ఘనంగా బోనాల వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం దిగ్వల్ గ్రామంలో మైసమ్మ దేవాలయ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి గ్రామపురవీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యాన్ని ప్రత్యేకంగా ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.