వేతన జీవులను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌..

వేతన జీవులను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌
పలమనేరు(నేటి ధాత్రి) 
సాధారణంగా బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నారంటే వేతనాలు పెరుగుతాయని ఎదురుచూసే వేతన జీవుల ఆశలను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అడియాసలు చేశారు. 2025`26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని పథకాల అమలు కోసం కేటాయింపులు చేస్తామన్నారు తప్ప, జీతాల కోసం పనిచేస్తున్న కార్మికులకు బడ్జెట్‌లో చోటు ఇవ్వలేదు. ఎటువంటి జీఓ ఇవ్వకుండానే మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పుకోవడం చూస్తే గడ్డి చూపించి గుర్రాన్ని పరిగెత్తిం చడం వంటిదే. ఇతర వాగ్దానాలైన ఆశా వర్కర్ల జీతాల పెంపునకు ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు హామీ గురించి ప్రస్తావించలేదు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌బోర్డును పునరుద్ధరిస్తామన్న హామీకి అదే గతి పట్టించారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన విధంగా ప్రభుత్వం దొడ్డిదారిన వాడేసుకున్న బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ఈ బడ్జెట్‌లో జమ చేయలేదు. రాష్ట్రంలోని లక్షలాది మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు తమకు మినిమం టైంస్కేల్‌, ఉద్యోగాల పర్మినెంట్‌ అవుతాయని పెట్టుకున్న ఆశలపై తెలుగు దేశం కూటమి ప్రభుత్వం నీళ్లుజల్లింది.
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌ ఊసేలేదు. వారికి చెల్లించాల్సిన రూ వేలాది కోట్లు బకాయిల ప్రస్తావన, కేటాయింపుల్లేవు. ఓపీఎస్‌ పునరుద్ధరణ గురించీలేదు. లక్షలాది మంది పనిచేస్తున్న సమగ్రశిక్ష, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ తదితర ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌కు, రెండు లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌కు, మినిమం టైంస్కేల్‌ అమలు మధ్యాహ్నభోజన పథకం, వెలుగు కార్మికులకు కనీస వేతనాల అమలు, విద్యుత్‌, ఆర్టీసీ తదితర ప్రభుత్వరంగ సంస్థల కాంట్రాక్ట్‌ కార్మికులకు డైరెక్ట్‌ పేమెంట్‌, టైం స్కేల్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ గురించి కనీసం ప్రస్తావన, కేటాయింపులు లేవు. తక్కువ జీతాలు తీసుకునే ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు సంక్షేమ పథకాల హామీ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం శోచనీయం.
సామాన్యుల సంతోషమే రాజుల సంతోషమని బడ్జెట్‌ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం చెప్పుకుంది. కానీ షాపులు, మాల్స్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు, హోటల్స్‌ తదితర వాటిల్లో పనిచేస్తున్న దాదాపు 50 లక్షల మంది కార్మికుల వేతనాలు 2006,07 తర్వాత ఇంత వరకూ పెంచలేదు.
ఈ బడ్జెట్‌లో కూడా వాటి పెంపు ప్రస్తావనలేదు. 
గత ప్రభుత్వ విచ్ఛిన్నం వలన అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిందని ప్రసంగంలో చెబుతూనే ఈ బడ్జెట్‌లో రూ. 80 వేల కోట్లు అప్పులను ప్రతిపాదించారు. వేతనాల కోసం, కూలి కోసం శ్రమ చేసి బతికేవారికెవ్వరికైనా  సంక్షేమ పథకాలు మాత్రమే సంతృప్తి పర్చలేవని 2024 రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో తేలింది. ఈ ఫలితాల నుండైనా కూటమి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు.  కార్మికుల వేతనాల కోసం, సంక్షేమం కోసం తగిన విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో తగిన మార్పులు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, డు జై గిరిధర్ గుప్తాఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు..

హనుమాన్ ఆలయ చైర్మన్ పరామర్శించిన రాము, రమేష్ యాదవ్..

హనుమాన్ ఆలయ చైర్మన్ పరామర్శించిన రాము, రమేష్ యాదవ్

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి లక్ష్మీ అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, కొమ్ము రమేష్ యాదవ్ లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లుకు మారం రాము రమేష్ యాదవ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ ఈదునూరి యాకయ్య, నెక్కొండ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, నెక్కొండ మాజీ ఉపసర్పంచ్ వీర భద్రయ్య, బి ఆర్ ఎస్ నాయకులు వెంకన్న, శ్రీనివాస్, శ్రీనాథ్, బొడ్డుపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

ఆలయాధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్.

చిట్యాల, నేటిధాత్రి :

భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం ఒడితల గ్రామంలో మూడు రోజుల నుండి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మరియు బద్ది పోచమ్మ తల్లి దేవాలయాలల్లో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. కాగా, సోమవారంరోజున జరిపిన ధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేణుగోపాలస్వామి, రామలింగేశ్వరస్వామి, బద్ది పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఒడితల గ్రామంలోని
కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను అభివృద్ది చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు శాలువాలు కప్పి సన్మానం చేశారరు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మన వంశ కృష్ణ జిల్లా నాయకులు చిలుకల రాయ కొమురు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం

చికిత్స పొందుతున్న వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. శ్రీరాంపూర్ పట్టణంలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో సూపర్వైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ కుమారుడు శ్రీకాంత్ చదువులో గొప్పగా రాణించి ప్రిపేర్ అయ్యే సమయంలో విపరీతంగా తలనొప్పి రావడంతో జిల్లాలోని హాస్పటల్ కి తరలించగా వైద్యులు పరీక్షలు చేసి హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి పంపించారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో ఉండగా కొందరు గ్రామస్తులు ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు ను సంప్రదించండి సహాయమందిస్తారని తెలియజేయడంతో హుటాహుటిన ట్రస్ట్ సభ్యులను సంప్రదించడంతో వెంటనే వారు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సభ్యులు డి.ప్రేమ్ కుమార్,కె. మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్..

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్

పక్షుల సంరక్షణ పై సమగ్ర అధ్యయనం

అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ

మంచిర్యాల:నేటి ధాత్రి

పర్యావరణంలో మిగిలిన జీవరాశుల కంటే ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై సమగ్ర అధ్యయనం జరగాలని ఇందుకు దీర్ఘకాలిక పరిశీలన అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా ) డాక్టర్ సువర్ణ అన్నారు.అటవీ శాఖ మరియు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్,నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో మంచిర్యాలలో గత రెండు రోజులుగా జరిగిన బర్డ్స్ ఫెస్టివల్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.ఈ సందర్భంగా మంచిర్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు•పక్షుల గమనానికి పరిధిలు లేవని అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర వహిస్తున్నాయన్నారు. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయని ఇలాంటి పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం పక్షులని చెప్పారు.ఇవి వాటి భాషలో మంచి కమ్యూనికేషన్ కలిగి రాకపోకలు కొనసాగిస్తూ పర్యావరణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా పక్షుల గురించి తమ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోవాలన్నారు. ఇందుకుగాను పాఠశాల ఉపాధ్యాయులు సైతం పక్షుల స్థితిగతులు వాటి జీవన విధానంపై విద్యార్థులకు క్విజ్ లు నిర్వహించాలన్నారు. మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో వేల పక్షులు సంచరిస్తున్నాయన్నారు.గత రెండు సంవత్సరాలుగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో దీర్ఘకాలిక పరిశీలన చేసి 201 జాతుల పక్షులను గుర్తించామన్నారు.జిల్లా పరిధిలోని మిగిలిన అటవీ డివిజన్ లలో కూడా అటవీ సిబ్బంది తమ పరిధులలో పక్షుల గమనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేసుకోవాలని సూచించారు.కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్ మాట్లాడుతూ కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలో రాష్ట్రంలోనే అరుదైన రాబందుల సంరక్షణకు తాము తీసుకుంటున్న చర్యల వల్లే వాటి జనాభా పెరుగుతుంది అన్నారు.నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ శాస్త్రవేత్త మహేష్ శంకరన్ మాట్లాడుతూ సవన్నా గడ్డి మైదానాలకు మరియు అడవులకు మధ్య వ్యత్యాసాన్ని,అక్కడి జీవవైవిద్యం గురించి వివరించారు.పక్షులు క్రమంగా అంతరిస్తే బయోడైవర్సిటీ దెబ్బతింటుందని,వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ విజయన్ మాట్లాడుతూ పక్షులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ లు ఉండాలన్నారు.బి ఎన్ హెచ్ ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ సాథియా సెల్వం మాట్లాడుతూ ముంబై లాంటి నగరాల్లో ఆరో తరగతి నుంచే పక్షుల గురించి ప్రత్యేకంగా రికార్డులు నిర్వహిస్తున్నాని,ఇక్కడి పాఠశాలల్లో కూడా బర్డ్స్ ఏకో క్లబ్ నిర్వహించుకోవాలన్నారు. వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రధాన అధికారి బండి రాజశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో పక్షుల అధ్యయనం పై సమగ్ర పరిశీలన చేయగా 11 పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయన్నారు. 57 జాతుల పక్షులు కేవలం అటవీ,ప్లాంటేషన్ ఏరియాలోని సంచరిస్తున్నాయని పరిశీలించామన్నారు.99 జాతుల పక్షులు కీటకాలు తినే వాటిగా,16 జాతుల పక్షులు కేవలం పండ్లను తినే పక్షులుగా గుర్తించామన్నారు. పక్షుల అధ్యయనం,సంరక్షణకు తమ సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ బర్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంరక్షణలో సేవలందిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు సభ్యులకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ,కవ్వాల్ టైగర్ రిజర్వ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతా రాములు కలిసి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ కుమార్ పాటిల్,మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ అధికారి సర్వేశ్వరరావు,పక్షులపై అధ్యయనం చేస్తున్న ప్రముఖులు డాక్టర్ శాంతారామ్,డాక్టర్ బిక్షం గుజ్జ, డాక్టర్ సాథియా సెల్వం, సంజీవ్ మీనన్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ అధికారులు,డిప్యూటీ రేంజ్ అధికారులు,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు,బీట్ అధికారులు,పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

హనుమాన్ ఆలయ చైర్మన్ బెజ్జంకి ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

హనుమాన్ ఆలయ చైర్మన్ బెజ్జంకి ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

నెక్కొండ:నేటి ధాత్రి

మండల కేంద్రానికి చెందిన హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి బెజ్జంకి లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బెజ్జంకి వెంకటేశ్వర్లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజిపి బండి శివ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పోలిశెట్టి భాను, కాంగ్రెస్ నాయకులు సింగం ప్రశాంత్, రావుల మైపాల్ రెడ్డి, వెంకన్న, శ్రీకాంత్, వీరస్వామి, ప్రభాకర్, షబ్బీర్ ,అన్వర్, తదితరులు లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు .

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం..

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..

నర్సంపేట:నేటిధాత్రి

పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం 8 వ వార్షికోత్సవం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సంఘం అధ్యక్షుడు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు.నర్సంపేట ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభివృద్దే లక్ష్యంగా గత 8 సంవత్సరాలు జర్నలిస్టుల పరపతి సహకార సంఘం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.ఒకరికొరకు పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుపోవాలని ఈ సందర్భంగా సూచించారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..

పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నికల అధికారులుగా పోడేటి అశోక్, కాసర్ల నరసింహరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహింఛారు. నూతన అధ్యక్షులుగా కోదాటి గోపాలకృష్ణ,కార్యదర్శిగా రడం శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షులుగా పాలంచ సత్యనారాయణ,
కోశాధికారిగా సామల అనిల్ కుమార్,సహాయ కార్యదర్శిగా కందుల శ్రీనివాస్ గౌడ్,గౌరవ అధ్యక్షులుగా వేములపల్లి వెంకటరామయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పిట్టల కుమారస్వామి,శీలం రమేష్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్,కర్ల వెంకటరెడ్డి, మచ్చిక రమేష్ గౌడ్, పెండెం శివానంద్,జూలూరి హరిప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి వెంకటేష్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్

వనపర్తి:నేటిదాత్రి 

రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి కి వచ్చిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ కలిశారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలకు వచ్చారు ఈ . సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ వారికి ఒకప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి..

ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి

సూర్య హాస్పిటల్ డాక్టర్స్ ఎం. గీతా పావని ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు మరియు ఎన్.ఎస్. పవన్ రెడ్డి జనరల్ ఫిజీషియన్ ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు…*

నేటి ధాత్రి:మణుగూరు

పినపాక మండలం జానంపేట గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు భద్రాచలం సూర్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది..
ఈ వైద్య శిబిరానికి భద్రాచలం సూర్య హాస్పిటల్ కు చెందిన ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం గీతా పావని మరియు జనరల్ ఫిజీషియన్ ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డి మరియు హాస్పటల్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో హాజరైన పినపాక మండలంలోని పలు గ్రామాలకు చెందిన రోగులను ఉద్దేశించి డాక్టర్ ఎం. గీతాపావని మాట్లాడుతూ ప్రారంభ దశలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే నిరుపేద కుటుంబాల్లో ఈ కిడ్నీ వ్యాధి బారిన ఎక్కువ మంది పడుతున్నారని కిడ్నీ సమస్యలతో అనేక రకాలుగా బాధించబడుతున్నారని, వీరందరికీ సరైన చికిత్స అందించడానికి భద్రాచలంలోనే సూర్య హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని… నిరుపేదల సేవే భగవంతుని సేవగా భావించి అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు…
తదుపరి డాక్టర్ ఎన్ ఎస్ పవన్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ వ్యాధిగ్రస్తులు సరైన ఆహార నియమాలు పాటిస్తూ సక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడినట్లయితే షుగర్ గాని బీపీ గాని కంట్రోల్లో ఉంటాయి వాటి వల్ల ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. షుగర్ మరియు బిపి కంట్రోల్ లో లేకపోతే కిడ్నీ వ్యాధి బారిన ఇప్పుడు ఎక్కువమంది పడుతున్నారని.. వైద్యంలో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని ఎవరు ఎలాంటి జబ్బులకు భయపడవలసిన అవసరం లేదని తెలియజేశారు… భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు వస్తున్నారు

ఈ కార్యక్రమంలో దరిదాపు 300 మంది రోగులను డాక్టర్లు పరీక్షించి వారికి తగు సలహాలు సూచనలతో పాటు సుమారు నాలుగు లక్షల రూపాయల మందులను ఉచితంగా పంపిణీ చేశారు…

ఈ కార్యక్రమంలో భద్రాచలం సూర్య హాస్పిటల్ సిబ్బంది మరియు ఇతర గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు..

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి..

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి…

మిర్చి క్వింటాల్ కి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర ప్రకటించండి…

త్వరలో మిర్చి రైతుల సమస్యలపై గవర్నర్ సీయం మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలుస్తా…

*జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట:నేటిధాత్రి

దేశవ్యాప్తంగా మిర్చి రైతులను ఆదుకునేందుకు “జాతీయ మిర్చి బోర్డు” ఏర్పాటు చేసి క్వింటాల్ ఎండు మిర్చి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర నిర్ణయించి నేరుగా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన పది రోజులుగా మిర్చి ధర భారీగా పతనం కావడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకుని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు స్పైసెస్ బోర్డు అధికారులతో మాట్లాడానని ప్రస్తుతం మార్చి మాసంలో మిర్చి ధర పెరగవచ్చునని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేస్తోందన్నారు ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ” మూడు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుందని మార్కెట్లో క్వింటాలుకు పధమూడు వేల లోపు మాత్రమే ధర లభించడం వల్ల ఆర్థికంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మిర్చిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు తరహాలో వరంగల్ కేంద్రంగా “జాతీయ మిర్చి బోర్డు” మంజూరు చేయాలని మిర్చి బోర్డు ద్వారా మిర్చి సాగు కి అవసరమైన అనేక రకాల రాయితీ పథకాలను అమలు చేయడంతో పాటు క్వింటాల్ ఎండుమిర్చి రూ” ఇరువై వేలు గా నిర్ణయించి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నేరుగా ప్రభుత్వమే మిర్చి బోర్డు నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సాంబశివరెడ్డి కోరారు ప్రస్తుత సీజన్ లో మార్కెట్ పరంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలిసి వారి దృష్టికి తీసుకు వెళ్తానని సాంబశివరెడ్డి తెలిపారు మిర్చి రైతుల సమస్యలు మార్కెట్ ఒడిదుడుకులపై ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మూడు పర్యాయాలు తన నివేదికను భారత ప్రభుత్వం కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు అందజేసిన విషయాన్ని సాంబశివరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు

నిరోషా కుటుంబానికి ఆర్థిక సహాయం..

నిరోషా కుటుంబానికి ఆర్థిక సహాయం

కల్వకుర్తి /నేటి దాత్రి

నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన నిరోషా వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి నిరోషా ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు సోమవారం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, జంగయ్య, బలరాం, బాల నాగయ్య, శివుడు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు..

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు

శాలువాతో సత్కరించిన అరుణ ఫర్టిలైజర్ యాజమాని వెంకన్న

పరకాల:నేటిధాత్రి
వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్బంగా అరుణ ఫర్టీలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే వెంకటేశ్వర్లు హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.గత 35 సంవత్సరాలుగా ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ రంగంలో వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు అందిస్తూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఎరువుల పురుగుమందులు విత్తనంపై దుకాణాల యజమానుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు గందే వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి..

కోహిర్ మండల్లో మట్టి అక్రమ తరలింపు. పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యాపారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. మరియు రెవెన్యూ శాఖ మరియు మన్నింగ్ శాఖ అధికారుల మౌనం అక్రమ గని కార్మికుల మనోధైర్యాన్ని పెంచింది. ఇటీవల, శుక్రవారం రాత్రి, మాద్రిలోని కోహిర్ మండల్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాల సమయంలో, మాద్రి గ్రామ ప్రజలపై మట్టి మాఫియా కర్రలతో దాడి చేసి, అక్రమ మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నప్పుడు వారిని గాయపరిచింది. గాయపడిన వారిలో ముహమ్మద్ వసీం పటేల్, ముహమ్మద్ అజీం మరియు ఇతరులు ఉన్నారు. మరియు ఈ దాడిలో ముహమ్మద్ వసీం పటేల్ తీవ్రంగా గాయపడ్డాడు మరియు వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరియు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరియు గాయపడిన వారి వివరాల ప్రకారం, వక్ఫ్ భూమిలో అక్రమంగా పంట కోతలు జరుగుతున్నాయని, అదే సమయంలో, పంట కోస్తున్న వారిని వివరాలు అడిగినప్పుడు, వారిపై కర్రలతో దాడి చేశారని తెలుస్తోంది. మరియు ఈ అక్రమ మైనింగ్ రెండు వైపుల నుండి కొనసాగుతోంది. మరియు దాడిలో గాయపడిన వారు శనివారం కోహిర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరియు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు ఈ అక్రమ మైనింగ్‌ను ఆపాలని గ్రామస్తులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం..

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గోని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు యంపి, మాజీ మంత్రి. టి జి ఐ డి సి మాజీ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం: జహిరాబాద్ పట్టణం లో ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం లో పాల్గోని స్వామి వారిని దర్శించుకుని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు.నిర్వహకులు ఈ సందర్భంగా జ్ఞాపికను అందచేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు ,మంకల్ సుభాష్ గారు,శుక్లవర్దన్ రెడ్డి, అశోక్,రాకేష్ గుప్త,ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు..

ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Ramadan fasting initiations started

 

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండగ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. జహీరాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో గల ముస్లింలు ఉపవాస దీక్షను పాటిస్తున్నారు.. ఉపవాస సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి వాహనాల తనిఖీ చేయరాదని, చాలన్లు విధించరాదని, నమాజ్ వేళ్లే సమయంలో వాహనాలు తనిఖీ చేయరాదని జహీరాబాద్ ఈద్గా కమిటీ సభ్యులు స్థానిక పట్టణ ఎస్సై కాశీనాథ్ ను కోరారు. దీంతో పాటుగా ఉపవాస దీక్షలు విరమించే సమయంలో విద్యుత్ అంతరాయము రాకుండా చూడాలని విద్యుత్ సరఫరా లో ఏదైనా అంతరాయం ఉంటే ముందే సూచించాలని విద్యుత్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ మాసం అతి పవిత్రంగా భావించి ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేస్తూ సాయంత్రానికి ఉపవాస దీక్ష విరమిస్తారు. ఈ మాసంలో ముస్లింలు పవిత్రంగా ఉంటూ అల్లాను ధ్యానిస్తూ ఐదు సార్లు నమాజు చేస్తూ ఉపవాసలు కొనసాగిస్తారు. అధికారులను కలిసి ఈద్గా కమిటీ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మాజీద్, మొహమ్మద్ ఇనాయత్ అలీ, మొహమ్మద్ అక్బరుద్దీన్, మొహమ్మద్ ఆయుబ్, తదితరులు ఉన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

A spirited gathering of alumni 1994-94 batch students

ఝరాసంగం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1994-94 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నాటి గురువులతో కలిసి వైభవంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన విద్యార్థులు అందరు ఒకే వేదికపై కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులు పాపిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మల్లేశం, అజుముద్దీన్, చంద్రశేఖర్, మాణిక్యప్పలా పాదాలకు నమస్కరించి ఆశీర్వచనలు తీసుకుని పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. పూర్వ విద్యార్థులు ఆర్ నర్సింలు, విజయేందర్ రెడ్డి, శశికళ, అమరావతి, అస్లాం, రిహానా, నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, విజయ్ కుమార్, ముక్తార్, అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ టార్చర్‌ మేం భరించలేం!

`సబ్‌ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన.

`మంత్రి పొంగులేటికి, ఉన్నతాధికారులకు రిజిస్ట్రార్ల లేఖ.

`మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేం!

`ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు.

`మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేం.

`సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది.

`సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది.

`వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి.

`అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము.

`జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము.

`సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము.

`రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది!

`లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలు.

`గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!

`లేని పోని వార్తలు సృష్టిస్తున్నారు.

`ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు.

`రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు

`రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు

`నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది

`మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని సామెత. కానీ అసలు దర్జా, దర్పం వెలగబెట్టే వారికి కూడా కష్టాలుంటాయా? వస్తాయా? ఇబ్బంది పెడతాయా? ఊపిరి సలపకుండా చేస్తాయా? అంటే అవునని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ ఎవరూ వినని సందర్భం, సందేహం కావడంతో ఒకింత ఆశ్చర్యమే అనిపిస్తుంది. కాకపోతే అది నిజం. ఈ మధ్య తెలంగాణలోని సబ్‌ రిజిస్ట్రార్లు ఈ టార్చర్‌ మేం భరించలేం! బాబోయ్‌ అంటున్నారు. నిజంగానే రిజిస్ట్రార్లు ఈ మాటలు అంటున్నారా? అని ఆరా తీస్తే అవుననే అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సబ్‌ రిజిస్ట్రార్లు తీవ్ర అందోళన చెందుతున్నారు. ఆవేదనకు గురౌతున్నారు. మేము ఈ కొలువు చేయలేకపోతున్నామని గొల్లు మంటున్నారు. ఉద్యోగం చేయలేమని చెబుతున్నారు. దాంతో కొంతమంది సబ్‌ రిజిస్ట్రార్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కి, ఇతర ఉన్నతాధికారులకు ఓ లేఖ రాసినట్లుగా సమాచారం అందుతోంది. నిత్యం కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఆ లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం నేటిధాత్రి దృష్టికి వచ్చింది. ఆ లేఖ సారాంశం అందింది. తెలంగాణ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నిత్యం వచ్చే జర్నలిస్టులతో వేగలేకపోతున్నామన్నది ఆ లేఖ సారాంశం. ప్రతి రోజు పదుల సంఖ్యలో వచ్చే జర్నలిస్టులలో అసలు జర్నలిస్టులు ఎవరు? జర్నలిస్టుల ముసుగులో వచ్చిందెవరో తేల్చుకోలేక రిజిస్ట్రార్లు సతమతమౌతున్నారట. మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేకపోతున్నామని సబ్‌ రిజిస్ట్రార్లు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చే జర్నలిస్టులలో ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు. మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేమంటున్నారు. పదుల సంఖ్యలో జర్నలిస్టులు రావడం సమయం కోరడం, వారు ప్రశ్నల మీద ప్రస్నలు అడగడం జరుగుతోంది. తమకు సంబంధం లేని అంశాలను, వారి ఊహలను మా నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏ వార్త ఎందుకు రాస్తున్నారో, ఎవరిని అడిగి రాస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా జర్నలిస్టులు రాసే ప్రతి విషయానికి సమాధానం చెబుతూ వెళ్తే కొలువు చేయడానికి సమయం సరిపోవడం లేదు. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఒక రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయన్న పూర్తి సమాచారం నెట్‌లో దొరుకుతుంది. అయినా అర్థం పర్థం లేని వార్తలు రాస్తున్నారు. కట్టు కథలు అల్లి వీడియోలు తయారు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తూ వండి వారుస్తున్నారు. ఆ వార్తలకు తలా తోక వుండడం లేదు. నిజంగానే ఏదైనా పొరపాటు జరిగితే జర్నలిస్టులకు రాసే హక్కు వుంది. కానీ జరగనవి జరిగినట్లు కల్పిత కథలు సృష్టించి మా మనోభావాలను దెబ్బ తీస్తున్నారని రిజిస్ట్రార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలపై అటు ఇతర జర్నలిస్టులకు సమాధానం చెప్పుకోవడమే కాదు, పై స్థాయి అధికారులకు కూడా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. వచ్చే వార్తలలో ఏవి నిజమో..ఏవి అబద్ధమో అర్థం కాక ఉన్నతాధికారులు వివరణలు అడుగుతున్నారు. ఇలా రోజంతా ఆ తలనొప్పితోనే గడిచిపోతోంది. దాంతో మా రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్ని సార్లు తిరగాలంటూ ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఏదో ఆశించే రిజిస్ట్రార్లు కాలయాపన చేస్తున్నారని అనుమానపడుతున్నారు. మేం ఎదురుకుంటున్న ఈ సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదు. మీడియా అర్థం చేసుకోవడం లేదు. రోజుల్లో సగానికి పైగా సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది. మా బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు. వినిపించుకోవడం లేదు. జర్నలిస్టులను రానివ్వకపోతే ఏదో జరుగుందని మళ్ళీ వార్తలు రాస్తారు. సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది. జర్నలిస్టులకు వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి. జర్నలిస్టులు రాసే ప్రతి వార్తకు,అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము. ఇలా నిరంతరం జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము. నిజంగానే ఏదైనా అవకతవకలు జరిగితే రుజువులతో సహా వార్తలు రాయండి. నిందారోపణలే లక్ష్యంగా వార్తలు రాసి మనో భావాలు దెబ్బ తీయొద్దని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది! లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలుగా వుంటున్నారు. గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!గా మారిన వాళ్లంతా తెల్లారి లేస్తే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలోనే వుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి పనులు తొందరగా ముగించాలా? లేక జర్నలిస్టులకు సమాధానాలు చెప్పుకుంటూనే కూర్చోవాలో అర్థం కావడం లేదు. వీళ్ల పరిస్థితి ఇలా వుంటే డాక్యుమెంట్‌ రైటర్ల ఆగడాలు మరో రకంగా వుంటున్నాయి. కొత్తగా వచ్చిన రిజిస్ట్రార్లకు చుక్కలు చూపిస్తున్నారు. లేని పోని వార్తలు సృష్టించి, కొంత మంది జర్నలిస్టులకు సమాచారం అందిస్తున్నారు. అది నిజమనుకొని ఎలాంటి ఆధారాలు కూడా అడక్కుండానే కొంత మంది జర్నలిస్టులు వార్తలు రాసేస్తున్నారు. ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు. రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు. నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది. మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని సబ్‌ రిజిస్ట్రార్లు కోరుతున్నారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న సీపీఎం ముసాయిదా

మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ లేదా నియోఫాసిస్ట్‌ కాదన్న సీపీఎం

భగ్గుమన్న కాంగ్రెస్‌, సీపీఐ

కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న సీపీఎం మారిన వైఖరి

ఎల్‌డీఎఫ్‌పై ఎదురుదాడిని పెంచిన కాంగ్రెస్‌

సీపీఎం వ్యూహాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడంలేదా?

వచ్చే ఏడాదిలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు

చాపకింద నీరులా వ్యవహరిస్తున్న బీజేపీ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, భారతీయ జనతాపార్టీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు పరస్పర విరుద్ధ భావజాలాలు కలిగినవన్న సంగతి మనకు తెలిసిందే. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి, భాజపా అనుసరించే జాతీయవాద సిద్ధాంతానికి ఉప్పు`నిప్పు సంబంధమంటే అతిశయోక్తి కాదు. అటువంటిది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) వచ్చే ఏప్రిల్‌ నెలలో పార్టీ కాంగ్రెస్‌ జరుగనున్న నేపథ్యంలో ఒక ముసాయిదాను విడుదల చేసింది. భాజపాను ఫాసిస్ట్‌, నియో`ఫాసిస్ట్‌ పార్టీగా ఎప్పుడూ తనదైన శైలిలో విమర్శించే సీపీఐ(ఎం) ఈసారి ముసాయిదాలో నరేంద్రమోదీ ప్రభుత్వం ‘నియో`పాసిస్ట్‌’ లేదా ‘ఫాసిస్ట్‌’గా పిలవడానికి అవసరమైన అర్హతలు లేవని పేర్కొనడం దేశంలో ఒక్కసారి రాజకీయ ప్రకంపనలు రేకెత్తించింది. ఈ ముసాయిదా విడుదల కాగానే కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ)లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిజం చెప్పా లంటే ఈ ముసాయిదా విపక్షపార్టీల మధ్య కొత్త విభేదాలను సృష్టించడమే కాదు, వాటిల్లో నెల కొన్న నిలకడలేని రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసింది.

విషయమేంటంటే వచ్చే ఏప్రిల్‌ నెలలో సీపీఐ(ఎం) పార్టీ 24వ కాంగ్రెస్‌ మీటింగ్‌ జరుగనుంది. పార్టీ రాజకీయ తీర్మానానికి సంబంధించి ముసాయిదా నోట్‌ను రూపొందించి తన రాష్ట్ర శాఖలకు పంపింది. ఇటువంటి ప్రతి పార్టీ కాంగ్రెస్‌ సమావేశానికి ముందు ఇటువంటి ముసాయిదానుపంపడం రివాజు. అయితే ఇప్పటివరకు బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌పై పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై సీపీఎం యూటర్న్‌ తీసుకోవడమే ఈ ముసాయిదాలోని ఆశ్చర్యం కలిగించే విశేషం! నిజానికి బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లను ఫాసిస్ట్‌ అజెండాతో ముందుకెళ్లేవిగా సీపీఎం ఎప్పుడూ విమర్శిస్తూ రావడం కద్దు. మాజీ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో మోదీ ప్రభుత్వాన్ని, ఫాసిజాన్ని సమాంతర రేఖలుగా వివరించడానికి ప్రయత్నించారు. ఇదిలావుండగా సీపీఎం తన అభిప్రాయాన్ని సమర్థించుకోగా, సహచర సీపీఐ మాత్రం ఈ ‘తప్పిదాన్ని’ సరిదిద్దుకోవాలని డిమాండ్‌ చేసింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా సీపీఎం మరియు సీపీఐలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకేసి సీపీఎం కేవలం తన ఉనికికోసమే ఈవిధంగా మాటమార్చిందంటూ విరుచుకుపడిరది.

సీపీఎం, సీపీఐ మరియు కాంగ్రెస్‌లు జాతీయస్థాయిలో ఒకే కూటమిలో వుండగా, కేరళలో మా త్రం సీపీఎం, సీపీఐల కూటమితో ఏర్పడిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో వుంది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.డి.ఎఫ్‌. ఈ రాష్ట్రంలో విపక్షంలో వుంది. సీపీఎం తాజా వైఖరి నేపథ్యంలో ప్రముఖ రచయిత తుషార్‌ గాంధీ ‘ఎక్స్‌’వేదికలో ఈవిధంగా పోస్ట్‌ చేశారు. ‘‘కేరళ సీపీఎం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అంగీకరించడంలేదు. అంటే ఇప్పుడు సీపీఎం తన ఎర్ర జెండానుమడతపెట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ను కేరళలోకి ‘రెడ్‌ కార్పెట్‌’ వేసి మరీ ఆహ్వానించాలని చూస్తున్నదనుకోవాలా? ఇప్పుడు ‘లాల్‌’ కాస్తా ‘భగ్వా’గా మారిపోయిందా?’’ అంటూ ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ‘నియో`ఫాసిస్ట్‌’ లక్షణాలను ప్రదర్శిస్తున్నప్పటికీ, దాన్ని ‘ఫాసిస్ట్‌ లేదా నియో` ఫాసిస్ట్‌’గా పిలిచేందుకు అవసరమైన యోగ్యతలు దానికి లేవని సీపీఎం ముసాయిదా స్పష్టం చేసింది. ‘మేం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ లేదా నియో`ఫాసిస్ట్‌ అని ఎప్పుడూ పేర్కొనలేదు. ఇదేసమయంలో భారత్‌ను నియో`ఫాసిస్ట్‌ రాజ్యంగా పరిగణించడంలేదు. మేం చెప్పేదల్లా ఒక్కటే. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బీజేపీ పదేళ్లుగా దేశాన్ని పాలిస్తోంది. ఈ కాలంలో బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో రాజకీయ సుసంఘటితను సాధించాయి. దీని ఫలితంగా నియో`ఫాసిస్ట్‌ లక్షణాలు వ్యక్తమవడం మొదలైంది’ అని సీపీఎం ముసాయిదా తీర్మానం పేర్కొంది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్‌ పార్టీ అభిప్రాయాన్ని గట్టిగా సమర్థించారు. ‘‘మేం ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా వ్యవహరించలేదు. ఫాసిజం మళ్లీ పురుడుపోసుకుందన్న మాట కూడా మేం ఎప్పుడూ అనలేదు. నిజంగా ఫాసిజం దేశంలోని ప్రవేశిస్తే రాజకీయ నిర్మాణం ఒక్కసారిగా మారిపోతుంది.’ అని బాలన్‌ పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌)లు తమ అభిప్రాయానికి భిన్నంగా దేశంలోకి ఫాసిజం వచ్చేసిందని భావిస్తున్నాయి, అని కూడా బాలన్‌ పేర్కొ న్నారు. నిజానికి దేశంలోకి ఫాసిజం వచ్చిందని భావిస్తే అందుకు రుజువులు చూపండి అని బాలన్‌ కోరినట్టు మళయాల న్యూస్‌ పోర్టల్‌ ‘మాధ్యమం’ పేర్కొంది.

మధ్యంతరాసామ్రాజ్యయుగంలో పురుడుపోసుకున్న క్లాసికల్‌ాఫాసిజానికి మరియు నియోాఫాసిజానికి మధ్య వున్న తేడాను తాము గుర్తించామని, ఇది కేవలం నియోాలిబరలిజంలో చోటుచేసుఉన్న సంక్షోభం నుంచి పుట్టుకొచ్చింది మాత్రమేనని సీపీఎం పేర్కొంది. నియోాఫాసిజం నిజా నికి ప్రజాస్వామ్య చట్రంలో నిరంకుశ లక్షణాలు కలిగివుంటుందని, క్లాసికల్‌ాఫాసిజం మాదిరిగా కాకుండా ఇది పూర్తిగా ఎన్నికల వ్యవస్థనే తిరస్కరిస్తుందని వివరించింది.
కేరళ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత సీపీఎం వైఖరిని, కేరళ కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి యత్నాలు మొదలుపెట్టింది. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్‌ ‘ప్రస్తుత సీపీఎం వైఖరి పూర్తిగా దాని వ్యాపారధోరణికి నిదర్శనం’ అని విమర్శించింది. కేరళలో సీపీఎంను ఇకనుంచి ‘కమ్యూనిస్ట్‌ జనతా పార్టీ’ (సీజేపీ)గా పిలవాలంటూ ఎద్దేవా చేసింది. సీపీఎంకు, బీజేపీకి మధ్య అంతర్గతంగా ‘అంగీకారం’ కుదిరిందా? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఫాసిస్ట్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ కాదనడమంటే ఆపార్టీకి సీపీఎం కోవర్ట్‌గా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.
‘సీపీఎం ఉన్నతస్థాయిలో తీసుకొచ్చిన కొత్త సిద్ధాంతం నేపథ్యంలో ఇప్పటివరకు సెక్యూలర్‌ విలువలకోసం పోరాడే పార్టీగా భావించేవారు, నేటివరకు వామపక్షంగా పరిగణిస్తూ తప్పుచేశామన్న భావనకు గురవుతారు. గత అసెంబ్లీ, లోక్‌సభ మరియు ఇతర ఉప`ఎన్నికల్లో క్రమంగా రైట్‌ వింగ్‌వైపుకు మారుతున్న పరిణామాలు, సీపీఎంను దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా స్థానం లేకుండా చేస్తున్నాయి. అంతేకాదు ఈ పార్టీ ప్రస్థానం ముగింపు దశలో ఉన్నదన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి’ అని కేరళ కాంగ్రెస్‌ పేర్కొంది.

కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వి.డి. సతీశన్‌ మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎం వైఖరి, బీజేపీతో దానికున్న రహస్య ఒప్పందాన్ని వెల్లడిస్తోందని ఆరోపించారు. ‘కేరళలో సీపీఎం ఎప్పుడూ ఫాసిజంతోశాంతిగానే వ్యవహరిస్తోంది. సంఫ్‌ుపరివార్‌తో అది ఒక అంగీకారానికి వచ్చింది. ఈ సంబంధాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ కాదంటూ కొత్త ముసాయిదాను ముందుకు తెచ్చింది. మోదీతో చేతులు కలపడానికి, సంఘపరివార్‌తో శాంతి ఒప్పందం ద్వారా వారికి లంగిపోవడానికి సీపీఎం సిద్ధపడిరది’’ అని సతీశన్‌ ఆరోపించారు.
కేవలం కాంగ్రెస్‌ మాత్రమే కాదు సీపీఐ కూడా సీపీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళప్రభుత్వంలో సీపీఎంకు జూనియర్‌ భాగస్వామిగా కొనసాగుతున్న సీపీఐ, ‘సీపీఎం ముసాయిదా లో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి’ అని డిమాండ్‌ చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటేనే ఒక ఫాసిస్ట్‌ సంస్థ. ఆర్‌ఎస్‌ఎస్‌ కింద పనిచేసే మోదీ నేతృత్వంలోని బీజేపీ కూడా ఫాసిస్ట్‌ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో సీపీఎం తన పంథాను సరిదిద్దుకోవాలని కేరళ సీపీఐ ప్రధాన కార్యదర్శి బినోయ్‌ విశ్వం డిమాండ్‌ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
విషయాన్ని పరిశీలిస్తే కేరళలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీపీఎం, వ్యవహారజ్ఞానంతో సమ తుల్య వైఖరితో అడుగులు ముందుకేస్తుంటే, సీపీఐ మాత్రం తన వైఖరిలో ఏవిధమైన మార్పులే కుండా పూర్వపు పంథాతోనే ముందుకెళుతుండటం వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఇక కాంగ్రెస్‌ కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమే కనుక, అధికారంలోకి రావడానికి సీపీఎం వైఖరిని ఒక అవకాశంగా తీసుకొని మరింత దూకుడుగా ముందుకెళ్లే వైఖరిని అనుసరిస్తోంది. ఏది ఏమైనా సీపీఎం తాజాగా మారిన తన వైఖరితో విపక్షాలను ఒక్క కుదుపునకు లోను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేరళలో క్రమంగా బీజేపీ ఓటింగ్‌ శాతం పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఇలాగే వచ్చే ఎన్నికల్లో కూడా జరిగితే తాము నష్టపోక తప్పదన్న అభిప్రాయానికి సీపీఎం వచ్చి వుండాలి. అందుకనే రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జా గృతి పవనాలను గుర్తించే తాను బీజేపీకి వ్యతిరేకం కాదన్న ముద్రను సుస్థిరం చేసుకుంటే, వచ్చే అసెంబ్లీ హిందూ ఓట్లను కాపాడుకోవచ్చన్నది సీపీఎం వ్యూహం కావచ్చు. ఓట్లశాతం పెరుగు తున్నా కేరళలో బీజేపీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ పెరుగుతున్న బీజేపీ అనుకూల ఓటింగ్‌ అధికార ఎల్‌డీఎఫ్‌ను దెబ్బతీస్తుంది. ఈ వ్యూహంతోనే తాను బీజేపీకి వ్యతిరేకం కానన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే, బీజేపీ ఎట్లాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక, ఆ పార్టీకి అనుకూల ఓట్లను తమవైపుకు తిప్పుకోవచ్చన్న సీపీఎం వ్యూహం నిజమైతే సహచర పార్టీలు తొందరపడి సీపీఎంను విమర్శిస్తున్నాయనుకోవాలి. ఇదే సమయంలో భాజపా కూడా ఈ ట్రాప్‌లో పడకుండా తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటూనే మరింత చొచ్చుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాల్సి వుంటుంది.

రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలి.

రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఏర్పాట్లుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడిఓసి కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.

Ramzan

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులను ఆదేశించారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర
వ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. ఏదేని విద్యుత్తు సమస్య వచ్చినా తక్షణమే స్పందించేందుకు మసీదు పెద్దలకు ఆ ప్రాంతం యొక్క లైన్ మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి, కాటారం, మహాదేవ పూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రార్ధనా మందిరాల వద్ద పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు ఉండాలని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస ప్రార్థనలు చేస్తారని వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తెలియజేసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డిఎస్పి సంపత్ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, డిపిఓ నారాయణ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ శ్రీనివాస్ ఈడీఎం శ్రీకాంత్.!

మీ సేవా కేంద్రాలు నిర్దేశించిన రుసుము కంటే అదనంగా తీసుకుంటే చర్యలు

తహసీల్దార్ శ్రీనివాస్ ఈడీఎం శ్రీకాంత్

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం భూపాలపల్లి మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సేవల అందుబాటు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.
ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీ సేవా కేంద్రాల కర్తవ్యం తెలిపారు. మీ సేవా కేంద్రాల ద్వారా అందించు సేవలకు సంబంధించి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మీ సేవా కేంద్రం నిర్వహకులను ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version