ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలి.

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలి.

⏩మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.

⏩కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.

⏩సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్ర.

⏩కర్రెగుట్టల నుండి బలగాలను వెనక్కి రప్పించాలి

⏩ఏజెన్సీ ఏరియాలో శాంతియుత వాతావరణం కల్పించాలి.

ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,దళిత రత్న కేదాసి మోహన్
కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

మావోయిస్టుల పై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మార్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న కేదాసి మోహన్ డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాశిబుగ్గలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అనంతరం కేదాసి మోహన్ మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. బండి సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.సహజ వనరులను, విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టె కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను హత్య చేస్తున్నారని ఆయన ఆరోపించారు.మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారని కర్రెగుట్టల నుండి పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాణాల హననాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ మంజాల బిక్షపతి గౌడ్, హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్,తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య,వివిధ ప్రజా సంఘాల నాయకులు పిట్టల రాజమౌళి,మంద నవీన్,గుండ్ల కాశీం,పారనందుల శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్ లో చదివించాలని భార్య పట్టుబట్టింది. భర్త రవి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ లో ఉంటూ చదివించుకుంటున్నది. రవి వరంగల్ కు వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటూ మన స్థాపానికి గురిచెందాడు.ఈ నెల 4 న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన గ్రామస్తుల కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజియంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందగా తల్లి కొమరమ్మ ఫిర్యాదు మేరకు శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

విద్యుత్ ఉద్యోగులకు భద్రత,.!

విద్యుత్ ఉద్యోగులకు భద్రత, అవగాహనా కార్యక్రమం నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన గుండి సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ ఉద్యోగులకు విద్యుత్ భద్రత అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమానికి విశేష అతిథిగా కరీంనగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మేక రమేష్ బాబు, ముఖ్యఅతిథిగా కరీంనగర్ రూరల్ డివిజనల్ ఇంజనీర్ ఎం.తిరుపతిలు హాజరై విద్యుత్ భద్రత సూత్రాలు, భద్రతపై ప్రతిజ్ఞ, పరికరాల ఉపయోగంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాలకు సంబంధించిన విద్యుత్ ఉద్యోగులు, మండలాల యొక్క ఏఈలు, సబ్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.!

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాదుని సత్యనారాయణ …..

నేటి ధాత్రి .,,……………..

 

 

జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండల గ్రామం ఎల్లారెడ్డి పల్లెలో చేనేత కార్మిక కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ మాట్లాడుతూ రోజంతా శ్రమించి కార్మికులకు రోజు 300 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని కావున ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు అయ్యేవిధంగా పని కల్పించాలని మరియు ఇందిరమ్మ గృహాలు హెల్త్ కార్డు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు వరంగల్ జిల్లాలో ఏర్పాటు అవుతున్న కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో పద్మశాలీలకు మరియు చేనేత కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిపి కల్పించాలని 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు పవర్ రూమ్ కార్మికులకు విద్యార్థి పింఛన్ వెంటనే మంజూరు చేయాలని మరియు మగ్గం వేసే ప్రతి కార్మికునికి జియో ట్రాక్ తో సంబంధం లేకుండా చేనేత మిత్ర కింద 2500 అందించి చేనేత కార్మికులకు ఆర్థిక ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు

సమస్యలపై స్పందించకపోతే.!

సమస్యలపై స్పందించకపోతే త్వరలో సమ్మె సైరన్..టీజీఈజెఎసి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ ఉద్యోగుల,గెజిటెడ్ ఆఫీసర్స్,ఉపాధ్యాయులు,కార్మికులు మరియు పెన్సనర్స్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ (టీజీఈజెఎసి) సూచనల మేరకు మంగళవారం రోజున బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించడం జరిగింది.అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహాయ సహకారాలు అందించి ఉద్యోగుల మరియు వారి కుంటుంబాలకు చేయూత అందించాలని కోరారు.57 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా శాసనసభ సభ్యుడు గడ్డం వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోని వెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతు సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరము టీజీఈజెఎసి మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి,జనరల్ సెక్రెటరీ కె.వనజా రెడ్డి,మంచిర్యాల జిల్లా టీజీఈజేఏసీ తరుపున ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 15 లోపు స్పందించకపొతే మే 15 నాడు నల్ల బ్యాడిలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన మరియు ధర్నాలు చేపట్టడం జరుగుతుందని,జూన్ 9 నాడు హైదరాబాద్ లో జరిగే మహా సదస్సులో మంచిర్యాల జిల్లా తరుపున ప్రతి ఉద్యోగి పాలుగొంటారని,వర్క్ టూ రూల్,పెన్ డౌన్,సాముహిక సెలవులతో ప్రభుత్యం పై ఒత్తిడి పెంచుతామని,సమ్మె సైరన్ మోగించక తప్పదనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ గడియారం శ్రీహరి,జనరల్ సెక్రెటరీ కె.వనజా రెడ్డి,రాష్ట సెక్రెటరీ పొన్న మల్లయ్య,డిప్యూటి సెక్రెటరీ జనరల్ భూముల రామ్ మోహన్,కో-చైర్మన్ శ్రీపతి బాపూరావు,చక్రపాణి,రవి,చెన్న కేశవులు,సుధాకర్, గోపాల్,వెంకటేశం మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం.!

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్,.!

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్, పై పని కార్మికుల సమ్మె

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
కేకే మహేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత కార్మికులకు
ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న మహిళా సంఘాల చీరలకు కార్మికులకు,మెరుగైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం మీటరుకు రెండు రూపాయలు యజమానులకు పెంచిన కూడా,సరియైన వేతనం ఇవ్వకుండా తగ్గించాలని చూస్తున్నా యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిని
రేపు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద
ధర్నా వై పని,పవర్లూమ్ కార్మికులు పాల్గొని ధర్నాలు విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగినది.
ఈరోజు అమృత శుక్ల కార్మిక భవనం వద్ద వార్పిన్ కార్మికుల జనరల్ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్,వార్పిన్, వై పని కార్మికులు,15 రోజుల క్రితం మహిళా సంఘాల చీరలకు కూలి పెంచాలని సమ్మె చేసిన సందర్భంగా, చేనేత జోలి శాఖ అధికారులు గత బతుకమ్మ చీరలకు ఏ విధంగా అయితే కూలి వచ్చిందో అంతకంటే మెరుగైన వేతనం కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి సమ్మె విరమించడం జరిగింది.

Warpin, Pyi workers

వారు హామీ ఇచ్చిన ప్రకారంగా కార్మికుల కూలి పెంచడం కోసం మీటరుకు రెండు రూపాయలు బట్ట ధర పెంచడం జరిగింది 32 రూపాయలు ఉన్నది 34 రూపాయలు పెంచడం జరిగింది.కార్మికుల కోసం రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన కూడా కార్మికుల శ్రమకు తగ్గ వేతనం ఇచ్చేందుకు యజమానులు మనసు రావడం లేదు కార్మికులు ప్రభుత్వం నుంచి పోరాడి సాధించినటువంటి కూలీ నుండి కూడా. యజమానులు లాభం పొందాలని చూస్తున్నారు
బతుకమ్మ చీరల కూలి ఇంతకుముందు పవర్ లోన్ కార్మికులకు 5.25 పైసలు ఒక మీటర్ కు కార్మికునికి కూలి ఉంటే ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తామని అంటున్నారు .వార్పిన్. వై పని కార్మికునికి గత బతుకమ్మ చీరల పనికంటే.విపరీతమైన పని భారం పెరిగింది చిన్నకోములు వస్తున్నాయి పోగులు పెరిగినాయి అయినా కూడా పెరిగిన పనికి ధర ఇవ్వడానికి. యజమానులు ఒప్పుకోవడం లేదు.. చేనేత జౌళి శాఖ అధికారులు కూలి నిర్ణయం చేయకపోవడం.యజమానులకు కూలి నిర్ణయించాలని బాధ్యతలు అప్పజెప్పడం వలన ఈ పరిస్థితి రావడం జరిగినది.అధికారుల యజమానుల మధ్య.కార్మికులు నష్టపోవడం జరుగుతుంది.అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కూలి సమస్య పరిష్కరించాలి లేని ఎడల
పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు
సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి
కోడం రమణ,అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి,మచ్చ వేణు,బుట్ల వెంకటేశం, దోమల రమేష్ ఐరన్ ప్రవీణ్,సామల శీను తదితరులు పాల్గొన్నారు.

డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు.!

డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు రామానంద్

పాకాల చేపలు మత్స్యకారులకు అవకాశం కల్పించాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మత్స్యకారుల జీవనోపాధి కోసం వారిని పాకాల సరస్సులో చేపలు పట్టుకునేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మత్స్యకార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఖానాపూర్ మండలానికి చెందిన పాకాల సరస్సులో 12 గ్రామాలకు సంబంధించిన దాదాపు 200 మత్స్యకారుల కుటుంబాలు తమ కులవృత్తిగా చేపలను పట్టుకొని జీవన ఉపాధి పొందుతున్నారని అన్నారు.గత 10 రోజుల క్రితం పాకాల సరస్సులో చేపలను పడుతున్న మత్స్యకారుల వలలను జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వలలను స్థానిక ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకారులకు కుటుంబాల సమస్యలు పరిష్కారం కోసం డిఎఫ్ఓ వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. అనాది కాలం నుంచి చేపలను పట్టే వలలను పట్టుకపోవడం వలన మత్స్యకారులు వారి ఉపాధిని కోల్పోవడం జరుగుతున్నదని కాగా విషయాన్ని వివరించడం జరిగిందన్నారు. గతంలో వారికి కేటాయించిన హద్దుల ప్రకారం వలలు వేసి చేపలు పట్టుకొని అవకాశాన్ని కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించిన డీఎఫ్ఓ గతంలాగే చేపలను పట్టుకొనే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పెండెం రామానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీను, ఎస్.అల్లోరు, లక్ష్మినారాయణ,జి. రమేష్, రాజేందర్,పి. వెంకన్న,రమేష్, ఎస్.రాజు, యాకన్న,రవి, మల్సుర్,జి. శ్యాంరాజ్, శేఖర్,వెంకటేష్, జితేందర్, వెంకన్న, రాజయ్య,కార్తీక్,బిక్షపతి, సారంగం,సారంగం,కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం.!

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి లండన్ వెళ్లడానికి అవసరమైన రూ.70 వేల విలువైన విమాన టికెట్ అందజేసిన ఎమ్మెల్యే

ఖండాంతరాలు దాటి చదువుకొని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాగా భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి :

 

 

 

ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి అండగా నిలవడంలో ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థినిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి కి లండన్ లోని గ్రీన్ విచ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం వచ్చింది.ఉన్నత చదువుల కోసం శతాక్షి దేశాలకు వెళుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి వచ్చింది.ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ముందుండే ఎమ్మెల్యే మేడిపల్లి శతాక్షికి ఆర్థిక సహకారం అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం కరీంనగర్ లోని తన నివాసంలో శతాక్షిని అభినందించి, స్వంత ఖర్చులతో కొనుగోలు చేసిన రూ. 70 విలువైన విమాన టికెట్ ను అందజేశారు. ఖండాంతరాలు దాటి చదివి, అంబేద్కర్ వలె భారతదేశానికి ఖ్యాతిని తీసుకురావాలని విద్యార్థినికి ఎమ్మెల్యే సూచించారు.విమాన టికెట్ను అందజేసిన ఎమ్మెల్యేకు శతాక్షీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా విద్యార్థినిని ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మండల ప్రజలు అభినందించారు.

గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో.

నేటి ధాత్రి ఎఫెక్ట్.. గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : ఆదివారం “వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు” అనే శీర్షికతో” నేటి ధాత్రి” లో వచ్చిన కథనానికి ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ స్పందించారు.మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి,సిబ్బందితో కలిసి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతోందని గ్రామస్తులను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్.!

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్…?

– నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగేనా.

కొల్చారం (మెదక్) నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇల్లు మంజూరులో రోజురోజుకు దుమారం రాజుకుంటోంది సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల లిస్టులపై ఆగ్రహం, అనుమానాలు, గంద రగోళం వ్యక్తమవుతోంది. పల్లె పల్లెలో కాంగ్రెస్ నేతలు మేము కష్టపడ్డాం ఓట్లు వేయించాం అధికారంలోకి వచ్చాం… ఇప్పుడు ఇల్లు తీసుకోవడం మా హక్కు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు గుసగుసలు చేస్తున్నారు. హస్తం పార్టీకి చెందిన నాయకులు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారని, మా అధికారం మా రాజ్యం అన్న తీరుతో ప్రజలపై ఆధిపత్యం చూపుతున్నా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాత్రం ఎవరైనా అర్హుల కాదని తేలితే లిస్టులు రద్దు చేస్తామని తప్పులు జరిగితే అధికారులపై చర్యలు తీసు కుంటామని చెబుతున్నారు. కానీ ఈ మాటలకూ కమిటీల చర్యలకూ పొంతన లేదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారుల సర్వేలకు గ్రామాల్లో అవ రోధాలు ఏర్పడుతున్నాయి. అధికారులు కూడా నిరుత్సా హంగా “చేస్తే చేస్తాం లేకపోతే వెళ్తాం” అన్న విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా చాలా చోట్ల సర్వేలు పూర్తవ్వకుండానే అధికారులు వెనుదిరు గుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో పార్టీ జెండా పట్టి
నవారికి పెద్దపీట పడుతోంది. పేదవారికి న్యాయం జర గాలంటే పార్టీ బలమే అర్హతాగా బంధుప్రీతి, డబ్బు, ఆర్థిక బలం ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలలో ఈ రచ్చ మరింత ఉధృతంగా ఉంది. స్వయంగా మంత్రులు చేసిన ప్రకటనలను లెక్క చేయకుండా స్థానిక కమిటీలు తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లు లిస్టుల్లో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండల నాయకులు కూడా సిఫార్సుల పేరుతో కమిటీలకు ప్రభావం చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇందిరమ్మ ఇల్లు లభించని పేదలు అర్హులు నిరాశతో ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలోనూ ఈ ఇళ్ల వ్యవహారాన్ని కేంద్రంగా చేసుకుని వర్గ పోరు ముదురుతోంది. కొంతమంది నేతలకు ఇల్లు రాకపోవడంతో పార్టీలో గొడవలు జరుగుతున్నాయిని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇల్లు ఇచ్చే వారు కాంగ్రెస్ నేతలే మరోవైపు అదే నేతల వల్లే గొడవలు జరుగుతు న్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ వ్యవహారంపై నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆర్హత కలిగిన పేదలకు గూడు కల్పిం చాలన్నదే చాలామంది అభిప్రాయం. వర్గీయతను బంధు ప్రీతిని తొలగించి నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగితేనే ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో.. ఇండ్లు లేనివారికి.. అధికార పార్టీ నాయకులతో అయితదా..? అధికారులు సర్వే చేసి నిజమైన అర్హులను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేసే చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే..

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 7 న జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు . ఉదయం 6 గంటలకు అమ్మవారి పల్లకి సేవ 6:45 నిమిషాలకు గణపతి పూజ 8 గంటల కు వాసవి మాత మూలవిరాట్ ఉత్సవమూర్తికి అభిషేకం అలంకారం 12 గంటలకు అమ్మవారికి ఒ డిబియ్యం మహోత్సవం మధ్యాహ్నం 1 గంటకు తీర్థి ప్రసాదాలు భోజనాలు సాయంత్రం 6 గంటలకు కలశం ఉత్సవమూర్తి ఊరేగింపు రాత్రి 8 గంటలకు ఉద్వాసన 9 గంటలకు దేవతమూర్తుల పుష్పాక్ష తలతో ఆశీర్వచనం ఉంటుందని వారు పేర్కొన్నారు వనపర్తి లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలో ఆర్యవైశ్య సంఘాలు రైస్ మిల్లర్స్ కిరాణా షాప్ యజమానులు ఏజెన్సీ వారు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వాసవి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు ఆత్మకూర్ కొత్తకోట పెబ్బేర్ ఇతర ప్రాంతాలలో కిరాణా షాపులు రైస్ మిల్లర్స్ బందు పాటించి పూజలో పాల్గొంటారని ఇదే సాంప్రదాయం వనపర్తి లో కిరాణం షాప్ లు రైస్ మిల్లర్స్ ఏజెన్సీ నిర్వాహకులు కొద్దిసేపు బందు పాటించి పూజలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి కోరారు

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ.

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ

మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు,పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు ఇచ్చాయని లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం కష్టతరం అవుతుందని, కార్మికుల సమష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం కాపాడుతుందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత,ఉపాధి భద్రత దూరమవడమే కాకుండా కార్మిక శాఖ కూడా నిర్వీర్యం కాబడుతుందని అందుకని కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని తదితర ప్రధానమైన డిమాండ్లతో మే 20 న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం,ఉడుత రవి,మచ్చ వేణు,గాజుల రాజు ,బూట్ల వెంకటేశ్వర్లు,అవధూత హరిదాసు,చింత కింది సుదన్,దోమల రమేష్ , శ్యామ్,సతీష్ ,సదానందం తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ.!

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా టీవీ సత్యం

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

 

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జగిత్యాల జిల్లా బండారి గార్డెన్లో నిర్వహించినటువంటి 18 మండలాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా టీవీ సత్యం ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మాట్లాడుతూ టీవీ సత్యం మన జగిత్యాల అధ్యక్షుడు కావడం మన అదృష్టమని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నిరుపేదలకు సబ్సిడీ ద్వారా దుగోడా మిషన్లు మరియు సంగడి మిషిన్లు విశ్వకర్మలకు ఇప్పించాలని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మరియు ప్రధాన కార్యదర్శి మద్దెనపల్లి నాగేష్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద దశరథం మరియు 18 మండలాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత.

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయానికి పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులు ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళంను మంగళవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన సింహద్వారా తలుపులకి అదనంగా అయ్యే మరో లక్ష రూపాయలని కూడా మేమే భరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులను గ్రామస్తులతో పాటు కులసంఘ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, పలువురు గ్రామస్తులు, కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్.

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్

సీఎం వ్యాఖ్యలే నిదర్శనం

ఇగ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లే

వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు

మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఓట్టిమాటేనని తేలింది

నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇగ రాదు

విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇగ ఇయ్యరని తేల్చేశారు

మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం

రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం

‘‘సంవిధాన్’’ చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమైనయ్

రాహుల్ సమాధానం చెప్పి తీరాల్సిందే…

రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ వన్నీ ఝూటా మాటలే…

నాగుపాములెక్క వంకర టింకరగా రోడ్డును నిర్మించింది కాంగ్రెస్సే

కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించింది కాంగ్రెస్సే

2035 వరకు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేయించుకున్నది కాంగ్రెస్సే

ఆ కాంట్రాక్ట్ తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా?

ఆ సమస్యను పరిష్కరిస్తే 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరిస్తామని 2022లోనే చెప్పలేదా?

ఇదిగో…ఆధారం

నిన్న కోమటిరెడ్డికి కూడా గడ్కరీ ఇదే విషయాన్ని చెప్పారు

అయినా లేఖల పేరుతో కేంద్రంపై బురద చల్లడం ఎంత వరకు కరెక్ట్?

ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ డ్రామాలాడుతున్నారు

సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించాల్సిందే

ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్…

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

 

 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయలేనని సీఎం తేల్చేశారు. ఇక వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇయ్యనట్లే. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యరని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలికొదిలేసినట్లే’’అని వ్యాఖ్యానించారు.

ఇగ తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం… దుకాణం బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి రేపటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం వినతి పత్రం తీసుకొని ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే…..

తెలంగాణ రాష్ట్రమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా. రాష్ట్రం దివాళా తీసింది. అని మాట్లాడటం సిగ్గు చేటు. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నరు. నిన్న సీఎం మాటలతో కాంగ్రెస్ పనైపోయింది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్.

 

Congress

 

సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మా భవిష్యత్తు ఏమిటనే భయంతో ఉన్నరు. ఇంటికి ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యను అధిగమించేందుకు యత్నిస్తరు. కానీ రాష్ట్రానికి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీసిండు. దేశం ముందు తలదించుకునేలా చేసిండు. యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం నిన్న పూర్తిగా మంట కలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇంతకంటే అవమానం మరొకటి లేనేలేదు.

ఢిల్లీకి పోతే అపాయిట్ మెంట్ కూడా ఇస్తలేరని చెప్పడం పచ్చి అబద్దం. ప్రధానమంత్రిని చాలా సార్లు కలిశారు. కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నడు. అయినా ఏం మాట్లాడుతున్నరు. ‘‘వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతరేమోననే భయంతో దగ్గరికి కూడా రానీయడం లేదు.’’అని అంటున్నడు. ఈ చెప్పులెత్తకపోవడమేంది? ఈ చెప్పులెత్తకపోవడమేంది? నాకైతే అర్ధం కాలే. కాంగ్రెస్ లో అట్లనే చేస్తరేమో. ఆ పార్టీ సంస్కృతి అదేనేమో. 2023 డిసెంబర్ లో, 2024 జులైలో, 2025 ఫిబ్రవరిలో కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కేంద్ర మంత్రులైతే లెక్కేలేదు. నిన్న కూడా గడ్కరీ కలిశారు. అయినా అపాయిట్ మెంట్ ఇయ్యడం లేదు. చెప్పులు ఎత్తకపోయేవాడిలా చూస్తున్నరనడం సిగ్గు చేటు.

 

Congress

సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే…. ఆయన పూర్తిగా చేతులెత్తేశారు. హామీలను అమలు చేయలేం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేం. ఇచ్చిన హమీలను అమలు చేయలేమని చెప్పిండు… ఇగ ప్రజలే ఆలోచించాలి. ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్పిండు. అయినా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చిండు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నడు. హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ సీఎం సీటెక్కంగనే చేతులెత్తేసిండు. ఇగ మీ ఖర్మ అని చేతులెత్తిసిండు. ఓట్లేసి గెలిపించినందుకు మీ తీట మీది అని అంటున్నడు. ఇకపై రైతులకిచ్చిన హామీలను అమలు చేయడు. వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇయ్యడు. మహిళలకు రూ.2500లు ఇయ్యరు. తులం బంగారం ఇయ్యరు.

మాట తప్పిన కాంగ్రెస్ ను ఇగ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాట ఇచ్చి తప్పినందుకు ఆ పార్టీ సంగతి తేలుస్తాం. ఏం ఆశించి ఎన్నికలప్పుడు హామీలను అమలు చేస్తామన్నరు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎందుకు బాండ్ పేపర్ రాసిచ్చారు? ఇప్పుడెందుకు చేతులెత్తేశారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ రాక్షసత్యం బయటపడింది. సంవిధాన్ పుస్తకం చేత పట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు చేతులెత్తేశారో సమాధానం చెప్పి తీరాల్సిందే. అప్పటిదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం. రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం. ప్రజలతో కలిసి అడ్డుకుని తీరుతాం.

ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏమీ చేయలేదంటరు. ఇచ్చేదంతా కేంద్రమే. అభివ్రుద్ధి జరుగుతున్నదంతా కేంద్ర నిధులతోనే. రోడ్ల కోసమే 1.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. రైల్వేల కోసం 32 వేల కోట్లు ఖర్చు చేసినం. వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లు ఇచ్చినం. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బాగా సాయం చేస్తుందని పొగుడుతారు. బయటకు వచ్చినంక నయాపైసా ఇయ్యడం లేదని రెండు నాల్కల ధోరణితో మాట్లాడతారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతటి దుర్మార్గులంటే… చేసిన తప్పులన్నీ చేసేస్తారు. పాపాలన్నీ చేస్తారు….అవన్నీ బయటకొస్తున్నయని తెలిసే సరికి ఎదుటి వాళ్ల మీద రుద్ది బయటపడాలనుకుంటరు. నిన్న ఓ మంత్రి రాజీవ్ రహదారిని 6 లేన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తడు. ఇదేం పద్దతి? అరే.. రాజీవ్ రహదారిని నిర్మించింది నాటి కాంగ్రెస్ పార్టీయే. ఆ కాంట్రాక్టర్ తో కలిసి కమీషన్లు కక్కుర్తి పడి రోడ్డును అడ్డదిడ్డంగా నిర్మించింది కాంగ్రెస్సే. భారీ ఎత్తున కమీషన్లు దండుకుంది కాంగ్రెస్సే…. అట్లాంటి పార్టీ నేతలు ఇయాళ ఏమంటున్నరు? రాజీవ్ రహదారిని 8 (ఎయిట్) లేన్ రోడ్డుగా మార్చండి… కేంద్రం పట్టించుకోవడం లేదని నిందలేస్తున్నరు. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకొకటి ఉందా? 2036 దాకా ఆ కాంట్రాక్ట్ కొనసాగేలా ఒప్పందం చేసుకుందే కాంగ్రెస్ పార్టీ.
అయినా సరే… తెలంగాణ ప్రజలపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అభిమానంతో రాజీవ్ రహదారిని 6 లేన్ జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పుడే కాదు. 2022లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇదే మాట చెప్పింది. ఇదిగో ఆధారం(3.6.2022న కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వు కాపీని చూపిస్తూ….). ‘‘హైదరాబాద్ నుండి కరీంనగర్ మీదుగా మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారినికి 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ తో చేసుకున్న ఒప్పందం ద్రుష్ట్యా ఆ సమస్యను పరిష్కరించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బులను సెటిల్ చేసుకోండి. అవసరమైతే గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ కింద లేదా జాతీయ రహదారిగానైనా విస్తరిస్తాం’’ అని చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ కాపీలను కూడా మీకు పంపిస్తా… చెక్ చేసుకోండి.
ఇదే కాదు… తెలంగాణ అభివ్రుద్ది కోసం కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసినం. రాబోయే 2 ఏళ్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే మరో 2 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనం. కలిసి పనిచేసేందుకు మేమెప్పుడూ సిధ్దమే. ఇకనైనా కేంద్రంపై బురద చల్లడం మానుకొని ప్రజల బాధలను అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నా…

ఆపరేషన్ కగార్ శాంతియుత చర్చల పై అభిప్రాయం…

అసలు చర్చలు అనేవి లేవని తుపాకులు పట్టుకున్న వారితో చర్చలు ఏంటి?
తుపాకులు వదిలేసి జనంలో కలవాలని దానికి చర్చలు ఎందుకు,సమస్య తీరిపోతుందని అన్నారు…

పహల్గాం దాడి పై వివరణ

భారతదేశ పౌరులపై దాడి చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా వదలమని త్వరలోనే దానికి సమాధానం తెలుస్తుందని అన్నారు…

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు నంది నరేష్, సీనియర్ నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, బుగ్గారెడ్డి, కంచర్ల పరుశురాములు, సళ్ళ సత్యం రెడ్డి, రావుల బాల్రెడ్డి, గాజుల దాసు, స్రవంతి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు రాలిన మామిడి తోటలను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను, మామిడి ఇతర పళ్ళ తోటలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జైపాల్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో చాలా గ్రామాల వద్ద ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యం వందలాది క్వింటాల అమ్మకం కోసం ఆరబోసారని వడగళ్ల వాన వల్ల పూర్తిగా వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయన్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్నారు.
రైతన్నకు చేతికి అందిన పంట వడగళ్ల వాళ్ళతో నీటిలో కలిసిపోయిందని, మామిడి ఇతర పళ్ళ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతన్న తీవ్ర ఆవేదనతో కృంగిపోతున్నాడని వెంటనే ప్రభుత్వం ప్రతి ఎకరాకు యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగపడేదని ప్రభుత్వ అసమర్థ విధానం వల్ల ప్రతి రైతు కూడా పరిహారాన్ని గ్యారంటీగా అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండ్లతోటలు పరిశీలించిన వారిలో పతెం రాజేశ్వర్ రెడ్డి, తాటిపెళ్లి లింగయ్య, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.!

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.

◆- అన్ని వర్ణాల వారు అర్హులే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాలలో ఉచిత ప్రవేశాలు జరుగుతున్నాయని సంస్థాపకులు, మహామండలేశ్వర్ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 14 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. వేదంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ వర్ణానికి చెందినవారైనా అర్హులేనని తెలిపారుప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో 90 మంది విద్యార్థులు కృష్ణ యజుర్వేదంలోని వివిధ కోర్సులు చదువుతున్నారని వారు పేర్కొన్నారు. ఆశ్ర.మంలో వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధన, భోజనం, వసతి కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ ఉంటుందని వారు అన్నారు. ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరోహిత్య షోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానంపై బోధన ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో వేదాంత, న్యాయ, యోగదర్శనం,ధ్యానం, భజన, గ్రంథపఠనం తదితర తరగతులు ఉంటాయని ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆచార్యులు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమైనట్లు వివరించారు. ఈ నెల 29న మౌఖిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 5న అడ్మిషన్లు జరుగుతాయని, జూన్ 12న లింగదీక్షతోతరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గలవారు దత్తగిరి ఆశ్రమ కార్యాలయాన్ని లేదా మరింత సమాచారం కోసం చరవాణి 9177259329, 86392 58008 ద్వారా సంప్రదించాలని కోరారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు.!

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్, ఏపీకె మెసేజ్ ల పట్ల తస్మాత్ జాగ్రత్త.

సైబర్ నేరాలకు గురైతే గంటలోపు(గోల్డెన్ అవర్) ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం చాలా ముఖ్యం.

జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,సులభంగా డబ్బులు సంపాదించాలానే అత్యశ చివరికి ఇబ్బందుల పాలు చేస్తుందని, సైబర్ నేరం జరిగిన గంట(గోల్డెన్ అవర్)లోపు 1930 నంబర్ కు లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో పిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా
మీమొబైల్ ఫోన్ కి ఆఫ‌ర్లు,డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని,అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే మెసేజ్ ల‌కు,కొత్త నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవ‌కాశం ఉన్నందున వాటి పట్ల స్పందించవద్దని,సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి & ఫ్లీప్ చేయడానికి విభిన్నమైన కార్యనిర్వహణతో బయటకు వస్తున్నారని వాటిని క‌ట్ట‌డికి అప్ర‌మ‌త్త‌త‌, అవ‌గాహ‌నే ఆయుధం అని తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల తీయని మాటల వలలో పడి వ్యక్తిగత విషయాలు, ఫోటోలు అస్సలు ఇవ్వవద్దని,వ్యక్తిగత విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటుగా ఉండవద్దని ,సోషల్ మీడియా అకౌంట్స్ కి తప్పని సరిగా ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని, సోషల్ మీడియా వేధికాకగా వేధిస్తే తక్షణమే పోలీస్ వారిని స్పందించాలని తెలిపారు.

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.

● లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
● కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
●.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
●. లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
●.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
●.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
●. పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
●.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
●.ఒక పోలీసు అధికారి పేరుతో మీకు ఫోన్ చేసి మీ ఆధార్ గురించి మాట్లాడితే స్పందించకండి ఇది ఒక స్కామ్..
●. మీరు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని చెబితే, స్పందించవద్దు.ఈది ఒక స్కామ్.
మీ కోసం లేదా మీరు పంపిన ప్యాకేజీలో డ్రగ్స్ కనుగొనబడిందని మీకు చెబితే ప్రతిస్పందించవద్దు.ఇది ఒక స్కామ్.
ఎవరైనా మీకు కాల్ చేసివారు పొరపాటున మీ UPI IDకి డబ్బు పంపారన తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే ప్రతిస్పందించవద్దు ఇది ఒక స్కామ్.

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్.!

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

డ్యూటీకి డుమ్మా కొట్టిన 15 మంది డ్యూటీ డాక్టర్లు…

డాక్టర్లు,నర్సుల హాజరు రిజిస్టర్ ని పరిశీలించిన కలెక్టర్…

బయోమెట్రిక్,హాజరు బుక్ పంపించాలని సూపర్డెంట్ ని హెచ్చరించిన కలెక్టర్…

రోగులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపిన కలెక్టర్…

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన ని జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ హాస్పటల్ ల్లో విజిట్ చేసే సమయానికి ఈ రోజు డ్యూటీలో ఉండాల్సిన 15 మంది డాక్టర్లు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ పూర్తి వివరాలు బయోమెట్రిక్ ,హాజరు రిజిష్టర్ తో వివరాలు జిల్లా కార్యాలయానికి పంపి,హాజరు కానీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపిన జిల్లా కలెక్టర్, హాస్పటల్ పరిసరాల్లో రోగులకు అందాల్సిన సేవలు పై అడిగి తెలుసుకుని తాగునీరు ఏర్పాటు చేయాలని మరియు ఒపీ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు…
హాస్పటల్లో డ్యూటీ చేస్తున్న నర్సులు హాజరు రిజిష్టర్ ని పరిశీలించి చికిత్సకు హాస్పటల్ వస్తున్న వారిపట్ల మర్యాదగా ఉండాలని రోగులకు సేవ చేస్తూ తగు గుర్తింపు తెచ్చ

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version