తంగళ్ళపల్లిలో టిబి రక్త పరీక్షలు

తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మేడం గారి సూచన మేరకు తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. డాక్టర్ స్నేహ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అనుమానితులకురక్త పరీక్షలు చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు దయాగ్నొస్టిక్సెంటర్లో .అరుదుగా చేసే ఈ పరీక్ష ఎప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ పరీక్ష ద్వారా ఇనాక్టివి టిబి తెలుసుకోవడం ద్వారా ముందస్తు క్షయ వ్యాధికి గురికాకుండా ప్రివెంట్ చేయవచ్చని ఈ గ్ర పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి పూర్తిగా మూడు రోజులపాటు 12 .డోసులు వారం చొప్పున మందులు ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోక్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు టిబి లేటెంట్ ఇన్ఫెక్షన్ ఈ గ్రా రక్త పరీక్షలు నిర్వహించారు. సుమారు పదిమంది అనుమానితుల నుండి రక్త నమూనాలను తీసి టీ హబ్ కి పంపించారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ టిబి ల్యాబ్ సూపర్వైజర్ నాగరాజు. సూపర్వైజర్ ప్రమీల. హెల్త్ అసిస్టెంట్ సతీష్. ఏఎన్ఎం జ్యోతి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లి పీహెచ్సీని పరిశీలించిన జిల్లా ఆరోగ్యాధికారి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తంగళ్ళపల్లి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత తనిఖీ చేయడం జరిగింది..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

ఈ సందర్భంగా. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించే వ్యాధి నిరోధక టీకాలను రిజిస్టర్ లను పరిశీలించి. చిన్నపిల్లలకు తల్లిదండ్రులకు వ్యాధి నిరోధక టీకాలపైఅవగాహన కల్పించి పిల్లలకు సకాలంలో టీకాలు తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప. చేయవలసిందిగా .మండల వైద్యాధికారి డాక్టర్ స్నేహ కి వైద్య సిబ్బందికి సూచిస్తూ. మండలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి గ్రామంలో వైద్య సిబ్బంది ఆశ వర్కర్లతో మండలంలోని ప్రతి గ్రామంలో వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఏమైనా అవసరాలు ఉన్నచో వారికి అత్యవసరటైంలో వైద్యం అందించే ప్రక్రియ కొనసాగించాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు ఇట్టి కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్నేహ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version