CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ.

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ

మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు,పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు ఇచ్చాయని లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం కష్టతరం అవుతుందని, కార్మికుల సమష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం కాపాడుతుందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత,ఉపాధి భద్రత దూరమవడమే కాకుండా కార్మిక శాఖ కూడా నిర్వీర్యం కాబడుతుందని అందుకని కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని తదితర ప్రధానమైన డిమాండ్లతో మే 20 న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం,ఉడుత రవి,మచ్చ వేణు,గాజుల రాజు ,బూట్ల వెంకటేశ్వర్లు,అవధూత హరిదాసు,చింత కింది సుదన్,దోమల రమేష్ , శ్యామ్,సతీష్ ,సదానందం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version