మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి.

*మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి..

ఇంటికో పారిశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

*ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

పలమనేరు(నేటి ధాత్రి) మే 08:

స్థానికంగా మనకున్న అవకాశాలను అంది పుచ్చుకుని మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాథమిక టైలరింగ్ శిక్షణను పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం యొక్క ఉద్దేశాన్ని డిఆర్డిఏ పిడి శ్రీదేవి మహిళలకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న. ఈ కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరమైందన్నారు. ప్రాథమిక టైలరింగ్ శిక్షణ ద్వారా మహిళలకు కుట్టు మరియు డిజైన్ నైపుణ్యాల అందించడంతో వారికి ఆర్థిక మరియు మహిళా సాధికారత కల్పించడం జరుగుతుందన్నారు.

powerhouses

ఈ శిక్షణ ద్వారా ఆర్థిక స్వావలంబనతో పాటు తక్కువ పెట్టుబడితో జీవనోపాధి అవకాశాలు, గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో టెక్స్ టైల్ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయని దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణ రెడ్డి, ఎంపీడీఓ ఖాదర్ భాషా, బాలాజీ కోపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ, నాయకులు నాగరాజు రెడ్డి, అర్బీసి కుట్టి, గిరిబాబు, నాగరాజు,మదన్, కిరణ్, బీఅర్సీ కుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version