బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడీ జన్మదిన వేడుకలు.

బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడీ జన్మదిన వేడుకలు

జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఘనంగా జిల్లా కేంద్ర లో వేడుకలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర లో జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ. జక్కన్న సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనునిత్యం బీసీల హక్కుల కోసం పోరాడుతున్న యోధుడు అని అభివర్ణించాడు, బీసీల కోసం దేశంలోనూ రాష్ట్రంలోనూ బీసీల కులగణన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమర నిరాహార దీక్ష చేసి చావు చివరి అంచుల వరకు వెళ్లి కుల గణన సాధించిన వీరుడని , ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు కోసం మేమెంతో మాకు అంత సాధించాలనే అనే ఉద్దేశంతో బీసీలను చైతన్య పరుచుతూ గ్రామ గ్రామాన చైతన్యపరచాలని కొండ లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలమైన వంకాడి నుండి అలంపూర్ వరకు రథయాత్ర నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా నాయకులు బండి రమేష్ , కృష్ణ , నేరెళ్ల కుమార్, కాటిపెల్లి సతీష్ , ఉమర్ ఆలీ, శ్రీను , రామకృష్ణ , అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version