వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు రాలిన మామిడి తోటలను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను, మామిడి ఇతర పళ్ళ తోటలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జైపాల్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో చాలా గ్రామాల వద్ద ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యం వందలాది క్వింటాల అమ్మకం కోసం ఆరబోసారని వడగళ్ల వాన వల్ల పూర్తిగా వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయన్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్నారు.
రైతన్నకు చేతికి అందిన పంట వడగళ్ల వాళ్ళతో నీటిలో కలిసిపోయిందని, మామిడి ఇతర పళ్ళ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతన్న తీవ్ర ఆవేదనతో కృంగిపోతున్నాడని వెంటనే ప్రభుత్వం ప్రతి ఎకరాకు యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగపడేదని ప్రభుత్వ అసమర్థ విధానం వల్ల ప్రతి రైతు కూడా పరిహారాన్ని గ్యారంటీగా అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండ్లతోటలు పరిశీలించిన వారిలో పతెం రాజేశ్వర్ రెడ్డి, తాటిపెళ్లి లింగయ్య, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version