చోరీల పరంపరకు బ్రేక్ – జైల్లోకి నిందితుడు
#నెక్కొండ, నేటి ధాత్రి:
తోపనపల్లి మరియు బొల్లికొండ ఆయా చుట్టుపక్కల గ్రామాల్లో ఇటీవల వరుస చోరీలు జరగడంతో అప్రమత్తమైన నెక్కొండ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వ్యక్తి బానోతు అజయ్ కుమార్, వయస్సు 25, డ్రైవర్, బొల్లికొండ గ్రామానికి చెందిన అతని నుంచి 28 తులాల వెండి మరియు 1 తులం బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇతనిపై అనేక కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడిని మహబూబాబాద్ జైలు రిమాండ్ కు తరలించామని
నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
