కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి
డీలర్ లపై కొన్ని కంపెనీల కపట ప్రేమ
ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మరియు డీలర్ ఫెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి
ఎరువుల రిటైల్ డీలర్లు వ్యాపారం,కష్టాల కడలిపై, నష్టాల నావలా తయారైందని గత రెండేళ్లుగా కొన్ని ఎరువుల కంపెనీలు,రిటైల్ డీలర్లకు ఇచ్చే మార్జిన్లు గణనీయంగా తగ్గించడంతో హోల్ సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకు అమ్మి రిటైల్ డీలర్లకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నవని పరకాల మండల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్ మరియు డీలక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రముఖ ఎరువుల కంపెనీలలో కొన్ని కంపెనీలు లాభా పెక్షే ధ్యేయంగా ఎరువుల కంపెనీ డీలర్ల పై కపట ప్రేమను చూపిస్తూ సీజను అన్సీజన్ పక్కనపెట్టి డిమాండేతర సరుకులకు ఎరువుల ఆర్డర్ తోపాటు లింకు రూపేనా కొన్ని రకాల సరుకులను తీసుకున్న హోల్ సేల్ డీలర్లుతో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయన్నారు.లింకులో తెచ్చుకున్న సరుకులు అమ్ముడుపోక వ్యాపారంలో లాభాలురాక డీలర్లు చితికి పోతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా బస్తాలు రిటైల్ డీలర్లు అమ్మే పరిస్థితిలో లేరని కొన్ని కంపెనీ లు ఇచ్చే మార్జిన్లు హమాలీ, డి డి ఖర్చులకే పోతున్నాయని ఇవన్నీ పోగా డీలర్లకు మిగిలేది శూన్యమే అని అన్నారు.ఎరువులపై గవర్నమేంట్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ కంపెనీ వారు వారి లాభాపేక్షణకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్నారని అధికారులు,కంపెనీ ప్రతినిధులు దీనిపై దృష్టి సారించి ఇచ్చే లింకులు రైతులకు ఇచ్చే విధంగా రూల్ పాస్ చెసి రిటైల్ డీలర్లకు న్యాయ
సమ్మతమైన విధంగా యూరియాను అందించాలని కోరారు.