కోటగుళ్లలో ఘనంగా నందీశ్వరుని 2వ వార్షికోత్సవం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T174225.515-1.wav?_=1

 

కోటగుళ్లలో ఘనంగా నందీశ్వరుని 2వ వార్షికోత్సవం

గణపేశ్వరునికి నందీశ్వరుడి కి రుద్రాభిషేకం

స్వామివారికి బిల్వార్చన

శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శ్రావణమాసం చివరి సోమవారం నందీశ్వరుని రెండవ వార్షికోత్సవాన్ని నేత్రపర్వంగా
నిర్వహించారు.ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు, సాయిబాబా దేవాలయ అర్చకులు వినయ్ లు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. 2023 ఆగస్టు 18 న నిజామాబాద్ సిపి పోతరాజు సాయి చైతన్య కీర్తి దంపతుల ఆధ్వర్యంలో నందీశ్వరుని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం రెండవ వార్షికోత్సవం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వరుని కి గణపేశ్వరునికి రుద్రాభిషేకం త్రివేణి సంగమం జలాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం పూలమాలలో పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నందీశ్వరుని వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు మహిళలకు అమ్మవారి గాజులను అందజేశారు. ఆలయంలో నందీశ్వరుని ప్రతిష్టించిన నిజామాబాద్ సిపి పోతరాజు సాయి చైతన్య, కీర్తి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

చివరి శ్రావణ సోమవారం అన్నదానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-5.wav?_=2

చివరి శ్రావణ సోమవారం అన్నదానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించారు. శివాలయం సేవకులు మలేష్ యాదవ్, కృష్ణా రెడ్డి, రమేష్, నాగేష్తో పాటు వారి బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కైలాసగిరి శివాలయానికి భక్తుల రద్దీ….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T155236.411.wav?_=3

 

కైలాసగిరి శివాలయానికి భక్తుల రద్దీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జహీరాబాద్లో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు గణేష్ స్వామి, నందు స్వాముల ఆధ్వర్యంలో శివుడికి అభిషేకం, బిల్వార్చన, గంగాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ దర్శించుకున్న – జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T142142.378-1.wav?_=4

 

కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ దర్శించుకున్న – జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్

మహాదేవపూర్ ఆగస్టు 18 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం లోని కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ సోమవారం రోజున దర్శనం చేసుకున్న జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్భంగా చివరి సోమవారం రోజు కావడంతో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనంలో భాగంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలకడం తో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించు కోవడంతో పాటు ఆలయ అధికారులు శాలువాతో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాకు పదవిని కట్టబెట్టిన సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి, మండల ప్రజలకు మరియు ఎల్లవేళలా నాకు తోడు నీడగా ఉండి నా అభివృద్ధికి తోడ్పడిన తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ శ్రావణమాసం రోజున కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించు కోవడం జరిగింది. అలాగే మండల స్థాయి నుండి జిల్లా స్థాయి పదవి కట్టబెట్టిన మంత్రి శ్రీధర్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాయకులకు అండదండగా ఉంటూ ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ అభివృద్ధి దిశగా ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్, కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రధాన అర్చకులు నాగేష్ శర్మ మరియు పురహితులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రావణమాస జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-7-7.wav?_=5

శ్రావణమాస జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో
శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ నమః శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పీఠాధిపతి మఠం.శివ లీలమ్మ ఆధ్వర్యంలో అర్చకులు రేవణ సిద్దయ్య స్వామి రుద్రాభిషేకం బిల్వపత్రి పూజలు నిర్వహించిన జొన్నగామ. వీరన్న పాటిల్ కుటుంబ సభ్యులు మరియు నల్లంపల్లి మఠం. శివకుమార్ స్వామి దంపతులు అదే విధంగా గురుజవాడ .వాస్తవ్యులు జగన్ గారి దంపతులు మరియుఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి. కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

నాపాక ఆలయం లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-1.wav?_=6

నాపాక ఆలయం లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు.

చిట్యాల,నేటిధాత్రి .

చిట్యాల మండలం నైన్ పాక గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకొని శ్రీ కృష్ణ వేషాధారణలతో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ రామ కృష్ణ పరమ హంస మందిరం నుండి బస్టాండ్ వద్ద శ్రీ కృష్ణ విగ్రహం దగ్గరికి ఊరేగింపు నిర్వహించి డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుపుకొని శ్రీ శ్రీ శ్రీ నాపాక లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి శ్రీ కృష్ణునికి పళాభి షేకం చేసి చిన్నారుల చేతుల మీదుగా ఉట్టి కొట్టి ఘనంగా జరుపుకొని శ్రీ కృష్ణ జన్మదిన సంధర్బంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసారుఅనంతరం ఉట్టి కొట్టిన చిన్నారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు నాపక ఆలయ ప్రాంగణంలో నైన్ పాక గ్రామ పెద్దల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో నైన్ పాక గ్రామ యాదవ సంఘం నాయకులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు

మండల కేంద్రంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-38-5.wav?_=7

మండల కేంద్రంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం రోజున అఖిల భారత యాదవ సంఘం మరియు భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజును కొందరు భక్తులు కృష్ణాష్టమి అని మరికొందరు గోకులాష్టమని, అష్టమి అని పిలుస్తారు, కృష్ణాష్టమి అంటే చెడుపై మంచి గెలిచిన రోజు అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను వివిధ ఆచారాలతో సంప్రదాయాలతో జరుపుకుంటారు, మండల కేంద్రం లోనీ గుల్లలో భక్తులు ఉదయాన్నే భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం భజనలు, భగవద్గీత పారాయణం నిర్వహించి భవద్గీత సారాంశాన్ని భక్తులకు, ప్రజలకు పురోహితులు తెలిపారు. అఖిల భారత యాదవ సంఘం నాయకులు వీధులలో ఉట్లు కొట్టడం, పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు కృష్ణుడు, గోపిక వేషధారణలు వేసి నృత్యాలను చేపించారు. కార్యక్రమంలోసందన వేన మహేందర్ నాథ్ యాదవ్ చల్ల ఓదెలు కన్నెబోయిన ఐలయ్య పరిషబోయిన నగేష్ యాదవ్ కాట్రేవుల నవీన్ పిడుగు బాపు సిద్ధిశంకర్ మరియు కుల సంఘాల నాయకులు పెద్దలు హాజరు కావడం జరిగింది

శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్సికోత్సవ వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-37-3.wav?_=8

శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్సికోత్సవ వేడుకలు.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మంజూరు నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవ పవిత్రోత్సవ కార్యక్రమాలను టిటిడి వేద పండితులు శ్రీ భావనారాయణ చార్యుల బృందం చేత ఘనంగా ప్రారంబించడం జరిగింది. మూలవిరాట్ కి పంచామృతాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జెన్కో సి ఈ ప్రకాష్ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30-3.wav?_=9

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

*ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

తిరుప‌తి(నేటిధాత్రి(ఆగస్టు 16:

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా ఇస్కాన్ లోని రాధా కృష్ణ‌ స‌మేత అష్ట‌స‌తులను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం దర్శించుకున్నారు.ఆల‌య ప్ర‌తినిధులు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గోకులాష్ట‌మి సంద‌ర్భంగా శ్రీకృష్ణ ప‌ర‌మాత్మున్ని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య ప్ర‌తినిధుల తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు.తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రిపై శ్రీకృష్ణుని కృపాక‌టాక్షాలు మెండుగా ఉండాల‌ని ఆకాంక్షించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆర‌ణి జ‌గ‌న్, రాజా రెడ్డి, జీవ‌కోన సుధా, బాబ్జీ, రాజేష్ ఆచ్చారీ, మున‌స్వామి, పురుషోత్తం, శ్రావ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

శాకాంబరీ అలంకారం లో భవాని మాత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-5.wav?_=10

శాకాంబరీ అలంకారం లో భవాని మాత

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

పోత్కపల్లి శ్రీ భవాని సమేత మహలింగేశ్వర స్వామి ఆలయంలో తాడూరి శ్రీదేవి – భానుప్రకాష్ రావు దంపతుల ఆద్వర్యంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని శ్రీ భవాని మాత కు వివిధ రకాల కూరగాయలతో శాకంబరిదేవి అలంకరణ చేయడం జరిగినది. ఈ కార్య్రమంలో సుమారు వంద కు పైగా మహిళల భక్తులు పాల్గొని శాకాంబరీ అలంకరణ లో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.

న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-25-4.wav?_=11

న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా న్యాల్ కల్ మండలం కుర్మ సంఘం అధ్యక్షులు గొల్ల నర్సింలు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జక్కుల హనుమంత్ సార్ హద్నూర్ గారు రావడం జరిగింది గోపికలు శ్రీకృష్ణ వేశాధారణ తో చిన్నారులతో కృష్ణ భగవానునికి పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఉట్టి కొట్టు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీకృష్ణ భగవానుని జీవిత చరిత్ర గురించి విశ్వాహిందు పరిషత్ మండలం అధ్యక్షులు రాంచందర్ పవార్ మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమం లో మల్గి మాజీ సర్పంచ్ జట్టుగొండ మారుతీ ఓంకార్ యాదవ్ మల్గి ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మాజీ ఎస్. ఎం.సీ. చేర్మెన్ నర్సప్ప అశోక్ చల్కి దత్తు గొల్ల దిలీప్ కుమార్ యాదవ్ శ్రీనివాస్ పెద్దగొల్లా శ్రీనివాస్ గొల్ల రాములు మారుతీ మహేష్ సిద్దు సునీల్ మొగుళప్ప రాకేష్ ఆకాష్ విట్టల్ గొల్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు,

వీరశైవ లింగాయతుల విశ్వశాంతి పాదయాత్ర..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-5.wav?_=12

వీరశైవ లింగాయతులు పాదయాత్రలో సమాజ సేవకు కొత్త అడుగు

జహీరాబాద్ నేటి ధాత్రి:

విశ్వ శాంతికై వీర శైవుల పాదయాత్ర జిల్లాఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజు జహీరాబాద్, విశ్వశాంతి కై తాలూకా వీరశైవ లింగాయత్ సమాజంతో పాటు శ్రీ రాచన్న స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి బడంపేట్ మహా పాదయాత్ర ఈ నెల 17న ఆదివారం ఉదయం 7.00 గంటలకు జహీరాబాద్ శ్రీ రాచన్న స్వామి ఆలయం నుండి బయలుదేరుతుందని ఆ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం చేపడుతున్న ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి వీర శైవ లింగాయత్ సమాజ్ సభ్యులు శివ నామ స్మరణతో సంకీర్తన చేస్తూ పాదయాత్ర లో పాల్గొంటారని తెలిపారు. పాదయాత్ర జహీరాబాద్ నుండి ప్రారంభమై శివాలయం, షేకాపూర్ మీదుగా పర్సుపల్లి నుండి బడంపేట్ కు చేరుతుందన్నారు.సభ్యులు, భక్తబృందం సాంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా సలహాదారులు అనిమిశెట్టి జయప్రకాష్, తాలూకా వీరశైవ లింగాయత్ యూత్ అధ్యక్షులు శ్రీ సిద్దాపురం అరుణ్, జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండి శ్రీనివాస్, రాష్ట్రీయ బసవ దాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్, అమర్ కౌలాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం..

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-87.wav?_=13

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామి వారికి ప్రత్యేక పూజలు..

గురువారం అమావాస్య సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ శేఖర్ పటేల్
,కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప,తగిన ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్. ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అమ్మవారి ఆలయాల కూల్చివేత భక్తజనాల ఆవేదన.

*తిరుపతి జిల్లాలో అమ్మవారి ఆలయాల కూల్చివేత భక్తజనాల ఆవేదన…

*పునర్నిర్మాణం కోరుతున్న ప్రజలు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 23:

తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండల పరిధిలో కూతవేటు సమీపంలో ఉన్న జగత్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం అకస్మాత్తుగా కూల్చివేయబడింది. గత అయిదేళ్లుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వేలాది భక్తులు అమ్మవారిని తమ ఇంటి దేవతగా పూజించడమే కాకుండా ప్రతి సంవత్సరం జాతర, నవరాత్రుల వంటి పూజాకార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ఆలయం అధికారిక గుర్తింపు లేకపోయినా, ప్రజల నమ్మకాన్ని చాటే భక్తిశ్రద్ధలు ప్రతి మూలకూ వ్యాపించాయి.
అయితే, ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే ఆలయాన్ని కూల్చివేయడాన్ని భక్తులు సాంఘికంగా, ఆధ్యాత్మికంగా గాయపడే చర్యగా భావిస్తున్నారు. మతస్వేచ్ఛను హరించడమే కాకుండా, ఇది ప్రజాస్వామ్య పరిపాటికి విరుద్ధంగా ఉందని పలువురు విశ్వాసపాత్రులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే, ఆలయం కూల్చివేయడానికి అసలైన కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఆలయం ప్రమాద స్థితిలో ఉందని కారణంగా వ్యవహరించి ఉంటే, దాన్ని కూల్చడం కంటే పునర్నిర్మాణం చేయడమే అనుకూలమైన మార్గం కావాలి.
ఇంకా ముఖ్యంగా ఇదంతా స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర తిరుపతి జిల్లాలో జరగడం మరింత బాధాకరంగా మారింది. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, ఇలాంటి చర్యలు ఆ విశిష్టతను మరుగున పరుస్తున్నాయి.ప్రజలు ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయాన్ని తిరిగి అదే స్థలంలో పునర్నిర్మించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని. చిన్న ఆలయమైనా ప్రజల విశ్వాసానికి నిలయంగా ఉంటే, దానికి శాసనబద్ధమైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆలయాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించి, పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సంప్రదాయాల పరిరక్షణకు ఇది ఒక ఉదాహరణగా నిలిచేలా చూడాలని పొన్నా రవికుమార్ మరియు అమ్మవారి భక్తులు కోరుతున్నారు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బుధవారము అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది.

 

Ketaki

 

 

ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగింది ఝరాసంగం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

shine junior college

 

 

 

రామేశ్వరం ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

 

 

 

 

చెన్నై: రామేశ్వరం(Rameshwaram) ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి(Rameshwaram Ramanathaswamy Temple) రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు ఆ ఆలయంలో సులువుగా దైవదర్శనం చేయలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలకు పూర్వమే రామేశ్వరం ఆలయంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించే వారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌ ఉండేది.

 

 

 

 

ఆ క్యూలైన్‌లో వెళ్ళి స్థానికులు సులువుగా దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి డిప్యూటీ కమిషనర్‌ చెల్లదురై బాధ్యతలు చేపట్టినప్పటి నుండి స్థానికుల క్యూలైన్‌ తొలగించారు. స్థానికులు ధర్మదర్శనం (సర్వదర్శనం) క్యూలైన్‌లోనే రావాలని ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులపై స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల రాజీ చర్చలు కూడా జరిగాయి. కానీ ఆలయ అధికారులు గతంలా ప్రత్యేక క్యూలైన్‌లో స్థానికులను అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు.

 

 

 

 

 

 

 

 

ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ మంగళవారం ఉదయం రామేశ్వరం నగరంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వేల సంఖ్యలో స్థానికులు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వైపు దూసుకొచ్చారు. ఆ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కారణంగా ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం.

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి.

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి

తిరుగు ప్రయాణం లో స్వామివారి దర్శనం

చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో గత 12 రోజులుగా కొనసాగుతున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కోటగుళ్లను సందర్శిస్తున్నారు. సోమవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతా నికి చెందిన భక్తులే కాకుండా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులు కూడా కోట గుళ్ళ ను సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఆలయ విశిష్టతను వివరించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

సరస్వతి పుష్కరాలకు రానున్న రెండు రోజుల్లో లక్షలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
సరస్వతి పుష్కరాల కొనసాగుతున్న నేపథ్యంలో 10 వ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పరిశీలించి వాకి టాకీ ద్వారా రానున్న రెండు రోజులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ లో భక్తల రద్దీని పరిశీలించి కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, రక్షణ చర్యలు, విఐపిలు పుణ్య స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని, కంటైనర్ ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మెయిన్ ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డులో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విఐపిల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ లో క్రమం తప్పక నీటి సరఫరా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఘాట్ ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని భక్తుల రద్దీని పరిశీలించి పుష్కరాల సేవలు ఏవిధంగా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్వర త్వరగా దర్శనాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కాళేశ్వరం లోని పలుగుల జంక్షన్, తాత్కాలిక బస్టాండ్, ఇప్పల బోరు జంక్షన్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులతో మాట్లాడారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోలీసులు అప్రత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా సురక్షిత ప్రయాణాలు చర్యలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష.!

పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని నాగవీధిలో పసునూటి సౌమ్య శంకర్ ల కుమారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా గణపురంలోని హనుమాన్ మాలాధారణ స్వాములకు తడి బిక్ష అనంతరం పొడి బిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. హనుమాన్ మాల దారణ స్వాములు భిక్ష ఘనంగా చేసి పసునూటి అభిరామను స్వాములు సుఖసంతోషాలతో విద్య బుద్ధి కలిగి ఉండాలని దీవించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version