ఓసీలకు ఉత్తమ శాఖలు..!

ఓసీలకు ఉత్తమ శాఖలు..!

-బీసీలకు ఉత్తుత్తి శాఖలు..!!

-17 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 7 మంత్రి పదవులు

-86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 8 మంత్రి పదవులా..!

-ఇదెక్కడి సామాజిక న్యాయం

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

రాష్ట్ర మంత్రివర్గంలో ఓసీలకు ఉత్తమ శాఖలను కేటాయించి..బీసీలకు ఉత్తిత్తి శాఖలను కేటాయించడం దేనికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా? అని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న అగ్రవర్ణాలకు అత్యంత కీలకమైన..బడ్జెట్ ఉన్న 7 మంత్రి పదవులను కేటాయించి..86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత లేని..బడ్జెట్ లేని 8 మంత్రి పదవులను కేటాయించడం ఇదెక్కడి సామాజిక న్యాయమంటూ నిలదీశారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే అందుకనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేపట్టి..రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ..చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. మిగిలి ఉన్న మిగతా 3 మంత్రి పదవులను బీసీలకు కేటాయించాలని, అదేవిధంగా మంత్రివర్గంలో మార్పులు చేసి ప్రాధాన్యత కలిగిన పదవులను బీసీలకు కేటాయించాలని వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి.

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి…

మందమర్రి నేటి ధాత్రి:

 

మందమర్రి సింగరేణి పాఠశాల కళ్యాణి ఖని లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. డ్రాయింగ్ మాస్టర్ లేక విద్యార్థులు వారి నైపుణ్యాన్ని కోల్పోతున్నారని సింగరేణి ప్రాంతంలో 9 సింగరేణి పాఠశాలలు ఉండగా ఒక్క పాఠశాలలోనే డ్రాయింగ్ టీచర్ కొనసాగుతున్నాడు. ఆ ఉపాధ్యాయుడు కూడా త్వరలో కొద్ది నెలలో రిటైర్డ్ కాబోతున్నాడని సింగరేణి పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ ఉపాధ్యాయులను నియమించాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. సింగరేణి కోల్ బెల్టు ప్రాంతమైన కొత్తగూడెం మణుగూరు ఇల్లందు భూపాలపల్లి గోదావరిఖని సెక్టార్ 2 సీసీసి మందమర్రి గోలేటి లో డ్రాయింగ్ టీచర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు న్యూస్ టుడే కు ఆవేదన చెప్పారు. ఎన్ ఈ పి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం విద్యార్థులకుబోధనతోపాటుసృజనాత్మకత విద్యను అందించుటకు చాలా దోహదపడుతుందిని డ్రాయింగ్ టీచర్లను నియమించాల్సిందిగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీకి విద్యార్థుల తల్లిదండ్రులు విన్నపం చేస్తున్నారు. సింగరేణి పాఠశాలలో ఎన్నోమార్పులు తీసుకొచ్చిన సెక్రెటరీ విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం డ్రాయింగ్ పోస్టును నియమించాలని సింగరేణి కార్మికులు విద్యార్థులు కోరుతున్నారన్నారు.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవితకు పునాదులు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ సెక్టర్ లో గల మందమర్రి నాలుగవ కేంద్రం,ఒకటవ జోన్ లోని మూడవ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని గురువారం రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓ హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లో నూతనంగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి అని, పిల్లల భవిష్యత్తుకు పునాదులు లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టి డబ్ల్యూ ఓ రోఫ్ ఖాన్, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు, పిల్లల తల్లితండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

— ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
• సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న డీఈవో రాధా కిషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో కూడా ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని ఆయన కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వచ్చే విధంగా చూడాలన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సంఘాన్ని యాదగిరి, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు నవీన్ రత్నాకర్, మోహన్, మమత, జ్యోతిలక్ష్మి ఉన్నారు.

ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

డ‌య్య‌ర్‌ను.. ఢీకోట్టిన‌ శంకరన్‌ నాయర్ స్టోరి

 

 

 

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2 (Kesari Chapter 2).

అక్ష‌య్ కుమార్ (Akshay Kumar), మాద‌వ‌న్ (R. Madhavan), అన‌న్యా పాండే Ananya Panday) కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా క‌ర‌ణ్ త్యాగ్ (Karan Singh Tyagi) ర‌చన‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు.

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ (Dharma Productions) బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ (Karan Johar) మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించారు.

హిస్టారిక‌ల్ కోర్ట్ రూ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సుమారు 50 రోజుల త‌ర్వాత‌ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వస్తే..

1919లోబ్రిటీష్ హాయాంలో జ‌రిగిన దారుణ మార‌ణ‌ కాండ‌ జ‌లియ‌న్ వాలా బాగ్‌కు మూల కార‌కుడైన అప్ప‌టి పంజాబ్ జ‌న‌ర‌ల్ మైఖైల్ ఓ డ్వేయ‌ర్ ఆ వార్త బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా చేస్తాడు.

ఆపై త‌మ‌కు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాల‌ని ఆ స‌మ‌యంలో వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడైన‌ అడ్వ‌కేట్ శంకరన్‌ నాయర్‌ (అక్షయ్‌ కుమార్‌)ను డ్వేయ‌ర్ కోరుతాడు.

కానీ ఆక్క‌డ జ‌రిగిన మార‌ణ‌కాండ విష‌యం తెలుసుకున్న ఆయ‌న అందుకు స‌సేమిరా అని అక్క‌డిక్క‌డే త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి డ‌య్య‌ర్‌పైనే కేసు వేస్తాడు.

 

Kesari Chapter 2

 

దీంతో జ‌న‌ర‌ల్ మ‌రో ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌ నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్‌.మాధవన్‌)ని ఆశ్ర‌యించ‌డంతో కేసు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.

ఈ క్ర‌మంలో శంక‌ర్ నాయ‌ర్‌, మెక్‌కిన్లేల మ‌ధ్య ఎలాంటి వాద‌న‌లు జ‌రిగాయి, నాటి దురాగ‌తాన్ని ఎలా బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేశారు.

చివ‌ర‌కు క‌థ ఎన్ని మ‌లుపులు తిరిగిందనే క‌థ‌క‌థ‌నాల చుట్టూ సినిమా సాగుతూ నాటి జ‌లియ‌న్ వాలాబాగ్ దుర్ఘ‌ట‌న‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యే విధంగా మూవీ న‌డుస్తుంది.

ఇప్పుడీ చిత్రం జూన్ 13 శుక్ర‌వారం నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో ఈ సినిమా చూడ‌లేక పోయిన వారు, మల్లీ చూడాల‌నుకునే వారు ఇప్పుడు ఎలాంటి స‌మ‌స్య లేకుండా ఇంటి ప‌ట్టునే ఉంటూ ఫ్యామిలీతో క‌లిసి ముఖ్యంగా పిల్ల‌ల‌కు నాటి జ‌లియ‌న్ వాలా బాగ్‌ ఘ‌ట‌న‌ను తెలియ‌జేస్తూ మూవీ వీక్షించ‌వ‌చ్చు.

డోంట్ మిస్ ఇట్‌.

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం.

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం

వరంగల్ తహశీల్దార్ మహ్మద్ ఇక్బాల్.

వరంగల్ నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ అన్నారు. దేశాయిపేట షాదిఖానాలో రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వరంగల్ మండల తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కవిత మాట్లాడుతూ భూముల్లో ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరంగా కొలతల్లో పాస్ పుస్తకాల్లో సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం భూమి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.

వరంగల్ మండల తహసిల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యల మీద కార్యాలయాల చుట్టు తిరుగుతున్న క్రమంలో అధికారులు ఒక్కోసారి అందుబాటులో లేకపోవడం వాళ్ళు వెనుక తిరగడం జరిగేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న భూభారతి చట్టం ద్వారా సమస్యలు ఉన్నచోటకే అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించడం సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇదొక మంచి అవకాశం అని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొనగా బాధితులు దరఖాస్తులు సమర్పించుకున్నారు.

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు.

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు

తహసీల్దార్ శ్రీనివాసులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కాసింపల్లి లో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు డిప్యూటీ తాసిల్దార్ అంజలి రెడ్డి అనంతరం భూ భారతి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ రామస్వామి సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ…

 

ప్రేమ‌లు హీరో నస్లెన్ మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా థియేట‌ర్లలో మంచి విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం ఓ రోజు ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చింది.

ప్రేమ‌లు హీరో నస్లెన్ (Naslen) మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana). తెలుగు క‌న్నా ముందే ఏప్రిల్ 10న కేర‌ళ‌లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సొంతం చేసుకుంది. గ‌తంలో టొవినో థామ‌స్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ కాంబోలో త‌ల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేర‌ళ‌ను షేక్ చేసిన ఖ‌లీద్ ర‌హ‌మాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. కేవ‌లం రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసి కేర‌ళ‌ నాట‌ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల త‌ర్వాత ముంద‌స్తుగా ప్ర‌క‌టించిన డేట్ క‌న్నా ఓ రోజు ఎర్లీగానే ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాకిచ్చింది.
సినిమా టికెట్లు

క‌థ విష‌యానికి వ‌స్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత‌, పెద్దోడు, చిన్నోడు, సెహ‌నావాస్ ఐదుగురు చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. అయితే ఇంట‌ర్ ఫలితాల్లో ఒక‌రు మాత్ర‌మే పాస్ అవుతారు.ఇక రెగ్యుల‌ర్‌గా కాలేజికి వెళ్లి చ‌దువుకోవ‌డం మ‌న వ‌ళ్ల‌ కానీ ప‌ని అని డిసైడ్ అయి కొత్త‌గా ఏదైనా ట్రై చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అందుకోసం బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కుల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఫ్లాన్ చేస్తారు. ఈక్ర‌మంలో స‌మీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడ‌మీలో శిక్ష‌ణ‌ కోసం చేరుతారు. ఈ నేప‌థ్యంలో ట్రైనింగ్ తీసుకునే క్ర‌మంలో వారు ఆ ప‌ని స‌రిగ్గా చేయ‌లేక, సీరియ‌స్‌నెస్ లేక‌ బాక్సింగ్‌ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట‌ చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు ఆపై డిస్ట్రిక్‌ లెవ‌ల్‌, స్టేట్ లెవ‌ల్ టోర్న‌మెంట్స్ ఆడాల్సి రావ‌డంతో చివ‌ర‌కు ఆ కుర్రాళ్లు ఏం చేశారు, చివ‌ర‌కు ఎలా ముగించార‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

కాగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫుల్ ఫ‌న్ మోడ్‌లోనే సాగుతూ ప్రేక్ష‌కుల‌కు తీరిక ఇవ్వ‌ని వినోదంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే మూవీలో ఫ‌లానా వాడు హీరో అని చెప్ప‌లేం. న‌స్లైన్ త‌ప్ప అంద‌రూ మ‌న‌కు ఏమాత్రం ప‌రిచ‌యం లేని మొహాలే అయినా ఐదుగురి పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది. వారి చుట్టే క‌థ తిరుగుతూ వారి న‌ట‌న‌, డైలాగులు, వ‌న్ లైనర్స్ వాటినన్నింటినీ మ‌రిచి పోయేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు ఫేమ‌స్ మీమ్స్ అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వ‌ద్ద జాత‌కం చూపించి చెప్పాలా వంటి వ‌న్ లైన‌ర్స్ తో కిక్ ఇస్తారు. ఫ‌స్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్‌, అమ్మాయిల‌కు సైట్ కొట్టే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌వ్విస్తారు.

ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ కోర్టులో యాక్ష‌న్ సీన్ల‌తో ఆటాడేసుకుంటారు. మిత్రులు ఒక్కొక్క‌రు బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లే ముందు తోటి మిత్రులు ఇచ్చే బిల్డ‌ప్‌లు, వ‌చ్చేపాట‌, డైలాగులు సీటులో కూర్చోనియ‌కుండా న‌వ్విస్తాయి. ఎక్క‌డా అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌ల‌కు చోటివ‌కుండా పాత్ర‌ల మ‌ధ్య సంద‌ర్భోచిత‌ కామెడీతో ఆల‌రిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో స‌న్నివేశం సినిమాకే హైలెట్‌. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 12 నుంచి సోనీల లివ్ (SONY LIV) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. చివ‌రి వ‌ర‌కు మంచిగా ఎలాంటి బాద‌ర‌బందీ లేకుండా హాయిగా మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెత‌క్కుండా కుటుంబం అంతా క‌లిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.

ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి వెన్నులో వ‌ణుకు పుట్టించే సినిమా!

ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి.. వెన్నులో వ‌ణుకు పుట్టించే సినిమా!

డోంట్ మిస్‌

 

 

 

 

 

 

 

 

 

 

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌.

 

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ థ్రిల్ల‌ర్ సినిమాలంటే త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌ (Naveen Chandra).

 

ఆయ‌న హీరోగా న‌టించిన చిత్రం ఎలెవ‌న్ (Eleven) గ‌త నెల‌లో..

 

 

మే16న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో మ‌స్ట్ వాచ్ మూవీగా పేరు తెచ్చుకుంది.

 

 

క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాలో రేయ హ‌రి (Reyaa Hari), అభిరామి (Abhirami) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

 

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుంద‌ర్ సీ వ‌ద్ద అనేక సినిమాల‌కు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన లోకేశ్ అజిల్స్ (Lokkesh Ajls) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీకి వ‌చ్చేసింది.

 

క‌థ విష‌యానికి వ‌స్తే..

 

అరవింద్‌ (నవీన్‌ చంద్ర) విశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా, స్మార్ట్‌ పోలీసుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటాడు.

 

అయితే నగరంలో జ‌రుగుతున్న వరుస హత్యల కేసుని డీల్‌ చేస్తున్న పోలీస్‌ అధికారి రంజిత్‌ (శశాంక్‌) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ బాధ్య‌త‌ అరవింద్‌ తీసుకుంటాడు.

 

ఆపై కూడా వ‌రుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంత‌కీ ల‌భించ‌వు.

 

 

ఈ క్ర‌మంలో చివ‌ర‌కు ఆరో హ‌త్య‌ దగ్గర ల‌భించిన‌ ఓ చిన్న క్లూతో కేసులో కదలిక వచ్చి ఒక్కొక్క‌రిగా హత్యకు గురైన వాళ్ల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

 

 

కానీ హత్యలు చేసేది ఎవరనే విష‌యం మాత్రం తెలియ‌దు.

 

చివ‌ర‌కు అరవింద్ ఏం చేశాడు.

 

హంతుకుడిని పట్టుకో గ‌లిగాడా?

లేదా అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి?

ట్విన్‌ బర్డ్‌ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి?

 

ఈ కథలో బెంజిమన్‌ పాల్‌, ఫ్రాన్సిస్‌ ఎవరు?

అన్నది కథ.

 

సినిమా ఆరంభమైన 10 నిమిషాల‌లోనే ఇన్వెస్టిగేష‌న్ మొద‌లై..

 

ప్రేక్ష‌కులకు స్పైన్ చిల్లింగ్ ఇస్తూ సినిమా ఆద్యంతం స‌స్పెన్స్ తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.

 

అంతేగాక సీరియ‌ల్ కిల్ల‌ర్ బ్యాగ్రౌండ్ స్టోరీ ఎమోష‌న‌ల్‌గా ట‌చ్ చేస్తుంది.

 

మ‌రి కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు సైతం ఆక‌ట్టుకుంటాయి.

 

ఇక ఫ్రీ ఇంట‌ర్వెల్‌కు ముందే కిల్ల‌ర్ బ‌య‌ట‌ప‌డ్డప్ప‌టికీ చివ‌ర్లో వ‌చ్చే ట్విస్టు సైతం గూస్‌బ‌మ్స్ తెచ్చేలా ఉంటుంది.

 

 

ఇప్పుడీ సినిమా జూన్ 13 శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనే కాకుండా మ‌రో మూడు ఓటీటీల్లో (ఆహా త‌మిళ్, టెన్ కొట్టా, సింప్లీ సౌత్‌) స్ట్రీమింగ్ అవుతోంది.

 

థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మంచి థ్రిల్ల‌ర్ చిత్రం చూడాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ఎలెవ‌న్ (Eleven) సినిమాను మిస్ అవ‌కుండా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

 

ఇదిలాఉంటే న‌వీన్ చంద్ర న‌టించిన మ‌రో థ్రిల్ల‌ర్ బ్లైండ్ స్పాట్ సైతం ఈ సినిమా విడుద‌ల రోజే థియేట‌ర్ల‌లోకి రాగా ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌ కూడా ఓకే రోజు రావ‌డ‌డం గ‌మ‌నార్హం.

 

సినిమా రివ్యూవ‌ర్ల‌పై.. ద‌య్యం ప‌గ‌!

సినిమా రివ్యూవ‌ర్ల‌పై.. ద‌య్యం ప‌గ‌! డీడీ నెక్స్ట్‌ లెవెల్ ఓటీటీకి వ‌చ్చేసింది

 

 

పాపుల‌ర్ త‌మిళ క‌మెడియ‌న్ సంతానం హీరోగా న‌టించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ ఓటీటీకి తెలుగులోనూ వ‌చ్చేసింది.

పాపుల‌ర్ త‌మిళ క‌మెడియ‌న్ సంతానం (Santhanam) హీరోగా న‌టించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ (DD Next Level).

సెల్వ రాఘవన్ (Selva raghavan), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), గీతికా తివారి (Geethika Tiwary) తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ (S. Prem Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

గ‌తంలో సంతానం న‌టించిన హ‌ర్ర‌ర్, కామెడీ సినిమా డీడీ రిట‌ర్న్స్ కి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మే16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప‌రాజ‌యం పాలైంది.

ఇప్పుడీ సినిమా నెల తిర‌గ‌కుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించే కృష్టమూర్తి (సంతానం) త‌రుచూ కొత్త సినిమాల రివ్యూలు ఇస్తూ అందరి మ‌న్న‌న‌లు అందుకుంటుంటాడు.

ఒకసారి ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరు కావాలని మూవీ ఫ్యార‌డైజ్ అనే థియేట‌ర్ నుంచి కృష్టమూర్తి, మ‌రికొంత‌మంది రివ్యూవ‌ర్స్‌కి ప్రత్యేక ఆహ్వానం వస్తుంది.

దీంతో ఈ సినిమా చూడ‌డానికి కృష్ణ‌మూర్తి అక్క‌డ చిక్కుకుపోతాడు.

గ‌తంలో త‌న రివ్యూ వ‌ళ్ల న‌ష్ట‌పోయిన నిర్మాత ద‌య్యంగా మారి ట్రాప్ చేసి ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలుసుకుంటాడు.

అక్క‌డ నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు గానీ సాధ్య ప‌డ‌దు..

పైగా ఆ థియేట‌ర్లో ర‌న్ అవుతున్న సినిమాల్లో వ‌చ్చి ప‌డ‌తాడు. 

ఈక్ర‌మంలో కృష్ణ‌మూర్తి ఆ సినిమాలో నుంచి ఆపై ద‌య్యం, థియేట‌ర్‌ నుంచి ఎలా బ‌య‌ట ప‌డ్డాడ‌నే నేప‌థ్యంలో సినిమా సాగుతుంది.

విన‌డానికి, చూడ‌డానికి ఈ మూవీ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ స్క్రీన్ ప్లే ప‌రంగాఫెయిల్ అయి సెకండాఫ్ కాస్త ఇబ్బంది పెడుతుంది.

అయినా ఒక సారి ఈ సినిమాను చూసేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ఇప్పుడీ చిత్రం జీ5 (zee 5) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హ‌ర్ర‌ర్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు ఒక‌సారి ఈ ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ (DD Next Level) చిత్రాన్ని ట్రై చేయ‌వ‌చ్చు.

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మొహమ్మద్ ముల్తాని
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌ పై జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మాచునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంఘటన అత్యంత బాధాకరం,సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కుప్ప‌కూలిపోవ‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని,ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ
వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డ వారు ఆ భ‌గ‌వంతుడిని దయతో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మనసారా కోరుకుంటున్నానని మరియు చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠ ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నట్లు పాఠశాల వ్యవసాపకులు సిద్దేశ్వరా నందగిరి మహా రాజ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు స్వీక రించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు ఇంతవరకు తమకు అందాయన్నారు .దరఖాస్తులు స్వీకరించిన పిదప ఈనెల 15న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు వెంటనే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు చేసుకో వాలని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ సూచించారు.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

గ‌త నెల మే23న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి మిశ్ర‌మ స్పంద‌న‌ను ద‌క్కించుకున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఏస్ (Ace). విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi), రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth), దివ్యాపిళ్లై (Divya Pillai), యోగిబాబు (Yogi Babu), ఫృథ్వీ రాజ్‌ (బ‌బ్లూ) (Babloo Prithiveeraj) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అర్ముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సామ్ సీఎస్ (Sam C. S), జ‌స్టిన్‌ప్ర‌భాక‌ర‌న్ (Justin Prabhakaran) సంగీతం అందించారు. అయితే పూర్ ప‌బ్లిసిటీ వ‌ళ్ల అటు త‌మిళంలో, ఇటు తెలుగులో ప్రేక్ష‌కుల‌కు చేరువ కాలేక ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షార్ చేసింది.

 

క‌థ విష‌యానికి వ‌స్తే.. బోల్ట్ క‌న్న‌న్ జైలు నుంచి రిలీజై కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు మ‌లేషియా వెళ‌తాడు. అక్క‌డ జ్ఞానందం సాయంతో అక్క‌డే ఉంటూ క‌ల్ప‌న అనే యువ‌తి హోట‌ల్‌లో ప‌ని చేస్తుంటాడు. మ‌రోవైపు మ‌లేసియా పోలీసుగా ప‌ని చేసే కామంధుడైన పెంపుడు తండ్రి రాజా దొరైతో ఇబ్బందులు ప‌డుతూ ఓ బ‌ట్ట‌ల షాప్‌లో ప‌ని చేస్తూ ఉంటుంది రుక్మిణి. అయితే త‌ను అడిగిన డ‌బ్బు ఇస్తే వ‌దిలేస్తాన‌ని చెప్ప‌డంతో ప‌లుచోట్ల ప‌ని చేస్తూ డ‌బ్బు కూడ‌బెడుతూ ఉంటుంది. సేమ్ అపార్ట్‌మెంట్‌లో ఉండ‌డంతో బోల్ట్ క‌న్న‌న్‌, రుక్మిణిల మ‌ధ్య ప‌రిచయం ప్రేగా మారుతుంది.

ఇదిలాఉంటే.. ఓ వైపు క‌ల్ప‌న హోట‌ల్ కోసం తీసుకున్న లోన్ డ‌బ్బులు తిరిగి క‌ట్ట‌లేక పోతుండ‌డం, మ‌రో వైపు రుక్మిణి తన పెంపుడు తండ్రి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి డ‌బ్బులు అవ‌స‌రం ప‌డ‌డంతో క‌న్న‌న్ వారి స‌మ‌స్య‌లు తీర్చేందుకు నిర్ణ‌యించుకుంటాడు. ఈక్ర‌మంలో లోక‌ల్‌గా అక్ర‌మ వ్యాపారుల మ‌ధ్య‌కు వెళ్లి క్యాసినో త‌ర‌హా గేమ్‌లు ఆడి ల‌క్ష‌ల్లో బ‌కాయి ప‌డ‌తారు. అయితే త‌మ డ‌బ్బు కోసం ప్రాణాలు తీసే వారి నుంచి హీరో ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, అస‌లు హీరో ఆ గేమ్‌లు ఎందుకు ఆడాడు, క‌ల్ప‌న‌, రుక్మిణిల స‌మ‌స్య‌లు తీర్చాడా, అక్క‌డ జ‌రిగిన బ్యాంక్ రోబ‌రికి క‌న్న‌న్‌కు మ‌ధ్య ఉన్న లింకేంటి అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ఆక‌ట్టుకుంటుంది.

 

అయితే. సినిమాలో త‌ర్వాత‌ ఏం జ‌రుగ‌బోతుంద‌నేది మ‌న‌కు ముందే తెలుస్తున్నా చూసే ప్రేక్ష‌ల‌కు మాత్రం ఎక్క‌డా బోర్ కోట్ట‌కుండా విజ‌య్ సేతుప‌తి, యోగిబాబు పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. వారి మ‌ధ్య వ‌చ్చే సంభాష‌ణ‌లు డార్క్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విల‌న్ల‌తో హీరో ఆడే గేమ్ కూడా స‌ర‌దాగా సాగుతుంది. బ్యాంక్ దొంగ‌త‌నం, క‌న్న‌న్ వేసే ఎత్తులు అన్నీ మంచి క్యూరియాసిటీని క‌లుగ జేస్తాయి. ఇప్పుడీ సినిమా జూన్ 13, శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి ఫ‌న్ రైడ్ మూవీ చూడాల‌నుకునే వారికి ఈ ఏస్ (Ace) సినిమా మంచి ఆఫ్సన్‌. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త లేకుండా సినిమా అలా స‌రదాగా సాగి పోతూ ఉంటుంది.

 మలయాళ డైరెక్టర్ తో అల్లు అర్జున్.

 మలయాళ డైరెక్టర్ తో అల్లు అర్జున్…

 

అల్లు అర్జున్( Allu Arjun), పుష్ప(Pushpa) తరువాత నుంచి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ..  దీని తరువాత అంతకుమించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు. దీనికోసం హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్(Trivikram) సినిమాను పక్కన పెట్టి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. జవాన్ తో అట్లీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు  వీరిద్దరూ కలిసి 2500 కోట్ల టార్గెట్ ను రీచ్  అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్( Allu Arjun), పుష్ప(Pushpa) తరువాత నుంచి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ..  దీని తరువాత అంతకుమించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు. దీనికోసం హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్(Trivikram) సినిమాను పక్కన పెట్టి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. జవాన్ తో అట్లీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు  వీరిద్దరూ కలిసి 2500 కోట్ల టార్గెట్ ను రీచ్  అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత అయినా బన్నీ.. త్రివిక్రమ్ తో  సినిమా చేస్తాడు అనుకుంటే పొరపాటే. ఎవరు ఊహించని డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే బన్నీ వాస్ .. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద అనౌన్స్ మెంట్ రాబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే అది త్రివిక్రమ్ మూవీ కాదని కూడా  క్లారిటీ ఇచ్చాడు.  అసలు ఇలాంటి ఒక కాంబోను ఊహించలేమని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఆ కాంబో  ఏంటి.. ? బన్నీ ఏ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడా.. ? అంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టి ఎట్టకేలకు ఆ డైరెక్టర్ ఎవరో కనిపెట్టినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ తో పనిచేసి విజయాలను అందుకునం బన్నీ.. ఇప్పుడు మలయాళ హిట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడట. ఆ మలయాళ డైరెక్టర్ ఎవరో కాదు.. బాసిల్ జోసెఫ్(Basil Joseph). మలయాళంలో డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి విజయాలను అందుకుంటున్న బాసిల్ తోనే అల్లు అర్జున్ జతకట్టినట్లు తెలుస్తోంది. జయ జయ జయ జయహే సినిమాతో బాసిల్ తెలుగువారికి దగ్గరయ్యాడు. ఆ తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగువారిని ఫిదా చేసింది. సూక్ష్మ దర్శిని, పోన్ మాన్, మరణ మాస్ లాంటి  సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన మిన్నల్ మురళీ 2021 లో రిలీజ్ అయ్యి  భారీ విజయాన్ని అందుకుంది. 

దాదాపు నాలుగేళ్ళ తరువాత బాసిల్.. అల్లు అర్జున్ కోసం ఒక కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి..  కేరళలో ఎలాంటి ఫ్యన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ అయితే.. అక్కడ వారికి మల్లు అర్జున్. ఎవరి సినిమాలైనా మలయాళంలో ఆడతాయో లేదో తెలియదు కానీ, బన్నీ సినిమా మాత్రం కచ్చితంగా మలయాళంలో ఆడితీరుతుంది. ఇప్పుడు మలయాళ డైరెక్టర్ తోనే బన్నీ సినిమా చేస్తున్నాడు అంటే వారికి పండగే అని చెప్పాలి. ప్రస్తుతం  స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, మరో నాలుగు నెలలో అధికారికంగా మేకర్స్  ఈ సినిమాను ప్రకటించనున్నారట. ఏదిఏమైనా బన్నీ స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం సూపర్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

వనజీవి స్ఫూర్తితో.

వనజీవి స్ఫూర్తితో.

“నేటిధాత్రి”, హైదరాబాద్.

ఇటీవలే మరణించిన పద్మశ్రీ వనజీవి రామయ్య ని స్ఫూర్తి గా తీసుకొని వాశ్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ప్రజాపతి ఒక సంవత్సరంలో లక్షమొక్కలు నాటాలనే సంకల్పం తీసుకున్నారు ఈ లక్ష మొక్కల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారిక నివాసంలో మొదటి మొక్కను నాటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటి మొక్కను నాటిన మంత్రి తన స్వంత నియోజక వర్గమైన ధర్మపురి నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని నరేష్ ప్రజాపతి ని కోరారు.

 

 

Inspired by wildlife.

బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కవి గాయకులు మిట్టపల్లి సురేందర్, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త జిఆర్కే రెడ్డి, గాజుల రవికుమార్ ఎడ్యుజోన్ సీఈఓ లు పాల్గొన్నారు

విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, పాత మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న జి యు పి ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన నూతన పుస్తకాలు, దుస్తులను కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు శానవాజ్ ఖాన్, గోరటి శ్రీనివాసులు,నాయకులు సాబేర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 18వ పట్టణ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్, సిపిఐ నాయకులు గురుజపెల్లి.సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఆదివారం సింగరేణి కమ్యూనిటీ హాల్ సుభాష్ కాలనీలో పట్టణ 18వ మహాసభను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.పట్టణ మహాసభకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అని తెలిపారు.
పట్టణంలోని 30 వార్డులలో సుమారు 250 మంది డెలిగేట్స్ తో ఈ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలో పట్టణ అభివృద్ధి కోసం, అర్హులైన వాళ్లందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్, వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళ పింఛన్ల కోసం ఈ మహాసభలో పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.
భూపాలపల్లి పట్టణం మీదగా నడుస్తున్న లారీలను అదుపు చేసి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలను మేధావులు,కార్మికులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాతంగి రాంచంధర్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, అస్లాం, రవీందర్, శాంతి, శేఖర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు.

సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు…

సువిశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన…

ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ…

ఇంగ్లీష్ మీడియంలో బోధన…

పుష్టికరమైన మధ్యాహ్న భోజనం…

డిజిటల్ క్లాసు రూములు…

ఉచిత యూనిఫాం అందజేత

నేటి ధాత్రి గార్ల:

ప్రైవేటు పాఠశాలల్లో లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజ్ఞపాటవ పోటీలకు ఒత్తిడి లేని శిక్షణ ప్రభుత్వ బడులల్లో ఇస్తున్నట్లు ఎంపీడీవో మంగమ్మ, ఎంఈఓ వీరభద్రరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా పునః ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ,బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు.సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా వారి తల్లిదండ్రులకు ప్రోత్సహించాలని సూచించారు.నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని వారు అన్నారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ప్రాథమిక పాఠశాల పెద్దకిష్టాపురం లో సు విశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు మరియు స్పోర్ట్స్ డ్రస్సులు అందజేయడమే కాకుండా ఉచిత పాఠ్య పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.సర్కారు బడిలో సన్నబియ్యంతో కూడిన రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరియు రాగి జావా వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం లో బోధిస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ద్వారా ప్రగతిని అంచన వేస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూన్నట్లు తెలిపారు. గ్రామంలోని బడియిడు పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ తద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగుగులోత్ వీరభద్రం, బానోత్ చంద్రమోహన్, టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాలోత్ శివ నాయక్,గంగావత్ రాంసింగ్ నాయక్,ఉపాధ్యాయులు బి. రామ, నాగేశ్వరావు,వేణుకుమార్, రాంబాబు,రాజ్ కుమార్, స్వాతి, మాలోత్ సురేష్, గంగావత్ సంత్ర, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి

సిరిసిల్ల టౌన్ ( నేటి ధాత్రి ):

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్ష్మణ్ ప్రింటర్స్ లో డాక్టర్ జ నపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి ఘనంగా జరిగింనది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహితి సముద్రుడు మేరు నగ ధీరుడు తెలుగు వెలుగును, తెలుగు కవితను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కడలి దాటించిన తొలి తెలంగాణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె, అంటూ ఘన నివాళి సమర్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకునూరి శంకరయ్య పూర్వ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ సినారే ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు నాటక ప్రదర్శనలో అతని చేతులు మీదుగా బహుమతి అందుకున్న జ్ఞాపకం ఉందని, వారి సినీ పాటలు కవిత్వము జగము నకు తెలిసిన మహానుభావులు అన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ గులేబకావళి కథలో గుబాలింపజేసే సాహిత్యాన్ని విరచించి, సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి సినారే,అని అన్నారు. సహాధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ సి నారాయణ రెడ్డి ప్రముఖ కవిగా గాయకుడిగా బోధకుడిగా గురువుగా మరి సాహిత్యంలో ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ కవిగా మరియు సినిమాకు రంగంలో పాత్రకు తగ్గట్టుగా పాటలు రాసి మన్నన పొందినాడు. మన తెలంగాణకే ఒక మనీ మకుటమై నిలిచినారు అని అన్నారు. ఉపాధ్యక్షులు బూర దేవానందం కవితా గానం ఆలాపించారు. అంకారపు రవి తన ఘనంగా కవితను సినరే కు అంకితం ఇచ్చారు.ముడారి సాయి మహేష్ కవితలు ఆలపించారు.గుండెల్లి వంశీ తన కవితను ఆలాపించారు. దొంత దేవదాసు, ఏనుగుల ఎల్లయ్య,అంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రజా దవాఖాన అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా.

పల్లె ప్రజా దవాఖాన-అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా…

గార్ల నేటి ధాత్రి:

ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు నిధుల వెచ్చించి సుందరమైన సువిశాలమైన అన్నీ వసతులతో కూడిన పల్లె దవాఖానలను కట్టించి,సరిపడ సిబ్బందిని నియమించి,జీతాలు,పనిముట్లు,వైద్య సామాగ్రి,మందులు,మెయింటనెన్సు అలవెన్సులు ఇచ్చి ప్రజలకు కనీస ఆరోగ్య అవసరాలు తీర్చజూస్తుంటే స్థానిక గార్ల మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానతో మాత్రం తమకు ఏమాత్రం ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మీ సేవే మా లక్ష్యమని-మేమున్నాము,మీ రు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకొమ్మని ప్రజలకేనాడు నమ్మకం కల్గించిన పాపాన ఇక్కడి సిబ్బంది పోలేదంటున్నారు.ఈ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ నియామకమైనప్పటి నుండి నేటికీ స్థానికంగా నివాసముండక, అందుబాటులో అసలుండక,ఖమ్మం నుండి నిత్యం అప్ అండ్ డౌన్లు చేస్తుంటారు.విచిత్రమైన విషయం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రిలో ఒక్క డాక్టరు కూడా పనిచేయడం లేదు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముంచుకోస్తున్న వేళ గ్రామంలో విషజ్వరాలు,డెంగీ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.ఇక్కడి వైద్యులు, సిబ్బంది డియం అండ్ హెచ్ వో మెడికల్ క్యాంపులనేర్పాటు చేసినపుడు మాత్రమే కనపడి,మిగతా వేళల్లా అపరిచితమే అన్నట్టుంది.వేలకు వేల జీతాలు తీసుకుంటూ,ఏజన్సీ పల్లె ప్రజల అనారోగ్యాలను బేఖాతరు చేస్తూ వైద్య వృత్తికే కళంకం చేస్తున్నారని ప్రజలు నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.ఏదో ఒక సమయంలో హెల్మెట్ల ధరించుక వచ్చి,రిజిష్టరులో సంతకాలు చేసుకుని వెళుతున్నా,గిరిజన ప్రజలింకా చోద్యం చూస్తూనే ఉన్నారు.ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలు,సిరంజీలు,వైద్య వేస్టులు, కుళాయి లేని నల్లా కనెక్షను నీటితో నిండే నిరంతర మురికి గుంటలతో పరిసరమంతా మురికిమయమైనా ఈ సిబ్బందికి మాత్రం పట్టదు.కురుస్తున్న వర్షాలకు పల్లెలో ఇంటికో ముగ్గురు చొప్పున విషజ్వరాల బారినపడి గతంలో గార్ల, మహబూబాబాద్, ఖమ్మం వంటి పట్టణాలకు గిరిజనులు దారులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సూదిమందుకి గానీ మందుబిళ్ళకి గానీ ఆసరా లేక,ఏనాడూ తిమోఫాస్ వంటి దోమల మందులు పిచికారీ చేయక,దోమతెరల పంపిణీ చేయక,ఫ్రైడే-డ్రైడేలు,శానిటేషన్ నిర్వహించక,పేదలకు నెలవారీ బి.పి,షుగరు మాత్రలు ఇవ్వక,రోగాల నివారణపై ప్రజల చైతన్యపర్చని ఈ దవాఖాన గానీ,ఈ సిబ్బంది గానీ మాకెందుకని పల్లె ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దేనికీకొరగానిదానిగా ఆస్పత్రిని మార్చి,కర్తవ్యాన్ని మర్చిన ఈ సిబ్బందిమాకొద్దని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.అలాగే ఇక్కడి సిబ్బంది పనితీరుపై ప్రజాక్షేత్రంలో సమగ్ర విచారణ జరిపి,వారు ఏమాత్రం పనిచేయక తీసుకున్న జీతాలను,ప్రభుత్వం రికవరీ చేసి,తగు శాఖాపరమైన చర్యలు తీసుకుని,వారిని స్థానచలనం కలిగించాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version