విజయం కోసం కృషి చేసిన నాయకుని ఘనంగా సన్మానం
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి విజయం సాధించిన తర్వాత మొదటి సారి జహీరాబాద్ విచ్చేసిన సందర్భంగా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి కలిసి శాలువా పులమలలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ముల్తాన్,సిడిసి చైర్మన్ ముబీన్ జహీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి యువ నాయకులు నాగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నవాజ్ రెడ్డి, అభిలాష్ రెడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు,
