నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ.

నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి బుధవారం అంకురార్పణ చేశారు. పంబాల పూజారి రౌతు కిషోర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఎస్సీ కాలనీ సమీపంలో పాత స్థలాన్ని మరోసారి గుర్తించి, పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ… ఆలయ నిర్మాణానికి ఇదే గ్రామానికి చెందిన బైరెడ్డి వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలు దాతలుగా ముందుకు రావడం జరిగింద న్నారు. ఇందులో భాగంగా నేడు స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈనెల 11న ఉదయం 7 గంటలకు ఆలయ నిర్మాణానికి ముగ్గు పోయడం జరుగుతుందని కావున గ్రామ మహిళలు పసుపు కుంకుమ కొబ్బరికాయలతో అధిక సంఖ్యలో హాజరై పూజలో పాల్గొని విజయవంత చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు
పెరుమాండ్ల రాజేశ్వర్, గట్టు మహేందర్, బిరుదు రాములు, వడ్లకొండ నాగరాజు, ఎర్రం సతీష్ కుమార్, పెరుమాండ్ల నవీన్,కన్నూరి కుమార స్వామి,కత్తి తిరుపతి, ముక్కెర రాజు, పైతరి సదయ్య, గాజుల వెంకటస్వామి, సుంకరి ప్రమోద్, గట్టు రమేష్, తోడేటి విజేందర్, కసుబోజుల రమేష్,పబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు.

నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం లో దేశాయి పల్లె బదనపల్లి తంగళ్ళపల్లి గ్రామాలలో నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని . తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి.మండల కేంద్రంలో ఇప్పటివరకు 210. ఇండ్లకు గ్రౌండింగ్ చేయడం తో పాటు పేదింటి కలల సహకారం.చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో డబుల్.బెడ్ రూమ్ పేరు మీద. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అటువంటి దానికి. తావు లేకుండా ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం. ప్రజా పరిపాలన అందిస్తుందని. గత ప్రభుత్వాలు చేసిన. అప్పులను తీర్చుకుంటూ. రేవంత్ రెడ్డి. ప్రజా పరిపాల సాగిస్తూ. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు.

ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొగ్గు వేసి ప్రారంభం చేసిన ఎంపిఓ సౌజన్య రావు గారు, హౌసింగ్ DE అంజయ్య గారు,న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు B. శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి K. భాస్కర్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, న్యాల్కల్ పాక్స్ చైర్మన్ సిద్ది లింగా స్వామి, మండల మాజీ ఉప అధ్యక్షుడు మొహమ్మద్ గౌసోద్దీన్, జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ రఫియోద్దీన్, మాజీ ఎంపీటీసీ శాంత్ కుమార్ పటేల్, AE శివానంద, పంచాయతీ కార్యదర్శి N. సరేన్ రాజ్, అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఫీక్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ నిలయా గౌడ్, నయీమొద్దీన్, ముస్తఫా, లాలూ పటేల్, ఖాయమొద్దీన్, పాషా భాయ్, యాదుల్ భాయ్, మిస్లోడ్డిన్, మౌల పటేల్, అఫ్జల్ భాయ్, మచ్కురి శంకర్, మచ్కురి మాణిక్, సురేష్ , బసవరాజు, సమీర్, నాసర్ , అక్బర్, సయ్యోజి గౌడ్, అజర్, జలీల్ మియా, మహిళలు కమలమ్మ , శేషమ్మ, జ్యోతి , గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన

ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయం వాళ్ల నాన్న తాత గడ్డం ఆబి రెడ్డి గారు నిర్మించిన ముత్యాలమ్మ గుడి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోగా వారి వారసులు ముత్యాలమ్మ గుడి కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్డం వెంకటరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు మాట్లాడుతూ వారి తాతగారు కట్టిన గుడి శిథిలావస్థలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం చూసి జిర్గించుకోలేకపోయారు. గత సంవత్సరం లో మూడాలు ఉన్నందువలన ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేయలేదు. దీంతో శనివారం మూల సామ్రాట్ విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు. అనంతరం త్వరలోనే ముత్యాలమ్మ దేవాలయం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలందరికీ ముత్యాలమ్మ పండగను ఘనంగా నిర్వహించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పలువురు కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మే – 30 సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బి.వై. నగర్ లోని సి.ఐ.టి.యు ఆఫీసు వద్ద CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం , హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం CITU అని 1970 మే 30 వ తేదీన ఐక్యత – పోరాటం అనే నినాదంతో కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని గత 55 సంవత్సరాలుగా దేశంలో , తెలంగాణ రాష్ట్రంలో , రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక హక్కుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని పోరాటంలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సి.ఐ.టి.యు కు అండగా ఉంటూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
ఈరోజు సిఐటియు 55 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కార్మిక వర్గ ఉద్యమ పోరాట కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గుర్రం అశోక్ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , గుండు రమేష్ , దొబ్బల లచ్చయ్య , వావిలాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దళిత బాలికల పాఠశాలలకు పునాది భాగ్యారెడ్డి వర్మ.

దళిత బాలికల పాఠశాలలకు పునాది భాగ్యారెడ్డి వర్మ.

నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్.

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

హైదరాబాదు సంస్థానంలో దళిత బాలికల పాఠశాలలను స్థాపించిన భాగ్యరెడ్డి వర్మ వాటి అభ్యున్నతికి పునాది అయ్యాడని నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కె.భాస్కర్ అన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ
1906 నుండి 1933 లో హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలు స్థాపించారని అన్నారు. జగన్మిత్ర మండలి,మన్యసంఘం,సంఘసంస్కా ర నాట్యమండలి,అహింసా సమాజాలను స్థాపించి హైదరాబాద్ ప్రాంతాలలో సంఘసంస్కారాలపై ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సంపత్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, జేఏవో రజిని, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వార్డుల ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

శంకుస్థాపనలకే పరిమితం.

శంకుస్థాపనలకే పరిమితం

కార్యరూపం దాల్చని అభివృద్ధి పనులు

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమిత మయ్యాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపనలు చేయగా కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. కొన్ని సంవత్సరా లుగా లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పెండింగ్ లో నే ఉన్నాయి ఎన్నికల ముందు కొప్పుల గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆపడంతో గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అభి వృద్ధి పనులు పూర్తిచేసేనా!

Foundation stones

అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని చందంగా ఉన్నది కొప్పుల గ్రామంలో పశువైద్యశాల, రజక, పద్మశాలి సంఘ నిర్మాణంలో శంకుస్థాపనలు చేసి మరిచారు శంకుస్థాపనలు చేసి సంవత్సరాలు గడిచిపో యిన నేటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడo గమ నార్ధం. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం అధికారులు కావచ్చు అని గ్రామ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి గత ప్రభుత్వం అధికారుల సమక్షంలో ఎన్ని కల ముందు శంకుస్థాపనలు చేసి మొదలు చేసి సంవత్స రాలు గడుస్తున్న పనులు ప్రారంభానికి మాత్రమే అడుగు ముందుకు పడడం లేదు. కొన్ని భవనాలకు శంకుస్థాపనలు చేసి మరిచారు. కాంట్రాక్టర్ ఎవరికి కేటాయించారో!లేదో! తెలియక ప్రజలు అయోమ యంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ఆయుధం కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసు కొని, అధికారులు ప్రజా ప్రతిని ధులు సకాలంలో పనులుపూర్తి చేసేలా చర్యలు తీసు కోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని వద్ద యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సిహెచ్.భీమ్రావు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగే స్వామి జెండాను ఆవిష్కరించి,కేకును కట్ చేశారు.అనంతరం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కార్మికులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.1947 మే 3న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య బేబీ కృపాలాని ఐఎన్టీయూసీ ని స్థాపించారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కులు,సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిపెట్టిన ఘన చరిత్ర ఐఎన్టియుసి యూనియన్ ది అని కొనియాడారు.30 మిలియన్లకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక కార్మిక సంఘం అని అన్నారు. జాతీయస్థాయిలో ఇన్ని సభ్యత్వాలు కలిగి ఉండడానికి ప్రధాన కారణం జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి,జాతీయ ప్రధాన కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ లు కార్మికుల హక్కులను సాధించడమే ధ్యేయంగా నేటి వరకు కృషి చేయడమే అన్నారు.రానున్న రోజులలో యూనియన్ను మరింత బలమైన కార్మిక సంఘంగా నిర్మించడం కోసం వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు పేరం రమేష్,ల్యాగల శ్రీనివాస్,ఫిట్ కార్యదర్శి నంబయ్య,జిల్లా కార్యదర్శి బీమ్ రవి, ఉపాధ్యక్షులు జే.నర్సింగ్,ఫిట్ అసిస్టెంట్ కార్యదర్శిలు మహేష్ రెడ్డి,శ్రీను,రవి, కార్యదర్శులు చందు పటేల్,బి.అశోక్,చిన్నయ్య, మహేందర్ రెడ్డి,రాజు,మల్లేష్ పాల్గొన్నారు.

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో ఐఎన్టియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ రాములు, సివిల్ ఫిట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కాసర్ల ప్రకాష్ ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.

నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కే సముద్రం విలేజ్లో విశ్వబ్రాహ్మణ సంఘం నూతనంగా నిర్మించబోతున్న శ్రీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల నూతన దేవాలయములకు గాను గురువారం భూమి పూజ శిలా న్యాస శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొనడం జరిగింది, వారితోపాటు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, దస్రు నాయక్, శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మురళి నాయక్ ను శాలువాతో సత్కరించడం జరిగింది, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి గొప్ప మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు మరియు కమిటీ సభ్యులను అభినందించారు.

ఇంతటి గొప్ప కార్యక్రమం చేయాలంటే చాలా కష్టతరమైన కార్యచరణ ఎంతో కష్టంతో కూడుకున్న కార్యక్రమం చేపట్టారు అని మీరంతా సమైక్యంగా ఉండి ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని అప్పుడే అనుకున్న కార్యచరణ సిద్ధిస్తుందని కమిటీ సభ్యులను అభినందించారు.

కేసముద్రం విలేజ్ విశ్వబ్రాహ్మణులు చేపట్టిన ఈ పుణ్య కార్యానికి గ్రామస్తులు మరియు ప్రతి ఒక్కరూ ఈ పుణ్య కార్యక్రమములో పాలుపంచుకోవాలని దేవాలయాల నిర్మాణం కొరకు అందరూ సహకరించాలని అన్నారు.

మూడు గుడుల నిర్మాణం మొత్తం కృష్ణశిల రాతి శిలలతో నిర్మాణం జరుగుతుందని మూడు గుల్ల నిర్మాణం ఖర్చు 81 లక్ష రూపాయలు కేవలం గుల్ల నిర్మాణానికి వెచ్చిస్తున్నామని గుడి నిర్మాణ కమిటీ తెలిపారు.

ఈ అత్యంత అద్భుతమైన దేవాలయాల గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అందరూ సహకరించి ఈ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సంకేపల్లి నారాయణరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, లక్కాకుల నరసయ్య, బుర్ర నాగిరెడ్డి, కమటం సురయ్య, కనుకుల రాంబాబు, మరియు విశ్వబ్రాహ్మణ సంగం సభ్యులు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జనసమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం.!

ఘనంగా జనసమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఇబ్రహీంపట్నం నేటిధాత్రి:

తెలంగాణ జన సమితి పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో ని కొత్త బస్టాండ్ లో తెలంగాణ జన సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు ఏశాల గంగారెడ్డి జండా ఆవిష్కరించారు
అనంతరం జనసమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పై పోరాటం లో తెలంగాణ జన సమితి పార్టీ ముందు ఉంటుంది, నిరంతరం ప్రజా సమస్యలపై, విద్యార్థి-నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ అని మరియు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలంగాణ జన సమితి అని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో TJS జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్ గారు, TJS ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు కంతి రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి గారు, TJS నాయకులు కాట దశరథ్ రెడ్డి, కంతి లింగారెడ్డి కంతి ప్రశాంత్, గోవర్ధన్ , ఒద్దే మోహన్,బద్దీ రాములు,జిల్లా రాజేందర్, నాగులపేట నరసయ్య, పెద్దరాజ్యం, గజ్జ రమేష్, గజ్జ శేఖర్, కంతి రాకేష్, కల్లెడ స్వామి, కంతి గంగాధర్, కచ్చకాయల వసంత్, పత్తి రెడ్డి శ్రీనివాస్, గట్టు మల్లయ్య, M.D. సలీం, హన్మాండ్లు, గుమ్మడి నరసయ్య, గడసంద రవి, నాచుపల్లి తిరుపతి, కనక ముత్తయ్య,కనక పోషయ్య,గొర్రె శ్రీనివాస్,సుంకే రాజన్న,తిమ్మని బావయ్య,కనక రాజేశ్వర్,సున్నం పెద్ద ముత్తన్న, నాచుపల్లి తిరుపతి,కనక వెంకట్, మరియు తెలంగాణ జన సమితి యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ జన సమితి పార్టీ.!

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా
జెండా ఎగరవేసిన

తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్చార్జ్ ఎలిశాల రాజేష్

వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లంద గ్రామంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఎలిశాల రాజేష్ ఇంటి ఆవరణలో జెండా ఎగరవేసిన సందర్భంగా ఎలిశాల రాజేష్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో పోరాటాలకు పిలుపునిచ్చి రాష్ట్రాన్ని సాధించినం సబ్బండ వర్గాల ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆశయాలతో ముందుకు వెళతామని ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటం చేస్తూ వారి వెంట ఉంటామని తెలియజేస్తూ ఏడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట మండల నాయకులు పెద్దూరు నాగరాజు పరకాలఅజయ్ కుమార్ పాల్గొన్నారు.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భవ దినోత్సవం.!

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఈరోజు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 6వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది

పంపిణీ అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మరియు ఉపాధ్యాయులు సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ…
ఈరోజుల్లో యువత చెడు మార్గంలో వెళుతున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక కొత్త మార్గం ఎంచుకోవాలని వారిని కోరడం జరిగింది

5 సంవత్సరాలుగా మాకు సహకరించి మా కోసం ముందుండి నడిపిన ప్రతి ఒక్క మా మిత్రులకు అన్నలకు, తమ్ముళ్లకు కుటుంబ సభ్యులకు మరియు పట్టణ ప్రజలందరికీ మా తరఫున పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మొదలుపెట్టి సరిగ్గా ఈరోజుకు 6 సంవత్సరాలు పూర్తయింది

ఈ సంస్థ నేను స్థాపించినప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులతో మొదలై ఈరోజు కొన్ని వందల మందితో ముందుకు వెళుతుంది

మా ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు ఏమిటంటే కొన్ని మీకోసం తెలియజేయడానికి

1. కరోనా వచ్చి మృతి చెందిన వారికి దహన సంస్కరణాలు చేయడం జరిగింది

2. కరోనా వచ్చినవారికి మా సొంతంగా పౌష్టిక ఆహారం మేమే స్వయంగా వారి వద్దకు వెళ్లి వారికి ఇవ్వడం జరిగింది

3. లాక్ డౌన్ సమయంలో వందల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మేము వారి వద్దకు వెళ్లి అందించడం జరిగింది

4.పాఠశాల పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు బుక్స్ అందించడం జరిగింది

5.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది

6. పట్టణ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిన సమయంలో రోడ్లపై స్వయంగా మేమే మరమత్తులు చేయడం జరిగింది

7. వాహనదారులకు రోడ్డు మార్గంలో చెట్లు చాలా వేపుగా పెరిగి రోడ్డు సరిగ్గా కనబడక చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో మా సొసైటీ సభ్యులంతా కలిసి ఆ చెట్లను తీసివేయడం జరిగింది

8. నిరుపేద కుటుంబంలోని అమ్మాయిల వివాహాలకు మా వంతుగా ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది చాలా సందర్భాలలో

9.వికలాంగులకు స్టాండ్స్ పంపిణీ చేయడం జరిగింది

10.కరోనా సమయంలో పెరిగిన ఆటో చార్జీలను మా వంతుగా కృషి చేసి తగ్గించడం జరిగింది
ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్న వారికి మా వంతుగా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది

11.మందమర్రి చుట్టుపక్కల రాత్రివేళ మహిళలకు ఇబ్బందికరంగా మారిన మార్కెట్ల లైట్ల కోసం సమస్యపై కృషి చేయడం జరిగింది

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి చేయడం జరిగింది

ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించిన నాతోటి మిత్రులకు అధికారులకు ఇతర పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు

ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకు వస్తాం

రాబోయే రోజుల్లో ఈ వందల సంఖ్య కాస్త వేల సంఖ్యగా మారి వేల నుంచి లక్షల సంఖ్యలుగా మారాలని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజ్ కుమార్ జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్ మండల అధ్యక్షుడు సకినాల శంకర్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఓరం కవిరాజ్, దాడి రాజు అబిద్ కిరణ్ చరణ్ చింటూ అజయ్ సుందర్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి పంపిణీ.!

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చల్మెడలో సబ్ స్టేషన్కు శంకుస్థాపన.

చల్మెడలో సబ్ స్టేషన్కు శంకుస్థాపన. 

నిజాంపేట , నేటి ధాత్రి

 

మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులో నీ తిరుమల స్వామి ఆలయ భూమిలో 33 / 11 కెవి సబ్ స్టేషన్ ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ చల్మెడ గ్రామ ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలనే ఉద్దేశంతో సబ్ స్టేషన్కు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అందరూ సన్నబియ్యమే తినాలని ప్రభుత్వము రేషన్ షాపుల ద్వారా అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. తిరుమల స్వామి ఆలయాన్ని కూడా త్వరలోనే అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దర్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎస్ ఇ శంకర్, డి ఈ లు గరుత్మంతా రాజు, చాంద్ పాషా, ఏడి ఆదయ్య , ఏఈ గణేష్, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, పంజా మహేందర్ , మారుతి, వెంకటేష్ గౌడ్ , నజీరుద్దీన్ , ముత్యం రెడ్డి, తుమ్మల రమేష్ ,కాకి రాజయ్య ,బాజ రమేష్, సత్యనారాయణ రెడ్డి, దేశెట్టి సిద్ధ రాములు , మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమావత్ వినోద్ , మసూద్ ,రవీందర్ రెడ్డి, అందే స్వామి, బొమ్మెన మల్లేశం, లక్ష్మణ్, భూపతి రెడ్డి, రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

BJP ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో.

BJP ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో.

నేటి ధాత్రి కథలాపూర్

 

 

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో కథలాపూర్ BJP పార్టీ కార్యాలయంలో పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇంచార్జ్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా OBC మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ రావడం జరిగింది వారు మాట్లాడుతూ BJP పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు క్రియాశీల సభ్యులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన విషయాల్నింటిని క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, పిడుగు ఆనంద్ రెడ్డి,నరెడ్ల రవి,దయ్యా లక్ష్మి నర్సయ్య,జిల్లా సత్యం, అల్లకొండ నవీన్,పాలేపు, రాజేష్,నరేష్,గంగామల్లయ్య, శ్రీధర్,శివ,వినయ్, నరేందర్,మహేష్,సంతారం, సాయిరెడ్డి,వినయ్,రాజేష్,రాజరెడ్డి శ్రీకాంత్ పాల్గొన్నారు.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి…

పనులు పూర్తి కాగానే ప్రారంభించేది వివేక్ వెంకటస్వామి నే…..

మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసింది, పనులు పూర్తి చేసింది కాంగ్రెస్ హయంలోనే అని, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోనే నని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రిడ్జి పనులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చివరిదశకు వచ్చిన నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశి కృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

Bridge.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినప్పటికి అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బాల్క సుమన్ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపనలు చేసి పనులను నత్త నడకన కొనసాగించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చేసి గెలిచిన సంవత్సరన్నర కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి పనులు పూర్తి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతోనే పనులు పూర్తి అయ్యాయాయని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజరమేష్ కి సిగ్గు లేదా అని మండిపడ్డారు. త్వరలోనే బ్రిడ్జి ప్రారంభం చేసి ప్రాంత ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీర్చుతారని నాయకులుb పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, యాకూబ్ అలీ, కళ్యాణ్, శివకిరణ్, రాజేష్, సుధాకర్, బాణేష్, లాడెన్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

జిల్లా మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన.

జిల్లా మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల విధులతో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమైక్య భవనానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ సమీపంలో అధునాతన పద్ధతుల్లో నూతనంగా భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
మహిళాసంఘాలకుచేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళలు ఆర్థికంగా ఎదిగిన అప్పుడే ఆ కుటుంబం ఉన్నత శిఖరాలకుచేరుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జైబాపు, జై భీమ్, జైసం విధాన్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

శాయంపేట నేటిధాత్రి:

MLA lays foundation stone for construction of Indiramma’s houses

శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొన్నారు. రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనదేశ రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాం క్షలు నెరవేరటంలేదని, ప్రధా నికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్,గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్రగ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగా న్ని బీజేపీపార్టీ అనగాదొక్కా లని చూస్తుందని అన్నారు అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాల ను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న పథకాలలో ఒకటి ఇందిర మ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఉన్నవా రికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగిం చుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమా లల్లో వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version