అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి..

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఓటర్ జాబితా సవరణ పై కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరగాలని, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు ఓటర్ జాబితా చాలా కీలకమని, సరైన ఓటర్ జాబితాతో ఎన్నికల నిర్వహిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు.
ఓటర్ జాబితా, పారదర్శకమైన పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, బ్యాలెట్ ఎన్నికల వ్యవస్థకు కీలకమని అన్నారు.

ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణ పై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని,ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగించే సమయంలో తప్పనిసరిగా నిర్దేశిత మార్గదర్శకాలు పాటించాలని అన్నారు.
ఓటరు జాబితాలో డబల్ ఎంట్రీ ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మన జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమందికి ఓట్లు ఉన్నట్లు వస్తున్న ఫిర్యాదులను జాతీయ ఓటర్ సర్వీస్ పోర్టల్ వివరాలు పరిశీలిస్తూ పరిష్కరిస్తామని అన్నారు.
ప్రతి సంవత్సరం 4 సార్లు ఓటర్ జాబితా సవరణ చేయడం జరుగుతుందని అన్నారు.

ప్రజాప్రతినిధుల చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం ఓటర్ నమోదు సమయంలో తప్పుడు సమాచారం అందిస్తే నేరమని, మోసపూరిత ఉద్దేశాలతో రెండు చోట్ల ఓటు హక్కు కల్గి ఉండే ఓటర్ల వివరాలు ఆదారాలతో అందిస్తే తప్పనిసరిగా విచారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వీటి పరిధిలో ఇప్పటివరకు 2 లక్షల 30 వేల 157 మంది పురుష ఓటర్లు, 2 లక్షల 47 వేల 977 మంది మహిళా ఓటర్లు, 38 మంది ఇతరులు మొత్తం 4 లక్షల 77 వేల 182 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ , ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వ్యయ వివరాలు నిర్దిష్ట సమయంలో నమోదు చేయాలని , లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరారు.

 

ఓటర్ జాబితా సవరణపై ఎటువంటి సందేహాలు ఫిర్యాదులు సూచనలు ఉన్న తెలియజేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు రాధాబాయి రాజేశ్వర్ భాజాపా పార్టి ప్రతినిథి నాగుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సంపత్, భారస పార్టీ ప్రతినిధి రాజన్న, బి.ఎస్.పి పార్టీ ప్రతినిధి రమేష్, సి.పి.ఐ(ఎం) పార్టీ ప్రతినిధి రమణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version