కొడితే ఆ బాలు తిరిగి అదే వేగంగా వస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని అన్నారు.

వక్స్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఉదయం 3 గంటల వరకు పార్లమెంటులో ఉండి ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు.త్వరలోనే కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తుంది ఈ విధమైన బిల్లులన్నీ చెల్లకుండా పోతాయన్నారు. లౌకికత్వాన్ని పూర్తిస్థాయిలో పాటించేది అన్ని వర్గాలకు సమాన ప్రతిపాదికన గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ ముయ్యద్దీన్,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు తైవుల్లా, లతోపాటు మాజీ టి ఎస్ ఐ డి సి చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షులు మొహమ్మద్ అత్తర్ అహ్మద్,అశోక్ అప్పారావు, తాసిల్దార్ దశరథ్, మత పెద్దలు పుర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్షంలోనే కొనసాగిన సదస్సు

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేక నిరసన సదస్సు వర్షంలోనే కొనసాగింది. వక్తలు వర్షంలో తడుచుకుంటూ ప్రసంగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సవరణ బిల్లు కంటే ఈ వర్షం కఠినమైంది కాదని ఇలాంటి వర్షాలను తాము ఇలాంటి ఎన్నో కష్టాలు సహిస్తామని వక్తలు ప్రకటించారు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఈటెలకు ఘనస్వాగతం.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఈటెలకు ఘనస్వాగతం

 

పరకాల నేటిధాత్రి

 

పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మీదుగా సరస్వతీ పుష్కరాలకు కాలేశ్వరం వెళుతున్న మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అంబేద్కర్ సెంటర్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్,పరకాల రూరల్ మండలం అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్,ఎర్రం రామన్న,చందుపట్ల రాజేందర్ రెడ్డి,కుక్కల విజయ్ కుమార్, సంగా పురుషోత్తం,చిర్ర సారంగపాణి,భాసాది సోమరాజు,ముత్యాల దేవేందర్,కుంటమల్ల గణేష్, ఆకుల రాంబాబు,ధర్నా సునీల్,కందుకూరి గిరిప్రసాద్, గాజుల రంజిత్,సారంగా నరేష్,పల్లెబోయిన భద్రయ్య, చంద్రిక అశోక్,ఆర్పీ సంగీత మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్న కేంద్ర.!

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ మే 20( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని , కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు అఖిలభారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బి.వై. నగర్ లో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు , హక్కులను తొలగించి పెట్టుబడిదారులు , యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం , ప్రత్యేక పరిస్థితుల్లో నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో , కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు , హక్కులను కాపాడుకోవడంలో భాగంగా జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సంఘటిత , అసంఘటిత అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్డాస్ గణేష్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version