ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

రామడుగు నేటిధాత్రి:

యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం పురస్కరించుకుని రామడుగు మండల కేంద్రంలో జిల్లా ఉన్నత పాఠశాల మైదానంలో చిన్నారులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చొప్పదండి అనిల్ కుమార్, నేరెళ్ళ మల్లేశం, మల్యాల అక్షయ్ కుమార్, ఎడవెల్లి సాగర్, వాలీబాల్ కోచ్ ఆశాలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటు.

గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటులో మొక్కలు నాటిన నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకులని కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులని వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బిఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకచారి, సలీం, వాజీత్, సూర్యనారాయణ, శశి, ఆకాష్ రెడ్డి, మహేష్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

తలసేమియా దినోత్సవం .

తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్బంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది తో కలిసి అవగాహన ర్యాలీ మరియు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే రక్త వ్యాధినే తలసేమియా అంటారు.హిమోగ్లోబిన్ రక్తంలోని ఆక్సిజన్‌ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆల్ఫా (α) మరియు బీటా (β) అనే రెండు ప్రోటీన్లతో ఏర్పడుతుంది. త‌ల‌సేమియా వ్యాధిగ్రస్తుల్లో ఎముక మజ్జ (బోన్ మ్యారో) శ‌రీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ లేదా ఎర్ర ర‌క్త క‌ణాల‌ను త‌యారుచేయ‌కపోవడంతో శరీరంలోని అన్ని కణాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా అందదు.తలసేమియా ఎక్కువగా రెండు సంవత్సరాల్లోపు గల వారిలో గమనించవచ్చు.మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు లేదా హిమోగ్లోబిన్ ఉండాల్సిన మోతాదులో లేన‌ప్పుడు తలసేమియాతో పాటు ర‌క్త‌హీన‌త సమస్య కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, సాయిశ్రీ,సిరి,పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ,ఆచార్యలు,సరళ, నర్సబాయి, ఝాన్సీ,శ్రీదేవి, నాగమణి, ఆశ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యం చేయించుకుని పరిస్థితులు ఉన్నవారికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేస్తూ. పేద ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి చెక్కులను. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఇందులో లబ్ధిదారులైన. అంబటి లక్ష్మమ్మకు 60000 రూపాయలు. మునిగే మహేందర్ కు 55 వేల రూపాయలు. బి మల్లయ్యకు. 11,500 రూపాయలు. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మాకు చెక్కులు రావడానికి కృషి చేసినందుకు లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కడారి సునీల్ రెడ్డి. సీనియర్ నాయకులు కూతురి రాజు. కుండ వేణి కిషన్. రవి. మీరాల శ్రీనివాస్ యాదవ్. ఎడ్ల ప్రేమ్ కుమార్. జంగం సత్తయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వివాహా వేడుకలలో ఎమ్మెల్యే మేఘారెడ్డి.

వివాహా వేడుకలలో ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి
మేఘారెడ్డి గురువారం వివాహా వేడుకలకు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు
.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మాజీ జెడ్పిటిసి గోల్ల వెంకటయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, తదితరులు పాల్గొన్నారు*

టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సమీక్ష.

టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సమీక్ష

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

జిల్లాలో మే 13న సజావుగా టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులలో ప్రవేశాల నిమిత్తం మే 13న ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు జరిగే టీజీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సకల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2136 మంది విద్యార్థులు టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాస్తున్నారని, వీరి కోసం 7 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సిసి టివి కేమేరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రశ్నా పత్రాల తరలింపు అవసరమైన బందోబస్తు కల్పించాలని అన్నారు.పరీక్షా సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద కరెంట్ కోతలు ఉండవద్దని అన్నారు. విద్యార్థులకు అవసరమైన రూట్ లలో బస్సులు నడిచేలా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకేట్లతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ చంద్రయ్య,పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, జిల్లా వైద్యాధికారి డా.రజిత, సెస్, ఆర్.టి.సి, విద్యా, మున్సిపల్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సబ్సిడీ లోన్స్‌పై కొత్త కొర్రిలు మానుకోవాలి.

తెలంగాణ సబ్సిడీ లోన్స్‌పై కొత్త కొర్రిలు మానుకోవాలి

నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలి
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్

రామడుగు నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ లోన్ పథకాల్లో కొత్త కొర్రిలు రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రామడుగు మండల ప్రధాన కార్యదర్శి పూరేల్ల శ్రీకాంత్ గౌడ్ మండల కేంద్రంలో ఒక ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద సబ్సిడీ లోన్ సిబిల్ స్కోర్ కారణం లేకుండా ఇవ్వాలని కరోనా మహమ్మారి సమయంలో అనేకమంది యువత రుణ వాయిదాలు చెల్లించ లేకపోయిన నేపథ్యంలో వారి సిబిల్ స్కోర్లు దెబ్బతిన్నాయని దీంతో ఇప్పుడు వారు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ లోన్లకు కూడా అనర్హులవుతున్నారు. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి ఆర్థికంగా నష్టపోయి, ఇప్పుడు మళ్లీ స్థిరపడేందుకు ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తే సిబిల్ అడ్డంకిగా మారుతోందని నిరుద్యోగ యువతకి ఆదరణగా ప్రభుత్వం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకుండా ప్రత్యామ్నాయ ప్రమాణాలను పరిశీలించాలని, ప్రభుత్వ పథకాల ఉద్దేశ్యం ఆర్థికంగా వెనుకబడిన యువతకు సహాయం చేయడమేనని, సిబిల్ అడ్డుగా మారకూడదని పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని పత్రిక ముఖముగా కోరుతున్నారు.

మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి.

*మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి..

ఇంటికో పారిశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

*ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

పలమనేరు(నేటి ధాత్రి) మే 08:

స్థానికంగా మనకున్న అవకాశాలను అంది పుచ్చుకుని మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాథమిక టైలరింగ్ శిక్షణను పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం యొక్క ఉద్దేశాన్ని డిఆర్డిఏ పిడి శ్రీదేవి మహిళలకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న. ఈ కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరమైందన్నారు. ప్రాథమిక టైలరింగ్ శిక్షణ ద్వారా మహిళలకు కుట్టు మరియు డిజైన్ నైపుణ్యాల అందించడంతో వారికి ఆర్థిక మరియు మహిళా సాధికారత కల్పించడం జరుగుతుందన్నారు.

powerhouses

ఈ శిక్షణ ద్వారా ఆర్థిక స్వావలంబనతో పాటు తక్కువ పెట్టుబడితో జీవనోపాధి అవకాశాలు, గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో టెక్స్ టైల్ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయని దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణ రెడ్డి, ఎంపీడీఓ ఖాదర్ భాషా, బాలాజీ కోపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ, నాయకులు నాగరాజు రెడ్డి, అర్బీసి కుట్టి, గిరిబాబు, నాగరాజు,మదన్, కిరణ్, బీఅర్సీ కుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు..

వనపర్తి లో వాసవి కన్యకా పరమేశ్వరి,!

వనపర్తి లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కలశం ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి:

 

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ నిర్వహించారు . బుధవారం రాత్రి ఆర్యవైశ్య మహిళలు గా గాంధీ చౌక్ లో మహిళలు భక్తి పాటలతో కోలాటం వేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఇటుకురి వీరయ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూమేష్ కుమార్ శెట్టి పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురామ్ మారం బాలీశ్వరయ్య శెట్టి బక్తులు పాల్గొన్నారు

మీ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకండి.

తల్లిదండ్రులు జాగ్రత్త.. మీ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకండి.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

వేసవి సెలవులు కావడంతో కల్వకుర్తి పట్టణంలో 14 సంవత్సరాలు నిండని బాలురు సరదాగా ఆటల కోసం ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారు. కొందరు బాలురు విపరీతమైన వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతున్నడంతో ప్రమాదాలు జరిగి అవకాశం ఉంది. అధికారుల స్పందించి పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా .తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పట్టణవాసులు కోరారు.

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు .

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవ సభ్యులు

వనపర్తి నేటిధాత్రి ;

 

 

పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై
భారత్ ఆర్మీ సైన్యం మెరుపు దాడులు నిర్వహించి .ఉగ్రవాదులను హతం చేసినందుకు భారత్ ఆర్మీ చీఫ్ ఆర్మీ జవాన్లకు వనపర్తి సామాజిక సేవకులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు .ఈ మేరకు వారు హర్షం వ్యక్తం చేశారు . గోనూరు వెంకటయ్య బి రాజశేఖర్ కె వేణుగోపాల్ శ్రీనివాసులు నరసింహ కె రమణ కె వెంకటేశ్వర్లు కె కె మూర్తి హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు

‘‘అంతం కాదిది’’…’’ఆరంభం!’’

 

-ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌!

-ఆపరేషన్‌ సింధూర్‌…ఉగ్ర స్థావరాలు మటాష్‌!

-పహల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతీకారం.

-భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం.
-దేశమంతా మన సైనికులకు సలామ్‌.

 

-జై హింద్‌ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది.

-పాకిస్తాన్‌ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం.

-మసూద్‌ కుటుంబం, బంధువులు మృతి.

-100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.

-26 ఉగ్రస్థావరాలు గుర్తింపు.

-పాకిస్తాన్‌ మాయమయ్యే సమయం ఆసన్నమైంది.

-ఇప్పుడే మొదలైంది…ఇక పాకిస్తాన్‌కు మూడిరది.

-ఉగ్రవాద స్థావరాలపై అర్థరాత్రి మొదలైన భారత్‌ దాడులు.

-25 నిమిషాలలో ఆపరేషన్‌ పూర్తయ్యింది.

-9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

-అంతర్జాతీయంగా పాక్‌ ఇప్పుడు ఏకాకి!

-పాక్‌కు మిగిలేది ఇక భవిష్యత్తు కాళరాత్రి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇండియా అంటేనే శాంతి సందేశం. శాంతికి నిలయం. పరహితం. పరోపకారం. ప్రపంచశాంతిని కోరుకునే దేశం. అలాంటి మన దేశం మీద ప్రతి క్షణం విషం చిమ్ముతూ బతకడమే పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. దేశం విడిపోయిన నాటి నుంచి ఏదో ఒక రకంగా గిచ్చి కయ్యం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నది. ఇప్పటికి నాలుగు సార్లు జరిగిన యుద్దంలో ఓడిపోయినా ఆ పాకిస్తాన్‌కు బుద్ది రావడం లేదు. 1972లో ఏకంగా 90 వేల మంది పాకిస్తాన్‌ సైనికులు లొంగిపోయి, యుద్దంలో ఓడిపోయారు. అయినా ఆ దేశానికి సోయి రావడం లేదు. ఎన్ని సార్లు ఆ దేశం పీచమణిచినా మారడం లేదు. తినడానికి తిండికి దిక్కులేకపోయినా సరే, మనతో యుద్ధం కోరుకుంటూ పతనం అంచుల్లో వున్నా దాని బుద్ది మారడం లేదు. మన దేశంలో ఎన్ని కవ్వింపులు చేసినా క్షమిస్తూ పోతూనే వున్నాం. పైగా ఆ దేశంలో విపత్కర పరిస్ధితులు ఎదురైన ప్రతిసారి సాయం చేస్తూ ఆదుకుంటూనే వున్నాం. అయినా ఆ దేశానికి కృతజ్ఞతలేదు. ఎన్నొసార్లు భూకంపాలు వచ్చిన పాకిస్తాన్‌ అతలా కుతలమైపోయిన సందర్భాలలో ఆదుకుంటూ వచ్చాం. ఇప్పటికీ నిత్యం గోదుమ పిండి పంపకపోతే , తిండికి దిక్కులేకపోయినా, మన తిండి తింటూ మన దేశంపైనే ప్రతికారం కోరుకుంటుంది. అలాంటి దేశానికి ఇక బుద్ది చెప్పే తరుణం ఆసన్నమైంది. ఇక పాకిస్తాన్‌ను కోలుకోకుండా, తేరుకోకుండా చేస్తే తప్ప పాకిస్తాన్‌ దారికి వచ్చే పరిస్ధితి లేదు. దాయాది దేశమని సాయం చేసినా, ఎన్ని పాలు పోసినా పాము విషమే కక్కుతుందన్నట్లు తన పాపపు బుద్దిని పాకిస్తాన్‌ ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే ఇక ఆట మొదలైంది. ఉగ్రవాదులు వేట మొదలైంది. తనకు దిక్కులేకపోయినా, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, మన దేశంలో అశాంతిని రేపుతామని చూస్తున్న పాకిస్తాన్‌ను ఇక వదిలిపెట్టకూడదన్న గట్టి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆరేళ్ల క్రితం మన సైనికులు 60 మందిని పొట్టన పెట్టుకున్నా, సర్జికల్‌ స్ట్రైక్‌తో ఆపేశాం. కాని ఆసారి పెహల్గావ్‌లో ముష్కరులు హిందువులను టార్గెట్‌ చేసి చంపడం అన్నది ప్రపంచంలో ఏ దేశం సహించలేదు. మన 140 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోయింది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్‌ ప్రేజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే, ముష్కర స్ధావరాలను కూకటి వేళ్లతో పెలికించి, ప్రపంచం ముందు మరోసారి భారత్‌ గొప్పదనాన్ని చాటుకున్నది. కాకపోతే పాకిస్తాన్‌ పాపాలకు ఎక్కడో అక్కడ పుల్‌ స్టాప్‌ పడాలి. పాకిస్తాన్‌ ఇక భారత్‌ వైపు కన్నెత్తి చూడాలంటే కలలో కూడా అక్కడి పాలకులు ఉలిక్కి పడాలి. పాకిస్ధాన్‌కు మన దేశపు దెబ్బ అంత గట్టిగా పడాలనే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. ఓ వైపు ప్రపంచంలో అభివృద్దిలో పోటీ పడాలని మనం ఆలోచిస్తుతంటే, ప్రతిసారి పాకిస్తాన్‌ కవ్వింపుల కోసం ఇక ఆలోచించే రోజు వుండకూడదు. అంటే పాకిస్తాన్‌ వరల్డ్‌ మ్యాప్‌లో లేకుంటా చేస్తేనే దారి వస్తుంది. పాక్‌ ఆక్రమించుకున్న పిఓకే స్వాధీనంతోపాటు, పాక్‌ను అష్ట దిగ్భందనం చేస్తే తప్ప దానికి ఊరిరి ఆడదు. మన కేంద్ర ప్రభుత్వం అదే ఆలోచన చేస్తోంది. పాకిస్తాన్‌ కూసాలు కదిలిపోయేలా చేస్తోంది. భవిష్యత్తులో యుద్దం అన్న ఆలోచన వస్తేనే పాకిస్తాన్‌ గుండెలు అదిరిపోవాలి. అంతే కాదు మీరు తప్ప మాకు దిక్కులేదని కాళ్లబేరానికి రావాల్సిన అవసరం వుంది. అంత దూరం తీసుకుపోతే తప్ప పాకిస్తాన్‌ మాట వినదు. ఇప్పుడున్న పరిసి ్దతుల్లో పాకిస్తాన్‌పై కనికరం అన్నది చూపకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. హిందూస్తాన్‌ వైపు తొంగి చూసినా తునాతునకలైపోతామన్న భయం పాకిస్తాన్‌కు రుచి చూపించాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా జార విడువాలనుకోవడం లేదు. పాకిస్తాన్‌తో ఈ తలనొప్పి ఇక వుండదకూడదనే నిర్ణయానికి వచ్చింది. సరిహద్దును చూస్తే పాకిస్తాన్‌ ఇక జడుసుకోవాలి. ముష్కరులకు తావివ్వాలంటేనే పాకిస్తాన్‌కు తడిసిపోవాలి. అందుకే ఇక అసలు ఆట మొదలైంది. అంతం కాదిది..ఆరంభం. ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌. 9 ఉగ్రవాద స్ధావరాలు మాటాష్‌. పలహాల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత్‌ తీర్చుకున్న ప్రతికారం. భారతీయుల్లో ఆనందం వెల్లిరిస్తోంది. ఇలాంటి మాట కోసం అమాయకులైన 25మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నాటి నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రతీకారంతో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ప్రతికారం తీర్చుకోకుంగా జాప్యం చేస్తుందని మధనపడినవ వారు కూడా వున్నారు. మన దేశ ప్రభుత్వ ఆలోచన, యుద్ద వ్యూహాలు అర్ధం చేసుకోలేక, బావోద్వేగాలతో ఎదురుచూసిన ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చిన సందర్భమిది. దేశమంతా ఒక రకంగాచెప్పాలంటే పులకించిపోతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, మన సైనికులను కీర్తిస్తోంది. దేశమంతా జేజేలు పలుకుతోంది. ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరుపెట్టి మరీ ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేయడాన్ని దేశమంతా ఉద్వేగంతో సంబరాలు చేసుకుంటోంది. భారత్‌ మాతాకీ జై అని జై కొడుతోంది. జై హింద్‌ అంటూ దేశమంతా నినదిస్తోంది. దేశమంతా మన సైనికులు సలాం చేస్తోంది. జై హింద్‌ ట్విట్లతో దేశమంతా మారు మ్రోగిపోతోంది. పాకిస్ధాన్‌ ఆక్రమించుకున్న పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనే కాదు, ఏకంగా పాకిస్తాన్‌ గడ్డ మీదకు వెళ్లి మరీ ఉగ్ర స్ధావరాలను మన వైమానిక దళం ద్వంసం చేసింది. పాకిస్తాన్‌ కేంద్రంగా వున్న 26 ఉగ్ర స్ధావరాలను గుర్తించినట్లు సమాచారం. అందులో కీలకమైన 9 స్దావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. పిఓకెలో వున్న 5 ఉగ్రవాద స్ధావరాలు, పాకిస్తాన్‌ గడ్డ మీద వున్న 4 స్ధావరాలను నామరూపాలు లేకుండా చేశారు. పాకిస్తాన్‌ గడ్డ మీద మన సైనికులు త్రివర్ణ పతాకం ఎగరవేడం గొప్ప శుభ పరిణామం. మన దేశమంతా సగర్వంగా సైనికులకు సలాం చేసింది. తీవ్ర వాద నాయకుడైన మసూద్‌ కుటుంబం మొత్తం చనిపోయింది. వారితోపాటు బంధువులు, ఇతర ఉగ్ర వాదులు మొత్తం 100 మందికిపైగా భారత్‌ జరిపిన వైమానికదాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక మన కంటిలో నలుసులా, చెప్పులో రాయిలా తయారైన పాకిస్తాన్‌ కూడా మాయమయ్యే సమయం ఆసన్నమైంది. అయితే మన దేశం అనుసరిస్తున్న యుద్ద వ్యూహాలు అర్దం కాక ఇప్పటికే పాకిస్తాన్‌ తలలు పట్టుకుంటోంది. పాకిస్తాన్‌ విషయంలో ప్రపంచమంతా ఒకవైపు, పాకిస్తాన్‌ ఒక వైపు అనేలా యుద్ద తంత్రాన్ని నెరిపిన ఘనత మన ప్రదాని నరేంద్ర మోడీకే దక్కింది. గతంలో పాకిస్తాన్‌కాలు దువ్విన ప్రతి సందర్భంలోనూ ఏదోఒక దేశం మద్దతు ప్రకటిస్తూ వచ్చేవి. కాని ఈసారి 80 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్‌కు అగ్రరాజ్యాలేవీ పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. ఒక రకంగాచెప్పాలంటే పాకిస్తాన్‌ ఏకాకి అయ్యింది. మన ప్రధాని నరేంద్ర మోడీ యుద్ద తంత్రాన్ని ఇప్పుడే మొదలు పెట్టారు. అయితే నిజానికి పహల్గావ్‌ దాడి మరుసటి రోజు నుంచే మన దేశం యుద్దతంత్రాన్ని మొదలు పెట్టింది. ముందు పాకిస్తాన్‌ను ఆర్ధికంగా కుదేలు చేసింది. ఆ దేశానికి ఎగుమతులు అన్నీ రద్దు చేసింది. తర్వాత వైమానిక దారులు మూసేసింది. పాకిస్తాన్‌కు సిందు నది నీళ్లను ఆపేసింది. దాంతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పటికే మూలిగే నక్కలాంటి పాకిస్తాన్‌ మీద మన ప్రభుత్వం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్‌ గిలగిలాడుతోంది. నిజానికి పాకిస్తాన్‌ ప్రజలు కూడా మన దేశంతో యుద్దం వద్దని ఆ దేశ సైనికులు కూడా పాకిస్తాన్‌ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. యుద్దం చేయడానికి ఇష్టపడక ఎంతో మంది పాకిస్తాన్‌ సైనికులు కూడా తమ ఉద్యోగాలు రాజీనామా చేశారన్న వార్తలు కూడా విన్నాం. అయినా పాకిస్తాన్‌కు బుద్ది రాలేదు. ఆ దేశ రాజకీయ నాయకులకు సోయి రావడం లేదు. ఇండియా మీద గెవడం అన్నది పాకిస్తాన్‌కు కలలో కూడా జరగనిది. యుద్దమంటే క్రికెట్‌ లాంటి ఆటలో గెలవడం కాదు. అయినా ఆటలో కూడా ఎప్పుడూ పాకిస్తాన్‌ పెద్దగా గెలిచింది లేదు. అలాంటిది యుద్దంలో పాకిస్తాన్‌ కనీసం చెప్పుకునే రణ తంత్రం లేదు. సైనిక సంపత్తి చాలదు. మన దేశ ప్రజలంతా ఒక్క సారి జై హింద్‌ అంటే ఆ సౌండ్‌కే పాకిస్తాన్‌ సగం గుండె ఆగిపోతుంది. అలాంటి పాకిస్తాన్‌ కొన్ని అగ్ర రాజ్యాల అండ చూసుకొని ఎగురుతూ వుండేది. కాని ఇప్పుడు ఏ దేశం పాకిస్తాన్‌కు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అంతే కాదు అఫ్గనిస్తాన్‌ తాలిబన్లు కూడా పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. అయినా పాకిస్తాన్‌కు సిగ్గు రావడం లేదు. మన దేశ నుంచి విడిపోయిన ముక్కకే అంత వుంటే, ఆ ప్రాంతాన్ని దానం చేసిన మనకు ఎంత వుండాలి? మన సైనిక శక్తి కింద వారి సంఖ్య ఎంత? గతంలో ఊ అంటే అణ్వాయుదాలున్నాయంటూ పదే పదే పాకిస్తాన్‌ బెదిరిస్తూ వచ్చేది. అయినా మన దేశం ఎంతో సంయమనంతో వుండేది. మన మంచితనం పాకిస్తాన్‌కు చేతగాని తనంగా కనిపిస్తోంది. ఈసారి అసలు పాకిస్తాన్‌ అనేదే లేకుండా చేస్తే తప్ప దారికి రాదు. 1972 తర్వాత మళ్లీ మనదేశంలో సైనిక మాక్‌ డ్రిల్‌ జరిగిందంటే మన ప్రభుత్వం ఎంత స్ధిర నిర్ణయంతో వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంతతను దెబ్బతీసేలా పక్కలో బల్లెంలా నిత్యం కొర్రీలు పెడుతుంటే ఇంకా చూసుకుంటూ ఊరుకునే పరిస్దితి లేదని మన ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. ఓ వైపు పాక్‌ మన దేశ భూగాగాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డగా చేసి పెట్టి మారణ హోమం సృష్టించాలని ఇప్పటి వరకు పాకిస్తాన్‌ చూసింది చాలు. ఇకపై మన దేశం ఉపేక్షించే పరిస్దితి లేదని ప్రదాని మోడీ తేల్చి చెప్పేశారు. ఆఖరుగా ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్‌ ఈ విషయాన్ని లెవనెత్తి పై చేయి సాధించాలిన చూసింది. మన దేశం చెప్పిన సమాధానం విని పాకిస్తాన్‌ బిత్తర పోయింది. ప్రపంచ దేశాలతోపాటు, ఐక్య రాజ్య సమితికూడా మన దేశానికి మద్దతు పలికింది. పాకిస్తాన్‌ చేత కూడ ఉగ్ర వాదులను తుదముట్టించేందుకు సహకరిస్తామని చెపాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితిలో తమ దేశంపై భారత్‌ దాడిచేయాలని చూస్తోందని చెప్పి సానుభూతి పొందాలని చూసింది. కాని మన ప్రభుత్వం మాత్రం మేం ఉగ్రవాదుల ఏరి వేత మాత్రమే చేస్తున్నామని చెప్పడంతో ఐక్యరాజ్య సమితిలో పాక్‌ పరువు పోయింది. లేనిపోనివి చెప్పి సానుభూతి పొందాలనుకున్నా చెల్లలేదు. అదే రోజు అర్ధరాత్రి అంటే 7తేదీన ఆలస్యం చేయకుండా 9 ఉగ్ర వాద స్ధావరాలను ధ్వసం చేసింది. పాకిస్తాన్‌లాగా దొంగ దెబ్బ మనం తీయలేదు. ప్రపంచానికి చెప్పి మరీ మన ప్రభుత్వం ఉగ్ర స్ధావరాలను టార్గెట్‌ చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో 25 నిమిషాలలో పని పూర్తి చేసింది. అయితే ఇక్కడితో ఆగిపోయేది కాదు. మనదేశం ఆగేది కాదు. అందుకే హోం మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ 2 వుంటుందని ప్రకటించారు. అంటే ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా ఇ ంకా వుందని అమిత్‌షా సంకేతాలిచ్చినట్లైంది. ఏ రకంగా చూసినా అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఏకాకి. ఇక ప్రతి రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రే..! జై భారత్‌. జై హింద్‌!!

సమన్వయ సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిరచిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’

రుజువైన భారత్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యం

పాక్‌లోని లోపలి ప్రాంతాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం బహిర్గతం

తాత్కాలిక లక్ష్యాలు సాధించినా, దెబ్బతినని ఉగ్రవాదుల మూలాలు

పాక్‌ ప్రకటనతో యుద్ధంగా మారే ప్రమాదం

 

పాకిస్తాన్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే

అడుక్కు తింటున్నా అహంకారం తక్కువేం లేదు

అంతర్జాతీయంగా ఏకాకి అయినా బుద్ధి మారని పాక్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన నిర్వహించిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అత్యాధునిక యుద్ధకళలో మనదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. గతంలో బాలాకోట్‌, యురి దాడులు నిర్వహించినా, ఆ రెండుసార్లు మన దళాలు పీఓకేలోకి ప్రవేశించి ఆయా ఆపరేషన్లను దిగ్విజయంగా నిర్వహించాయి. అయితే ఈసారి సరిహద్దు దాటకుండానే కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రమే కాదు, పాక్‌ భూభాగంపై కూడా నిర్దిష్టమైన రీతిలో దాడిచేయగలమని ఆ దేశానికి తెలియజెప్పింది. ముఖ్యంగా ఈ దాడిలో త్రివిధ సైనిక దళాలు, రాజకీయ నాయకత్వం, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఎంతో సమన్వయంతో పనిచేసి అనుకున్నది సాధించాయి. మనదేశంలోని అన్ని వ్యవస్థల సమన్వయ సామర్థ్యంకూడా ప్రపంచానికి మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా ఈదాడుల్లో ఉపయోగించింది రఫేల్‌ యుద్ధ విమానాలు. వీటిల్లో అత్యాధుóనిక ఆయుధాలను అమ ర్చి సరిహద్దును దాటకుండానే, ఏవిధమైన నష్టం లేకుండా నిర్దిష్ట లక్ష్యాలపై కచ్చితమైన దాడులు నిర్వహించడం ఇక్కడ గుర్తించాల్సిన కీలకాంశం. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో మనదేశానికి చెందిన 25 మంది, నేపాల్‌కు చెందిన మరొక పర్యాటకుడిని అమానుషంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనకు ప్రతీకారంగా జరిపిన ఈ దాడుల్లో 90వరకు మిలిటెంట్లు మరణించి నట్టు తొలి వార్తలు తెలియజేస్తున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ప్రపంచానికి పదేపదే స్పష్టం చేస్తున్న మనదేశం, ఈ దాడులను కేవలం లష్కరే తొయ్యబా (లెట్‌), జైషే మహమ్మద్‌ (జెమ్‌) స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే నిర్వహించింది. చాలా జా గ్రత్తగా రచించిన ప్రణాళిక ప్రకారం పాక్‌ సైనిక స్థావరాలను ముట్టుకోలేదు.

స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులు

ఈ దాడులకు ఉపయోగించిన రఫేల్‌ జెట్‌ విమానాల్లో స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులు, హామర్‌ ప్రిసిషన్‌ గైడెడ్‌ బాంబులను భారతీయ వాయుసేన అమర్చింది. వీటిల్లో స్కాల్ప్‌ క్షిపణులు లోపలి ప్రాంతాలపై కచ్చితమైన దాడులకు ఉపయోగపడగా, హామర్‌ బాంబులతో గాల్లోనుంచి భూత లం మీది లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేశాయి. పూర్తిగా భారత భూభాగంనుంచి ని ర్వహించిన ఈ ఆపరేషన్‌కు, నేవీ చక్కటి సమన్వయ సహకారాలు అందించింది. భారత ప్రజలుగాఢనిద్రలో వున్న సమయంలో, పాక్‌ సైన్యం ఏమరుపాటుగా వున్న తరుణాన్ని ఎంచుకొని సరి గ్గా 6వ తేదీ అర్థరాత్రి దాటి, 7వ తేదీ 1.44 గంటలకు మన సైన్యం ఈ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో భారత్‌ వైపు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పాకిస్తాన్‌ గగనతలంలోకి ప్రవేశించి నిర్దిష్ట ఉగ్ర లక్ష్యాలపై దాడులు జరపడంలో భారత్‌ తనవద్ద ఉన్న ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని విస్పష్టంగా ప్రదర్శించింది. ముఖ్యంగా పాకిస్తాన్‌ సైన్యంతో అనవసర యుద్ధం రాకుండా, కేవలం ఉగ్రవాద కేంద్రాలపైనే దృష్టి కేంద్రీకరించడమనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అనుకున్న విధంగా పూర్తిచేయడం అంత సులభం కాదు. దీన్ని మనదేశం సాధించి చూపింది. 

రఫేల్‌ కీలకపాత్ర

రఫేల్‌ యుద్ధవిమానాల్లో అమర్చిన స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులకు 300 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యముంది. ఫలితంగా ఈ యుద్ధ విమానం సురక్షితమైన దూరంలో వుంటూనే తన దాడిని కొనసాగించడానికి వీలైంది. అదీకాకుండా ఈ క్షిపణీ వ్యవస్థ శత్రు రక్షణ వ్యవస్థల ను ఏమార్చి ముందుకు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించగలదు. హామర్‌ (హైలీ అగైల్‌ మాడ్యులార్‌ మ్యునిషన్‌ ఎక్స్‌టెండెండ్‌ రేంజ్‌) బాంబులు వ్యూహాత్మకంగా, ఉగ్రవాద స్థావరాల్లోని నిర్దిష్ట చిన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడ్డాయి. ఈ మొత్తం ఆపరేషన్‌, ప్రణాళికా రచనలో మన సైన్యం అనుసరించిన ఆధునిక పోకడ ప్రపంచానికి వెల్లడైంది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించకుండానే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఆపరేషన్‌ సింధూర్‌ విశిష్టత. గమనించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే, మనవైపు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా, ఉగ్రవాద స్థావ రాలకు అనుకున్న రీతిలో తీవ్ర నష్టం కలిగించడం. అంతేకాదు, ఈ ఆపరేషన్‌ కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాల ధ్వంసంపై మాత్రమే కాదు, ఆయా సంస్థల ముఖ్యనేతలను హతమార్చ డంపై కూడా దృష్టి కేంద్రీకరించింది. ఈ ఉగ్రవాద స్థావరాలను గుర్తించడానికి, పహల్గామ్‌ దా డులు జరిగినప్పటినుంచి మన రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ (రా) సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆవిధంగా సేకరించిన కచ్చితమైన సమాచారం ఆధారంగా, లష్కరే తొయ్యబా, జెయిషే మహమ్మద్‌ సంస్థల కమాండ్‌ మరియు కంట్రోల్‌ విభాగాలను పూర్తిగా ధ్వంసం చేయాలన్న లక్ష్యాన్ని మన సైన్యం నిర్దేశించుకుంది. 

ముర్దిక్‌లోని లెట్‌ స్థావరంపై తీవ్రస్తాయి దాడులు

ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా ముర్ధిక్‌లోని లెట్‌ స్థావరంపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు కేంద్ర స్థానం. అదేవిధంగా బహవాల్పూర్‌లోని జై షే మహమ్మద్‌ ఉగ్ర సంస్థపై కూడా దాడులు తీవ్రస్థాయిలో జరిగాయి. ఈ రెండు సంస్థల్లోనూ భారత్‌ను లక్ష్యం చేసుకొని ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ప్రదేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. ఈవిధంగా ఈ సంస్థలకున్న ఉగ్రవాదులను తయారుచేసే సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాదు, భవిష్యత్తులో అటువంటి ప్రణాళికలు రూపొందించకుండా వుండే స్థాయిలో ఈ దాడులు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ 7 లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఈ ఆప ంషన్‌ మొత్తాన్ని పర్యవేక్షించడాన్ని పరిశీలిస్తే, మనదేశ అత్యున్నత నాయకత్వం దీనికి ఎంతటి ప్రాధాన్యత నిచ్చిందీ అర్థమవుతుంది. ఇక మన రియల్‌ జేమ్స్‌బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఎప్పటికప్పుడు ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌దే కీలక పాత్ర. ఇదే సమయంలో మన ‘రా’ సంస్థ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన నిక్కచ్చి సమాచారాన్ని అంద జేయడం మరో గొప్ప విషయం. 

భారత్‌ నిగ్రహం

ఈమొత్తం ఆపరేషన్‌ను ఉగ్రవాద వ్యతిరేక చర్యగానే భారత్‌ పరిగణించి ఎంతో నిగ్రహంతో వ్య వహరించడం వల్లనే పరిస్థితి యుద్ధానికి దారితీయలేదు. ఈ వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయంవంతం కావడానికి మించి మరో ప్రయోజనం కూడా ఒనగూడిరది. చాలా తక్కువ నష్టంతో పాకిస్తాన్‌లోని సుదూర ప్రాంతాల్లోని నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేయగలమన్న స్పష్టమైన సందేశాన్ని పాక్‌ ఉగ్రవాదులకు, వారి మద్దతుదార్లకు మనదేశం ఇచ్చినట్లయింది. ఇదే సమయంలోఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులు చేసామని, ఆవిధంగా ‘ఉగ్రవాదంపై పోరు ’కే కట్టుబడి వున్నామన్న సందేశాన్ని ప్రపంచానికి మనదేశం ఇచ్చింది. అయితే ఆపరేషన్‌ సిం ధూర్‌ ద్వారా మనదేశం తక్షణ లక్ష్యాలను సాధించినప్పటికీ దీర్ఘకాలంలో దీని పర్యవసానాలు ఎట్లా వుంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మౌలిక వసతుల ధ్వంసం, ఉగ్ర సంస్థల నాయకులను హతమార్చడం తాత్కాలికంగా ఆయా సంస్థల సామర్థ్యాన్ని దెబ్బతీసినప్పటికీ, కొంత విరామం తర్వాత అవి మళ్లీ యథాస్థితికి చేరుకుంటాయనేది చరిత్ర చెబుతున్న సత్యం. కాకపోతే పాకిస్తా న్‌ లోని సుదూర ప్రాంతాలపై కూడా అత్యంత కచ్చితత్వంతో దాడిచేసే సామర్థ్యం భారత్‌కు ఉ న్నదన్న సత్యం పాకిస్తాన్‌కు తెలిసొచ్చిన మాట వాస్తవం. అంతేకాదు ఈ ఆపరేషన్‌ దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ సరిహద్దు అంశాలపై తన ప్రభావాన్ని తప్పక చూపుతుంది. ఈ దాడులను ‘యుద్ధ చర్య’గా పాకిస్తాన్‌ ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువ! అయితే ఉగ్రస్థావరాలపై మాత్రమే దాడులు జరపడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సన్నిహిత దేశాలకు తెలియపరుస్తూ రావడంవల్ల, యుద్ధం స్థాయికి పరిస్థితులు దారితీయకపోవచ్చు కూడా!

మరో మైలురాయి

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఈ ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరులో మనదే శం మరో మైలురాయిని దాటిందనే చెప్పాలి. తన ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే, వ్యూహాత్మక సంయమనం పాటించడం ఒక్క భారత్‌కు మాత్రమే సాధ్యమైంది. వీటి వినియోగం ద్వారా రెండుదేశాల మధ్య సంఘర్షణ జరగకుండా జాగ్రత్తపడిరది. అంతేకాదు మనదేశం అనుసరిస్తున్న ‘త్రివిధ దళాల ఉమ్మడి చర్య సిద్ధాంతం’ ఇస్తున్న చక్కటి ఫలితాలు ప్రపంచానికి తెలిసొచ్చాయి. మొత్తంమీద చెప్పాలంటే, ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్‌ నిబద్ధత ప్రపంచానికి మరోసారి వెల్లడైంది.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
చందుపట్ల కీర్తి రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి:

మొగులపల్లి మండలం గ్రామం వేములపల్లి లోఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. వారి వెంట నాయకులు మాజీ ఎంపీటీసీ గాజుల రజిత మల్లయ్య రాజు గౌడ్ చంద్రసేన ఎర్ర రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం.

సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. వివిధ శాఖలపై సమీక్షించారు. కార్యక్రమంలో నిర్మలారెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య పాల్గొన్నారు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.

అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని, పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నాగారం నుండి పాయబట్ల వరకు 400 లక్షలు తో బి.టి రోడ్డు నిర్మాణ పనులు, 150 లక్షల అంచనా విలువ తో వాజేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణం, ఎడ్చర్లపల్లి నుండి ముత్తారం వరకు 300 లక్ష తో బి.టి. రోడ్డు నిర్మాణం పనులను శంకుస్థాపనలు, 14 లక్షలతో నిర్మించిన బేబీ బర్త్ వెయిటింగ్ భవనము ను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరిష్ , ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి ప్రారంభించినారు.
అనంతరం కొంగాల గ్రామం 57 మందికి , నాగారం గ్రామం 64 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
అనంతరం వెంకటాపురం మండలం కేంద్రం లో అంచనా విలువ 60 లక్షల నిధులతో ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ (పి.ఆర్) కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి శంకుస్థాపన చేశారు.
పాత్రపురం గ్రామంలోని రైతు వైదిక లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
ఈ సందర్భంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలపై పెను భారం మోపిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత పాలకులు చేసిన అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని, వాజేడు, వెంకటాపూరం మండలాలలో నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని తెలిపారు.
గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేయడానికి కార్యక్రమాలను చేపట్టిన ఈ సంవత్సరం ఉగాది నుండి ధనికుడు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు. గతంలో పాలించిన దొర కాలంలో అరకొరగా ఉద్యోగ అవకాశాలు కల్పించగా నేటి ప్రజా ప్రభుత్వం పది నెలల కాలంలోనే 57 వేల 662 ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చి పేద రైతులకు చుట్టంగా మార్చిందని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో రాజీవ్ వికాస్ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యంతో అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అర్హులైన వారందరికీ జూన్ 2వ తేదీన ఆరువేల కోట్ల రూపాయలను అందజేయడం జరుగుతుందని అన్నారు. నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు నిరుపేదలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందడానికి పది లక్షల రూపాయలను పెంచడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం పేదల పట్ల సవతి తల్లి ప్రేమ కనపరిచినప్పటికీ నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పేదల కన్నీళ్లను చూడచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని, రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిన అనంతరం నూతన పథకాలను అమలు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.
ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.
భద్రాచలం శాసన సభ్యులు
తెల్లం వెంకట్రావు.
భద్రాచలం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.
బుధవారం వాజేడు, వెంకటాపురం మండలాలలో జరిగిన పలు కార్యక్రమాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గ్రామాల నిరుపేద ప్రజలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. తన నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలోని అన్ని గ్రామాలలో అన్ని వర్గాల నిరుపేద ప్రజలు ఉన్నారని వారందరికీ దశలవారీగా ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ పనులను త్వరత గతిన పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని అన్నారు. వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామంలో 106 ఇల్లు మంజూరు కాగా 62 ఇండ్లు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాయని 15 ఇండ్లు గ్రౌండ్ ఇండ్లు నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు చెల్లించడం జరిగిందని వివరించారు. ఇండ్ల నిర్మాణం కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుపేదలకు ఐటిడిఏ పరిధిలోని ఆదివాసి గిరిజనులకు ఇండ్ల నిర్మాణం కోసం అదనపు ఇండ్లను కేటాయించిందని అన్నారు.
ఈ కార్యక్రమములలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు,
మండల అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదవండి.!

ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం. స్థానిక సెస్. ఆధ్వర్యంలో. ప్రభుత్వ బాలికలు జూనియర్ కళాశాల సిరిసిల్ల అధ్యాపక బృందం. ప్రభుత్వ కళాశాలలో చేరండి మీ మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. అనే.నినాదంతో సారంపల్లి బద్దెనపల్లి గ్రామాల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటింటికి వెళ్లి కళాశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్మీడియట్ విద్యను చదవండి చదవడం వల్ల కలిగే లాభాలు వారి తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ సీతారాము శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ .నవీన్ రెడ్డి. జెబి ఉల్లా గంగరాజు తదితరులు పాల్గొన్నారు

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.!

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మర్రి చెట్లను తొలగించాలని కమిషనర్ కు వినతి.!

మర్రి చెట్లను తొలగించాలని కమిషనర్ కు వినతి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేషు పల్లి గ్రామం నుండి క్యాతనపల్లి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా మర్రి చెట్లు ఉన్నందున రోడ్డు పగిలిపోతుందని, మర్రి చెట్లను తొలగించి వేరే చెట్లను పెట్టేలా చొరవ తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు కు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయించేలా చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగిందని మాజీ వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నంది సురేష్, నరేష్, బండారి ప్రశాంత్, ప్రమోద్ ,సాయికిరణ్, కుర్మ విజయ్, నంది అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version