సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి
సిరిసిల్ల టౌన్ ( నేటి ధాత్రి ):
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్ష్మణ్ ప్రింటర్స్ లో డాక్టర్ జ నపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి ఘనంగా జరిగింనది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహితి సముద్రుడు మేరు నగ ధీరుడు తెలుగు వెలుగును, తెలుగు కవితను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కడలి దాటించిన తొలి తెలంగాణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె, అంటూ ఘన నివాళి సమర్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకునూరి శంకరయ్య పూర్వ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ సినారే ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు నాటక ప్రదర్శనలో అతని చేతులు మీదుగా బహుమతి అందుకున్న జ్ఞాపకం ఉందని, వారి సినీ పాటలు కవిత్వము జగము నకు తెలిసిన మహానుభావులు అన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ గులేబకావళి కథలో గుబాలింపజేసే సాహిత్యాన్ని విరచించి, సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి సినారే,అని అన్నారు. సహాధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ సి నారాయణ రెడ్డి ప్రముఖ కవిగా గాయకుడిగా బోధకుడిగా గురువుగా మరి సాహిత్యంలో ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ కవిగా మరియు సినిమాకు రంగంలో పాత్రకు తగ్గట్టుగా పాటలు రాసి మన్నన పొందినాడు. మన తెలంగాణకే ఒక మనీ మకుటమై నిలిచినారు అని అన్నారు. ఉపాధ్యక్షులు బూర దేవానందం కవితా గానం ఆలాపించారు. అంకారపు రవి తన ఘనంగా కవితను సినరే కు అంకితం ఇచ్చారు.ముడారి సాయి మహేష్ కవితలు ఆలపించారు.గుండెల్లి వంశీ తన కవితను ఆలాపించారు. దొంత దేవదాసు, ఏనుగుల ఎల్లయ్య,అంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.