రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలి
తపస్ జిల్లా అధ్యక్షులు
వనపర్తి నేటిదాత్రి :
ఉపాధ్యాయుల సంఘం సభ్యత్వ నమోదులో పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి మునిగిళ్ళ పెద్దమందడి వెల్టూరు మద్దిగట్ల మోజర్ల విరాయపల్లి పామిరెడ్డిపల్లి బలిజపల్లి చిన్న మందడి అల్వాల దొడగుంటపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో తపస్ సభ్యత్వాన్ని చేయించుకున్నారని. తపస్ జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి తెలిపారు ఏకీకృత సర్వీస్ నిబంధనలు ను క్లియర్ చేసి ఉప విద్యాధికారి డైట్ లెక్చరర్స్ ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చి ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దమందడి మండల ఇంచార్జ్ నర్మదా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ శశివర్ధన్ మండల గౌరవ అధ్యక్షులు మధుసూదన్ తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగపూర్ ఈశ్వర్ రవికుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క రమేష్ మండల కార్యదర్శి తిరుపతి సురేష్ రవి తదితర తపస్ బృందం తపస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు