శుక్రవారం అర్ధరాత్రి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని పెద్దమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగలగొట్టి అందులోనీ డబ్బులు దొంగిలించినట్టు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. అలాగే వెంకటాపూర్, నార్లపూర్ గ్రామాల్లోనీ ఆలయాలలో చోరీకి ప్రయత్నం జరిగిందని కానీ ఏలాంటి నష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి (సివిల్ రైట్స్ డే) ఆర్ ఐ శివరామకృష్ణ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మొగుళ్ళపల్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ సూచించారు. మొగుళ్ళపల్లి మండలం కొరికి శాల గ్రామంలో శనివారం జరిగిన సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో వారు మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతోపాటు సమస్యలపై స్పందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకోవాలని, సక్రమంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్ ఐ శివ రామకృష్ణ ఏఎస్ఐ రాజేశం గ్రామాకార్య దర్శి రాజాశేఖర్ గ్రామస్థులు పాల్గొన్నారు.
వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బచ్చురాం
వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బచ్చు రామ్ నియామక పత్రము తీసుకున్నారు పత్రం తీసుకున్నట్లు తెలిసింది వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్షులుగా పోటీ చేయుటకు కోనూరు వెంకటయ్య బచ్చురాం నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు గోనూరు వెంకటయ్య వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంగంఅధ్యక్షులుగా ఏకగ్రీవం చేయనందుకు పోటీ నుoడి తప్పుకున్నట్లు తెలిసింది
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయం వాళ్ల నాన్న తాత గడ్డం ఆబి రెడ్డి గారు నిర్మించిన ముత్యాలమ్మ గుడి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోగా వారి వారసులు ముత్యాలమ్మ గుడి కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్డం వెంకటరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు మాట్లాడుతూ వారి తాతగారు కట్టిన గుడి శిథిలావస్థలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం చూసి జిర్గించుకోలేకపోయారు. గత సంవత్సరం లో మూడాలు ఉన్నందువలన ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేయలేదు. దీంతో శనివారం మూల సామ్రాట్ విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు. అనంతరం త్వరలోనే ముత్యాలమ్మ దేవాలయం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలందరికీ ముత్యాలమ్మ పండగను ఘనంగా నిర్వహించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ గత అయిదు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన పులాల కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర రావు, కుమార్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కుమార్ చనిపోవటం చాలా బాధాకరం అని తెలిపారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, BRS నాయకులు బోగం వెంకటేష్ మరియు నాయకులు ఉన్నారు
ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుపాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్ట పడ్డారని తెలిపారు.
క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలు అవుతుందని నిరూపించారని, పుష్కరాలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు.
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.
పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.
శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను.పూర్తి చేశారని అభినందించారు.
మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు.
సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే అందుకు కారణం మీరేనని, మీరు పడిన శ్రమ మీరు చూపిన చొరవ విజయానికి కారణం అయ్యాయన్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా కష్టపడ్డారని, పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం, మీడియా కవరేజి ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు.
యంత్రాంగం కృషి వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.
ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారని అన్నారు.
12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు. కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు. మీడియా మిత్రుల సహకారం గురించి.
ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని, ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఇది మొదటి అడుగు మాత్రమేనని రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
ఈ విషయంలో అసలు రాజీ పడబోమని, ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని అన్నారు.
ముఖ్యంగా యంత్రాంగం యొక్క పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం మీ వెంట ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందించారు
కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.
ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 లోపు యునిట్లు ఉచిత విద్యుత్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా…
కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందించారు.
ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు. అలాగే వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా యంత్రంగా ఆశాంతం కష్టపడి పనిచేసి సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసినట్లు తెలిపారు.
సరస్వతి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించిన యంత్రాంగం యొక్క కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి విజయానికి తోడ్పడ్డారని తెలిపారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పుష్కరాలు విజయవంతంగా కావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
కొమరపల్లి గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలని సూచించారు. కనువిప్పు కలిగి విధంగా విజయవంతం చేశారని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సిబ్బందిని అధికారులను ఆయన అభినందించారు.
రానున్న గోదావరి పుష్కరాలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని గోదావరి పుష్కరాలకు కుంభమేళాలను మైమరిపించే విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఏలాంటి లోటుపాట్లు రాకుండా చేసేందుకు సరస్వతి పుష్కరాల అనుభవం దోహదపడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యంత్రాంగమంతా ఒకతాటిపై నిలబడి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.
సమగ్ర ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రతి ఒక్కరిని అభినందించారు.
మూడు నెలల ముందు నుంచి సమగ్ర ప్రణాళికలు చేశామని 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను ప్రణాళికలు ప్రకారం నిర్వహించామని తెలిపారు.
రోజురోజుకు భక్తులు రద్దీ పెరిగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు తెలిపారు.
కాళేశ్వరం చిన్న గ్రామమైనప్పటికీ 30 లక్షలు కంటే ఎక్కువ మంది భక్తులు భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ 12 రోజులు రేయింబవళ్ళు విధులు నిర్వహించారని అన్నారు.
పుష్కరాలు ముందు పుష్కరాలు తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యమని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా 24*7 నిరంతరం విద్యుత్ అందించారని అభినందించారు.
వర్షాలు వచ్చి రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన 30 నిమిషాల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరించారని అభినందించారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బంది వడదెబ్బ నుండి భక్తులను కాపాడారని తెలిపారు.
పోలీస్ శాఖ వాహన రద్దీ పెరుగుతున్న క్రమంలో రాత్రికి రాత్తే పార్కింగ్ ఏర్పాటు చేసి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించారని తెలిపారు.
ఆర్డబ్ల్యూఎస్ నిరంతరాయ మంచినీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. 45 డిగ్రీలు కంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్నది, అనుకోకుండా అధిక వర్షపాతం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్లామని తెలిపారు.
దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరును ఆయన అభినందించారు.
దేవాలయంలో భక్తులు నియంత్రణ చర్యలు రెడ్డిని చాలా బాగా మేనేజ్ చేశారని అభినందించారు.
ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణలతో ముందుకు వెళ్ళామని సీఎస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ తదితరులు సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నుండి ప్రతిరోజు పర్యవేక్షణ చేశారని వారి సూచనలు విజయవంతానికి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు.
అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన జిల్లా అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
** వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ జమ్మికుంట: నేటిధాత్రి
ఈ రోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ పర్యవేక్షణలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సిబ్బంది ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను సిగరెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మే 31 తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వినియోగాన్ని తగ్గించుకుంటూ పోవడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పొగాకును వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో అంతేకాకుండా పొగాకును వాడడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన ర్యాలీలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ డాక్టర్ సంధ్యారాణి,డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ పరహానుద్దీన్,డాక్టర్ హిమబిందు,డాక్టర్ సంధ్య, మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ,కుసుమ కుమారి, సదానందం మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది నరేందర్ ,సరళ, వనజ, సావిత్రి ,సాజిదా పర్వీన్, రాధా మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు
గణపురం మండల కేంద్రానికి చెందిన పసునూటి రాజు కొమురమ్మ దంపతుల కుమారుడు పసునూటి వెంకటేష్ వయస్సు 30 సంవత్సరాలుఈరోజు వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు వెంకటేష్ మరణంతో ఘనపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ పోస్టుమార్టం నిమిత్తం పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శికాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు
వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి కి రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ పార్టీ టి పి సీసీ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి,కాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సి ఎం రేవంత్ రెడ్డిని ఒక ప్రకటనలో కోరారు .తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టిందని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నేత మండ్ల దేవన్న నాయుడు తెలిపారు నియోజకవర్గంలో బడా నాయకులమని చెప్పుకునే నాయకులను మట్టి కరిపించిన చిన్న మారుమూల గ్రామం సర్పంచ్ .ఎంపీటీసీ. ఎంపీపీ ఎమ్మెల్యే గా గెలిచిన తూడి మేఘా రెడ్డి కి ప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి కేటాయిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని మండ్లదేవన్న నాయుడు తెలిపారు
గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం లో ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గణపురం మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు గణపురం మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇ పరిస్థితి ఏర్పడిందని, ప్రతిసారి వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేసేవారని, ఇసారి మాత్రం అలా జరగలేదని, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్, పి పి సి ఇంచార్జి లకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని అన్నారు, గత ప్రభుత్వంలో కటింగ్ లపై మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు చెప్పాలని, కటింగ్ లపై స్పందించాలని పూర్ణచంద్రారెడ్డి అన్నారు వెంటనే ప్రభుత్వ గోదాములు తీసుకొని ధాన్యం నిలువ చెయ్యాలని, ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే , జిల్లా మంత్రి చొరవ తీసుకొని ధాన్యం సరఫరా వేగవంతం చేయాలని, ప్రభుత్వం మాటలు చెప్పకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు
న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం
హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
హన్మకొండ వరంగల్ నేటిధాత్రి (లీగల్):
శనివారం నాడు వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా పొగాకు నిరోధక అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో వరంగల్ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా అనేక విధాలుగా చెడుగా ప్రభావితం చేస్తుంది అని తెలిపారు. పొగాకు వినియోగ దారులలో అవగాహన కల్పించడం మరియు దానిని మానేయడానికి తగిన కారణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. పొగాకు కోరికను అధిగమించడానికి తన దృష్టి మరల్చుకొని పొగ రహిత ప్రాంతానికి వెళ్లడం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు సంగీతం వంటి ప్రత్యామ్నాయ సడలింపు పద్ధతులను ప్రయత్నించాలని సూచించారు.
legal services
హనుమకొండ ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు వినియోగం వలన కలిగే చెడు ప్రభావాలను వివరించారు. పొగాకు వాడకం గుండె మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధులకు దారితీస్తుంది, ధూమపానం గుండెపోటు లకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది కనుక పొగాకు కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు.ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో న్యాయమూర్తులు పొగాకు రహిత ప్రతిజ్ఞ ను చేయించారు.
ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ కోర్ట్ న్యాయమూర్తి నారాయణ బాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్, హనుమకొండ జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా.ఏ.అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ డా.మోహన్ సింగ్, డా. శ్రీనివాస్, పల్మనాలజిస్ట్ డా.పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు
శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు (ఆర్బివివిఆర్) నరహరి జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘ భవన నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రెడ్డి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మోకాలి నొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతు ఆపరేషన్ చేపించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను హైదరాబాద్ సోమాజిగూడలో వారి స్వగృహంలో డోర్నకల్ నియోజకవర్గ,మరిపెడ మండల విలేకరులు కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టాలని కోరారు.ఈ పరామర్శ కార్యక్రమంలో విలేకరులు గండి విష్ణు, అనంత రాములు,మూడవత్ రవి, కారంపూరి వెంకటేశ్వర్లు,సతీష్, కపిల్ గౌడ్ ,శ్రీశైలం,ఉప్పలయ,రవి నాయక్ పాల్గొన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వేణు
కరీంనగర్, నేటిధాత్రి:
సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యారంగంలో మార్పుల కోసం అనేక పోరాటాలు శ్రీనివాస్ చేశాడని, ఏఐవైఎఫ్ నాయకుడిగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి సమస్యలపై కూడా ఎన్నో ఉద్యమాలు నిర్మించాడని, అనంతరం సిపిఐలో జిల్లా కౌన్సిల్ సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా, కరీంనగర్ నగర కార్యదర్శిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి నేడు జిల్లా కార్యదర్శి స్థాయికి అతి చిన్న వయస్సులో ఎదగడం అభినందనీయమని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు పాల్గొన్నారు.
ఇటీవల నూతనంగా నర్సంపేట పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ రఘుపతి రెడ్డిని నర్సంపేట డివిజన్ వేమనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో ఘనంగా సన్మానించారు.అధ్యక్షులు చింతల కమలాకర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి, వీరమల్ల మాధవ రెడ్డి,బైరి తిరుపతి రెడ్డి,కే విజేందర్ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,గోలి శ్రీనివాస్ రెడ్డి,వీరమల్ల సంజీవరెడ్డి,ఉపేందర్ రెడ్డి,బిల్లా ఇంద్రా రెడ్డి,మాడుగుల మల్లారెడ్డి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,పెరుమళ్ళ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం లో పుణ్య శ్లోకలోకమాత రాణి అహల్య భాయ్ హోల్కర్ 300 జయంతి ఉత్సవాన్ని బిజెపి మండల అధ్యక్షుడు నరహరి శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి ఇరువురు మాట్లాడు తూ మహిళల సాధికారత కోసం వారి యొక్క ఉపాధి కోసం అదేవిధంగా చేనేత కార్మికుల కోసం అహల్యబాయి ఎంతో కృషి చేశారని అన్నారు.
మహేశ్వర్లో చేనేత పరిశ్రమ స్థాపన
అహిల్యాబాయి హోల్కర్ తన పాలనలో మహేశ్వర్ను చేనేత పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేశారు.
మహేశ్వర్లోని రాజవాడా గోడల డిజైన్లను ఆధారంగా తీసుకుని ప్రత్యేక మైన మహేశ్వరి సారీలను తయారు చేయాలని ఆమె ప్రేరణ ఇచ్చారు.
ఈ సారీల తయారీలో సూరత్, మండవ వంటి ప్రాంతాల నుండి నైపు ణ్యమైన చేనేత కార్మికులను మహేశ్వర్కు ఆహ్వానించారు.
ఈ విధంగా చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చి, స్థానిక మహిళలకు ఉపాధి అవకా శాలు కల్పించారు.
మహిళల కోసం ఉపాధి అవకాశాలు
మహేశ్వర్లోని రెహ్వా సొసైటీ 1978లో స్థాపించబడింది, ఇది అహిల్యాబాయి హోల్కర్ వారసురాలైన రిచర్డ్ హోల్కర్ మరియు ఆయన భార్య సాలీ హోల్కర్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది.
ఈ సొసైటీ ద్వారా మహిళలకు చేనేత శిక్షణ, ఉపాధి అవకాశాలు మరియు ఆరోగ్య సేవలు అందించబడు తున్నాయి. ప్రస్తుతం, ఈ సొసైటీ 250 మంది చేనేత కార్మికులతో కలిసి 110 లూమ్స్లో పనిచేస్తోంది.
చేనేత పరిశ్రమకు ప్రోత్సా హం
అహిల్యాబాయి హోల్కర్ చేనేత పరిశ్రమను ప్రోత్సహిం చడానికి వివిధ చర్యలు తీసు కున్నారు.
మహేశ్వర్లో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా, ఆమె స్థానిక మహిళ లకు ఉపాధి అవకాశాలు కల్పించారు.
ఈ విధంగా ఆమె చేనేత కార్మికుల సంక్షే మం కోసం కృషి చేశారు.
అహిల్యా బాయి హోల్కర్ చేనేత పరిశ్రమ అభివృద్ధి, మహిళల కోసం ఉపాధి అవకాశాలు కల్పించ డం మరియు చేనేత పరిశ్రమ కు ప్రోత్సాహం ఇవ్వ డం ద్వా రా చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్ర మంలో భూత అధ్యక్షులు బాసాని నవీన్, కోమటి రాజశేఖర్, బత్తుల రాజేష్, మునుకుంట్ల రాజశేఖర్, మరియు మహిళ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో మాజీ మేయర్ల పాత్ర ఏంటి?
అధికారిక కార్యక్రమాల్లో వేదికపై మాజీలను పిలిచినమున్సిపల్ కమిషనర్ పైచర్యలు తీసుకోవాలి
బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న కమిషనర్
_సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్ల పంపిణీ అధికారిక కార్యక్రమంలో వేదికపై బిజెపి పార్టీకి చెందిన మాజీ మేయర్ సునీల్ రావు, డి.శంకర్ కొంతమంది మాజీ కార్పొరేటర్లూ వేదికపై ఉండటం వేదికపై సీట్లలో కూర్చోవడానికి ఆహ్వానించిన నగరపాలక కమిషనర్ పైచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా బిజెపికి చెందిన నాయకులు వేదిక పై కూర్చున్న కమిషనర్ మౌనంగా ఉండటం ఉండి ప్రజలను అవమానపరుస్తున్నారని బిజెపి కార్యక్రమాల్లాగా అధికార కార్యక్రమాలు కమిషనర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు.
Municipal Commissioner
పదవి కాలం పూర్తయిన ఇంకా మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వేదికలపై పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో అరవై మంది కార్పొరేటర్ల పదవి కాలం పూర్తయిన బోర్డుపై ఉన్న వారి పేర్లు ఇంకా తొలగించడం లేదని వెంటనే వాటిని తీసేయాలని సురేందర్ రెడ్డి,రాజు ఈసందర్భంగా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
విత్తన దుకాణాలపై పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త దాడులు
మరిపెడ నేటిధాత్రి.
మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని పలు విత్తన దుకాణాలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శనివారం వారు మండల కేంద్రంలోని సూర్య తేజ విత్తన దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరసింగ్, ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందియాలని కోరారు. రైతులకు పలు సూచనలు చేశారు.లైసెన్స్ ఉన్న దుకాణాలలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు అవునో కాదు నిర్ధారించాలి. లూజ్ విత్తనాలు ఎవరు కూడా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి విత్తనానికి డీలర్లు వద్ద బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. విత్తన ప్యాకెట్టు కూడా పంట చివరి వరకు దాచుకోవాలని తెలిపారు. ఈ దారులలో మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరా సింగ్,ఎస్సై సంతోష్ పాల్గొన్నారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న
నర్సంపేట,నేటిధాత్రి:
భారత వ్యవసాయ రంగలో ఎం.ఎస్. స్వామినాథన్ సూచించిన సిఫారసులను అమలు చేసి, రైతాంగ, మరియు వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కృషి చేయటంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఎఐయుకెఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న డిమాండ్ చేశారు.
శనివారం నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నర్సంపేట డివిజన్ ప్రధమ మహాసభ కత్తుల కొమురయ్య అధ్యక్షతన జరిగింది.
మహాసభలను జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి ప్రారంభించగా, టియుసిఐ జిల్లా కార్యదర్శి అడ్డూరి రాజు, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహ రావు,జిల్లా అధ్యక్షులు ఆలువాల నరేష్ లు మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్, పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, దేశ వ్యవసాయంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.
దేశంలోని రైతులు 100 రకాల పంటలు పండిస్తుంటే కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి కేవలం 14 రకాల పంటలకే అరకొర
దేశంలో అత్యధిక మంది రైతులు పండించే వరి ధాన్యానికి గత రేటు కంటే కేవలం 69 రూపాయలే పెంచి మద్దతు ధరలు పెంచామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి, మొలకలొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారు చేస్తున్న కంపెనీలను , అవి అమ్ముతున్న షాపులను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత రబీ సీజన్ ప్రారంభంలో రైతాంగానికి ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని, సకాలంలో బ్యాంకులు రైతులకు వడ్డీ లేని రుణాలను అందించాలని కోరారు.
రైతు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని, భారత వ్యవసాయ రంగంలో ఎమ్.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహాసభ ప్రారంభానికి ముందు ఎ.ఐ.యు.కె.ఎస్. జెండాను చంద్రన్న ఆవిష్కరించారు.
డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక.
డివిజన్ స్థాయి నూతన కమిటీని ఎన్నుకోగా 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.డివిజన్ అధ్యక్షులుగా కత్తుల కొమురయ్య, ఉపాధ్యక్షులు ధార లింగన్న , ప్రధానకార్యదర్శిగా గట్టి కొప్పు రవి, సహాయ కార్యదర్శిగా మల్లేష్, కోశాధికారిగా బాబురావు, సభ్యులుగా చొప్పరి పైడి, గణపాక సుదాకర్, సింగన బోయిన కట్టయ్య, కోళ్ల రాజులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో గోపాల్, ఆలోచన, సమ్మన్న,రాధ, కోమల, మంజుల, స్వప్న, రాధిక ,సంజీవ, తిరుపతి, నర్సయ్య, వెంకన్న, రాజు, మల్లయ్య, కొమురయ్య, ఓం ప్రకాష్, శివలింగం, జంపయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం అల్పుగొండ సావిత్రి అధ్యక్షత జరిగింది.
జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని. పాపారావు మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువుల కోసం, జీలుగులు గతంలో 1000 రూపాయలు లోపు ఉండే, వాటి ని రెండు వెల వందచిల్లర రెట్టింపు కంటే ఎక్కువ శాతం పెంచారు.
ఇది రైతులపై భారం పడుతుంది.
వ్యవసాయ అధికారుల దాడుల్లో క్వింటాళ్లకొద్ది నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి, వాటిని కొనుగోలు చేసిన రైతులు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతారు, అప్పులు తెచ్చి పెట్టుబడిపెట్టి పంటలు పండక, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, నకిలీ విత్తనాలను విక్రయించే దళారులను అధినేయంగా శిక్షించాలని, ధాన్యం సేకరించిన రైతులకు కింటాకు 500బోనస్, రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఇందిరమ్మ రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడుల కోసం సాయం అందించాలని అన్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు.
కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెట్టుబడులకు కూడా సరిపోవని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని సీటు ప్లస్ అదనంగా 50% మద్దతు ధర చట్టం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గొడిశాల. వెంకన్న, మోడీ వెంకటేశ్వర్లు, జల్లే జయరాజు, నీరుటి.
జలంధర్, చందా వెంకన్న, సోమవరపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.