రాజీ మార్గమే రాజమార్గం…

రాజీ మార్గమే రాజమార్గం

రమేష్ బాబు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేసుల్లోని ఇరువర్గాలు రాజీమార్గం ద్వారా పయనించి కేసులను పరిష్కారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహె.చ్ రమేష్ బాబు తెలిపారు. కోర్టు ప్రాంగాణాల్లో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరైనారు. వారు మాట్లాడుతూ రాజీ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కక్షిదారుల యొక్క విలువైన సమయం డబ్బు వృధా కాకుండా ఉంటుందని అన్నారు. చిన్నచిన్న పంతాలు పట్టింపులకు పోయి పగలు ప్రతీకారాలు పెంచుకొని కేసుల్లో ఇరుక్కుని పోలీసులు కోర్టుల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదని ప్రతి ఒక్కరూ సోదరాభావంతో మెలగాలని జడ్జి గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నాగరాజ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కాటారం డిఎస్పి సూర్యనారాయణ గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారీ, సీఐ నరేష్ కుమార్, పోలీసు అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version