భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు.

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలును బహిష్కరించాలని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వైద్యనాథ్ ఆధ్వర్యంలో కోహిర్ మండల ఎంఆర్ఓ గారికి మరియు కోహిర్ మండల పిఎస్ ఎస్ఐ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది.భారతదేశంలో అక్రమంగా పాకిస్తానీ జాతీయలను మరియు ఉగ్రవాదులను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మరియు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్న వారిని దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరడం జరిగింది.
ఇందులో మండల అధ్యక్షులు వైద్యనాథ్ మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిష్టన్న, సీనియర్ నాయకులు నర్సింలు, సతీష్ రెడ్డి, నాగరాజు, వంశ వర్ధన్ రెడ్డి, వంశీ, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, శివకుమార్, ఈశ్వర్ యాదవ్, శ్రీనివాస్, శ్రీశైలం, దశరథ్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు.

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కి. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు వెన్ననేని. శ్రీధర్ రావు మాట్లాడుతూ పాకిస్తానీయులను గుర్తించి వారి దేశం విడిచి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మసీదులో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిములు గుర్తించి వెంటనే వారిని పాకిస్తాన్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పాకిస్తాన్ మద్దతుతో దేశంలో ఉండిపోతున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి అలాగే మే 22వ తేదీన కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఏక్తాయాత్ర. నిర్వహించడం జరుగుతుందని . ఈ కార్యక్రమానికి మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వినయ్ ఓబీసీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ జీవన్ మధుసూదన్ పోకల శ్రీనివాస్. రాజు. అనిల్. గణేష్. తదితరులు పాల్గొన్నారు

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం.!

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version