,,నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు ,,
,,అధికారుల నిర్లక్ష్యం ఆశ్రద్ధతో కనీసం మందులు సూదులు లేక జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సామాన్య పేద ప్రజలకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలం అయిపోతుంది,,
◆:- పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 500 నుండి 1000 మంది వరకు రోగులు వస్తూ ఉంటారు కానీ రోగులకు సేవలు చేయడంలో ప్రభుత్వాసుపత్రి పడకేయడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి తమ సమయాన్ని ధనమును కోల్పోతున్నారు ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లో కనీస మందులు లేక మందులుంటే సూదులు లేక చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు పేద రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు వీటన్నిటిని చూస్తూ ఆస్పత్రి ప్రధానాధికారులు నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తున్నారు దీని మూలంగా ప్రజా సంక్షేమం కోరే ప్రజా పాలనపై ప్రజలు రోగులు లో లోపల గుసగుసలాడుతున్నారు ఇంత మంచి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న అధికారుల ఆశ్రద్ధతో నిర్లక్ష్యంతో ఆస్పత్రి రోజు రోజు కు రోగులకు సేవలు అందించడంలో విఫలమైపోతుంది సామాన్య రోగులు డాక్టర్లు రాసిన చీటీలతో మందులు ఇంజక్షన్లు పొందుటకు వెళితే ఈ మందులు సప్లై లేవు పైనుండే రావడం లేదని నేరుగా ప్రజలతో చెబుతున్నారు అదేవిధంగా వృద్ధులు వెళ్లి సూది తీయించుకోవాలి అంటే కనీసం సూదులు లేక ప్రైవేట్ మెడికల్ షాపుల వెనకాల తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు జహీరాబాద్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్నది కాబట్టి జిల్లా మంత్రి ఆస్పత్రి పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందేలా స్థానిక ప్రజలు
సంతోషించేలా తగు చర్యలు తీసుకుంటారని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాము కాలానుగుణంగా వచ్చే వ్యాధులకు అంటే చర్మ వ్యాధులకు జలుబుకి దగ్గు జ్వరానికి సరైన మందులు లేవు కనీస మందులను అతి త్వరలో తెప్పించి స్థానిక పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జహీరాబాద్ ప్రజల పక్షాన జాగో తెలంగాణ ప్రశ్నిస్తుంది పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిజ్జ భాస్కర్ ఉస్మానియా యూనివర్సిటీ సభ్యులు మాదినం శివప్రసాద్ అరవింద్ ప్యార్ల దశరథ్ బాలు మొదలగు వారు పాల్గొన్నారు,
