కిడ్నీ కేన్సర్ ముందస్తు లక్షణాలు…

ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..

కిడ్నీ కేన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..  కిడ్నీ కేన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ కిడ్నీ కేన్సర్‌కు సంబంధించి ఐదు ముందస్తు సూచనల గురించి తెలుసుకుందాం  మూత్రంలో రక్తం

1) మూత్రంలో రక్తం

కిడ్నీ కేన్సర్ మొదటి సంకేతం మూత్రంలో రక్తం పడడం. దీనిని హెమటూరియా అంటారు. కేన్సర్ కణితులు మూత్రపిండాలు, మూత్ర వ్యవస్థలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీయడం వల్ల మూత్రంలో రక్తం పడుతుంది.

 

2)వెన్ను నొప్పి

మూత్రపిండాల కేన్సర్ నిరంతర పార్శ్వ నొప్పిని లేదా నడుము నొప్పిని కలిగిస్తుంది. ఎటువంటి గాయం లేకుండా వీపు దిగువ భాగంలో నొప్పి మొదలై క్రమంగా తీవ్రమవుతుంది. రక్తంలో మూత్రం పడడం, తీవ్రమైన వెన్ను నొప్పిని విస్మరించకూడదు. వెంటనే చికిత్స ప్రారంభించాలి.

3)బరువు తగ్గడం

వ్యాయామం, డైటింగ్ వంటి లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోనప్పటికీ వేగంగా బరువు తగ్గుతుండడాన్ని కూడా అనుమానించాలి. కిడ్నీ కేన్సర్ ప్రారంభ దశలో ఆకలి, జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గిపోతారు.

4)నడుముకు దిగువన గడ్డలు

నడుము దిగువన లేదా పక్కటెముకల కింద ఏవైనా గడ్డలు లేదా వాపు వంటివి కనిపిస్తున్నా అనుమానించాలి. వీపు దిగువన వాపు అనేది కిడ్నీలో కణితి పెరుగుదలను సూచిస్తుంది. అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షల ద్వారా వైద్యులు ఆ గడ్డలు దేనికి సంబంధించినవో తెలుసుకుంటారు.

5)అలసట, నీరసం

తరచుగా నీరసంగా అనిపించడం, త్వరగా అలసిపోవడం కూడా కిడ్నీ కేన్సర్‌కు ప్రారంభ సంకేతంగా భావించవచ్చు. కిడ్నీ కేన్సర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అది రక్తహీనతకు దారి తీసి తీవ్ర అలసటకు, నీరసానికి కారణమవుతుంది.

వెన్నునొప్పి వస్తుందా..

వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..

 

 

 

 

వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే, దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

 

 

వెన్నునొప్పి అంటే వీపు భాగంలో కలిగే నొప్పి. ఇది కండరాలు, ఎముకలు, నరాలు, లేదా వెన్నుపాములోని ఇతర భాగాల నుండి రావచ్చు. సాధారణంగా, ఇది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

తప్పుగా కూర్చోవడం:

గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవడం, సోఫాలో సరిగా కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తగ్గించాలంటే నేరుగా కూర్చోవాలి, కుర్చీ కూడా మంచిది ఉపయోగించాలి. ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవడం మంచిది.

 

 

 

 

శారీరక శ్రమ లేకపోవడం

రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడితే, వెన్నెముకకు సరైన మద్దతు లేక నొప్పి వస్తుంది. కనీసం రోజుకు కొన్ని నిమిషాలు యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచిది.

 

 

 

 

బరువులు ఎత్తడం:

బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తడం, లేదా ఒక్కసారిగా ఎక్కువ బరువు మోయడం వల్ల వెన్నెముకకు నష్టం కలుగుతుంది. కింద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, నెమ్మదిగా లేచే విధంగా ఎత్తాలి. అవసరమైతే ఎవరైనా సహాయం తీసుకోవాలి.

 

 

 

 

పరుపు లేదా నిద్ర భంగిమ:

మృదువైన లేదా గట్టిగా ఉన్న పరుపులు వెన్నెముకకు సరైన మద్దతు ఇవ్వవు. అలాగే నిద్రించే స్థితి సరిగాలేకపోతే ఉదయం నడుము నొప్పితో లేచే ప్రమాదం ఉంటుంది. మితమైన గట్టితనంతో ఉన్న పరుపును ఎంచుకోవాలి. వీపు నేరుగా ఉండేలా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. వెన్నునొప్పి సాధారణమైన సమస్య అయినా దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు మార్చుకోండి. వెన్ను నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించండి.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version