ఆంజనేయుని విగ్రహ పున ప్రతిష్ట.

ఆంజనేయుని విగ్రహ పున ప్రతిష్ట

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి:

టేకుమట్ల మండలం అంకుషాపురం సోమనపల్లి గ్రామ శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ సమయంలో ఆలయ కమిటీ సభ్యులు ఏనుగుల రాకేష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంలో ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడు హిందూ సంస్కృతిలో అత్యంత దేవుళ్ళు ఒకరు. అపారమైన బలం, అచంచలమైన భక్తి మరియు అపరిమిత జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన హనుమాన్ జీ హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడని అన్నారు. ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభయాంజనేయుని శుభ ఆశీస్సులు కలిగి సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ సందర్భంగా ఈ గొప్ప ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలోనికి ఆహ్వానం పలికినందుకు కమిటీ సభ్యులందరికీ ఉమ్మడి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలపడం
జరిగింది ఈ కార్యక్రమంలో సోమనపల్లి మాజీ సర్పంచ్ ఉద్దమారి మహేష్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, పిఎసిఎస్ డైరెక్టర్ మారం లింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, తోట వినయ్ సాగర్, పోతనవేన ఐలయ్య, దేవేందర్ పటేల్ వీసం బారత్ రెడ్డి, పిన్నింటి మణిదీప్ రావు, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మంద అశోక్, చిక్కుల రవి, మేకల శ్రీకాంత్, గిర వేణ కిరణ్, గిరవేణ భాస్కర్ అంతనగిరి దేవేందర్, మేకల అనిల్ ఉమ్మడి గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం.!

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నే.

ఆవిర్భావ వేడుకలో జెండా ఆవిష్కరించిన గూట్ల తిరుపతి

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం* ఘనంగా నిర్వwహించుకోవడం జరిగినది.

మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి* జాతీయ జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడుతూ..

ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ

ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి యువకులు 1200 మంది చనిపోయిన దాన్ని చూసి సోనియా గాంధీ మనసు చలించిపోయి

తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును పెట్టి ఆమోదింపచేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియా గాంధీ ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.

అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందియాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ప్రజాపాలనను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకపోయిన ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎన్నో మన్ననలు పొందుతున్నారు.

గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ బీసీల అందర్నీ ఎలాంటి సంక్షేమ పథకాల అందించక అనేక ఇబ్బందులకు గురిచేస్తూ తమ స్వలాభం కోసం కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అదే తీరుగా ప్రజాసంక్షేమ పథకాల అమలు అందరికీ అందిస్తున్నారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కామిడి రత్నాకర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

75 వేల రూపాయలు ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారాం మండలంలోనీ ఓడేడు గ్రామానికి చెందిన కట్కూరి సుజాత నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే స్పందించి సి ఎమ్ ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వీరికి డెబ్బది ఐదు వేల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది
డెబ్బది ఐదు వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి.

ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి

బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మనోహర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

 

ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ అన్నారు.తెలంగాణ ఏర్పాటు అయి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులు బిసి నాయకులు నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటం ఫలించి నేటికీ 11 సంవత్సరాల కావస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ ఏర్పాటు కాలేదని,ఆంధ్ర కబంధ హస్తాల నుండి విడిపోయిన తెలంగాణ అగ్రవర్ణాల కుట్రలో బందీ అయి ఉన్నదని ఉద్యోగ ఉపాధి రంగాలలో తెలంగాణ యువతకు నష్టం చేకూరుస్తున్న,రైతాంగాన్ని నడ్డి విరుస్తున్నారు.ఈ పాలకవర్గాలను,ఏదైతే తెలంగాణ ఆకాంక్షల కోసం జరిగిన బలిదానాల ఆశయాలు నెరవేరలేదని,ఆ ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం సిద్ధం కావాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు.
తెలంగాణ ఉద్యమము తొలిదశ మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు తుల మధుసూదన్ రావు,జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్,పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రాయలింగు పద్మశాలి సంఘం జిల్లా నాయకులు నల్ల నాగేంద్రప్రసాద్,తెలంగాణ బీసీ జేఏసీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవిడపుగణేష్,జిల్లా నాయకులు వేముల మల్లేష్, భీమ్సేన్,బీసీ జేఏసీ యువజన నాయకులు పెద్దల చంద్రకాంత్,ఎండి లతీఫ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇప్పలపల్లి బాపు,జిల్లా నాయకులు తాళ్ల పెళ్లి దేవేందర్ గౌడ్,అడిచర్ల రాజయ్య,తోకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్.

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరైన నాయకులు

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అక్బర్,జుబేర్ యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నథానెయల్,టిపిసిసి జిల్లా మీడియా&కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,అక్షయ్ జాడే,మాజీ కౌన్సిలర్ నాగేష్,నర్సింహా యాదవ్,పాండు యాదవ్,మోహీన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు
బలుగూరి తిరుపతిరావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బలుగురు తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా బారాస అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు పోరాటం ద్వారా అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమళ్ళ రమేష్ మల్సాని బాపురావు దేవునూరికుమారస్వామి బొల్లేని రవికుమార్ ఎల కంటి మూర్తిలింగాచారిపడిదల జగ్గారావు బండారి రామస్వామి చెక్క సురేష్ వనం కార్తీకు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

పరకాల కోర్టులో ఘనంగా రాష్ట్రఆవిర్భావ దినోత్సవం.

పరకాల కోర్టులో ఘనంగా రాష్ట్రఆవిర్భావ దినోత్సవం

 

పరకాల నేటిధాత్రి

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని పరకాల ఇన్చార్జి ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి నూటంకి శాంతి సోనీ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పరకాల భారతదేశం అధ్యక్షులు పిండల భద్రయ్య,పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.రుదిరా,ఏ. కుమార్,కోర్టు సూపరిండెంట్ టీ.నవీన్ కుమార్, కోర్ట్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి

వరంగల్ మండల ప్రజలకు తహసిల్దార్ సూచన

నేటిధాత్రి వరంగల్:

వరంగల్ మండల ప్రజలకు తహశీల్దార్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా, వరంగల్ మండలం లోని ఐదు రెవెన్యూ గ్రామాలకు, భూ భారతి రెవెన్యూ సదస్సులు జూన్ 3వ తేదీ నుండి 7వ తారీఖు వరకు నిర్వహించుటకు జిల్లా కలెక్టర్ వరంగల్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు మండలంలోని రెవెన్యూ గ్రామాల వారిగా జూన్ 3వ తేదీన మట్టేవాడ లో, 4వ తేదీన ఎనుమాముల లో, 5వ తేదీన పైడిపల్లి, దేశాయిపేట లో, 6వ తేదీన కొత్తపేట లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులో వరంగల్ మండలంలోని రెవిన్యూ టీంలు అనగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పాల్గొంటారు. కావున మండల కేంద్రంలోనీ ప్రజలు తమ భూమీ సమస్యలపై దరఖాస్తులు నేరుగా రెవెన్యూ అధికారులకు ఇచ్చి, వారి వద్ధనే సమస్య ప్రస్తావించి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది కావున వరంగల్ మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ ఇక్బాల్ సూచించారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

రైతులకు అవగాహన కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం సూరం పేట గ్రామంలో రాష్ట్ర అవత రణదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

రైతులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత వానా కాలంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు మరియు నీటి యాజమాన్యం తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా సూచించడమైనది, అధిక రసాయనాలు వాడడం వల్ల నేల నీరు గాలి కాలుష్యంతో పాటు మానవుని యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది కనుక అధిక రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రీయ పద్ధతిలో సహజసిద్ధమైన వ్యవసాయం చేసినట్లయితే ఆరోగ్యకరమైన పంటను మనము తీసుకోవడానికి వీలవుతుంది, అధిక రసాయ నాలు వాడడం ద్వారా నేలలో చౌడు వచ్చే అవకాశం కూడా ఉన్నందున రసాయనలకు బదులుగా సేంద్రియ వ్యవసా య పద్ధతిలోగనుక మనం వ్యవసాయాన్ని కొనసాగించి నట్లయితే కొంతకాలానికి చౌడు దానంతట అదే తగ్గిపోయే అవకాశం కూడా ఉంది బల మైన నేలలున్న దగ్గర పంట కూడా బలంగానే ఉంటుంది, అందువల్ల బలమైన మొక్కలు ఉండే అవకాశం ఉంది కనుక నాణ్యమైన దిగుబడిని సాధిం చే అవకాశం ఉందని సూచిం చడం జరిగింది.

పురుగు మందుల పిచికారి సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది.పురుగు మందులు కూడా సిఫారసు మేరకే వాడాలని సూచించడం జరిగింది.

బయోమందులను ఎట్టి పరిస్థితులలో వాడరాదని తెలియజేయడం జరిగింది.

బయోమందులు వాడడం ద్వారా తాత్కాలికంగా మొక్క ఎదుగుదల కనపడినప్పటికిని తదుపరి పరిణామాలలో పురుగు ఉధృతి మరి ము ఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి పంటను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి బయో మందులను రైతులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదని సూచించడం జరిగింది.

మరి ముఖ్యంగా రైతులు మొక్క జొన్న మరియు వరి మేల్ ఫిమేల్ పద్ధతిలో పంట పండిం చడం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

సదరు కంపెనీ దగ్గర తప్పనిసరిగా ప్రాపర్ అగ్రిమెంట్ అనేది తీసు కోవాలి.

అలాంటి పరిస్థితుల లో పొరపాటున ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు, దిగు బడులు తగ్గడం జరిగినప్పుడు కంపెనీ వారి నుండి నష్టపరి హారం పొందడానికి అవకాశం ఉంటుంది.

అగ్రిమెంటు తప్ప నిసరిగా తీసుకోవాలి, డీలర్ల దగ్గర కూడా కచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరనే విత్తనాలు కొనుగోలు చేయాలి, రసీదులను పట్టకాలమంతా కూడా భద్రపరచాలి.

 

తప్ప నిసరిగా రైతు తీసుకునే రసీ దు మీద షాపు యజమాని సంతకంతో పాటు రైతు సంత కం కూడా ఉండేలాగా చూసు కోవాలి.

తీసుకున్న రసీదులో విత్తనాలు,ఎరువుల పురుగు మందుల పూర్తిస్థాయి సమా చారం ఉండేలాగా చూసు కోవాలి తగు జాగ్రత్తలు తీసు కోవాలి.

మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి, తద్వారా భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా మనము ఎరువులు వేసుకో వడానికి అవకాశం ఉంది రైతులు ఈ దిశగా దృష్టి సారించాలని సూచించడం జరిగింది.

అనం తరం ప్రజ్వల్ సంస్థ రైతుల కోసం తయారు చేసిన నవధాన్యాల మినీ కిట్స్ రైతులకు పంపిణీ చేయడం జరిగింది, నవధాన్యాల ద్వారా కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ రాజ్ కుమార్, ప్రజ్వల్ సంస్థ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కల్పన, రైతులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్దిదారులకు మరియు నస్పూర్ కు చెందిన 529 మంది లబ్ధిదారులకు మరియు హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును ఇస్తామని చెప్పి మాటను నిలబెట్టుకొని మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలో ఈ రోజు మొత్తం1,193 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చామని చెప్పారు.

మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మొత్తం 3,098 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి కి, రాష్ట్ర రెవెన్యూ ,గృహ నిర్మాణం & సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ఈ కార్యక్రమంలో సంబంధింత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్.!

ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం

ముఖ్యఅతిథిగ హాజరైన నాగూర్ల

పరకాల నేటిధాత్రి:

ఎరువులు,పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫర్టిలైజర్స్ మాజీ అధ్యక్షులు సూర్యదేవర సదానందం అధ్యక్షతన స్వర్ణ గార్డెన్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

నూతన అధ్యక్షుడిగాఎన్నికైన అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీ కోశాధికారి గా,మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ ఎన్నికైన కమిటీ సభ్యులను సదానందం ప్రమాణస్వీకారం చేయించారు.గందె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన డీలర్ మహాశయులకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని,బాధ్యతాయుతంగా నాకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తానని నాతోటి వ్యాపారస్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జిల్లా కమిటీకి పరకాల అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకి వ్యాపారస్తులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన…ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పినట్టు చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు

సోనియా గాంధీ చోరువుతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది

జోహార్లు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు

ఎఏం సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య

( నేటిధాత్రి )వర్ధన్నపేట:

మండలం, ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణం నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఏంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…సబ్బండ వర్గాల పోరాటాల ఫలితం, సకల జనుల ఉద్యమాల ఫలితం వెరసి సోనియా గాంధీ గారి సాహసోపేతమైన నిర్ణయ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని తెలిపారు.సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరువతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన సోనియమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్ననన్నారు.
చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం లోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయి నష్టపోయినప్పటికిని మరి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు ఉండదని చెప్పి పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ తలుపులు మూయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్ చేయించిన ఘనత అమ్మ సోనియమ్మకు దక్కుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అయిందన్నారు.ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,డైరెక్టర్లు బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,ఎండి ఖజామియా,బండి సంపత్ గౌడ్, కటబోయిన సంపత్,ఎండి మహమూద్, పుల్లూరు దామోదర్, మార్కేట్ కార్యదర్శి శ్రీనివాస్ రాజు గారు లు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇబ్రహీంపట్నం నేటి దాత్రి:

జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్
వర్షకొండ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి 2025 సంవత్సరం పాఠశాల నుండి 100% ఫలితాలు సాధించడం జరిగింది అలాగే 527 మార్కులతో ఎన్ లహరి.ప్రథమ స్థానంలో స్కూల్ టాపర్ గా నిలిచింది దానితో పాటు స్కూల్ సెకండ్ టాపర్ ఎస్ వర్షిని.ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు గ్రామ మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం మరియు మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు ఫోనుకంటి చిన్న వెంకట్. మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరియు ప్రధానోపాధ్యాయులు రాజేందర్. ఘనంగా మొమెంటోలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్ కి సీసీ కెమెరాలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు అభినందించారు.

వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు.

వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు

హన్మకొండ నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలను ముదిరాజ్ కులస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల్లు శివసత్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు పల్లెబోయిన శ్రీనివాస్ కార్యదర్శి ఆలేటి రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లెబోయిన నర్సయ్య, గంగబోయిన రవీందర్, పుట్ట తిరుపతి, శ్రీముర్తి, పుట్ట రమేష్, పల్లెబోయిన నరేష్, పల్లెబోయిన కృష్ణ, పల్లెబోయిన కుమార్, పల్లెబోయిన రమేష్, పల్లెబోయిన శివమణి, పల్లెబోయిన సంపత్,పల్లెబోయిన రాజు, తిరుపతి,పల్లెబోయిన రమేష్, సురేష్, పుట్ట రాజు, పుట్ట భద్రి, పుట్ట కుమార్, పుట్ట రమేష్, పుట్ట నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం.

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి:

 

చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకొని 11 వ సంవత్సరం ముగించుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది
అనంతరం మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతోనే ఏర్పరచుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల కోరిక నెరవేర్చుకోవడానికి చిన్న పెద్ద తేడా అని లేకుండా తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యోగులు రైతులు అని తేడా లేకుండా యువతీ యువకులు అందరూ పాల్గొని తెలంగాణ సాధన కోసం ఎంతోమంది అమరులై సాధించుకున్న తెలంగాణలో మన నిధులు మన నియమకాలు మన ఉద్యోగాలు అనే నినాదంతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకతాటిపై నిలబడి ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం జరిగిందని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతీయ జనతా పార్టీ కృషి ఎనలేనిదని మొదటి నుండి ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి మద్దతుగా నిలిచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే క్రీ. శే. మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ తల్లి సూక్ష్మ స్వరాజ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని అన్నారుఅనంతరం భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలాధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా కార్యకర్తలు బుర్ర వెంకటేష్ గౌడ్ కు శాలువాతో ఘనంగా సన్మానించడం .ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ గుండ సురేష్ సాధసదానందం కుమార్ శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి సారంగపాణి మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ రాయిని శ్రీనివాస్ సదానందం చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖద్దరు కక్షలకు ఖాకీ బలి !?

`పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు.

`రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్న పోలీసు?

`కార్యకర్త స్థాయి నుంచి నాయకులు దాకా పోలీసులను బెదిరిస్తున్నారు.

`గతంలో ఇంతటి వేధింపులు వుండేవి కాదు.

`నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు.

`పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు.

`నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.

`ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు.

`క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు.

`నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు.

`మనసు చంపుకొని పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు.

`నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు.

`పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.

`కాంగ్రెస్‌ ఎదురు లేకుండా పాలించిన రోజుల్లో పోలీసు వ్యవస్థ బాగుండేది.

`ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం వచ్చాక అసలైన సమస్య మొదలైంది.

`కాంగ్రెస్‌లో అప్పట్లో గ్రూపులు మాత్రమే వుండేవి.

`తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీ ఆధిపత్యం మొదలైంది.

`పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.

`అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది.

`తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు.

`రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

`ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది.

`ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు.

`సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు.

`సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు.

`సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు.

`పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు.

`ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు.

`ఒకప్పుడు తప్పు చేస్తే శంకరగిరి మాణ్యాలు అనే వారు.

`ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు.

`ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

`దేశవ్యాప్తంగా పోలీసులు అనుభవిస్తున్న ఇబ్బంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
జనం కోసం బతికే ఏకైక వ్యవస్థ పోలీసు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడి, త్యాగాల కోసమే పుట్టిన వ్యవస్థ పోలీసు. దేశ సరిహద్దులలో ఎండనక, వాననక, చలిని లెక్క చేయకుండా మనల్ని కావాడే వాళ్లు సైనికులు. మరి మన సమాజంలో చుట్టూ వున్న శక్తులను నుంచి కాపాడేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ వుందనే నమ్మకం, ధైర్యంతోనే మనం నిశ్చింతగా బతుకుతున్నాం. పోలీసులే లేకుంటే ఒక్ష క్షణం కూడా గడవదు. సమాజ భద్రత సాగదు. సమాజంలో మంచి వుంటుంది. చెడు వుంటుంది. చెడు మీద మనం విజయం సాధించాలంటే కూడా మనకు పోలీసు అవసరం. పోలీసు వృత్తి అంటే అంత సామాన్యమైనది. తెగింపుతో కూడున్నది. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెట్టేది. అలాంటి వ్యవస్థ ఇప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో నలిగిపోతోంది. రాజకీయ పెత్తనంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.
నిజం చెప్పాలంటే పోలీసు వ్యవస్థ నిస్సహాయ స్థితికి చేరుకుంటోంది. నిష్పక్షపాతంగా పని చేయలేకపోతోంది. పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకుల గుప్పిట్లో పని చేయాల్సి వస్తోంది. గతంలో రాజకీయ వ్యవస్థ పోలీసు యంత్రాంగంలో జోక్యం చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి పోలీసు స్టేషనులో అధికారులుగా ఎవరుండాలని నాయకులే నిర్థేశిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలలో పాలక పక్షం ఎమ్మెల్యే చెప్పిన వారికే పోస్టింగులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పోలీసులు ఠానాలకు ట్రాన్స్‌ఫర్‌ కాలేకపోతున్నారు. ఎమ్మెల్యేల విల్లింగ్‌ లెటర్లు లేకుండా పోస్టింగులు అందుకోలేక పోతున్నారు. దాంతో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల చేతిలో కాకుండా నాయకుల చేతుల్లోకి పోతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా, అందులో ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల ట్రాన్స్‌ఫర్లు యదాలాపంగా జరిగిపోవాలి. కానీ ట్రాన్స్‌ఫర్ల సమయంలో ఫలానా పోలీసు అధికారి మాకు వద్దని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. పోలీసు వ్యవస్థను అచేతనావస్థలోకి నెట్టేస్తున్నారు. రాజకీయాలు రంగు మారడమే కాదు, రకరకాల విన్యాసాలు కూడా చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తోంది. అది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అదే వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. గతంలో ప్రత్యర్థులు అంటే రాజకీయంగా, సిద్దాంత పరంగా విభేదాలు వుండేవి. కానీ కక్ష పూరిత రాజకీయాలకు తావుండేది కాదు. పాలక పక్షం, ప్రతి పక్షం పరస్పరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నించేవి. నిజం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు సమాజ ప్రయోజనాల కంటే నాయకుల ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని చెప్పడంలో సందేహం. దాంతో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు చెలరేగిపోతున్నాయి. ఒకప్పుడు ఆధిపత్య రాజకీయాలలో నాయకుల అనుచరులు మీద ఎక్కువగా ఆధారపడుతూ వుండేవారు. కాలం మారింది. నాయకులలో మరింత స్వార్థం పెరిగింది. అనుచరులు బాగు పడడం అనేది నాయకులకు ఇష్టం లేకుండా పోయింది. నాయకులను సొంత పనులకు వాడుకొని, వారిని పోషించడం కన్నా, పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు. పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు సాగిస్తున్నారు. ఇది నిజంగా పోలీసు వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. నిష్పాక్షికంగా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం మరీ మితిమీరి పోవడంతో వ్యవస్థ నలిగిపోతోంది. ఏ పోలీసు అధికారి అన్యాయానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోరు. వాళ్లు మనుషులే! వారిలోనూ మానవత్వం వుంటుంది. ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన వారిది కరుకు గుండె కాదు. పోలీసులంటేనే సమాజ రక్షకులు. ఆ విషయం ప్రతి పోలీసుకు తెలుసు. కానీ రాజకీయ వ్యవస్థ వారి చేతులు కట్టేస్తుంది. పార్టీల స్వలాభానికి వినియోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు చెప్పినట్లు వినకపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది కూడా వాళ్లకు తెలుసు. అందుకే విధిలేని పరిస్థితులలో మనసు చంపుకొని పని చేస్తున్న పోలీసులు కొన్ని వేల మంది వున్నారు. పాలకుల ఎవరైనా సరే వారు చెప్పింది వినాలి. అది రూలు. ఆ రూల్‌ను పోలీసులు అతిక్రమించలేరు. దాంతో రాజకీయాల మూలంగా ఖాకీలు ఎంతో నష్టపోతున్నారు. ఉన్నత విద్య చదువుకొని, పోటీ పరీక్షలు రాసి, ఎన్నో సంక్లిష్టమైన దేహ దారుడ్య, శిక్షణలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు వస్తారు. సమాజాన్ని ఏదో చేయాలని కలలుగంటారు. కానీ కుర్చీలో కూర్చున్న రోజే తన చేతులతో అన్యాయం వైపు మొగ్గు చూపేలా నాయకుల జోక్యం, ఒత్తిడి మొదలౌతుంది. అప్పుడు వారు పడే వేధన, అనుభవించే ఆవేదన వాళ్లకు మాత్రమే తెలుసు. అయినా ఖద్దరు సమస్యలను తమ భుజాన వేసుకోవాల్సిన అవసరం ఖాకీలకు లేదు. అయినా పాలనా పరంగా అనుసరించక తప్పదు. అందుకే ఖద్దరు కక్షలకు పోలీసులు బలి అవుతున్నారు. రాజకీయ పార్టీల ఆధిపత్యం మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో ఇంతటి వేధింపులు పోలీసులకు వుండేవి కాదు. నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు. నాయకులు పోలీసులతో ఎంతో మర్యాద, గౌరవంగా వుండే వారు. పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు. ఆ సమయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు. క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు. నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు. మనసు చంపుకొని పోలీసులు పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా పోలీసులను బెదిరిస్తున్నారు. గతంలో రౌడీలు, గూండాలు, గజ దొంగలు పోలీసులకు సవాలు విసిరే వారు. ఇప్పుడు వాళ్లు కనుమరుగైపోయారు. ఆ పని ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు. పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత మొదలైంది. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీల ఆధిపత్యం పోలీసుల మీద మొదలై, వేధింపుల దాక వచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. అంతకు ముందు వర్గ పోరులు మాత్రమే వుండేవి. గ్రూప్‌ తగాదాలే వుండేవి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల అధికార మార్పిడీతో పోలీసు వ్యవస్థ సంకటానికి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నప్పుడు సహజంగా ఆ పార్టీ నాయకుల చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలంగాణ రాజకీయాలు సీమాంధ్ర రాజకీయాలను పోలి వుండేవి కాదు. ముఖ్యంగా రాయలసీమ, ఆంద్రా ప్రాంతాలలో పార్టీల ఆధిపత్యం విపరీతంగా వుండేది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలలో పోలీసులు నలిగిపోయేవారు. పాలక పక్షం పెంచి పోషించే రౌడీలు, గూండాలు కూడా పోలీసులను బెదిరించే స్తాయికి చేరుకున్నారు. ఆంద్రాలో ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలలో రౌడీలు రాజ్యమేలుతూ వుండేవారు. సినిమాలు కూడా అదే తరహాలో వుండేవి. ముఖ్యంగా కుల రాజకీయాలు, పార్టీ పరమైన రాజకీయాలు విపరీతంగా వుండేవి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. వంగవీటి మోహనరంగా హత్య తర్వాత ఆయన కుటుంబమే అ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు మారింది. కానీ ఆనాడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే రంగ హత్యకు గురయ్యే వారు కాదని అదే రాజకీయ పార్టీలు అంటాయి. ఇంతకన్న దుర్మార్గం ఏదైనా వుంటుందా? చివరికి ఇప్పటికీ పోలీసులనే దోషులుగా చూస్తున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేది ప్రపంచమంతా తెలుసు. ఆ సంఘటన జరిగి నలభై ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులను నిందిస్తూనే వుంటారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే అధికారంలో వున్న పార్టీలు, ప్రతిపక్షాలను అణచి వేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు. అది ఏ పార్టీ అయినా సరే…పాలకులు చెప్పిందాన్ని పోలీసులు పాటించాల్సి వస్తుంది. తప్పడం లేదు. అలా వింటే అన్నీ చూస్తున్నాం..పోలీసు వ్యవహార శైలిని పరిశీలిస్తున్నాం…పేర్లు నోట్‌ చేసుకుంటున్నామని పై స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. రెడ్‌ బుక్‌, పింక్‌ బుక్‌, బ్లాక్‌ బుక్‌ ఇలా తెలుగు రెండు రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. అసలు రాజకీయ పార్టీలు సవాళ్లు చేసుకోవడం మానేసి, పోలీసులను టార్గెట్‌ చేస్తున్నారు. మీ అంతు చూస్తామని బెదురిస్తున్నారు. దాంతో ఇప్పుడున్న పాలకుల మాట వినాలా? ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడాలా? అన్న సందిగ్ధత ఎదురౌతోంది. పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది. ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు. సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు. అలాంటి రాజకీయాల వల్ల సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు. పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు. సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు. పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు. ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు. ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

ఘనంగా బోనాల వేడుకలు.

ఘనంగా బోనాల వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కోహిర్ మండలం దిగ్వల్ గ్రామంలో మైసమ్మ దేవాలయ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి గ్రామపురవీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యాన్ని ప్రత్యేకంగా ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం.

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం

ధ్యానోత్సవాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటిధాత్రి:

ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్ లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత యోగ ధ్యాన శిక్షణలో ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఎస్సై జక్కుల ప రమేష్ తెలిపారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మనిషి తన శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్నాన పానాధులు ఎలా అవ సరమో మనసుని హృదయా న్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ధ్యానం ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయని తెలి పారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద, జిల్లా కోఆర్డినేటర్ అ చ్చయ్య,రమేష్, రాంబాబు, సత్యనారాయణ, సుధాక ర్, సురేందర్ పాల్గొన్నారు

వ్యవసాయ మార్కెట్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

వ్యవసాయ మార్కెట్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

జెండా ఆవిష్కరించిన ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి జెండావిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల బలిదానాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావాన్ని మనం జరుపుకోవడం సంతోషకరమైనదని ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నారాయణ,తహాసిల్దార్ విజయలక్ష్మి,కాంగ్రెస్ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ,మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్,మార్కెట్ డైరెక్టర్స్ దాసరి బిక్షపతి,బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళి,భోగం కమల,నల్లెల కుమారస్వామి,
పెండ్యాల కుమారస్వామి,
ఎండి రంజాన్,వైద్యుల వెంకటరాజిరెడ్డి,శానం కుమారస్వామి,గాదె విజయ్,
బుడిమే రాజయ్య
మల్లక్కపేట భక్తాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్,కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, , రాయపర్తి మాజీ ఎంపిటిసి పర్నెం మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు , తాజా మాజీ కౌన్సిలర్స్ పరకాల మండల పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పరకాల మండల పట్టణ నడికూడ మండల సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు,మార్కెట్ కార్యదర్శి,వ్యవసాయ అధికారులు,సిబ్బంది
రైతులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఐనవోలులో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు

అయినవోలు నేటిదాత్రి:

ఐనవోలు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కలపల్లి చందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వినర్ తంపుల మోహన్, బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా భరోసా అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్ అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు చేతగాని అడ్డగోలు హామీలు ఇచ్చి తాము అధికారం చేపట్టే సరికి రాష్ట్ర పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాకపోతే, ప్రభుత్వం గద్దె దిగిపోవాలని కేసీఆర్ నాయకత్వంలో మరోమారు బంగారు తెలంగాణను సాధించేందుకు భారస పార్టీ సిద్ధంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారస గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, మండల నాయకులు కావటి స్వామి, కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుపెల్లి రాజు, పట్టపురం ఎల్లగౌడ్,బొక్కల స్వామి, గద్దల ప్రభాకర్,సంతోష్,రవి తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version