శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 7 న జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు . ఉదయం 6 గంటలకు అమ్మవారి పల్లకి సేవ 6:45 నిమిషాలకు గణపతి పూజ 8 గంటల కు వాసవి మాత మూలవిరాట్ ఉత్సవమూర్తికి అభిషేకం అలంకారం 12 గంటలకు అమ్మవారికి ఒ డిబియ్యం మహోత్సవం మధ్యాహ్నం 1 గంటకు తీర్థి ప్రసాదాలు భోజనాలు సాయంత్రం 6 గంటలకు కలశం ఉత్సవమూర్తి ఊరేగింపు రాత్రి 8 గంటలకు ఉద్వాసన 9 గంటలకు దేవతమూర్తుల పుష్పాక్ష తలతో ఆశీర్వచనం ఉంటుందని వారు పేర్కొన్నారు వనపర్తి లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలో ఆర్యవైశ్య సంఘాలు రైస్ మిల్లర్స్ కిరాణా షాప్ యజమానులు ఏజెన్సీ వారు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వాసవి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు ఆత్మకూర్ కొత్తకోట పెబ్బేర్ ఇతర ప్రాంతాలలో కిరాణా షాపులు రైస్ మిల్లర్స్ బందు పాటించి పూజలో పాల్గొంటారని ఇదే సాంప్రదాయం వనపర్తి లో కిరాణం షాప్ లు రైస్ మిల్లర్స్ ఏజెన్సీ నిర్వాహకులు కొద్దిసేపు బందు పాటించి పూజలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి కోరారు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కళ్యాణం
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు . కళ్యాణోత్సవంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి దంపతులు వాసవి క్లబ్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చిగుళ్ల పల్లి శ్రీనివాలు వనిత క్లబ్ అధ్యక్షురాలు సువర్ణ కె బుచ్చయ్య దంపతులు కూర్చున్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ కళ్యాణోత్సవం ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం పట్టణ ఆర్యవైశ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు వనపర్తి ఆర్యవైశ్య సంగం మాజీ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ లగిశేట్టి అశోక్ లగిశెట్టి రమేష్ లింగం హరినాథ్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బచ్చురాం కాంగ్రెస్ పార్టీ నేత చుక్కయ్య శెట్టి న్యాయవాది బాస్కర్ వజ్రాల సాయిబాబా వై వెంకటేష్ కొండ విశ్వనాథం పూరిరిసురేష్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ అమరవాది నరేందర్ ప్రధాన కార్యదర్శి కల్వ బూపేష్.కుమార్ శెట్టి కొండ ప్రశాంత్ ఆర్యవైశ్యులు బచ్చురాం ఎలిశెట్టి వెంకటేష్ వజ్రాల సాయిబాబా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి శ్రీమతి అనoత ఉమావతి కొండూరు మంజుల ప్రవీణ్ పిన్నo వసంత సహాయనిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం పట్టణ ఆర్యవైశ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈసందర్భంగా వాసవి క్లబ్ తరుపున సీతారాముల కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించామని వాసవి క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఒకప్రకటనలో తెలిపారు

రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ.

*ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్, ఎడిఫై స్కూల్ డైరెక్టర్ కు స్వాగతం పలికిన..

*రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 05:

తిరుపతి పట్నాలు
వీధిలో స్థానికంగా గల శ్రీ రేణుక పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవం -2025 మార్చి 14 నుండి మార్చి 16 వరకు జరగనున్నాయి .ఈ నేపద్యంలో ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్,ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణీత్ ను వార్షిక మహోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులు దిలీప్ అధ్యక్షతన ప్రణీత్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ శ్రీ రేణుక పరమేశ్వరి వారి మహోత్సవాలలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన శక్తి మేర మహోత్సవాలలో జరిగే అన్నదానానికి ఆలయ అలంకరణకు కావాల్సిన నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడిఫై స్కూల్ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version