ఆర్మీ చేతికి ఏకే 203.. నిమిషానికి 700 రౌండ్లు..

ఆర్మీ చేతికి ఏకే 203.. నిమిషానికి 700 రౌండ్లు..

AK 203 Rifle: ఏకే 47, ఏకే 56 గన్నుల కంటే ఏకే 203 గన్నులు ఎంతో అధునాతనమైనవి. ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్‌ రీఫైల్స్‌(INSAS)ను ఏకే 203 గన్నులు రీప్లేస్ చేయనున్నాయి.

గన్నుల్లో ఏకే 47లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల క్రితం తయారైన ఈ ఆటోమేటిక్ రైఫిల్ ఇప్పటికీ టాప్ పొజిషన్‌లో ఉంది. ప్రపంచం నలుమూలల ఉన్న అన్ని దేశాల ఆర్మీలు ఏకే 47ను వాడుతున్నాయి. అయితే, ఇండియన్ ఆర్మీ ఏకే 47లకు స్వప్తి చెప్పే సమయం వచ్చింది. ది ఇండో – రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకే 203 మిషిన్ గన్నులను తయారు చేసింది. ఉత్తర ప్రదేశ్, అమేథిలో తయారు అయిన వాటికి ‘శేర్’ అని పేరు పెట్టారు.సదరు కంపెనీ 5,200 కోట్ల కాంట్రాక్ట్ కింద సాయుధ బలగాలకు ఆరు లక్షల గన్నులను సరఫరా చేయనుంది. ఈ విషయంపై IRRPL చీఫ్ మేజర్ జనరల్ ఎస్‌కే శర్మ గురువారం మాట్లాడుతూ.. ‘ది ఇండో – రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 5,200 కోట్ల ఒప్పందం జరిగింది. ఆ కంపెనీ ఆరు లక్షల గన్నులను సప్లై చేస్తుంది. 2030 డిసెంబర్ నాటికి గన్నుల సప్లై పూర్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు 48 వేల గన్నులు డెలివరీ అయ్యాయి. మరో రెండు, మూడు వారాల్లో మరో 7 వేల గన్నులు సరఫరా అవుతాయి. ఈ డిసెంబర్ నాటికి 15 వేల గన్నులు డెలివరీ అవుతాయి’ అని అన్నారు.

AK-203 ‘షేర్’ రైఫిల్ విశేషాలు

ఏకే 47, ఏకే 56 గన్నుల కంటే ఏకే 203 గన్నులు ఎంతో అధునాతనమైనవి. ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్‌ రీఫైల్స్‌(INSAS)ను ఏకే 203 గన్నులు రీప్లేస్ చేయనున్నాయి. ఇన్‌సాస్‌లో 5.56×45 ఎమ్ఎమ్ క్యాడ్‌రిజ్ ఉంటే.. ఏకే 203లో 7.62×39 ఎమ్ఎమ్ క్యాడ్‌రిజ్ ఉంటుంది. ఏకే 203 మ్యాగజైన్‌లో 30 క్యాడ్‌రిజ్‌లు పెట్టుకోవచ్చు. ఇన్‌సాస్ బరువు 4.15కేజీలు ఉంటే.. ఏకే 203 గన్నుల బరువు 3.8 కేజీలు మాత్రమే ఉంటుంది. పొడవు విషయానికి వస్తే.. బట్ స్టాక్ లేకుండా 705 మిల్లీ మీటర్లు ఉంటాయి. ఈ గన్నుల రేంజ్ 800 మీటర్లు. వీటిని ఎల్‌ఓసీ, ఎల్‌ఓఏసీతో పాటు మిగితా సరిహద్దు ప్రాంతాల్లోని సైనికులు వాడనున్నారు.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

సబ్ స్టేషన్ తండా వాస్తవ్యులు మలోత్ రాజు ఇటీవల జరిగిన
పాకిస్తాన్ మరియు ఇండియ సిందూరు ఆపరేషన్ యుద్ధంలో
కేసముద్రం మున్సిపాలిటీ పరిది లోని సబ్ స్టేషన్ తండా కూ చెందిన మలోత్ రాజు పాల్గొనడం గర్వకారణమని, అగ్రోస్ రైతు సేవ కేంద్రం దన్నసరి క్రాస్ రోఢ్ యజమానులు ధారావత్ రాజు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ కేసముద్రం మండల అధ్యక్షులు ననబల రమేష్ ఏఎంసి కేసముద్రం మాజీ డైరెక్టర్ ధారావత్ రమారవిందర్ నాయక్,
బనోత్ నాగ ,మాలోత్ బాలాజీ, బానోత్ రాజు, బనోత్ సురేష్, బానోత్ వీరన్న తదితరులు పాల్గోన్నారు

పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని.!

సంగారెడ్డి: పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళ హారతి ఇచ్చి మహా నివేదన చేయడం జరిగింది.
భారత్ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని,మన సైనికులు క్షేమంగా యుద్ధరంగం నందు విజయం సాధించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ తరపున దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించడం జరిగింది.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు

రాయికల్  నేటి దాత్రి:

మే 9.ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాయికల్ పట్టణంలోని నాగారం హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కశ్మీర్ లో పహాల్గామ్ ఘటన తరువాత ప్రతి భారతీయునిలో ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమ‌న్నారు.
భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో వారికి భారతీయులు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపాలన్నారు.ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని,ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,కుర్మ మల్లారెడ్డి,ఎలిగేటి అనిల్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, నాయకులు మచ్చ నారాయణ,గాజెంగి అశోక్, వాసం దిలీప్,చింతకుంట సాయికుమార్,బొమ్మకంటి నవీన్, సుమన్,భరత్,మహేష్,పవన్,అశోక్, రంజిత్ అర్చకులు సంతోష్. వాసం ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు .

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవ సభ్యులు

వనపర్తి నేటిధాత్రి ;

 

 

పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై
భారత్ ఆర్మీ సైన్యం మెరుపు దాడులు నిర్వహించి .ఉగ్రవాదులను హతం చేసినందుకు భారత్ ఆర్మీ చీఫ్ ఆర్మీ జవాన్లకు వనపర్తి సామాజిక సేవకులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు .ఈ మేరకు వారు హర్షం వ్యక్తం చేశారు . గోనూరు వెంకటయ్య బి రాజశేఖర్ కె వేణుగోపాల్ శ్రీనివాసులు నరసింహ కె రమణ కె వెంకటేశ్వర్లు కె కె మూర్తి హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు

ఇండియన్ ఆర్మీకి సెల్యూట్…

ఇండియన్ ఆర్మీకి సెల్యూట్… ఫహల్గాం ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైనస్పందనకు శ్రీకారం చుట్టింది

ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి వార్నింగ్

దేశ సత్తా చాటిన సైనిక దళాలకు, పీఎం మోడీ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల జిల్లావ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బిజెపి శ్రేణుల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు

బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద
పహల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన కు శ్రీకారం చుట్టిందని , పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై” ఆపరేషన్ సిందూర్” పేరుతో మెరుపు దాడులు చేసి , దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక, పూజలు ప్రార్థనలు నిర్వహించారు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో పట్టా కాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.. ఇట్టి కార్యక్రమంలో ఆడెపు రవీందర్ రాంప్రసాద్ భాస్కర్ ప్రతాప్ నరేష్ శ్రీహరి రాజు నరసయ్య శ్రీనివాస్ చందు పరమాత్మ శేఖర్ వైశాలి మాధవి శిరీష ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version