CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ.

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ

మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు,పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు ఇచ్చాయని లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం కష్టతరం అవుతుందని, కార్మికుల సమష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం కాపాడుతుందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత,ఉపాధి భద్రత దూరమవడమే కాకుండా కార్మిక శాఖ కూడా నిర్వీర్యం కాబడుతుందని అందుకని కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని తదితర ప్రధానమైన డిమాండ్లతో మే 20 న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం,ఉడుత రవి,మచ్చ వేణు,గాజుల రాజు ,బూట్ల వెంకటేశ్వర్లు,అవధూత హరిదాసు,చింత కింది సుదన్,దోమల రమేష్ , శ్యామ్,సతీష్ ,సదానందం తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించారు.

సీనియర్ సిటిజన్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారిగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ, మహేష్.బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ చట్టం ప్రకారం సామాన్యులకు కూడా చట్టంలోని అంశములు తెలిసి ఫిర్యాదు చేయుటకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు. మరియు ఎస్పీ అనుమతితో ఆఫీసు ముందర పోస్టర్ను అతికించడం జరిగినది. అత్యధికంగా ప్రజలు తిరిగే ఆర్డిఓ. కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది. సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి అనుమతితో అక్కడ కూడా వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు, దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు , అంకారపు జ్ఞానోబా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

చిట్యాల, నేటిధాత్రి :

 

 

ఉగాది పండుగ పర్వదినాన పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా జరిగిన శ్రీ వివేకానంద సేవా సమితి ఫౌండర్ కే సంజీవరావు అధ్యక్షతన పుష్ప గ్రాండ్ పంక్షన్ హాల్ లో అవార్డ్ కవుల, కళాకారులుకు అవార్డు ప్రదానోత్సవం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని పత్తి పువ్వు పాట ఆవిష్కరణ చేయడం జరిగింది సమాజంలో మేలుకొలిపే పాటలు రాయాలని పేర్కొన్నారు పాట రచయిత దాసారపు నరేష్ బాగా రాసారని అభినందించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ఆర్ఎస్ నంద గాయకులు మధు రోజా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు ఎన్ఎస్ఆర్ ఫౌండర్ సంపత్ రావు , కవులు గాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version