మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు..

మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

నర్సంపేట,నేటిధాత్రి:

వన మహోత్సవంలో భాగంగా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధ్యక్షులు అల్లే రాజు మాట్లాడుతూ వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎఫ్డీఓ నాగమణి ఆదేశాల మేరకు కుల సంఘం ఆవరణలో, పెద్దమ్మగుడి వద్ద పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్,ముదిరాజ్ కుల పెద్దమనిషి అల్లే పైడి కార్యదర్శి పెండ్యాల రవి,
కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నంబర్ మేకల రాజు,మాజీ కుల పెద్దమనిషి పెండ్యాల బిక్షపతి, మాజీ సొసైటీ అధ్యక్షులు కుల పెద్దమనిషి పెండ్యాల మల్లేశం, మేకల రవి,అటెండర్ అల్లే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలోని వర్షకొండ మండల పరిషత్ పాఠశాలలో విద్యాధికారి శ్రీ బండారి మధు సందర్శించడం జరిగింది పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని అభినందించాడు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో మొక్కలను పెంచడం ప్రతి విద్యార్థి భాద్యతగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన.

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ ఆవరణలో శనివారం రోజున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు నాటడం జరిగింది, పచ్చని చెట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెట్టును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని గ్రామంలోని ప్రజలందరూ ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున పెంచాలని అందరు మొక్కలు నాటినప్పుడే రాష్ట్రం పచ్చదనంగా ఉంటుందని కాలుష్య బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు, అనంతరం బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు, అలాగే మొక్కలు నాటడమే కాదని వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, రాయకమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ,కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు అలకొండ కుమారు, మరియు కాంగ్రెస్ నాయకులు బుర్ర శ్రీనివాసు అల్లం రాజు గంగాధర్ రవి, బ్యాంక్ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

నాగారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేటి ధాత్రి:

 

జూన్ 23 నుండి జూలై 6 వరకు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ నుండి జన్మదిన వరకు జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర మహిళా మోర్చా పిలుపుమేరకు మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ వేణుగోపాల్ ఆద్వర్యంలో నాగారం మున్సిపాలిటీ ఆర్ ఎల్ నగర్ శ్రీ స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అమ్మ పేరు మీద మొక్క నాటే కార్యక్రమం మరియు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రెటరీ మాధవి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనన్న, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ శ్యాంసుందర శర్మ, శ్రీనివాస్ గౌడ్
సీనియర్ బిజెపి నాయకులు రవీందర్ రెడ్డి, పోతంశెట్టి, సురేందర్ , శ్రీనివాస్,జ్యోతి పాండే శైలజ ,విజయలక్ష్మి ,శారద మరియు మండల మహిళలు, మహిళ మోర్చా నాయకురాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.

కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటు.

గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటులో మొక్కలు నాటిన నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకులని కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులని వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బిఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకచారి, సలీం, వాజీత్, సూర్యనారాయణ, శశి, ఆకాష్ రెడ్డి, మహేష్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version