చల్మెడలో సబ్ స్టేషన్కు శంకుస్థాపన.
నిజాంపేట , నేటి ధాత్రి
మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులో నీ తిరుమల స్వామి ఆలయ భూమిలో 33 / 11 కెవి సబ్ స్టేషన్ ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ చల్మెడ గ్రామ ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలనే ఉద్దేశంతో సబ్ స్టేషన్కు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అందరూ సన్నబియ్యమే తినాలని ప్రభుత్వము రేషన్ షాపుల ద్వారా అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. తిరుమల స్వామి ఆలయాన్ని కూడా త్వరలోనే అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దర్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎస్ ఇ శంకర్, డి ఈ లు గరుత్మంతా రాజు, చాంద్ పాషా, ఏడి ఆదయ్య , ఏఈ గణేష్, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, పంజా మహేందర్ , మారుతి, వెంకటేష్ గౌడ్ , నజీరుద్దీన్ , ముత్యం రెడ్డి, తుమ్మల రమేష్ ,కాకి రాజయ్య ,బాజ రమేష్, సత్యనారాయణ రెడ్డి, దేశెట్టి సిద్ధ రాములు , మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమావత్ వినోద్ , మసూద్ ,రవీందర్ రెడ్డి, అందే స్వామి, బొమ్మెన మల్లేశం, లక్ష్మణ్, భూపతి రెడ్డి, రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.