సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 18వ పట్టణ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్, సిపిఐ నాయకులు గురుజపెల్లి.సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఆదివారం సింగరేణి కమ్యూనిటీ హాల్ సుభాష్ కాలనీలో పట్టణ 18వ మహాసభను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.పట్టణ మహాసభకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అని తెలిపారు.
పట్టణంలోని 30 వార్డులలో సుమారు 250 మంది డెలిగేట్స్ తో ఈ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలో పట్టణ అభివృద్ధి కోసం, అర్హులైన వాళ్లందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్, వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళ పింఛన్ల కోసం ఈ మహాసభలో పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.
భూపాలపల్లి పట్టణం మీదగా నడుస్తున్న లారీలను అదుపు చేసి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలను మేధావులు,కార్మికులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాతంగి రాంచంధర్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, అస్లాం, రవీందర్, శాంతి, శేఖర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతి పార్టీ

– కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంతకంతో రైతులకు రుణమాఫీ
– గత ప్రభుత్వంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు
– సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి పార్టీ అని రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనే ఒక గొప్ప సదుద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక పెన్ను సంతకంతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పాడి రైతుల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చినా కూడా ఒకటి కూడా నెరవేర్చలేదని, కొన్ని పాడి పరిశ్రమ సంస్థలకు వ్యవస్థలకు ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఒకవేళ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దాని బాధ్యత ఎవరు అని అందుకోసమే దీనిని గమనించిన అధికారులు అధికార యంత్రాంగము ఇటువంటి సమస్యల పైన చర్యలు తీసుకుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. సమాజానికి ఆమోదయోగ్యమైనటువంటి వ్యాపారం చేసే సంస్థలకు వ్యవస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అందుకోసమే గత ప్రభుత్వం ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు ఇస్తే అధికారులు వాటిని సీజ్ చేసినా కూడా రైతులు ఇబ్బంది పడద్దని ఒక ఉద్దేశంతో వాటిని మళ్లీ తెరిపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షులు వెలుముల స్వరూప,జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, గోనె ఎల్లప్ప, కత్తెర దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version