రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత.

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయానికి పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులు ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళంను మంగళవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన సింహద్వారా తలుపులకి అదనంగా అయ్యే మరో లక్ష రూపాయలని కూడా మేమే భరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులను గ్రామస్తులతో పాటు కులసంఘ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, పలువురు గ్రామస్తులు, కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version