ఆ హోటల్లో మాటల్లేవ్100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే.

ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే..

 

 

 

 

ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు.

అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు.

అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఈ హోటల్‌ గురించి తెలుసుకున్న వారంతా..

సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..

భోజన ప్రియులకు వింత అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో..

హోటళ్లలో చిత్రవిచిత్ర ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది.

జైలు, విమానాల తరహాలో ఉండే హోటళ్లను చూశాం, నీటి అడుగున ఏర్పాటు చేసిన హోటళ్లను కూడా చూశాం.

ఇలాంటి విచిత్రమైన హోటల్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఇలాంటి విచిత్రమైన హోటల్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆ హోటల్లో మాట్లాడుకోవడాలు ఉండవు. సుమారు 100కి పైగా వెరైటీస్‌ని కేవలం సైగల ద్వారానే సరఫరా చేసేస్తారు.

ఈ హోటల్‌‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ నగరంలోని అరేకా కాలనీలో ఎకోస్ (ప్రతిధ్వని) పేరుతో ఈ విచిత్రమైన రెస్టారెంట్‌‌ను ఏర్పాటు చేశారు.
ఈ రెస్టారెంట్‌లో (Restaurant) ఎలాంటి మాటలూ వినిపించవు.
హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు.
అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు.

అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఒక్కో ఫుడ్‌కు ఒక్కో కోడ్ ఉంటుంది.

దాన్ని అనుసరించి సైగలు చేయడం లేదా పేపర్‌పై రాయాలి.

దీంతో సిబ్బంది వెంటనే ఆ కోడ్‌కు సంబంధించిన ఫుడ్‌ను తీసుకొస్తారు.

కస్టమర్లు కూర్చున్న టేబుల్ నంబర్, ఫుడ్ కోడ్ ఆధారంగా సిబ్బంది ఫాస్ట్‌గా ఆహారాన్ని సప్లై చేస్తారన్నమాట.

ఇంతకీ ఇలా సైగలతో ఫుడ్ ఆర్డర్ చేయడం వెనుక ఓ కారణం కూడా ఉంది.

దివ్యాంగులకు అండగా ఉండేందుకే..

మూగ, చెవిటి సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ హోటల్లో పనిచేసేవారంతా మూగ, చెవిటి వారే.

అయినా వారు సైగలను, కోడ్స్‌ను వెంటనే క్యాచ్ చేసి..

ఫాస్ట్ ఫాస్ట్‌గా ఫుడ్ సప్లై చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇలా దివ్యాంగులకు హోటల్లో ఉపాధి కల్పించడమే కాకుండా వారికి మనోధైర్యం ఇస్తున్నారు.

ఇలా దివ్యాంగులతో హాటల్ నడుపుతుండంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని అంతా అభినందిస్తున్నారు.

ఈ హోటల్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీనిపై నెటిజన్లు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మత్తు వద్దు భవితే ముద్దు.

మత్తు వద్దు భవితే ముద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ సేవ్ టు లైఫ్ మత్తు పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ మత్తుకోసం నిండు జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గొడవలు వద్దు రాజీలు ముద్దు.

గొడవలు వద్దు రాజీలు ముద్దు

ఈనెల 14న లోక్ అదాలత్

పరకాల సీఐ క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి

 

 

పరకాల మరియు నడికూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు 14 జూన్ న పరకాల కోర్టులో జాతీయలోక్ అదాలత్ ఉంటుందని మీ పై కానీ,మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడుతయాని యాక్సిడెంట్ కేసులు,కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు,వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్నచిన్న దొంగ తనం కేసులు,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు ఉంటే ఈ నేషనల్ లోకదాలతో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చునని ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని పరకాల కోర్ట్ పరకాల పోలీస్ స్టేషన్ కు రావాలని పరకాల సీఐ క్రాంతికుమార్,ఎస్ఐ లు రమేష్,శివకృష్ణ లు తెలిపారు.

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

 

KL Rahul:నేటి ధాత్రి:

 

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పేస్, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత భారత జట్టులో ఈ వికెట్లపై ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లూ తక్కువే. దీంతో ఇంగ్లండ్‌ ఆధిపత్యం తప్పదని అనుకుంటున్న తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్ట్‌లో థ్రిల్లింగ్ నాక్‌తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు హెచ్చరికలు పంపించాడు.

ఇది కదా కావాల్సింది..

ఇంగ్లండ్ లయన్స్‌తో పోరులో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు రాహుల్. ఇందులో 15 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావివ్వకుండా ఆడాడు. ప్రతి బంతిని అంతే కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. కరుణ్ నాయర్ (40)తో కలసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. నాలుగో వికెట్‌కు ధృవ్ జురెల్ (52)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యం జతచేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. తన ఫామ్, ఫిట్‌నెస్, మైండ్‌సెట్ ఎలా ఉందో రాహుల్ నిరూపించాడని మెచ్చుకుంటున్నారు. రాబోయే సిరీస్‌లో పరుగుల వర్షం కురిపిస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్‌కు ఇకపై అతడే మూలస్తంభం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version