ఆంజనేయుని విగ్రహ పున ప్రతిష్ట.

ఆంజనేయుని విగ్రహ పున ప్రతిష్ట

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి:

టేకుమట్ల మండలం అంకుషాపురం సోమనపల్లి గ్రామ శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ సమయంలో ఆలయ కమిటీ సభ్యులు ఏనుగుల రాకేష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంలో ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడు హిందూ సంస్కృతిలో అత్యంత దేవుళ్ళు ఒకరు. అపారమైన బలం, అచంచలమైన భక్తి మరియు అపరిమిత జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన హనుమాన్ జీ హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడని అన్నారు. ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభయాంజనేయుని శుభ ఆశీస్సులు కలిగి సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ సందర్భంగా ఈ గొప్ప ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలోనికి ఆహ్వానం పలికినందుకు కమిటీ సభ్యులందరికీ ఉమ్మడి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలపడం
జరిగింది ఈ కార్యక్రమంలో సోమనపల్లి మాజీ సర్పంచ్ ఉద్దమారి మహేష్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, పిఎసిఎస్ డైరెక్టర్ మారం లింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, తోట వినయ్ సాగర్, పోతనవేన ఐలయ్య, దేవేందర్ పటేల్ వీసం బారత్ రెడ్డి, పిన్నింటి మణిదీప్ రావు, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మంద అశోక్, చిక్కుల రవి, మేకల శ్రీకాంత్, గిర వేణ కిరణ్, గిరవేణ భాస్కర్ అంతనగిరి దేవేందర్, మేకల అనిల్ ఉమ్మడి గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version