అధికారుల నిర్లక్ష్యంతో.. నీటి కటకట.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది దీనికంతటికి కారణం అధికారుల నిర్లక్ష్యం అలసత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో నెలలో ఎన్నోసార్లు నీరు బంద్ కావడం జరుగుతుంది* దీంతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారుల పనితీరుపై ప్రజా ప్రతినిధులు ఓ కన్ను వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు నాయకులే నాలుగు గ్రూపులుగా ఉండడమే దీనికి అంతటికి కారణంగా భావిస్తున్నారు.
అధికారులకు నాయకుల గ్రూప్ తగాదాలతో ఎవరు పట్టించుకోరు అనే విషయం తెలుసుకున్న అధికారులు దానిని ఆసరాను చేసుకొని జహీరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కావున అధికారులను పనితీరుపై జహీరాబాద్ లో లీడర్ లు అని చెప్పుకుంటున్న నాయకులు అధికారుల తీరు పై సమీక్షించాలని కోరుతున్నారు.