ప్రేక్షకులను మెప్పించే కథలతో..

ప్రేక్షకులను మెప్పించే కథలతో

విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన సొంత బేనర్‌ భీమవరం టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న కొత్త…

విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన సొంత బేనర్‌ భీమవరం టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రాల విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘మా బేనర్‌పై విభిన్నమైన కథాంశాలతో పలు చిత్రాలను రూపొందిస్తున్నాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌, అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ, లవ్‌ స్టోరీ… ఇలా ప్రేక్షకులను మెప్పించే విభిన్న కథాంశాలతో మొత్తం పదిహేను వరకూ స్ర్కిప్టులు సిద్ధం చేశాం. ఈ చిత్రాలను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళతాము. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని రామసత్యనారాయణ తెలిపారు.

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం..

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం

‘మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తుల కాలంనాటి కథే ‘హరిహర వీరమల్లు’. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లాము. హరిహర అంటే…

‘మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తుల కాలంనాటి కథే ‘హరిహర వీరమల్లు’. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లాము. హరిహర అంటే విష్ణువు, శివుడు కలయిక. ఆ రెండు పేర్లు సూచించేలా వీరమల్లు అని పెట్టాము. ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం అవుతుంది’ అని అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘హరిహర వీరమల్లు’ ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నేను ‘భారతీయుడు’ సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. షూటింగ్‌ పూర్తవడానికి బాగా ఆలస్యమవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్‌ విడుదలతో వారి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెబుతున్నా… ‘హరిహర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుంది.
  • సినిమాను మొదట రెండు భాగాలు అని అనుకోలేదు. సినిమా వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన సినిమాలు అలాగే ఉంటాయి. చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే..ఎక్కువ మందికి చేరువవుతుందని భావించాము. అలా చర్చలో కథ విస్తృతి పెరిగింది.
  • ‘ఖుషి, ‘బంగారం’ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో చేసిన మూడో చిత్రమిది. పేరుకు మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉంది. పవన్‌ కల్యాణ్‌ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయనను నేను ఎక్కువగా ఇష్టపడతాను.
  • మా అబ్బాయి అని చెప్పడం కాదు గానీ.. జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని సిద్ధం చేశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా ‘ఇండియానా జోన్స్‌’ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు.

ఏపీలో ‘హరిహర వీరమల్లు’ టికెట్‌ ధర పెంపు

14 రోజులు అడిగిన మేకర్స్‌.. పది రోజులకే అనుమతి..

‘హరిహర వీరమల్లు’ టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 24న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు 14 రోజుల పాటు అదనపు రేట్లకు అనుమతించాలని ప్రభుత్వానికి మేకర్స్‌ విన్నవించారు. పరిశీలించి పది రోజుల పాటు పెంపునకు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 23 రాత్రి 9.30 గంటలకు సెకండ్‌ షో, 24వేకువ జామున 4గంటలకు బెనిఫిట్‌ షోలకు అనుమతి పెండింగ్‌లో పెట్టింది. పవన్‌ కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతోన్న మొదటి సినిమా కావడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దిగువ తరగతి రూ.100, అప్పర్‌ క్లాస్‌ రూ.150, మల్టీప్లెక్స్‌ రూ.200 అదనంగా పెంచుకోవడానికి అనుమతి లభించడంతో సినిమా టిక్కెట్ల ధరలు సింగిల్‌ స్ర్కీన్‌లో బాల్కనీ రూ.250, మధ్య తరగతి రూ.150-190, మల్టీప్లెక్స్‌లలో రూ.350దాకా ఉండబోతున్నాయి.

తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తాడు.

తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తాడు…

‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా.‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు.

కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్దారు.

ఇక నుంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను’ అని హీరో నితిన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘తమ్ముడు’ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. నితిన్‌ మాట్లాడుతూ ‘80 రోజులు అడవుల్లోనే ఉండి ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని ‘తమ్ముడు’ షూటింగ్‌ పూర్తి చేశాం’ అని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ‘చిత్రబృందం కష్టం వల్లే ‘తమ్ముడు’ సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది.

ర్శకుడు శ్రీరామ్‌ వేణు తన విజన్‌ను అద్భుతంగా తెరపైకి తెచ్చారు.

ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ పూర్తిగా ఆయనకే దక్కుతుంది.

నితిన్‌కు ఇది కమ్‌బ్యాక్‌ మూవీ అవుతుంది. రామ్‌చరణ్‌తో ఓ సూపర్‌హిట్‌ మూవీ చేయబోతున్నాం. త్వరలో వివరాలు ప్రకటిస్తాం’ అని చెప్పారు.

శిరీష్‌ మాట్లాడుతూ ‘‘తమ్ముడు’తో నితిన్‌కు హిట్‌ ఇస్తామని నిర్మాతగా మాట ఇస్తున్నాను’ అని అన్నారు. శ్రీరామ్‌ వేణు మాట్లాడుతూ ‘థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ‘తమ్ముడు’ సినిమాను డిజైన్‌ చేశాను.

కుటుంబ అనుబంధాలతో పాటు వాణిజ్య హంగులు కలబోసిన చిత్రమిది’ అని చెప్పారు.

‘ఇందులో కొత్త తరహా పాత్ర చేశాను’ అని లయ తెలిపారు.

‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం, పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు’ అని సప్తమి గౌడ చెప్పారు. థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయాల్సిన చిత్రమిదని వర్ష బొల్లమ్మ అన్నారు.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

గ‌త నెల మే23న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి మిశ్ర‌మ స్పంద‌న‌ను ద‌క్కించుకున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఏస్ (Ace). విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi), రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth), దివ్యాపిళ్లై (Divya Pillai), యోగిబాబు (Yogi Babu), ఫృథ్వీ రాజ్‌ (బ‌బ్లూ) (Babloo Prithiveeraj) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అర్ముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సామ్ సీఎస్ (Sam C. S), జ‌స్టిన్‌ప్ర‌భాక‌ర‌న్ (Justin Prabhakaran) సంగీతం అందించారు. అయితే పూర్ ప‌బ్లిసిటీ వ‌ళ్ల అటు త‌మిళంలో, ఇటు తెలుగులో ప్రేక్ష‌కుల‌కు చేరువ కాలేక ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షార్ చేసింది.

 

క‌థ విష‌యానికి వ‌స్తే.. బోల్ట్ క‌న్న‌న్ జైలు నుంచి రిలీజై కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు మ‌లేషియా వెళ‌తాడు. అక్క‌డ జ్ఞానందం సాయంతో అక్క‌డే ఉంటూ క‌ల్ప‌న అనే యువ‌తి హోట‌ల్‌లో ప‌ని చేస్తుంటాడు. మ‌రోవైపు మ‌లేసియా పోలీసుగా ప‌ని చేసే కామంధుడైన పెంపుడు తండ్రి రాజా దొరైతో ఇబ్బందులు ప‌డుతూ ఓ బ‌ట్ట‌ల షాప్‌లో ప‌ని చేస్తూ ఉంటుంది రుక్మిణి. అయితే త‌ను అడిగిన డ‌బ్బు ఇస్తే వ‌దిలేస్తాన‌ని చెప్ప‌డంతో ప‌లుచోట్ల ప‌ని చేస్తూ డ‌బ్బు కూడ‌బెడుతూ ఉంటుంది. సేమ్ అపార్ట్‌మెంట్‌లో ఉండ‌డంతో బోల్ట్ క‌న్న‌న్‌, రుక్మిణిల మ‌ధ్య ప‌రిచయం ప్రేగా మారుతుంది.

ఇదిలాఉంటే.. ఓ వైపు క‌ల్ప‌న హోట‌ల్ కోసం తీసుకున్న లోన్ డ‌బ్బులు తిరిగి క‌ట్ట‌లేక పోతుండ‌డం, మ‌రో వైపు రుక్మిణి తన పెంపుడు తండ్రి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి డ‌బ్బులు అవ‌స‌రం ప‌డ‌డంతో క‌న్న‌న్ వారి స‌మ‌స్య‌లు తీర్చేందుకు నిర్ణ‌యించుకుంటాడు. ఈక్ర‌మంలో లోక‌ల్‌గా అక్ర‌మ వ్యాపారుల మ‌ధ్య‌కు వెళ్లి క్యాసినో త‌ర‌హా గేమ్‌లు ఆడి ల‌క్ష‌ల్లో బ‌కాయి ప‌డ‌తారు. అయితే త‌మ డ‌బ్బు కోసం ప్రాణాలు తీసే వారి నుంచి హీరో ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, అస‌లు హీరో ఆ గేమ్‌లు ఎందుకు ఆడాడు, క‌ల్ప‌న‌, రుక్మిణిల స‌మ‌స్య‌లు తీర్చాడా, అక్క‌డ జ‌రిగిన బ్యాంక్ రోబ‌రికి క‌న్న‌న్‌కు మ‌ధ్య ఉన్న లింకేంటి అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ఆక‌ట్టుకుంటుంది.

 

అయితే. సినిమాలో త‌ర్వాత‌ ఏం జ‌రుగ‌బోతుంద‌నేది మ‌న‌కు ముందే తెలుస్తున్నా చూసే ప్రేక్ష‌ల‌కు మాత్రం ఎక్క‌డా బోర్ కోట్ట‌కుండా విజ‌య్ సేతుప‌తి, యోగిబాబు పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. వారి మ‌ధ్య వ‌చ్చే సంభాష‌ణ‌లు డార్క్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విల‌న్ల‌తో హీరో ఆడే గేమ్ కూడా స‌ర‌దాగా సాగుతుంది. బ్యాంక్ దొంగ‌త‌నం, క‌న్న‌న్ వేసే ఎత్తులు అన్నీ మంచి క్యూరియాసిటీని క‌లుగ జేస్తాయి. ఇప్పుడీ సినిమా జూన్ 13, శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి ఫ‌న్ రైడ్ మూవీ చూడాల‌నుకునే వారికి ఈ ఏస్ (Ace) సినిమా మంచి ఆఫ్సన్‌. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త లేకుండా సినిమా అలా స‌రదాగా సాగి పోతూ ఉంటుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version