ఆ హోటల్‌లో బస చేస్తే.. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో.

ఆ హోటల్‌లో బస చేస్తే.. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో, కాఫీ స్విట్జర్లాండ్‌లో…

ప్రపంచంలో ఏ భవనానికైనా సాధారణంగా ఒక్కటే చిరునామా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ యూరప్‌లోని ఒక భవనానికి రెండు చిరునామాలు ఉంటాయంటే నమ్ముతారా? ఆగండాగండి… వింత అక్కడితో ఆగిపోలేదు. అది కూడా రెండు దేశాల చిరునామాలు.

ఆ హోటల్‌లో బస చేస్తే తల స్విట్జర్లాండ్‌లో, కాళ్లు ఫ్రాన్స్‌లో పెట్టి పడుకోవచ్చు. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో తిని, కాఫీ స్విట్జర్లాండ్‌లో తాగొచ్చు. మెనూ కూడా రెండు దేశాల స్పెషల్‌ వంట కాలతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది. ఇంతకీ ఆ వింత హోటల్‌ ఎక్కడుంది?

ప్రపంచంలో ఏ భవనానికైనా సాధారణంగా ఒక్కటే చిరునామా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ యూరప్‌లోని ఒక భవనానికి రెండు చిరునామాలు ఉంటాయంటే నమ్ముతారా? ఆగండాగండి… వింత అక్కడితో ఆగిపోలేదు. అది కూడా రెండు దేశాల చిరునామాలు. అందులో ఒకటి స్విట్జర్లాండ్‌ చిరునామా కాగా, మరొకటి ఫ్రాన్స్‌ చిరునామా. ఎందుకంటే… ఆ భవనం సదరు రెండు దేశాల సరిహద్దు రేఖపై ఉంది. అంటే రెండు దేశాలకు మధ్యలో ఉందన్నమాట. ఆ భవనంలోనే చాలాకాలంగా ‘ఆర్బేజ్‌’ పేరుతో ఒక హోటల్‌ నడుస్తోంది.

జెనీవాకు ఐదు మైళ్ల దూరంలో, సరిహద్దు పట్టణమైన లా క్యూర్‌కు సమీపంలో ఉంటుందీ హోటల్‌. అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న ఏకైక హోటల్‌గా ‘ఆర్బేజ్‌’ గుర్తింపు పొందింది. విచిత్రంగా డైనింగ్‌రూమ్‌ సరిగ్గా సరిహద్దు గీతపైనే ఉంటుంది. కొన్ని టేబుళ్లు స్విట్జర్లాండ్‌ వైపు, మరికొన్ని ఫ్రాన్స్‌ వైపు ఉంటాయి. ఒకవైపు స్విట్జర్లాండ్‌ జెండా, మరోవైపు ఫ్రాన్స్‌ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తాయి. పర్యాటకులు స్విట్జర్లాండ్‌ దేశంలో కూర్చుని టిఫిన్‌ చేసి, ఫ్రాన్స్‌ దేశంలో కాఫీ తాగుతుంటారు. బెడ్‌రూమ్‌ సైతం సరిహద్దు రేఖపైనే ఉంటుంది. హోటల్‌ గదిలోని మంచం పై పడుకుంటే… తల స్విట్జర్లాండ్‌లో, కాళ్లు ఫ్రాన్స్‌లో ఉంటాయి. ఇక మెనూ రెండు దేశాల స్పెషల్‌ వంటకాలతో నోరూరించేలా ఉంటుంది.

వందల ఏళ్ల చరిత్ర…

ఈ హోటల్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1862లో స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాలు సరిహద్దు రేఖలను మార్చుకోవాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందం 1863లో అమలులోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం అప్పటికే ఉన్న కట్టడాలను తొలగించడం, కూల్చడం చేయకూడదు. దీన్ని అనుకూలంగా తీసుకున్న ఒక వ్యాపారవేత్త కొత్త సరిహద్దుకు రెండు వైపులా ఉన్న తన భూమిలో భవన నిర్మాణం చేశాడు. కానీ ఒప్పందం అమలులోకి రాక ముందే నిర్మించానని చెప్పుకొచ్చాడు. దాంతో అధికారులు ఆ భవనాన్ని ముట్టుకోలేదు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ సైనికులు ఈ హోటల్‌లోని రెండో అంతస్తులోనే ఆశ్రయం పొందారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఫ్రాన్స్‌ను ఆక్రమించింది. స్విట్జర్లాండ్‌ తటస్థంగా ఉండి పోవడంతో జర్మన్‌ సైనికులు ఆ దేశ భూభాగంలో అడుగుపెట్టలేదు. ఫ్రాన్స్‌ భూభాగం ఉన్న పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందారు.

ఆ సమయంలో ఎంతో మంది నాజీల ప్రాణాలను ఈ హోటల్‌ కాపాడిందని చెబుతారు. ఈ హోటల్‌ 1960లో అనేక రహస్య చర్చలకు వేదికగా నిలిచింది. అక్కడ జరిగిన చర్చల ఫలితంగానే 1962లో ఫ్రాన్స్‌ నుంచి అల్జీరియా స్వాతంత్య్రం పొందింది. బందీలుగా పట్టుకుంటా రనే భయంతో అల్జీరియా నేతలు తటస్థ ప్రాంతమైతేనే చర్చలకు వస్తామన్నారు. రెండు దేశాల సరిహద్దుపై ఉన్న ఈ హోటల్‌ను ఎంపిక చేశాకే నేతలందరూ చర్చల్లో పాల్గొన్నారు.

కొవిడ్‌ సమయంలో సరిహద్దులు మూసివేసినప్పుడు సైతం ఈ హోటల్‌ ముఖ్య పాత్ర పోషించింది. బంధువులు, శ్రేయోభిలాషులు హోటల్‌లో కలుసుకుని మాట్లాడే అవకాశాన్ని అందించింది. రెండు దేశాల సరిహద్దు రేఖపై ఉండటంతో ఈ హోటల్‌ను చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు. అక్కడికి వెళ్లి రెండు దేశాల్లో సంచరిస్తున్నట్టుగా అనుభూతి చెందుతారు. ‘భలే హోటల్‌’ అంటూ చిరునవ్వులు చిందిస్తారు.

ఆ హోటల్లో మాటల్లేవ్100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే.

ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే..

 

 

 

 

ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు.

అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు.

అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఈ హోటల్‌ గురించి తెలుసుకున్న వారంతా..

సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..

భోజన ప్రియులకు వింత అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో..

హోటళ్లలో చిత్రవిచిత్ర ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది.

జైలు, విమానాల తరహాలో ఉండే హోటళ్లను చూశాం, నీటి అడుగున ఏర్పాటు చేసిన హోటళ్లను కూడా చూశాం.

ఇలాంటి విచిత్రమైన హోటల్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఇలాంటి విచిత్రమైన హోటల్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆ హోటల్లో మాట్లాడుకోవడాలు ఉండవు. సుమారు 100కి పైగా వెరైటీస్‌ని కేవలం సైగల ద్వారానే సరఫరా చేసేస్తారు.

ఈ హోటల్‌‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ నగరంలోని అరేకా కాలనీలో ఎకోస్ (ప్రతిధ్వని) పేరుతో ఈ విచిత్రమైన రెస్టారెంట్‌‌ను ఏర్పాటు చేశారు.
ఈ రెస్టారెంట్‌లో (Restaurant) ఎలాంటి మాటలూ వినిపించవు.
హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు.
అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు.

అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఒక్కో ఫుడ్‌కు ఒక్కో కోడ్ ఉంటుంది.

దాన్ని అనుసరించి సైగలు చేయడం లేదా పేపర్‌పై రాయాలి.

దీంతో సిబ్బంది వెంటనే ఆ కోడ్‌కు సంబంధించిన ఫుడ్‌ను తీసుకొస్తారు.

కస్టమర్లు కూర్చున్న టేబుల్ నంబర్, ఫుడ్ కోడ్ ఆధారంగా సిబ్బంది ఫాస్ట్‌గా ఆహారాన్ని సప్లై చేస్తారన్నమాట.

ఇంతకీ ఇలా సైగలతో ఫుడ్ ఆర్డర్ చేయడం వెనుక ఓ కారణం కూడా ఉంది.

దివ్యాంగులకు అండగా ఉండేందుకే..

మూగ, చెవిటి సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ హోటల్లో పనిచేసేవారంతా మూగ, చెవిటి వారే.

అయినా వారు సైగలను, కోడ్స్‌ను వెంటనే క్యాచ్ చేసి..

ఫాస్ట్ ఫాస్ట్‌గా ఫుడ్ సప్లై చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇలా దివ్యాంగులకు హోటల్లో ఉపాధి కల్పించడమే కాకుండా వారికి మనోధైర్యం ఇస్తున్నారు.

ఇలా దివ్యాంగులతో హాటల్ నడుపుతుండంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని అంతా అభినందిస్తున్నారు.

ఈ హోటల్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీనిపై నెటిజన్లు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version