కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి.

కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి

డీలర్ లపై కొన్ని కంపెనీల కపట ప్రేమ

ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మరియు డీలర్ ఫెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

 

ఎరువుల రిటైల్ డీలర్లు వ్యాపారం,కష్టాల కడలిపై, నష్టాల నావలా తయారైందని గత రెండేళ్లుగా కొన్ని ఎరువుల కంపెనీలు,రిటైల్ డీలర్లకు ఇచ్చే మార్జిన్లు గణనీయంగా తగ్గించడంతో హోల్ సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకు అమ్మి రిటైల్ డీలర్లకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నవని పరకాల మండల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్ మరియు డీలక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రముఖ ఎరువుల కంపెనీలలో కొన్ని కంపెనీలు లాభా పెక్షే ధ్యేయంగా ఎరువుల కంపెనీ డీలర్ల పై కపట ప్రేమను చూపిస్తూ సీజను అన్సీజన్ పక్కనపెట్టి డిమాండేతర సరుకులకు ఎరువుల ఆర్డర్ తోపాటు లింకు రూపేనా కొన్ని రకాల సరుకులను తీసుకున్న హోల్ సేల్ డీలర్లుతో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయన్నారు.లింకులో తెచ్చుకున్న సరుకులు అమ్ముడుపోక వ్యాపారంలో లాభాలురాక డీలర్లు చితికి పోతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా బస్తాలు రిటైల్ డీలర్లు అమ్మే పరిస్థితిలో లేరని కొన్ని కంపెనీ లు ఇచ్చే మార్జిన్లు హమాలీ, డి డి ఖర్చులకే పోతున్నాయని ఇవన్నీ పోగా డీలర్లకు మిగిలేది శూన్యమే అని అన్నారు.ఎరువులపై గవర్నమేంట్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ కంపెనీ వారు వారి లాభాపేక్షణకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్నారని అధికారులు,కంపెనీ ప్రతినిధులు దీనిపై దృష్టి సారించి ఇచ్చే లింకులు రైతులకు ఇచ్చే విధంగా రూల్ పాస్ చెసి రిటైల్ డీలర్లకు న్యాయ
సమ్మతమైన విధంగా యూరియాను అందించాలని కోరారు.

ప్రాణాయాపయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుని.!

ప్రాణాయాపయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుని ఇచ్చిన మాట 

తప్పకుండా నెరవేర్చిన కేటీఆర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ జీవనోపాధి నిమిత్తం సౌదీ వెళ్ళగా. సౌదీలో ప్రమాదవశావస్తు. 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో. తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా. ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దీనితో దిక్కులేని పరిస్థితులు మధ్య ఉన్న పరిస్థితిని ఇండియాలో గ్రామంలోని కుటుంబ సభ్యులకు తన దీన పరిస్థితిని వివరించారు. ఈ విషయమై మాజీ మంత్రి సిరిసిల్ల కెటి రామారావు దృష్టికి తీసుకురాగా. గ్రామంలో పర్యటించి. కుటుంబ సభ్యులను. ఓదార్చి వారికి మనోధర్యం చెప్పి. మీ బాబుని ఎలాగైనా ఇండియాకు తీసుకొచ్చి మంచి వైద్యం కల్పించే బాధ్యత నాది అని. సదురు గాయపడిన వ్యక్తితో సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడి తమకు కావాల్సిన వైద్య సహాయం అందిస్తానని తనకు ధైర్యం చెప్పిన కేటీఆర్. సదురు గాయపడిన వ్యక్తి తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి కేటీ రామారావును వేడుకున్నారు ఈ విషయమై మహేష్ కి ధైర్యం చెప్పి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు ఈ విషయమై. కేటీ రామారావు ప్రత్యేక చొరవ తీసుకొని మహేష్ నీ. ఇండియాకు తీసుకువచ్చి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇప్పిస్తానని అంగీకరిస్తూ సౌదీ లోని. కేటీఆర్ సంబంధించిన వ్యక్తులను పంపించి వారితో మాట్లాడి ఎలాగైనా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పంపించాలని అక్కడ వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా సౌదీలోని.ప్రభుత్వ ఆసుపత్రికి. హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ . యజమాన్యం లేఖ రాశారు. దీనిపై కేటీ రామారావు చెప్పినట్లుగానే సౌదీ నుంచి నేడు స్వదేశానికి చేరుకున్న మహేష్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మహేష్ ని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన స్థానిక నాయకులు. కెటి రామారావు చెప్పడంతో. మండలంలోని మాజీ ఎంపీపీ. భర్త. అయినా బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగెల రాజు.పాక్స్. చైర్మన్ బండి దేవదాస్. పార్టీ సీనియర్ నాయకులు తదితరులు మహేష్ ను తీసుకువెళ్లి కిమ్స్ ఆసుపత్రిలో. కేటీఆర్ ఆదేశాలతో ప్రత్యేక చొరవ తీసుకొని వైద్య సహాయ నిమిత్తం మెరుగైన వైద్యం చేయాలని. డాక్టర్ల బృందానికి కేటీ రామారావు ప్రత్యేకంగా తెలియజేశారు. మా కొడుకు. ప్రమాదవశావాస్తు గాయపడి. దిన పరిస్థితులు ఉన్న. మా వాడి పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇండియాకుతీసుకురావడానికి. కృషి చేసి. ప్రత్యేకంగా కిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్న మాజీ మంత్రి కేటీ రామారావుకి మా కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్.!

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్…?

– నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగేనా.

కొల్చారం (మెదక్) నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇల్లు మంజూరులో రోజురోజుకు దుమారం రాజుకుంటోంది సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల లిస్టులపై ఆగ్రహం, అనుమానాలు, గంద రగోళం వ్యక్తమవుతోంది. పల్లె పల్లెలో కాంగ్రెస్ నేతలు మేము కష్టపడ్డాం ఓట్లు వేయించాం అధికారంలోకి వచ్చాం… ఇప్పుడు ఇల్లు తీసుకోవడం మా హక్కు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు గుసగుసలు చేస్తున్నారు. హస్తం పార్టీకి చెందిన నాయకులు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారని, మా అధికారం మా రాజ్యం అన్న తీరుతో ప్రజలపై ఆధిపత్యం చూపుతున్నా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాత్రం ఎవరైనా అర్హుల కాదని తేలితే లిస్టులు రద్దు చేస్తామని తప్పులు జరిగితే అధికారులపై చర్యలు తీసు కుంటామని చెబుతున్నారు. కానీ ఈ మాటలకూ కమిటీల చర్యలకూ పొంతన లేదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారుల సర్వేలకు గ్రామాల్లో అవ రోధాలు ఏర్పడుతున్నాయి. అధికారులు కూడా నిరుత్సా హంగా “చేస్తే చేస్తాం లేకపోతే వెళ్తాం” అన్న విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా చాలా చోట్ల సర్వేలు పూర్తవ్వకుండానే అధికారులు వెనుదిరు గుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో పార్టీ జెండా పట్టి
నవారికి పెద్దపీట పడుతోంది. పేదవారికి న్యాయం జర గాలంటే పార్టీ బలమే అర్హతాగా బంధుప్రీతి, డబ్బు, ఆర్థిక బలం ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలలో ఈ రచ్చ మరింత ఉధృతంగా ఉంది. స్వయంగా మంత్రులు చేసిన ప్రకటనలను లెక్క చేయకుండా స్థానిక కమిటీలు తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లు లిస్టుల్లో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండల నాయకులు కూడా సిఫార్సుల పేరుతో కమిటీలకు ప్రభావం చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇందిరమ్మ ఇల్లు లభించని పేదలు అర్హులు నిరాశతో ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలోనూ ఈ ఇళ్ల వ్యవహారాన్ని కేంద్రంగా చేసుకుని వర్గ పోరు ముదురుతోంది. కొంతమంది నేతలకు ఇల్లు రాకపోవడంతో పార్టీలో గొడవలు జరుగుతున్నాయిని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇల్లు ఇచ్చే వారు కాంగ్రెస్ నేతలే మరోవైపు అదే నేతల వల్లే గొడవలు జరుగుతు న్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ వ్యవహారంపై నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆర్హత కలిగిన పేదలకు గూడు కల్పిం చాలన్నదే చాలామంది అభిప్రాయం. వర్గీయతను బంధు ప్రీతిని తొలగించి నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగితేనే ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో.. ఇండ్లు లేనివారికి.. అధికార పార్టీ నాయకులతో అయితదా..? అధికారులు సర్వే చేసి నిజమైన అర్హులను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేసే చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version