తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మనాక్షి నటరాజన్ గారితో కలిసి వర్కషాప్ లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహిరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మహారాష్ట్రలోని సేవాగ్రామ్, గాంధీ ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నేర్చుకోవలసిన అంశాలపై ఐదు రోజుల వర్కషాప్ లో రాజకీయ భాగ్యస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొలగించుకునేలా బూత్ స్థాయిలో వెళ్ళి మహిళలు ఒక సమూహమును ఏర్పరచుకొని నాయకులుగా ఎదగాలని రాజకయాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారి, మరోవైపు రాజకీయ పార్టీలో మహిళా శక్తిగా అవతరించాలని ముఖ్య అతిధులు అన్నారు.దేశ, రాష్ట్ర రాజకీయ పాండితులచే అనేక సెషన్స్ ను నిర్వహించడం జరిగింది.భారతదేశం నుండి ఈ కారిక్రమంలో నలభై మంది మహిళలు ప్రత్యేక ఆహ్వానం మరియు అనేక ప్రక్రియల ద్వారా ఎంపిక చేయబడిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీమతి అస్మా గారు మరియు విజయలక్ష్మి పాల్గొన్నారు