రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
వరంగల్ మండల ప్రజలకు తహసిల్దార్ సూచన
నేటిధాత్రి వరంగల్:
వరంగల్ మండల ప్రజలకు తహశీల్దార్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా, వరంగల్ మండలం లోని ఐదు రెవెన్యూ గ్రామాలకు, భూ భారతి రెవెన్యూ సదస్సులు జూన్ 3వ తేదీ నుండి 7వ తారీఖు వరకు నిర్వహించుటకు జిల్లా కలెక్టర్ వరంగల్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు మండలంలోని రెవెన్యూ గ్రామాల వారిగా జూన్ 3వ తేదీన మట్టేవాడ లో, 4వ తేదీన ఎనుమాముల లో, 5వ తేదీన పైడిపల్లి, దేశాయిపేట లో, 6వ తేదీన కొత్తపేట లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులో వరంగల్ మండలంలోని రెవిన్యూ టీంలు అనగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పాల్గొంటారు. కావున మండల కేంద్రంలోనీ ప్రజలు తమ భూమీ సమస్యలపై దరఖాస్తులు నేరుగా రెవెన్యూ అధికారులకు ఇచ్చి, వారి వద్ధనే సమస్య ప్రస్తావించి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది కావున వరంగల్ మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ ఇక్బాల్ సూచించారు.