ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం.
చిట్యాల నేటి ధాత్రి:
చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకొని 11 వ సంవత్సరం ముగించుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది
అనంతరం మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతోనే ఏర్పరచుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల కోరిక నెరవేర్చుకోవడానికి చిన్న పెద్ద తేడా అని లేకుండా తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యోగులు రైతులు అని తేడా లేకుండా యువతీ యువకులు అందరూ పాల్గొని తెలంగాణ సాధన కోసం ఎంతోమంది అమరులై సాధించుకున్న తెలంగాణలో మన నిధులు మన నియమకాలు మన ఉద్యోగాలు అనే నినాదంతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకతాటిపై నిలబడి ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం జరిగిందని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతీయ జనతా పార్టీ కృషి ఎనలేనిదని మొదటి నుండి ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి మద్దతుగా నిలిచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే క్రీ. శే. మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ తల్లి సూక్ష్మ స్వరాజ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని అన్నారుఅనంతరం భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలాధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా కార్యకర్తలు బుర్ర వెంకటేష్ గౌడ్ కు శాలువాతో ఘనంగా సన్మానించడం .ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ గుండ సురేష్ సాధసదానందం కుమార్ శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి సారంగపాణి మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ రాయిని శ్రీనివాస్ సదానందం చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.